SNo
int64 0
21.6k
| date
stringlengths 19
19
| heading
stringlengths 3
91
⌀ | body
stringlengths 6
38.7k
| topic
stringclasses 5
values |
---|---|---|---|---|
10,073 | 14-11-2017 12:50:53 | ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? | బాల్యం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ మెమొరీస్ అన్నీ మధురంగా ఉంటాయి. వాటిని తలుచుకుని ఎంతో మురిసిపోతుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ చిల్డ్రన్స్ డే. ఈ సందర్భంగా చిన్నప్పుడు చేసిన అల్లరి అన్నీ తలుచుకుని ఆనందపడుతోంది తమన్నా. తన చిన్నప్పుడు తల్లిదండ్రులు, సోదరుడితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. "హ్యాపీ చిల్డ్రన్స్ డే! చిన్ననాటి ఫోటో చూడగానే.. పోస్ట్ చేయకుండా నన్ను నేను ఆపుకోలేకపోయాను. మీలో ఉన్న చైల్డ్ని చావనీయకండి. క్యూరియస్గా ఉండండి.. ప్రశ్నలడగండి.. పక్షపాత వైఖరితో కాకుండా సంతోషంగా.. ప్రేమగా ఉండండి." అంటూ తమన్నా ట్వీట్ చేసింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో క్వీన్ సినిమాలో నటిస్తోంది. | entertainment |
820 | 08-10-2017 23:54:11 | అదానీ ప్రాజెక్టుపై ఆస్ర్టేలియాలో భారీ నిరసనలు | మెల్బోర్న్ : భారత్కు చెందిన మైనింగ్ దిగ్గజం అదానీ ఆస్ర్టేలియాలో ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టుపై భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సిడ్నీ, బ్రిస్బేన్, మెల్బోర్న్, ది గోల్డ్ కోస్ట్, పోర్ట్ డౌగ్లా్సతోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు భారీ స్థాయిలో నిరసన ర్యాలీలు చేపట్టారు. వీటిలో వేలాది మంది పాల్గొని అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ ప్రాజెక్టు ముందుకు కదిలితే తమ భవిష్యత్ నాశనం అవుతుందని నిరసన కారులు పేర్కొన్నారు. ‘స్టాప్ అదానీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద వాళ్ల నుంచే కాకుండా చిన్న పిల్లల నుంచి కూడా బొగ్గు గని పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఎబిసి న్యూస్, తదితర మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇప్పటికే పర్యావరణం దెబ్బతింటోందని, అదానీ చేపట్టే బొగ్గు గని వల్ల పర్యావరణం మరింతగా నాశనం అవుతుందని నిరసనకారులు అంటున్నారు. ఇది అంతర్జాతీయ అంశమని, ఆస్ర్టేలియాలోని వేలాది మంది అదానీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారని ఓ నిరసనకారుడు పేర్కొన్నారు. 1,650 కోట్ల డాలర్లతో అస్ర్టేలియాలో కార్మికెల్ కోల్ మైన్ ప్రాజెక్టు అభివృద్ధిని అదానీ ప్రతిపాదించింది. పర్యావరణ, ఆర్థిక అంశాల కారణంగా ఇది ఏళ్లపాటు జాప్యం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం కారణంగా అక్కడి ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుందని అదానీతోపాటు క్వీన్స్లాండ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర ప్రభావాలు ఉంటాయని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. | business |
7,398 | 06-02-2017 01:03:15 | ‘నీలంపాటి అమ్మోరు’ గీతావిష్కరణ | సుమన్ ప్రధాన పాత్రలో శ్యామ్, శ్రీకీర్తిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. తోటకృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కొమర వెంకటేశ సారథ్యం వహిస్తున్నారు. ఎం.ఎ్స.చౌదరి సమర్పిస్తున్నారు. గణేశ ట్రావెల్స్ హనుమంతరావు సహకారంతో నవ్య మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. శాసనసభ్యుడు రసమయి బాలకిషన ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీలను సుమన అందుకున్నారు. ఇందులో అమ్మవారి భక్తుడిగా చాలెంజింగ్ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని సుమన తెలిపారు. తోటకృష్ణ మాట్లాడుతూ ‘‘700 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలోని నీలంపాటి అమ్మవారి జీవిత కథ, మహిమలతో ఈ సినిమాను రూపొందించాం. నటీనటుల పెర్ఫార్మెన్స, గ్రాఫిక్స్, సంగీతం వంటివి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు ఘనశ్యామ్ మాట్లాడుతూ ‘‘ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. సినిమా పెద్ద హిట్ కావాలని రసమయి బాలకిషన, ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, శ్యామ్, శ్రీకీర్తిక ఆకాంక్షించారు. | entertainment |
10,616 | 09-01-2017 16:18:05 | సూర్యతో విభేదాలే విక్రమ్కు ఛాన్స్ ఇప్పించాయా? | తమిళనాట స్టార్ డైరెక్టర్ గౌతమ్మీనన్, అగ్రహీరో సూర్య కాంబినేషన్లో ‘కాక్క కాక్క’ (తెలుగులో ఘర్షణ), ‘వారణమ్ ఆయురం’ లాంటి సూపర్ క్లాసిక్ మూవీస్ తెరకెక్కాయి. అయితే ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనికి కారణం వారి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘ధృవ నక్షత్రం’ సినిమా. వీరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘ధృవ నక్షత్రం’ తెరకెక్కాల్సి ఉంది. అయితే ఇతర సినిమా విషయంలో పడి గౌతమ్.. సూర్య సినిమాను పట్టించుకోలేదు. దాంతో సూర్యకు చిర్రెత్తుకొచ్చింది. మరింకేం ఆలోచించకుండా ‘ఆ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాన’ని డైరెక్ట్గా ప్రెస్ను పిలిచి చెప్పాడు. అప్పటి నుంచి వారిద్దరూ దూరమయ్యారు. ఇటీవలె ఆ విషయంలో సూర్య క్షమాపణ చెప్పాడు. | entertainment |
3,113 | 25-04-2017 00:27:24 | ఐదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీ | విదేశీ కంపెనీతో జాయింట్ వెంచర్ యోగర్ట్ తయారీ, మార్కెటింగ్ కోసం విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని హెరిటేజ్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. ఇప్పటికే పెరుగు విక్రయాల్లో హెరిటేజ్ అగ్రస్థానంలో ఉంది. యోగర్ట్ మార్కెట్లోనూ విభిన్న ఉత్పత్తులతో హెరిటేజ్ అగ్రస్థానానికి దూసుకుపోతోంది. త్వరలోనే బేవరేజ్ విభాగంలోనూ కొన్ని కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. విలువ ఆధారిత ఉత్పత్తులతో మరింత రాబడి 2015-16 ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్ ఫుడ్స్ 2,380 కోట్ల రూపాయల టర్నోవర్ను అధిగమించింది. ప్రస్తుతం హెరిటేజ్ తాజా పాలతోపాటు పెరుగు, బట్టర్ మిల్క్, లస్సీ, ఐస్క్రీమ్, పనీర్, బటర్, నెయ్యి, పాల పౌడర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంతోపాటు మార్కెట్ చేస్తోంది. మొత్తం రాబడిలో వీటి వాటా 24 శాతం. దీన్ని వచ్చే ఐదేళ్ల కాలంలో 40 శాతానికి పెంచుతాం. ఇందులో భాగంగానే మరిన్ని కొత్త ఉత్పత్తులతోపాటు యోగర్ట్ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. యోగర్ట్ మార్కెట్ పరిమాణం 1,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు అంచనా. విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా 6,000 కోట్ల రూపాయల రాబడి అంటే బిలియన్ డాలర్ల టార్గెట్ చేరుకోవడానికి సులభం అవుతుంది. గత ఐదేళ్ల కాలంలో హెరిటేజ్ రాబడిలో వార్షిక సగటు వృద్ధి 18 శాతం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇది 25 శాతం ఉంటుందని అంచనా. ఆర్గానిక్ గ్రోతతోపాటు ఇనార్గానిక్ గ్రోత కూడా మా వ్యూహంలో భాగం. ఇందులో భాగంగానే రిలయన్స్ డెయిరీ వ్యాపారాన్ని కొనుగోలు చేశాం. మరిన్ని కంపెనీల కోసం చూస్తున్నాం. | business |
6,891 | 10-11-2017 07:45:55 | సునీల్కి సేమ్ టైటిల్ పెట్టేశారు | 'జై బోలో తెలంగాణ' వంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా '2 కంట్రీస్'కి అఫీషియల్ రీమేక్గా రూపొందుతున్న చిత్రానికి తెలుగులోనూ '2 కంట్రీస్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను దర్శకనిర్మాత ఎన్.శంకర్ తెలియజేశారు. మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాక రికార్డ్ స్థాయిలో వసూళ్లు దక్కించుకొన్న "2 కంట్రీస్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది, సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్త సునీల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అధిక శాతం అమెరికాలో చిత్రీకరించబడిన ఈ చిత్రం షూటింగ్, డబ్బింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి, నా మునుపటి చిత్రాలు జయం మనదేరా, జైబోలో తెలంగాణా, శ్రీరాములయ్య, భద్రాచలం చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు "2 కంట్రీస్" తప్పకుండా నచ్చుతుంది. వచ్చేవారం ఫస్ట్ లుక్ను విడుదల చేసి.. డిసెంబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అని ఆయన తెలిపారు. | entertainment |
35 | 28-03-2017 23:50:45 | వాహనాలకు ‘ప్రీమియం’ మోత |
ముంబై : మోటారు వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియం మరింత పెరిగింది. ఈ ప్రీమియం 41 శాతం పెంచుతున్నట్టు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డిఎ ఒక ప్రకటనలో తెలిపింది. లీటర్ నుంచి 1.5 లీటర్ల సామర్ధ్యం ఉన్న వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియాన్ని ప్రస్తుతం ఉన్న రూ.2,237 నుంచి రూ.3,132కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రీమియం రేట్లు అమలులోకి వస్తాయి. | business |
10,405 | 21-11-2017 16:55:11 | ‘పద్మావతి’ విడుదలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ | తిరువనంతపురం: గత కొద్ది రోజులుగా వివాదాలు, నిరసలతో సతమతమవుతున్న ‘పద్మావతి’ చిత్రం విడుదలకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాణి పద్మావతిని కించపరిచే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ దాదాపు నెల రోజులుగా ఆ వర్గానికి చెందిన వ్యక్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా సెట్పై, దర్శకుడిపై, విడదల కోసం సిద్ధంగా ఉన్న థియేటర్లపై కర్ణి సేన కార్యకర్తలు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం రెండు రోజుల క్రితం ప్రకటించింది. అయితే సినిమాపై విచారణ చేపట్టిన కేరళ న్యాయస్థానం సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించి విడుదల చేయాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులు రావడంతో సినిమాను యథావిధిగా డిసెంబర్ 1న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. | entertainment |
13,921 | 21-03-2017 03:19:05 | గణితం మహా కఠినం | చుక్కలు చూపించిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష న్యూఢిల్లీ, మార్చి20: కేంద్రీయ పాఠశాల విద్యామండలి(సీబీఎస్ఈ) 12వ తరగతి గణిత పరీక్ష కఠిన స్థాయిని ఏడాదికేడాది పెంచుతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం నిర్వహించిన గణిత పరీక్ష విద్యార్థులకు చుక్కలు చూపించడమే అందుకు కారణం. పేపర్ విధానంలో మార్పులు చేసినందున పరీక్ష సులువుగానే ఉంటుందనుకున్న విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎవర్నడిగినా పేపర్ రాయడానికి కష్టంగా ఉందని చెప్పారు. ప్రశ్నాపత్రం చూసిన ఉపాధ్యాయులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. | nation |
16,874 | 09-08-2017 02:42:50 | చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు కృషి | ఓబీసీ అఖిలపక్ష మహాసభలో దత్తాత్రేయన్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో బీసీ బిల్లు తీసుకొచ్చి చట్టసభల్లో 50ు రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, రాందాస్ అథవాలే అన్నారు. బీసీ డిమాండ్లపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ఓబీసీ అఖిల పక్ష మహాసభలో దత్తాత్రేయతో సహా టీకాంగ్రెస్ నేతలు పొన్నాల, వీహెచ్, రాపోలు, టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ చైర్మన్ ప్రొ.బబన్రావ్ త్రైవాడ్, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీసీలు ఆగ్రహిస్తే పరిణామాలు వేరుగా ఉంటాయని, తిరుగుబాటు మొదలైందని, వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమంలో దత్తాత్రేయ, అథవాలే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీసీ కమిషన్కు రాజ్యంగబద్ధమైన హోదా కల్పించేందుకు ప్రధాని మోదీ బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ అడ్డుతగిలిందని, ఇక చట్టసభల రిజర్వేషన్లు తీసుకొస్తే సహకరిస్తారా అని దత్తాత్రేయ ప్రశ్నించారు. | nation |
14,388 | 24-10-2017 10:45:31 | భారత్ చేరుకున్న ఆఫ్ఘాన్ అధ్యక్షుడు | న్యూఢిల్లీ: ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఈరోజు ఉదయం భారత్ చేరుకున్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన ఆయన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆఫ్ఘాన్ అధ్యక్షుడికి గౌరవ సూచకంగా విందు ఏర్పాటు చేయనున్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆయనతో భేటీ కానున్నారు. వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్ వద్ద జరిగే కార్యక్రమంలో అధ్యక్షుడు ఘనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. | nation |
752 | 24-11-2017 00:03:04 | డిఫాల్టర్లకు నో ఎంట్రీ! | దివాలా సంస్థల ఆస్తుల వేలంలో పాల్గొనకుండా నిషేధంఎన్పిఎ ఖాతాలున్న వారిపైనా నిషేధంఐబిసిలో సవరణలకు ఆర్డినెన్స్ జారీన్యూఢిల్లీ: బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసి.. దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా వారి సంస్థ వేలానికి వచ్చినప్పుడు కారు చౌక ధరకే తిరిగి దక్కించుకోవాలని చూస్తున్న కొందరు ప్రమోటర్ల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విల్ఫుల్ డిఫాల్టర్లు (ఉద్దేశపూరిత రుణ ఎగవేతదారులు), ఏడాది క్రితం బ్యాంకుల నిరర్ధక ఆస్తుల (ఎన్పిఎ) జాబితాలో చేరిన కంపెనీలు లేదా వారి ప్రమోటర్లు దివాలా తీసిన సంస్థ ఆస్తుల వేలంలో పాల్గొనకుండా నిషేధిస్తూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గత ఏడాది అమల్లోకి తెచ్చిన దివాలా కోడ్ (ఐబిసి) ప్రకారం.. దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా సంస్థ ఆస్తులను వేలం వేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రమోటర్లు కూడా బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే, కొందరు వ్యక్తుల కారణంగా ఐబిసిలోని ఈ నిబంధన దుర్వినియోగం లేదా నిష్పలం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ కంపెనీల చట్ట ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) నుంచి దివాలా పరిష్కార చర్యలకు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్న కేసులకు సైతం దివాలా కోడ్లో జరిపిన సవరణలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్కు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వచ్చేనెల 15 నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారని కార్పొరేట్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఆందోళనకర స్థాయికి పెరిగిన మొండిబకాయిలను (ఎన్పిఎ) పరిష్కరించేందుకు నడుం బిగించిన ఆర్థిక శాఖ.. అవసరమైతే ఎన్పిఎ జాబితాలోని సంస్థలపై దివాలా కోడ్ ప్రయోగించాలని బ్యాంకులను ఆదేశించగలిగేలా ఆర్బిఐకి అధికారాలు కట్టబెట్టింది. దాంతో ఆర్బిఐ.. రూ.5 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉన్న 12 కంపెనీలపై దివాలా కోడ్ ప్రయోగించాలని బ్యాంకులను ఆదేశించింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఎలు రూ.8 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా.. ఈ డజను సంస్థలు చెల్లించిన బకాయిల వాటానే 25 శాతం (దాదాపు రూ.2 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. ఆర్బిఐ తొలి జాబితాలోని పన్నెండు కంపెనీల్లో భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, లాంకో ఇన్ఫ్రాటెక్, మన్నెత్ ఇస్పాత్, ఎలకో్ట్రస్టీల్ కూడా ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని సంస్థల ఆస్తుల వేలంలో ప్రమోటర్లు కూడా బిడ్డింగ్లో పాల్గొంటున్నారు. గతంలో డిఫాల్ట్ అయిన ప్రమోటర్లు తిరిగి సంస్థను ఎలా గాడిన పెట్టగలుగుతారు, బ్యాంకులకు రుణ బకాయిలెలా చెల్లిస్తారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే 300కుపైగా సంస్థలపై దివాలా కోడ్ ప్రయోగించేందుకు బ్యాంకులకు ఎన్సిఎల్టి అనుమతిచ్చింది. ఐబిబిఐకి అదనపు అధికారాలు దివాలా చట్ట అమలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబిబిఐ)కు అదనపు అధికారాలుకల్పించారు. దివాలా కోడ్ను ఉల్లంఘించినవారిపై రూ.2 కోట్ల వరకు జరిమానా విధించేలా ఐబిబిఐకి అధికారం కల్పించారు. మేం విల్ఫుల్ డిఫాల్టర్లం కాదు: సంస్థలు దివాలా చట్ట ప్రకారంగా చర్యలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల ప్రమోటర్లు తాజా ఆర్డినెన్స్పై స్పందిస్తూ.. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పరిధిలోకి తాము రామని అంటున్నారు. ఒకవేళ అనుమతిస్తే బిడ్డింగ్లో పాల్గొంటామని వారు చెప్తున్నారు. కొందరు న్యాయ నిపుణులు మాత్రం ఈ ఆర్డినెన్స్ ఉద్దేశంతో విబేధిస్తున్నారు. దివాలా పరిష్కారానికొచ్చిన సంస్థ ప్రమోటర్లను బిడ్డింగ్లో పాల్గొనకుండా నిషేధిస్తే వేలంలో ఆ కంపెనీ ఆస్తుల విలువ మరింత పడిపోవచ్చని, దాంతో ఆశించిన స్థాయిలో రుణాలు రికవరీ కాక బ్యాంకులు అధికంగా నష్టపోవాల్సి రావచ్చని వారు అభిప్రాయపడ్డారు. | business |
9,241 | 21-05-2017 00:21:04 | కంగన.. ఎనభై ఏళ్ల వృద్ధురాలు! | బాలీవుడ్ ‘క్వీన’ కంగనా రనౌత దర్శకురాలిగా మారుతున్నారు. ఆ చిత్రంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి పాత్రను పోషించనున్నారు! అవును. ఆ సినిమా పేరు ‘తేజు’. పరమ్హంస ఫిలిమ్స్తో కలిసి కంగన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. డిసెంబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా 2018లో విడుదలవుతుంది. ‘‘దర్శకురాలిగా నా తొలి సినిమా ‘తేజు’లో ఎనభై ఏళ్ల వృద్ధురాలి పాత్రను పోషించబోతున్నా. నాకు తెలిసిన, నేను ప్రేమించిన ప్రతి వృద్ధురాలి కథ ఈ సినిమా. నా వయసు కంటే నేను పరిణతి చెందిన వ్యక్తిని కాబట్టి ఇది నాకు సంబంధించిన కథ కూడా. గలగల మాట్లాడే దయార్ద్ర హృదయురాలి పాత్ర నాది. జీవితాన్ని బాగా ఆస్వాదిస్తుంటుంది. చావుకు దగ్గరవుతున్నప్పటికీ, ఈ ప్రపంచాన్ని వదిలేందుకు ఇష్టపడని స్త్రీ ‘తేజు’. తనకు వయసైపోయిందని ఎప్పుడూ భావించదు. నేను చంటిబిడ్డగా ఉన్నప్పుడు, మా జేజమ్మకు ఎనభైకి పైగా ఏళ్లుంటాయి. పెద్దవాళ్ల మధ్యే నేను పెరిగాను. ఏ దేశంలో కానీ, ఏ సమాజంలో కానీ, ఏ కులంలో కానీ వృద్ధులు నిరాదరణకు గురవుతుండటం చూస్తే నాకు అమితంగా బాధ కలుగుతుంది’’ అని వివరించారు కంగన. దీనికి స్ర్కిప్ట్ రచయిత కూడా ఆమె. | entertainment |
590 | 21-09-2017 00:36:04 | ప్రారంభ సెషన్ తర్వాత బుల్లిష్.. | తిథి: అశ్వయుజ శుక్ల పాడ్యమి నక్షత్రం: హస్తపునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులు, తుల, కుంభ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ: 10141.15 (-6.40) ట్రెండ్ మార్పు వేళలు: ఉదయం 9.51, 11.11 గంటలు ధోరణి: గ్రహగతులను బట్టి మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమై 10.35 గంటల వరకు అదే విధంగా ఉండి 10.45 నుంచి 2 గంటల వరకు మెరుగ్గా ట్రేడవుతూ.. చివరకు నిలకడ/నిస్తేజంగా మారే ఆస్కారం ఉంది. ట్రేడింగ్ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి)కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్లా్సతో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.30 గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి. 10.45 తర్వాత ఎటిపికన్నా ఎగువన ట్రేడవుతూ ఉంటే తగిన స్టాప్లాస్ తో లాంగ్ పొజిషన్లను తీసుకుని 2 గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి. నిరోధ స్థాయిలు: 10180, 10215మద్దతు స్థాయిలు: 10090, 10055 గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.-డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinancialastrologer.blogspot.in | business |
17,819 | 03-09-2017 02:37:14 | అటెన్షన్! | కేంద్రమంత్రి పదవులపై తీవ్ర ఉత్కంఠకేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేడేఉదయం 10:30కి ముహూర్తం9 పేర్లు ఖరారు.. అన్నీ కొత్త ముఖాలే.. నలుగురు బ్యూరోక్రాట్లుతెలంగాణకు మొండిచేయే.. శాఖల మార్పుపైనా అయోమయంసురేశ్ ప్రభుకు రక్షణ!.. రైల్వే శాఖ వద్దని తేల్చి చెప్పిన నితిన్ గడ్కరీమనోజ్కు రైల్వే.. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్కూ పదోన్నతినిర్మలకు తప్పిన గండం.. మిత్రపక్షాలతో మరో విస్తరణ త్వరలోన్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అటెన్షన్! ఎవరికి పదవి వస్తుందో సందిగ్ధం! ఒకరికి పిలుపు వస్తోంది! మళ్లీ సందిగ్ధంలో పడుతోంది! ఒకరి పేరు తెరపైకి వస్తోంది! కొద్దిసేపట్లోనే అది తెరమరుగవుతోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బీజేపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, కొత్తగా 9 మందికి అవకాశం కల్పించనున్నారు. వారంతా కొత్తవారే. వారిలోనూ నలుగురు బ్యురోక్రాట్లు! రాష్ట్రపతి భవన్లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆరుగురు మంత్రుల (బండారు దత్తాత్రేయ, కల్రాజ్ మిశ్రా, రాజీవ్ ప్రతాప్ రూఢీ, సంజీవ్ కుమార్ బాల్యాన్, ఫగ్గన్ సింగ్ కులస్తే, మహేంద్రనాథ్ పాండే)తో రాజీనామా చేయించిన మోదీ-షాలు కొత్తగా తొమ్మిది మందికి చోటు కల్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. కానీ, కొత్త మంత్రుల పేర్లతో విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. అలాగే, మంత్రి పదవికి రాజీనామా చేసిన దత్తాత్రేయ స్థానంలో తెలంగాణ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదని సమాచారం. మిత్రపక్షమైన టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు అశోక్గజపతిరాజు, సుజనాచౌదరిల మంత్రి పదవుల్లో కూడా ఎటువంటి మార్పు లేదు. కేబినెట్లో కొత్త మంత్రుల చేరికపై ప్రధాని మోదీ తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం స్వతంత్ర హోదాతో మంత్రులుగా ఉన్న పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శాఖ మారే అవకాశాలున్నాయి. రక్షణ శాఖ మంత్రిగా సురేశ్ ప్రభు పేరును ప్రధాని మోదీ దాదాపు ఖరారు చేశారు. రైల్వే మంత్రిగా నితిన్ గడ్కరీని నియమించాలని తొలుత భావించినా.. అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. దాంతో, ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హాకు పదోన్నతి కల్పించి ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. కొత్తగా తొమ్మిది మందికి మంత్రులుగా అవకాశం కల్పిస్తే వారిలో నలుగురు బ్యురాక్రాట్లు కావడం విశేషం. వీరిలో ఆర్కే సింగ్, ఆల్ఫోన్స్ మాజీ ఐఏఎస్ లు కాగా, హర్దీప్ సింగ్ పూరీ మాజీ ఐఎ్ఫఎస్ అధికారి. సత్యపాల్ సింగ్ మాజీ ఐపీఎస్. ఈయన ఢిల్లీ ముంబై కమిషనర్గా పని చేశారు. మిగిలిన ఐదుగురిలో ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. బిహార్ నుంచి రూడీని, యూపీ నుంచి కల్రాజ్ మిశ్రాను తప్పించారు కనక.. ఆ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు ఇచ్చారు. ‘‘కొత్త మంత్రులను కీలక శాఖల్లో వ్యూహాత్మక పదవుల్లో నియమించనున్నారు. మరీ ముఖ్యంగా, చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్న మోదీ కలను సాకారం చేయడానికి వీరు కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, రానున్న ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్లకు విస్తరణలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, మిత్రపక్షాలకు ఈసారి చోటు కల్పిస్తారని భావించినా, జేడీయూ, అన్నాడీఎంకేలకు ఎటువంటి ఆహ్వానం పలకలేదు. ఇదే విషయాన్ని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, ఈసారి మిత్రపక్షాలను కేబినెట్లోకి తీసుకోలేదు కనక త్వరలోనే మరోసారి విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ విస్తరణలోనే హరిబాబుకు అవకాశం కల్పించే చాన్స్ ఉందని వివరించాయి. కాగా, ఈసారి విస్తరణలో మీకు అదనపు బాధ్యతలు రానున్నాయా అని విలేకరులు నితిన్ గడ్కరీని ప్రశ్నించగా, శాఖల కేటాయింపు అనేది ప్రధాని హక్కు అని, కొత్త మంత్రులు మాత్రం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఆరెస్సెస్ ఆగ్రహంకేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఆరెస్సెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యం గా, బండారు దత్తాత్రేయ, కల్రాజ్ మిశ్రా, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఫగ్గన్ సింగ్ కులస్తే నిజాయతీపరులేనని, వారిని తప్పించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా దత్తాత్రేయ, రూడీ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బిహార్లో రూడీని తప్పించి మాజీ ఐపీఎస్ ఆర్కే సింగ్కు కేబినెట్లో చోటు కల్పిస్తున్నారు. దాంతో, పార్టీ నేతను తప్పించి బ్యురాక్రాట్కు అవకాశం ఇవ్వడం ఏమిటని ఆరెస్సెస్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కొత్త మంత్రులు వీరే!: 1. శివ్ ప్రతాప్ శుక్లా (ఉత్తరప్రదేశ్)2. అశ్వనీ చౌబే (బిహార్), 3. వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్)4. అనంత కుమార్ హెగ్డే (కర్ణాటక), 5. ఆర్కే సింగ్ (బిహార్)6. హర్దీప్సింగ్ పూరీ (పంజాబ్), 7. గజేంద్ర షెకావత్ (రాజస్థాన్)8. సత్యపాల్ సింగ్ (ఉత్తరప్రదేశ్), 9. ఆల్ఫోన్స్ కన్నంథనమ్ (కేరళ) | nation |
12,041 | 21-05-2017 04:52:17 | భూకంపాలను పసిగట్టే ఉపగ్రహం | బెంగళూరు, మే 20: అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాతో సంయుక్తంగా చేపట్టిన ఉపగ్రహం పూర్తికావస్తోందని ఇస్రో పేర్కొంది. ఇప్పటి వరకు రూపొందించిన ఉపగ్రహాలలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహమని పేర్కొంది. నాసా, ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ శాటిలైట్ (ఎన్ఐఎస్ ఏఆర్-నిసార్)గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుకు దాదాపు పదివేల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. త్వరలో నిర్మాణాన్ని పూర్తిచేసి జీఎస్ ఎల్వీ మార్క్-2 తో అంతరిక్షంలోకి ప్రయోగించాలని భావిస్తున్నట్లు వివరించింది. షెడ్యూలు ప్రకారం నిసార్ ప్రయోగాన్ని 2021లో చేపట్టనున్నారు. కాగా, ఈ ఉపగ్రహానికి రెండు రకాల ఫ్రీక్వెన్సీలో పనిచేసే రాడార్లను అమర్చారు. ఈ రాడార్లలలో ఎల్ బాండ్ను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) తయారుచేయగా.. ఎస్ బాండ్ను అమెరికా తయారుచేసింది. అంతరిక్షంలోకి చేరిన తర్వాత నిసార్ వారంవారం భూమిని ఫొటోలు తీసి పంపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం నిసార్ను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ వెల్లడించారు. | nation |
4,267 | 20-04-2017 04:47:37 | కౌలురైతుకు ఉరేస్తున్న వరి! | ప్రస్తుత రబీ ధాన్యాన్ని క్వింటాల్కు కనీసంగా రూ.2,000 కైనా కొనుగోలు చేయకపోతే కౌలురైతులు తీవ్రంగా నష్టపోతారు. అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మద్దతు ధరలురైతాంగానికి అందించేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఈ నిధికి ఇంత వరకూ ఒక్క పైసా కేటాయించలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో రబీ వరి పంట చేతికి వచ్చే దశకు చేరింది. వరి కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవ్వగా 20 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. వరి పంట పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగం కౌలురైతులదే. వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా వుండటంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఎకరాలో రబీ ధాన్యం ఉత్పత్తికి సరాసరి పెట్టుబడి రూ.34,575 అవుతోంది. సరాసరి కౌలు 12 బస్తాలకు రూ. 12,000 కలిపితే మొత్తం పెట్టుబడి రూ. 46,575 గా ఉన్నది. కౌలురైతు, కౌలురైతు కుటుంబం శ్రమ మినహాయిస్తే ఉత్పత్తి ఖర్చు ఇంకా పెరుగుతుంది. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి సరాసరి ఖర్చు రూ.1,791గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యానికి మద్దతు ధర కేవలం రూ.50/-----–మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. క్వింటాల్ ధాన్యం బస్తాకు ఏ గ్రేడ్కు రూ.1,510, కామన్ రకానికి రూ.1,470 గా నిర్ణయించింది. ఉత్పత్తి ఖర్చు కంటే మద్దతు ధర ఏ – గ్రేడ్కు రూ. 281, కామన్ రకానికి రూ.321 తక్కువగా ఉంది. రబీలో సరాసరి దిగుబడి 26 నుంచి 30 క్వింటాల్కు మించి వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రబీ వరికి పెట్టుబడి ఖర్చు: విత్తనాలు – రూ.1100, నారుమడి దమ్ము, బాగు చేయుట – రూ.900, నారుమడికి పురుగు మందులు, ఎరువులు – రూ.500, దమ్ము 4 సాళ్లు – రూ.2400, గట్టులంకలు, అడ్డావేయుట – రూ. 1000, నాట్లు కూలీ ఖర్చు – రూ.1650, నారుతీత, నారువేత కాంట్రాక్టు కూలీ – రూ.1500, కలుపు మందు – రూ.400, కలుపు తీత కూలీ ఖర్చు – రూ.1500, పురుగుమందులు కొనుగోలు – రూ.7000, స్ట్రేయింగ్ కూలీ ఖర్చు – రూ. 1200, ఎరువులు – రూ.4500, ఎరువులు చల్లుట కూలీ ఖర్చు – రూ.600, కోత, నూర్పిడి కట్టేత – రూ.6500, ఎలుకల నిర్మూలన – రూ.1000, ధాన్యం చేరవేత ట్రాక్టరు కిరాయి – రూ.1000, బరకాలు – రూ.225, సాగునీరు, ఇతర ఖర్చులు – రూ.4000, వడ్డీ 6 మాసాలకు – రూ.3600; మొత్తం: 34,575-, కౌలు 12 బస్తాలు – 12X1000 = రూ.12,000-; కౌలురైతు కుటుంబం శ్రమ మినహాయిస్తే మొత్తం: రూ.46,575. క్వింటాల్కు ఉత్పత్తి ఖర్చులు – రూ.1791. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకావడం లేదు. వాతావరణ మార్పులతో తేమ శాతం, ఇతర నిబంధనలు సాకు చూపి దళారులు, మిల్లర్లు ప్రస్తుతం క్వింటాల్ ధాన్యాన్ని రూ.1,200, రూ.1,300కు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక ఎకరాకు కౌలురైతు సరాసరిగా రూ. 12,000 వరకు నష్టపోతున్నాడు. సొంత భూమిగల రైతుకు కౌలు ఉండదు కాబట్టి ఆ మేరకు గట్టెక్కుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో మాత్రం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు పెంచుతామని హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశాయి. ఈ సిఫార్సులు ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. క్వింటాల్ ధాన్యానికి ప్రస్తుతం సరాసరి ఉత్పత్తి ఖర్చు రూ.1,791 కు అదనంగా 50% అంటే రూ. 895- కలిపితే రూ. 2,686 మద్దతు ధర నిర్ణయించాల్సి ఉంది. ఇటీవల కనీస మద్దతు నిర్ణయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని హుకుందేవ్ నారాయణ్ యాదవ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) మద్దతు ధరల నిర్ణయం విధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. రైతులు పెడుతున్న అనేక పెట్టుబడి ఖర్చులను సీఏసీపీ పరిగణలోకి తీసుకోవడం లేదని, ప్రధానంగా ఎలుకల నిర్మూలన, పెరిగిన కూలీ ఖర్చులు, విత్తనాలు, డీజిల్ ధరల పెరుగుదల తదితర ఖర్చులు ఉత్పత్తి ఖర్చుల్లో భాగంగా చూపడం లేదని చెప్పింది. రైతులు పండించిన పంటలు ధర రాని కాలంలో నిల్వ చేసుకోవడానికి ఎలాంటి గోడౌన్ సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకోవలసిన దుస్థితి వస్తోందని కమిటీ రిపోర్టులో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత రబీ ధాన్యాన్ని క్వింటాల్కు కనీసంగా రూ.2,000 కైనా కొనుగోలు చేయకపోతే కౌలురైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మద్దతు ధరలు రైతాంగానికి అందించేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధికి ఇంత వరకూ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి. రాజ్యాంగం రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ మద్దతు ధరకు అదనంగా ఒక్కపైసా కూడా బోనస్ ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది. సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) సర్వే వాస్తవాలను వెల్లడించింది. రైతాంగ దుస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. అబద్ధాల ప్రచారం మానాలి. రాష్ట్రంలో 93%మంది రైతులు అప్పుల్లో ఉన్నారని ఒక్కో కుటుంబానికి సరాసరి రూ.1,23,000 రుణభారం ఉందని సెస్ సర్వేలో తెలింది. కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో 14% వ్యవసాయ వృద్ధిరేటు సాధించినట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకోవడం గమనార్హం. ధాన్యం కొనుగోలు నిబంధనలు రైతుకు శాపంగా మారాయి. తేమ శాతం లెక్కింపులో మోసాలు జరుగుతున్నాయి. తేమ శాతం 17 శాతంగా నిబంధనలు ఉంటే మిల్లర్లు, దళారులు 15శాతం మాత్రమే అంటున్నారు. పైగా మిషన్లలో తేడాలు వుండటంతో అధిక తేమ శాతం చూపుతున్నారు. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. 40కేజీల సంచి 600 గ్రాములు ఉంటే అదనంగా 400 గ్రాములు కలిపి కేజీ తూకం చేస్తున్నారు. ఎకరాకు రైతు బస్తా ధాన్యం కోల్పోతున్నారు. తరుగు, ఇతర కారణాలు చెప్పి అదనంగా ధాన్యం తూకం వేస్తున్నారు. ధరలో కోత, తేమ శాతం లెక్కింపు, తూకాల్లో మోసాలతో రైతును మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాలు వీరికే ఉపయోగపడుతున్నాయి తప్ప రైతుకు ప్రయోజనం లేదు. మిల్లర్లు, దళారులు కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే కొన్నట్లు చూపి మద్దతు ధరను కాజేస్తున్నారు. ఈ-క్రాప్ బుకింగ్ ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ-క్రాప్ బుకింగ్లో కౌలురైతుల పేర్లు నమోదు కాలేదు. కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. భూ యజమానుల పేరుతోనే ధాన్యం అమ్ముకుంటే వారి అక్కౌంట్స్కే డబ్బులు జమ అవుతున్నాయి. కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో గొడౌన్లు సౌకర్యం లేక కళ్లాల్లోనే ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. రైతాంగ ఆత్మహత్యలు నివారించాలి. మద్దతు ధర సాధనకు కౌలురైతులు ఐక్యంగా ఉద్యమించాలి.ధాన్యం క్వింటాల్కు రూ.2,000 మద్దతు ధర కల్పించాలి. కేంద్రం మద్దతు ధర పెంచకుంటే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. తేమ శాతం నిబంధనలు మార్చాలి. తేమ శాతం లెక్కింపు, తూకాల్లో మోసాలు అరికట్టాలి. రైతులకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేంద్రాలు వెంటనే తెరవాలి. పండించిన ధాన్యం దాచుకునేలా గ్రామాల్లో గొడౌన్ల సౌకర్యం కల్పించాలి. ధాన్యం కొన్న వెంటనే డబ్బులు చెల్లించాలి. కొనుగోలు కేంద్రాలకూ, మిల్లులకు రైతు చేరవేస్తే రవాణా చార్జీలు రైతుకే చెల్లించాలి. గత రవాణా చార్జీల బకాయిలు రైతులకు ఇవ్వాలి.కె. శ్రీనివాస్ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, ప.గో.జిల్లా కార్యదర్శిఉభయగోదావరి జిల్లాల్లో రబీ వరి పంట చేతికి వచ్చే దశకు చేరింది. వరి కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవ్వగా 20 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. వరి పంట పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగం కౌలురైతులదే. వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా వుండటంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక ఎకరాలో రబీ ధాన్యం ఉత్పత్తికి సరాసరి పెట్టుబడి రూ.34,575 అవుతోంది. సరాసరి కౌలు 12 బస్తాలకు రూ. 12,000 కలిపితే మొత్తం పెట్టుబడి రూ. 46,575 గా ఉన్నది. కౌలురైతు, కౌలురైతు కుటుంబం శ్రమ మినహాయిస్తే ఉత్పత్తి ఖర్చు ఇంకా పెరుగుతుంది. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి సరాసరి ఖర్చు రూ.1,791గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యానికి మద్దతు ధర కేవలం రూ.50/-----–మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. క్వింటాల్ ధాన్యం బస్తాకు ఏ గ్రేడ్కు రూ.1,510, కామన్ రకానికి రూ.1,470 గా నిర్ణయించింది. ఉత్పత్తి ఖర్చు కంటే మద్దతు ధర ఏ – గ్రేడ్కు రూ. 281, కామన్ రకానికి రూ.321 తక్కువగా ఉంది. రబీలో సరాసరి దిగుబడి 26 నుంచి 30 క్వింటాల్కు మించి వచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రబీ వరికి పెట్టుబడి ఖర్చు: విత్తనాలు – రూ.1100, నారుమడి దమ్ము, బాగు చేయుట – రూ.900, నారుమడికి పురుగు మందులు, ఎరువులు – రూ.500, దమ్ము 4 సాళ్లు – రూ.2400, గట్టులంకలు, అడ్డావేయుట – రూ. 1000, నాట్లు కూలీ ఖర్చు – రూ.1650, నారుతీత, నారువేత కాంట్రాక్టు కూలీ – రూ.1500, కలుపు మందు – రూ.400, కలుపు తీత కూలీ ఖర్చు – రూ.1500, పురుగుమందులు కొనుగోలు – రూ.7000, స్ట్రేయింగ్ కూలీ ఖర్చు – రూ. 1200, ఎరువులు – రూ.4500, ఎరువులు చల్లుట కూలీ ఖర్చు – రూ.600, కోత, నూర్పిడి కట్టేత – రూ.6500, ఎలుకల నిర్మూలన – రూ.1000, ధాన్యం చేరవేత ట్రాక్టరు కిరాయి – రూ.1000, బరకాలు – రూ.225, సాగునీరు, ఇతర ఖర్చులు – రూ.4000, వడ్డీ 6 మాసాలకు – రూ.3600; మొత్తం: 34,575-, కౌలు 12 బస్తాలు – 12X1000 = రూ.12,000-; కౌలురైతు కుటుంబం శ్రమ మినహాయిస్తే మొత్తం: రూ.46,575. క్వింటాల్కు ఉత్పత్తి ఖర్చులు – రూ.1791. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకావడం లేదు. వాతావరణ మార్పులతో తేమ శాతం, ఇతర నిబంధనలు సాకు చూపి దళారులు, మిల్లర్లు ప్రస్తుతం క్వింటాల్ ధాన్యాన్ని రూ.1,200, రూ.1,300కు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక ఎకరాకు కౌలురైతు సరాసరిగా రూ. 12,000 వరకు నష్టపోతున్నాడు. సొంత భూమిగల రైతుకు కౌలు ఉండదు కాబట్టి ఆ మేరకు గట్టెక్కుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో మాత్రం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు పెంచుతామని హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశాయి. ఈ సిఫార్సులు ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. క్వింటాల్ ధాన్యానికి ప్రస్తుతం సరాసరి ఉత్పత్తి ఖర్చు రూ.1,791 కు అదనంగా 50% అంటే రూ. 895- కలిపితే రూ. 2,686 మద్దతు ధర నిర్ణయించాల్సి ఉంది. ఇటీవల కనీస మద్దతు నిర్ణయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని హుకుందేవ్ నారాయణ్ యాదవ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) మద్దతు ధరల నిర్ణయం విధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. రైతులు పెడుతున్న అనేక పెట్టుబడి ఖర్చులను సీఏసీపీ పరిగణలోకి తీసుకోవడం లేదని, ప్రధానంగా ఎలుకల నిర్మూలన, పెరిగిన కూలీ ఖర్చులు, విత్తనాలు, డీజిల్ ధరల పెరుగుదల తదితర ఖర్చులు ఉత్పత్తి ఖర్చుల్లో భాగంగా చూపడం లేదని చెప్పింది. రైతులు పండించిన పంటలు ధర రాని కాలంలో నిల్వ చేసుకోవడానికి ఎలాంటి గోడౌన్ సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకోవలసిన దుస్థితి వస్తోందని కమిటీ రిపోర్టులో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత రబీ ధాన్యాన్ని క్వింటాల్కు కనీసంగా రూ.2,000 కైనా కొనుగోలు చేయకపోతే కౌలురైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మద్దతు ధరలు రైతాంగానికి అందించేందుకు చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధికి ఇంత వరకూ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి. రాజ్యాంగం రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ మద్దతు ధరకు అదనంగా ఒక్కపైసా కూడా బోనస్ ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది. సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) సర్వే వాస్తవాలను వెల్లడించింది. రైతాంగ దుస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. అబద్ధాల ప్రచారం మానాలి. రాష్ట్రంలో 93%మంది రైతులు అప్పుల్లో ఉన్నారని ఒక్కో కుటుంబానికి సరాసరి రూ.1,23,000 రుణభారం ఉందని సెస్ సర్వేలో తెలింది. కానీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో 14% వ్యవసాయ వృద్ధిరేటు సాధించినట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకోవడం గమనార్హం. ధాన్యం కొనుగోలు నిబంధనలు రైతుకు శాపంగా మారాయి. తేమ శాతం లెక్కింపులో మోసాలు జరుగుతున్నాయి. తేమ శాతం 17 శాతంగా నిబంధనలు ఉంటే మిల్లర్లు, దళారులు 15శాతం మాత్రమే అంటున్నారు. పైగా మిషన్లలో తేడాలు వుండటంతో అధిక తేమ శాతం చూపుతున్నారు. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. 40కేజీల సంచి 600 గ్రాములు ఉంటే అదనంగా 400 గ్రాములు కలిపి కేజీ తూకం చేస్తున్నారు. ఎకరాకు రైతు బస్తా ధాన్యం కోల్పోతున్నారు. తరుగు, ఇతర కారణాలు చెప్పి అదనంగా ధాన్యం తూకం వేస్తున్నారు. ధరలో కోత, తేమ శాతం లెక్కింపు, తూకాల్లో మోసాలతో రైతును మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ఐకేపీ కేంద్రాలు వీరికే ఉపయోగపడుతున్నాయి తప్ప రైతుకు ప్రయోజనం లేదు. మిల్లర్లు, దళారులు కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే కొన్నట్లు చూపి మద్దతు ధరను కాజేస్తున్నారు. ఈ-క్రాప్ బుకింగ్ ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ-క్రాప్ బుకింగ్లో కౌలురైతుల పేర్లు నమోదు కాలేదు. కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. భూ యజమానుల పేరుతోనే ధాన్యం అమ్ముకుంటే వారి అక్కౌంట్స్కే డబ్బులు జమ అవుతున్నాయి. కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో గొడౌన్లు సౌకర్యం లేక కళ్లాల్లోనే ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. రైతాంగ ఆత్మహత్యలు నివారించాలి. మద్దతు ధర సాధనకు కౌలురైతులు ఐక్యంగా ఉద్యమించాలి.ధాన్యం క్వింటాల్కు రూ.2,000 మద్దతు ధర కల్పించాలి. కేంద్రం మద్దతు ధర పెంచకుంటే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. తేమ శాతం నిబంధనలు మార్చాలి. తేమ శాతం లెక్కింపు, తూకాల్లో మోసాలు అరికట్టాలి. రైతులకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేంద్రాలు వెంటనే తెరవాలి. పండించిన ధాన్యం దాచుకునేలా గ్రామాల్లో గొడౌన్ల సౌకర్యం కల్పించాలి. ధాన్యం కొన్న వెంటనే డబ్బులు చెల్లించాలి. కొనుగోలు కేంద్రాలకూ, మిల్లులకు రైతు చేరవేస్తే రవాణా చార్జీలు రైతుకే చెల్లించాలి. గత రవాణా చార్జీల బకాయిలు రైతులకు ఇవ్వాలి.కె. శ్రీనివాస్ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, ప.గో.జిల్లా కార్యదర్శి | editorial |
15,137 | 23-11-2017 14:46:47 | ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్నది అదే : మోదీ |
న్యూఢిల్లీ : సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత వేగంగా మార్పులు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం సైబర్ స్పేస్పై ప్రపంచ సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గత రెండు దశాబ్దాల్లో సైబర్ స్పేస్ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చేసిందో మనందరికీ తెలుసునన్నారు. 70వ దశకంలో భారీ మెయిన్ఫ్రేమ్ కంప్యూటర్లు ఉండేవని, 90వ దశకం వచ్చేసరికి ఈ-మెయిళ్ళు, పర్సనల్ కంప్యూటర్లు నూతన విప్లవాన్ని తీసుకొచ్చాయని చెప్పారు. సైబర్ స్పేస్ గత కొద్ది దశాబ్దాల్లో ప్రపంచాన్ని మార్చేసిందన్నారు. ప్రపంచంలో హెచ్చుతగ్గులు లేకుండా చేసే గొప్ప సాధనంగా డిజిటల్ టెక్నాలజీ ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇది దోహదపడుతోందన్నారు. ఇది సమతల ప్రపంచాన్ని సృష్టించిందన్నారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగలుగుతోందంటే, అది కేవలం టెక్నాలజీ వల్లనేనని తెలిపారు. టెక్నాలజీతో నడుస్తున్న భారీ పథకం ‘డిజిటల్ ఇండియా’ అని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పథకమని మోదీ తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఎనేబుల్డ్ సర్వీసెస్ - జామ్ పథకం - వల్ల అవినీతి తగ్గిందని, పారదర్శకత పెరిగిందని తెలిపారు. దళారులను తొలగించడం వల్ల దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు తెలిపారు. నరేంద్ర మోదీ యాప్ వల్ల తాను ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోగలుగుతున్నట్లు తెలిపారు. | nation |
14,671 | 04-10-2017 04:39:26 | ‘ఓబీసీ’ పై లోతుగా అధ్యయనం: జస్టిస్ రోహిణి | న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఓబీసీ వర్గీకరణపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సరైన గణాంకాలతో కూడిన నివేదికను అందజేస్తామని ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కమిటీ చైర్పర్సన్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి అన్నారు. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన ఆమె అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆయా వర్గాల ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చి 30ఏళ్లు గడిచినా లబ్ధి జరగడం లేదని, ప్రజల్లో అవగాహన పెరిగి కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని జస్టిస్ రోహిణి తెలిపారు. 3రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని ఆమె వెల్లడించారు. | nation |
8,425 | 07-03-2017 12:00:16 | ఆ హీరో వల్ల అన్యాయమైపోయిన దిశాపటానీ | వారసుల కోసం హీరోలు, హీరోయిన్లు ఎవరికి అన్యాయం చేయడానికైనా వెనుకాడరు. సరిగ్గా ఇదే జరిగింది దిశాపటానీ విషయంలో. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకి సీక్వెల్ను కరణ్ తీస్తున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాలో మొదట దిశాపటానీని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైఫ్ తన కూతురు సారాను ఈ సినిమా ద్వారా హీరోయిన్ చేద్దామని భావించాడట! ఆలస్యం లేకుండా పావులు కదిపాడట! ఫలితం దిశా స్థానంలో సారా వచ్చి చేరింది. ఈ విషయం తెలిసి దిశా తనకు జరిగిందని వాపోతోందట! పాపం తన బాధని బైటికి చెప్పుకునే అవకాశం కూడా దిశాకు లేకుండా పోయిందని బాలీవుడ్ జనాలు ఆమె మీద సానుభూతి చూపిస్తున్నారు. | entertainment |
12,691 | 18-01-2017 16:22:28 | మొయిలీ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్ | న్యూఢిల్లీ: నోట్లరద్దు, తదనంతర పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్తో పార్లమెంటరీ కమిటీ బుధవారం సమావేశమైంది. పార్లమెంటరీ కమిటీ ఆఫ్ ఫైనాన్స్కు వీరప్పమొయిలీ సారథ్యం వహిస్తుండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కమిటీలో ఉన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కూడా వదులుకుని ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ఊర్జిత్ను సమవేశంలో ప్రశ్నించే అవకాశం ఉంది. నోట్లరద్దు, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం వంటి అంశాలపై కమిటీకి ఊర్జిత్ వివరణ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు బ్యాంకింక్ సెక్రటరీ అంజులీ చిబ్ దుగ్గల్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్, రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ అథియా ఇతర సినీయర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వీరు సైతం కమిటీకి తమ వివరణ ఇవ్వనున్నారు. నోట్ల రద్దు డ్రైవ్ సమయంలో బ్యాంకు ఎటీఎంల నుంచి నగదు విత్డ్రాకు సంబంధించి రూల్స్ తరచు మార్చడం, రద్దయిన సుమారు రూ.15.44 లక్షల కోట్లలో ఎంత మొత్తం బ్యాంకులకు తిరిగి వచ్చిందనే విషయంపైనా పార్లమెంటరీ కమిటీ ఉర్జిత్ పటేల్ను ప్రశ్నించే అవకాశం ఉంది. | nation |
4,055 | 01-05-2017 03:39:07 | బలివాడ రచనలపై పోటీ | బలివాడ కాంతారావు సాహిత్యంపై ఆయన 90వ జయంతి (జూలై 3) సందర్భంగా విశాఖపట్నంలో భారతనిధి ఫౌండేషన్ చైర్మన్, విశాఖ రచయితల సంఘం, విశాఖసంస్కృతి మాసపత్రిక సంయుక్తంగా సమీక్ష/ వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నది. రచన 8పేజీలు మించకుండా మే10లోగా పంపాలి. చిరునా మా: అడపారామకృష్ణ, డోర్.నెం. 43-21-21, వరుణ్ షోరూం ఎదురుగా, దొండపర్తి జంక్షన్, విశాఖ పట్నం-530016. ఫోన్- 95052 69091. - అడపా రామకృష్ణ | editorial |
4,457 | 31-05-2017 02:47:46 | నిజాయితీకి నిలువుటద్దం |
నిక్కమైన మంచి నీలం వంటి వాడు నీలం సంజీవరెడ్డి. 1996 జూన్ 1న ఆయన పరమపదించారు. ఏనుగు మొదలుకొని పిపీలికం (చీమ) వరకు అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ సర్కోవత్కృష్టమైనది. ఈ భూమి మీద పుట్టిన వారిలో అతికొద్ది మంది మాత్రమే తమ శాశ్వత ముద్ర వేయగలిగారు. వారే చరితార్థులు, చరిత్రకారులు. ఆ అతికొద్ది మంది కోవకు చెందిన వారే నీలం సంజీవరెడ్డి. సంజీవరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. మహాత్మాగాంధీ పిలుపు అందుకుని 1931లో కళాశాల చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో దూకారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. 1940-–45 మధ్య ఎక్కువ కాలం జైలు జీవితం గడిపారు. 1951 నుంచి 1953 వరకు ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. 1960 నుంచి 1962 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా వున్నారు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. 1956 నుంచి 1960 వరకు, 1962 నుంచి 1964 వరకు రెండుసార్లు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో లాల్బహదూర్ శాస్ర్తి మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా, ఇందిరా గాంధీ మంత్రివర్గంలో రవాణా, పౌర విమానయాన, నౌకాయాన, టూరిజం మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు లోక్సభ స్పీకర్గా ఉన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండాలన్న ఉద్దేశంతో స్పీకర్ అయిన వెంటనే సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడైన స్పీకర్ అనిపించుకున్నారు. ఇప్పటివరకు ఎన్నికైన దేశ రాష్ట్రపతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది నీలం సంజీవరెడ్డి మాత్రమే కావడం విశేషం. సంజీవరెడ్డి పుట్టింది పల్లెటూర్లో... అలంకరించింది ఢిల్లీ పదవిని. రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి పదవిని అలంకరించి ‘రైతే రాజు’ అని నిరూపించారు. చదివింది ఇంటర్ అయినా జీవిత పాఠాలు నేర్చుకున్న నిరంతర విద్యార్థి. నీతికి, నిజాయితీకి, నిర్భీతికి, నిష్కల్మషానకి నిలువుటద్దం. ఆయన పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. పదవులే ఆయన కోసం వెంటపడుతూ వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క ప్రధాన మంత్రి పదవి తప్ప తక్కిన అన్ని పదవులు ఆయన అధిష్టించారు. ఎమ్మెల్యే, లోక్సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, భారత రాష్ట్రపతిగా ఇలా దాదాపు అన్ని పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ను ధాన్యాగారంగా చెప్పుకునేందుకు ముఖ్యకారకుడు సంజీవరెడ్డి. నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, వంశధార ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన మానస పుత్రిక. పదవి ఉన్నప్పుడు పొంగిపోవడం, అది లేనప్పుడు కృంగిపోవడం అంటే ఏమిటో తెలియని స్థితప్రజ్ఞుడు.డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డిఅధికార ప్రతినిధి, ఏపీసీసీ(రేపు నీలం సంజీవరెడ్డి వర్ధంతి) | editorial |
2,840 | 21-04-2017 00:05:45 | పి-నోట్ల పెట్టుబడి రూ.1.78 లక్షల కోట్లు | భారత మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల (పి నోట్స్) ద్వారా పెట్టే పెట్టుబడులను విదేశీ పోర్టుఫోలియో సంస్థ (ఎ్ఫపిఐ)లు మరింత పెంచాయి. సెబి గణాంకాల ప్రకారం మార్చి నెలాఖరుకు ఈ పెట్టుబడులు రూ.1,78,437 కోట్లకు చేరాయి. ఫిబ్రవరితో పోలిస్తే ఇది దాదాపు రూ.8,000 కోట్లు ఎక్కువ. ఇందులో రూ.1.12 లక్షల కోట్లు ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టాయి. పి.నోట్ల పెట్టుబడి నిబంధనలను సెబి కఠినం చేసినా ఈ పెట్టుబడులు పెరగడం విశేషం. సెబి దగ్గర నమోదైన ఎఫ్పిఐల ద్వారా విదేశీయులు లేదా విదేశీ సంస్థలు పి నోట్ల ద్వారా భారత ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. | business |
15,597 | 10-02-2017 00:33:52 | భారత్లో రహస్య అణ్వాయుధ నగరం | భారత రహస్యంగా అణు నగరాన్ని నిర్మిస్తోంది. అణ్వాయుధ సంపత్తిని రోజురోజుకీ పెంచుకుంటున్న భారత.. ఉపఖండంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. అంతేకాక ఖండాతర క్షిపణులను కూడా పరీక్షిస్తూ ఆయుధ పోటీకి తెరతీస్తోంది. భారత దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలి. - నఫీజ్ జకారియాపాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి | nation |
2,910 | 18-02-2017 23:37:40 | ఎస్బిటి రూ.600 కోట్ల సమీకరణ | న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బిటి) ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా బాండ్లను జారీ చేసి 600 కోట్ల రూపాయల వరకు సమీకరించనుంది. టైర్ వన్ మూలధనాన్ని పెంచుకునేందుకుగాను ఈ నిధులను సమకూర్చుకోవాలని బ్యాంకు నిర్ణయించింది. మాతృ సంస్థ ఎస్బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఎస్బిటి నిధుల సేకరణ చేపట్టడం విశేషం. | business |
3,124 | 11-08-2017 01:44:28 | భారత్ ఫోర్జ్ లాభం రూ.175 కోట్లు | 1:1 బోనస్ ఇష్యూన్యూఢిల్లీ : జూన్తో ముగిసిన త్రైమాసింలో 1,283.70 కోట్ల రూపాయల మొత్తం రాబడిపై 175.08 కోట్ల రూపాయల నికర లాభాన్ని సాధించినట్లు భారత్ ఫోర్జ్ వెల్లడించింది. గత ఏడాది (122 కోట్ల రూపాయలు)తో పోల్చితే నికర లాభం 43.43 శాతం వృద్ధి చెందింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 2 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఒక షేరును బోన్సగా జారీ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. కాగా భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అనలాజిక్ కంట్రోల్స్ ఇండియా లిమిటెడ్లో మిగిలిన 40 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. మరోవైపు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 201.60 కోట్ల రూపాయల కాంట్రాక్టును అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆర్డర్లో భాగంగా 1,050 డ్యూయల్ టెక్నాలజీ డిటెక్షన్ ఎక్వి్పమెంట్ను సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. గురువారం బిఎ్సఇలో కంపెనీ షేరు 2.20 శాతం నష్టపోయి 1,142.25 రూపాయల వద్ద క్లోజైంది. | business |
10,320 | 23-04-2017 11:52:42 | గుండెల్ని పిండేసే ప్రేమకథల్ని తీయడంలో ఆయనే దిట్ట: తాప్సీ | కేవలం గ్లామర్డాల్గానే కనిపించిన తాప్సీ పన్నును ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆమె బాలీవుడ్లో చేస్తున్న పాత్రలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘బేబీ’, ‘పింక్’, ‘నామ్ షబానా’లతో తాప్సీ బాలీవుడ్లో దూసుకుపోతోంది. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత డేవిడ్ ధావన్ ‘జుడ్వా’కు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ తీస్తున్నాడు. అందులో వరుణ్ధావన్ సరసన తాప్సీ నటిస్తోంది. వివిధ సందర్భాల్లో తాప్సీ వెల్లడించిన అభిప్రాయాలివి... నాది కర్లీ హెయిర్. పొడవాటి రింగుల జుట్టుతో తెగ ఇబ్బంది పడేదాన్ని. ఆదివారం వచ్చిందంటే చాలు, షాంపూతో శుభ్రం చేయడం, ఆయిల్ పట్టించడంతోనే సరిపోయేది. దాంతో జుట్టు కత్తిరించుకోవాలనుండేది. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. ఎవరికీ తెలియకుండా సెలూన్కు వెళ్లి కత్తిరించుకునేదాన్ని. జుట్టుకు చూయింగ్ గమ్ అంటుకుందని ఇంట్లో అబద్ధాలు చెప్పేదాన్ని. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బీచ్లంటే పడి చస్తా. మాల్దీవులు నా ఫేవరెట్ ప్లేస్. మరణించేలోపు ప్రపంచంలో వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలు చూడాలనే కోరిక ఉంది. అందుకే ఏ మాత్రం సమయం దొరికినా మా సిస్టర్ షగున్ పన్నుతో కలిసి టూర్లకు వెళ్తుంటా. నేను మరీ ఫెయిర్గా ఉన్నాననే తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే కెరీర్ ప్రారంభంలో ఒకే యేడాదిలో పదికి పైగా సినిమాల్లో నటించిన రికార్డు ఉంది. మణిరత్నం సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది. గుండెల్ని పిండేసే ప్రేమకథల్ని తీయడంలో ఆయనను మించినవారు లేరు. చిన్నప్పుడు మ్యాథ్స్లో పూర్. నాన్న లెక్కలు చెబుతూ మొట్టికాయలు వేసేవాడు. ఆ భయంతో లెక్కలు నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత అదే నా ఫేవరెట్ సబ్జెక్ట్గా మారింది. ఇంజనీరింగ్ కూడా పూర్తిచేశాను. బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్కు నన్ను పరిచయం చేసింది పూరీ జగన్నాథ్. అప్పటికే ఆయన ‘చష్మే బద్దూర్’ సినిమా కోసం ప్రీతిజింటాలా ఉండే అమ్మాయి కోసం వెదుకుతున్నారట. నన్ను చూడగానే ఓకే చేశారు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే అంతా నన్ను ‘అచ్చు ప్రీతిజింటాలా ఉన్నావ’ని అనేవారు. | entertainment |
4,169 | 17-05-2017 01:34:26 | ముస్లిం రిజర్వేషన్లపై తప్పుడు వాదనలు | ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముస్లింల కోసం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని చెయ్యటం ఆహ్వానించదగ్గ అడుగు. ముస్లింలని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి భాగస్వాముల్ని చేయటానికి ఈ విధానం అవసరం. దీని సక్రమమైన అమలు మన రాష్ట్రంలో ముస్లింలని సమాన పౌరులుగా, పాలితులుగా గుర్తించటానికి అత్యంత అవసరం. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముస్లింలలో వెనుకబడిన వర్గాలకి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టం ముస్లింలలో వెనుకబాటుతనం పై చర్చని మరలా ముందుకు తీసుకు వచ్చింది. ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళలో కొందరు– ముస్లింలు కేవలం ఆర్థికంగా మాత్రమే వెనుక బడి వున్నారని, సామాజికంగా వారికి కుల సమస్య లేదు కాబట్టి వారిలో వెనుక బాటు తనం లేదని, అందువల్ల రిజర్వేషన్లు ఇవ్వకూడదని; ఇచ్చినా సరే వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లలో కాకుండా సరి కొత్తగా వారికి రిజర్వేషన్లు కల్పించి ఇవ్వాలని, లేకుంటే దీని వల్ల వెనుకబడిన వర్గాలకి నష్టం వాటిల్లుతుందని అంటుంటే; మరికొందరు ముస్లింలకు సామూహికంగా రిజర్వేషన్లు చట్ట పరంగా చెల్లవని, కోర్టు వీటిని కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనల్లో కొత్తవి ఏమీ లేవు. 2004లో కాంగ్రెసు ప్రభుత్వం మొదటి సారి వెనుక బడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి వస్తున్నవే. అయితే వీటిలో సరైన వాదనలని తప్పుడు వాదనల నుంచి వేరు చేస్తే తప్ప మనకి ముస్లింలకు రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం గురించి అర్థం కాదు. మొదటి అసంబద్ధ వాదన- ప్రస్తుత ప్రభుత్వం ‘ఓట్ల కోసమే’ దీన్ని ప్రవేశపెట్టింది అనటం. మునుపటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1970 నుంచి అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ నడిచింది. మొదటి రెండు బీసీ కమిషన్లు అప్పటికే రిజర్వేషన్లు వున్న దూదేకుల, మెహతార్లునీ, ఆ తరువాత ఖురేషీలనీ తప్ప వేరే వారిని గుర్తించటానికి ఏ కృషీ చెయ్యలేదు. ఎప్పుడు మైనారిటీలపై చర్చ జరిగినా, అనేక మంది, పార్టీలతో సంబంధం లేకుండా ముస్లింలు వెనుకబడి వున్నారని ఒప్పుకుని, వారికి రిజర్వేషన్లు అవసరమని బలంగా చెప్పారు. 2004 నుంచి మూడు బీసీ కమిషన్లు ఈ విషయంపై నివేదికలు సమర్పించాయి. మండల్ కమిషన్ నివేదిక కూర్పులో ప్రధాన పాత్ర వహించిన పి.ఎస్. కృష్ణన్ 2007లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల పరిస్థితులపై కూలంకషంగా పరిశోధన చేసి, అప్పటి వరకూ వున్న అన్ని పరిశోధక పత్రాలని క్రోడీకరించి దాదాపు 300 పేజీల నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. దానిలో ఆయన, తెలుగు ముస్లింలలో కులీన వర్గాలు మినహాయించి మిగిలిన అందరూ వెనుకబడివున్నారని నిర్ధారించారు. దూదేకులు, ఖురేషీలు, మెహతార్లు వంటి తెలిసిన గ్రూపులని కాకుండా, మొదటి సారి అనేక ముస్లిం తెగలు/కులాలు/వర్గాలని––ముస్లిం ధోబీలు, ఫకీర్లు, గారడీ వాండ్లు వంటి 14 గ్రూపులని––- ఈ కమిషన్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిని బీసీలలో చేరుస్తూ 2007 లో చేసిన చట్టం ఇప్పటికీ అమలులో వుంది. ముస్లింలలో ఆర్థిక వెనుకబాటు తప్ప వేరే విధమైన వెనుకబాటుతనం లేదని ఇంకొక వాదన వినిపిస్తోంది, కానీ తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ నివేదిక చదివితే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏర్పడిన సామాజిక వెనుకబాటుతనం వల్లే వారిలో ఆర్థిక వెనుకబాటుతనం కూడా పెరుగుతోందని అర్థమవుతుంది. పలువురు పరిశోధకులు 1991 నుంచి 2011 వరకు ఉన్న విద్య, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో శాతం, పేదరికం, స్వంత ఇల్లు, మాతా శిశు ఆరోగ్యం, సంక్షేమం వంటి అనేక విషయాలపై ప్రభుత్వ గణాంకాలు తీసుకుని, అలాగే ముస్లింలలో వున్న కృష్ణన్ కమిషన్ పేర్కొన్న అనేక వృత్తి సమూహాలపై శాంపిల్ అధ్యయనాలు జరిపి ఈ సంవత్సరాలలో రిజర్వేషన్లు తీసుకున్న అనేక వెనుకబడ్డ కులాల, షెడ్యూల్డు తరగతులవారి స్థితి 2011కి బాగా మెరుగుపడిందని, ముస్లింల స్థితి మాత్రం 1991 కంటే దిగజారిందని తేల్చారు. ముస్లింలకు ఎటువంటి సంక్షేమ పథకాలు, తగినంత రిజర్వేషన్లు కల్పించకపోవడం, అమలు పరచకపోవటం దీనికి ప్రధాన కారణాలు. అందువల్లే, కృష్ణన్ కమిషన్ కంటే ముందుకెళ్లి ఇటువంటి సామాజిక వెనుకబాటుని తగ్గించాలంటే ముస్లింలు అందరినీ కూడా మన రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గంగా గుర్తించాలని సుధీర్ కమిషన్ చెప్పింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం ‘మత పరమైన’ రిజర్వేషన్లు కల్పించటం అని మరొక విమర్శ కూడా వినవస్తోంది. రిజర్వేషన్లని రెండు రకాల చారిత్రక అన్యాయాలకు చికిత్సగా రూపొందించారు: ఒకటి సామాజిక వెనుకబాటుతనం, రెండవది వివక్ష. సామాజిక వెనుకబాటుతనం కులం, వర్గం, ప్రాంతం అనేక కారణాల వల్ల రావచ్చు; వివక్ష అన్నది వీటికి అతీతంగా పనిచేస్తుంది. ముస్లింలు రెండు రకాల అన్యాయాలకు గురవుతున్నారనేది సచార్ కమిషన్ నివేదికతో అందరికీ స్పష్టమయింది. మన రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, కృష్ణన్ కమిషన్ నివేదిక, అబూ సాలే షరీఫ్ నివేదిక, సుధీర్ కమిషన్ నివేదిక దీన్ని ఇంకా నిర్ధారించాయి. అంతే కాక, ఒక మతానికి చెందటం వల్లే వివక్షకు గురవుతున్నారనే విషయం కూడా వినటానికి చేదుగానే ఉంటుంది గానీ అందరికీ తెలిసిన సత్యమే. వీటిని ‘మత పరమైన’ రిజర్వేషన్లుగా ప్రచారం చేస్తున్న వారికి చెప్పాల్సింది - మత పరమయిన వివక్షకి గురవుతున్న సమూహానికి ఈ రిజర్వేషన్లు విరుగుడుగా పనిచేస్తాయీ అని. సామాజిక వెనుకబాటుతనాన్ని కుల వ్యవస్థకి కుదించి, అది ఇస్లాం మతంలో లేదు కాబట్టి వారు వివక్షకు గురవ్వరు, కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్న ఇంకొక విచిత్ర వాదన కొంతమంది చేస్తున్నారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక మతంలో వివక్ష కాదు. సుప్రీమ్ కోర్టు కొంత కాలం వెనుకబడ్డ వర్గాలని వెనుకబడ్డ కులాల ఆధారంగా గుర్తించింది కానీ ఇటీవల ఈ ధోరణిని అనేక తీర్పులలో తోసిపుచ్చింది. ఈ వాదనని స్వర్గీయ బాలగోపాల్ కూడా కోర్టులో తన వాదనలలో, రచనలలో అనేక సార్లు వ్యతిరేకించారు. సామాజిక వెనుకబాటుతనం కులంతో మాత్రమే ముడిపడి లేదన్న విషయం వెనుకబడ్డ వర్గాల లిస్టు చూస్తే కూడా తెలుస్తుంది. అనేక సంచార జాతులకు వీటిలో స్థానం వుంది. అలాగే ఇస్లాం, క్రిస్టియన్ మతాలకి మారిన దళితులు కూడా భాగమే. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ముస్లిం కులాలు, వర్గాలు, తెగలు కేంద్ర వెనుకబడ్డ జాబితాలో భాగం పొందాయి కూడా. అంతేకాక వెనుకబడ్డ వర్గాలని ప్రాంతం బట్టి గుర్తి స్తారు. అందుకే బీహార్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ముస్లిం కులాలు అతి వెనుకబడ్డ కులాల్లో, మరికొన్ని వెనుకబడ్డ కులాల్లో వున్నాయి. కానీ, తమిళనాడులో ముస్లిం సమూహాన్ని వివక్షకు గురయిన సమూహంగా గుర్తించారు. వారిలో అత్యంత వెనుకబడిన వర్గాన్ని వెనుకబడిన వర్గాల్లో చేర్చారు. తెలంగాణరాష్ట్రంలో ముస్లింలు కుల ప్రాతిపదికన కాకుండా సమూహంగానే హైదరాబాదు రాజ్య పతనం తర్వాత జరిగిన పరిణామాల వల్ల వివక్షకు గురై వెనుకబడ్డారని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రషీయుద్దీన్ ఖాన్, ఒమర్ ఖాలిద్ వంటి ప్రసిద్ధ పరిశోధకుల రచనలు 1970ల నుంచే చెప్తూ వచ్చాయి. అయినా సరే, చాలా మంది దీన్ని ఎలాగూ కోర్టు కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాకి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఈ చట్టంపై వ్యవహరించిన తీరు కారణం. 2004, 2005లలో అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లపై చేసిన చట్టాలని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం పద్ధతులు, నియమాలు పాటించలేదన్న కారణంతో కొట్టేసింది. అయితే, కృష్ణన్ కమిషన్ నివేదిక సమర్పించిన తరువాత కూడా 2010లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు (ఐదుగురు వద్దని, ఇద్దరు ఉంచాలని) ముస్లింలలో వెనుకబాటుతనాన్ని నిర్ధారించటానికి అత్యంత కఠోర నియమాలని రూపొందించింది. ముస్లింలలో వెనుకబాటుతనం వున్నదని ఒప్పుకుంటూనే, దాన్ని శాస్త్రీయ నిదర్శనాలతో, ఏమాత్రం తప్పు లేకుండా నిరూపించినప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని, లేకుంటే వీటిని ‘మతపరమయిన రిజర్వేషన్లుగా’ పరిగణిస్తామని చెప్పింది. చట్టాన్ని అత్యంత సంకుచితంగా నిర్వచించిన ఈ ధోరణి వెనుకబడ్డ ముస్లిం వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వటానికి తీవ్ర అడ్డంకిగా మారింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ధోరణి ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించటాన్ని ఇప్పటికే గుర్తించబడ్డ వెనుకబడ్డ వర్గాలకి వ్యతిరేకంగా భావించటం, లేదా వారి రిజర్వేషన్లని ముస్లింలు తీసేసుకుంటున్నారని భావించటం. వెనుకబడ్డ వర్గాల జనాభాతో పోలిస్తే 27శాతం రిజర్వేషన్లు తక్కువే. దానిని పెంచటానికి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా అందరూ ప్రయత్నించాలి. అయితే దానికి సుప్రీమ్ కోర్టు విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గానీ, రాష్ట్ర ప్రభుత్వమో, తెలంగాణా ముస్లింలో కారణం కాదు. 2004తో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటుతనం ఉందని హిందువుల్లో వెనుకబడ్డ తరగతుల ప్రతినిధులతో సహా అనేకమంది ఒప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కల్పించిన 12శాతం వాటా అందరిలో కొత్త ఆశలని కల్పిస్తూనే అనుమానాల్ని కూడా కలిగిస్తోంది. కేంద్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకత తెలిసి కూడా ఏ నమ్మకంతో మన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు? హిందువుల్లో వెనుకబడ్డ వర్గాల ప్రతినిధులు, వ్యతిరేకించిన ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకోవటానికి ఇంకొంత ప్రయత్నం చేసి ఉండాలేమో? నిర్ణయం తీసుకోవటం ఎంత అవసరమో, ఆ నిర్ణయానికి ఈ పరిస్థితులలో మద్దతు కూడగట్టడం అంతే అవసరం కదా? వెనుకబడ్డ వర్గాలలో ముస్లింలకు, హిందువులకు మధ్య అనవసరమైన ఘర్షణని ఎలా తగ్గించాలి? రాజ్యంగ కమిటీ ముస్లింలకు ఉద్యోగాల్లో, విద్యలో, చట్ట సభల్లో రిజర్వేషన్లని కల్పించి, దేశ విభజన తరువాత, చివరి నిముషంలో వాటిని వెనక్కి తీసుకుంది. ఒక ప్రధాన మైనారిటీకి పాలనా వ్యవస్థలో, పౌర సమాజంలో చోటు కల్పించని రాజ్య వ్యవస్థలో వారికి కేవలం రక్షణ మాత్రమే కల్పించే ధోరణి ఇన్నాళ్లూ ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి కొంత మారి ప్రభుత్వాలు ముస్లింలని కూడా పాలితులుగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు, సమాన పౌరసత్వం కోసం రిజర్వేషన్లు కల్పించాలనే ధోరణి, చర్చ ప్రారంభమయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముస్లింల కోసం 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్నిచెయ్యటం ఆహ్వానించదగ్గ అడుగు. ముస్లింలని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి భాగస్వాముల్ని చేయటానికి ఈ విధానం అవసరం. ఈ విధానాన్ని సక్రమంగా అమలు పరచటం, మన రాష్ట్రంలో ముస్లింలని సమాన పౌరులుగా, పాలితులుగా గుర్తించటానికి అత్యంత అవసరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని అమలు చెయ్యాలని ఆశిద్దాం. డా. ఏ. సునీతమన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముస్లింలలో వెనుకబడిన వర్గాలకి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టం ముస్లింలలో వెనుకబాటుతనం పై చర్చని మరలా ముందుకు తీసుకు వచ్చింది. ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళలో కొందరు– ముస్లింలు కేవలం ఆర్థికంగా మాత్రమే వెనుక బడి వున్నారని, సామాజికంగా వారికి కుల సమస్య లేదు కాబట్టి వారిలో వెనుక బాటు తనం లేదని, అందువల్ల రిజర్వేషన్లు ఇవ్వకూడదని; ఇచ్చినా సరే వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లలో కాకుండా సరి కొత్తగా వారికి రిజర్వేషన్లు కల్పించి ఇవ్వాలని, లేకుంటే దీని వల్ల వెనుకబడిన వర్గాలకి నష్టం వాటిల్లుతుందని అంటుంటే; మరికొందరు ముస్లింలకు సామూహికంగా రిజర్వేషన్లు చట్ట పరంగా చెల్లవని, కోర్టు వీటిని కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనల్లో కొత్తవి ఏమీ లేవు. 2004లో కాంగ్రెసు ప్రభుత్వం మొదటి సారి వెనుక బడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి వస్తున్నవే. అయితే వీటిలో సరైన వాదనలని తప్పుడు వాదనల నుంచి వేరు చేస్తే తప్ప మనకి ముస్లింలకు రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం గురించి అర్థం కాదు. మొదటి అసంబద్ధ వాదన- ప్రస్తుత ప్రభుత్వం ‘ఓట్ల కోసమే’ దీన్ని ప్రవేశపెట్టింది అనటం. మునుపటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1970 నుంచి అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ నడిచింది. మొదటి రెండు బీసీ కమిషన్లు అప్పటికే రిజర్వేషన్లు వున్న దూదేకుల, మెహతార్లునీ, ఆ తరువాత ఖురేషీలనీ తప్ప వేరే వారిని గుర్తించటానికి ఏ కృషీ చెయ్యలేదు. ఎప్పుడు మైనారిటీలపై చర్చ జరిగినా, అనేక మంది, పార్టీలతో సంబంధం లేకుండా ముస్లింలు వెనుకబడి వున్నారని ఒప్పుకుని, వారికి రిజర్వేషన్లు అవసరమని బలంగా చెప్పారు. 2004 నుంచి మూడు బీసీ కమిషన్లు ఈ విషయంపై నివేదికలు సమర్పించాయి. మండల్ కమిషన్ నివేదిక కూర్పులో ప్రధాన పాత్ర వహించిన పి.ఎస్. కృష్ణన్ 2007లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల పరిస్థితులపై కూలంకషంగా పరిశోధన చేసి, అప్పటి వరకూ వున్న అన్ని పరిశోధక పత్రాలని క్రోడీకరించి దాదాపు 300 పేజీల నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. దానిలో ఆయన, తెలుగు ముస్లింలలో కులీన వర్గాలు మినహాయించి మిగిలిన అందరూ వెనుకబడివున్నారని నిర్ధారించారు. దూదేకులు, ఖురేషీలు, మెహతార్లు వంటి తెలిసిన గ్రూపులని కాకుండా, మొదటి సారి అనేక ముస్లిం తెగలు/కులాలు/వర్గాలని––ముస్లిం ధోబీలు, ఫకీర్లు, గారడీ వాండ్లు వంటి 14 గ్రూపులని––- ఈ కమిషన్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిని బీసీలలో చేరుస్తూ 2007 లో చేసిన చట్టం ఇప్పటికీ అమలులో వుంది. ముస్లింలలో ఆర్థిక వెనుకబాటు తప్ప వేరే విధమైన వెనుకబాటుతనం లేదని ఇంకొక వాదన వినిపిస్తోంది, కానీ తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ నివేదిక చదివితే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏర్పడిన సామాజిక వెనుకబాటుతనం వల్లే వారిలో ఆర్థిక వెనుకబాటుతనం కూడా పెరుగుతోందని అర్థమవుతుంది. పలువురు పరిశోధకులు 1991 నుంచి 2011 వరకు ఉన్న విద్య, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితులు, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో శాతం, పేదరికం, స్వంత ఇల్లు, మాతా శిశు ఆరోగ్యం, సంక్షేమం వంటి అనేక విషయాలపై ప్రభుత్వ గణాంకాలు తీసుకుని, అలాగే ముస్లింలలో వున్న కృష్ణన్ కమిషన్ పేర్కొన్న అనేక వృత్తి సమూహాలపై శాంపిల్ అధ్యయనాలు జరిపి ఈ సంవత్సరాలలో రిజర్వేషన్లు తీసుకున్న అనేక వెనుకబడ్డ కులాల, షెడ్యూల్డు తరగతులవారి స్థితి 2011కి బాగా మెరుగుపడిందని, ముస్లింల స్థితి మాత్రం 1991 కంటే దిగజారిందని తేల్చారు. ముస్లింలకు ఎటువంటి సంక్షేమ పథకాలు, తగినంత రిజర్వేషన్లు కల్పించకపోవడం, అమలు పరచకపోవటం దీనికి ప్రధాన కారణాలు. అందువల్లే, కృష్ణన్ కమిషన్ కంటే ముందుకెళ్లి ఇటువంటి సామాజిక వెనుకబాటుని తగ్గించాలంటే ముస్లింలు అందరినీ కూడా మన రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గంగా గుర్తించాలని సుధీర్ కమిషన్ చెప్పింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం ‘మత పరమైన’ రిజర్వేషన్లు కల్పించటం అని మరొక విమర్శ కూడా వినవస్తోంది. రిజర్వేషన్లని రెండు రకాల చారిత్రక అన్యాయాలకు చికిత్సగా రూపొందించారు: ఒకటి సామాజిక వెనుకబాటుతనం, రెండవది వివక్ష. సామాజిక వెనుకబాటుతనం కులం, వర్గం, ప్రాంతం అనేక కారణాల వల్ల రావచ్చు; వివక్ష అన్నది వీటికి అతీతంగా పనిచేస్తుంది. ముస్లింలు రెండు రకాల అన్యాయాలకు గురవుతున్నారనేది సచార్ కమిషన్ నివేదికతో అందరికీ స్పష్టమయింది. మన రాష్ట్రంలో సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, కృష్ణన్ కమిషన్ నివేదిక, అబూ సాలే షరీఫ్ నివేదిక, సుధీర్ కమిషన్ నివేదిక దీన్ని ఇంకా నిర్ధారించాయి. అంతే కాక, ఒక మతానికి చెందటం వల్లే వివక్షకు గురవుతున్నారనే విషయం కూడా వినటానికి చేదుగానే ఉంటుంది గానీ అందరికీ తెలిసిన సత్యమే. వీటిని ‘మత పరమైన’ రిజర్వేషన్లుగా ప్రచారం చేస్తున్న వారికి చెప్పాల్సింది - మత పరమయిన వివక్షకి గురవుతున్న సమూహానికి ఈ రిజర్వేషన్లు విరుగుడుగా పనిచేస్తాయీ అని. సామాజిక వెనుకబాటుతనాన్ని కుల వ్యవస్థకి కుదించి, అది ఇస్లాం మతంలో లేదు కాబట్టి వారు వివక్షకు గురవ్వరు, కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్న ఇంకొక విచిత్ర వాదన కొంతమంది చేస్తున్నారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక మతంలో వివక్ష కాదు. సుప్రీమ్ కోర్టు కొంత కాలం వెనుకబడ్డ వర్గాలని వెనుకబడ్డ కులాల ఆధారంగా గుర్తించింది కానీ ఇటీవల ఈ ధోరణిని అనేక తీర్పులలో తోసిపుచ్చింది. ఈ వాదనని స్వర్గీయ బాలగోపాల్ కూడా కోర్టులో తన వాదనలలో, రచనలలో అనేక సార్లు వ్యతిరేకించారు. సామాజిక వెనుకబాటుతనం కులంతో మాత్రమే ముడిపడి లేదన్న విషయం వెనుకబడ్డ వర్గాల లిస్టు చూస్తే కూడా తెలుస్తుంది. అనేక సంచార జాతులకు వీటిలో స్థానం వుంది. అలాగే ఇస్లాం, క్రిస్టియన్ మతాలకి మారిన దళితులు కూడా భాగమే. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ముస్లిం కులాలు, వర్గాలు, తెగలు కేంద్ర వెనుకబడ్డ జాబితాలో భాగం పొందాయి కూడా. అంతేకాక వెనుకబడ్డ వర్గాలని ప్రాంతం బట్టి గుర్తి స్తారు. అందుకే బీహార్ వంటి రాష్ట్రాల్లో కొన్ని ముస్లిం కులాలు అతి వెనుకబడ్డ కులాల్లో, మరికొన్ని వెనుకబడ్డ కులాల్లో వున్నాయి. కానీ, తమిళనాడులో ముస్లిం సమూహాన్ని వివక్షకు గురయిన సమూహంగా గుర్తించారు. వారిలో అత్యంత వెనుకబడిన వర్గాన్ని వెనుకబడిన వర్గాల్లో చేర్చారు. తెలంగాణరాష్ట్రంలో ముస్లింలు కుల ప్రాతిపదికన కాకుండా సమూహంగానే హైదరాబాదు రాజ్య పతనం తర్వాత జరిగిన పరిణామాల వల్ల వివక్షకు గురై వెనుకబడ్డారని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రషీయుద్దీన్ ఖాన్, ఒమర్ ఖాలిద్ వంటి ప్రసిద్ధ పరిశోధకుల రచనలు 1970ల నుంచే చెప్తూ వచ్చాయి. అయినా సరే, చాలా మంది దీన్ని ఎలాగూ కోర్టు కొట్టేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాకి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఈ చట్టంపై వ్యవహరించిన తీరు కారణం. 2004, 2005లలో అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లపై చేసిన చట్టాలని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం పద్ధతులు, నియమాలు పాటించలేదన్న కారణంతో కొట్టేసింది. అయితే, కృష్ణన్ కమిషన్ నివేదిక సమర్పించిన తరువాత కూడా 2010లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పు (ఐదుగురు వద్దని, ఇద్దరు ఉంచాలని) ముస్లింలలో వెనుకబాటుతనాన్ని నిర్ధారించటానికి అత్యంత కఠోర నియమాలని రూపొందించింది. ముస్లింలలో వెనుకబాటుతనం వున్నదని ఒప్పుకుంటూనే, దాన్ని శాస్త్రీయ నిదర్శనాలతో, ఏమాత్రం తప్పు లేకుండా నిరూపించినప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చెయ్యాలని, లేకుంటే వీటిని ‘మతపరమయిన రిజర్వేషన్లుగా’ పరిగణిస్తామని చెప్పింది. చట్టాన్ని అత్యంత సంకుచితంగా నిర్వచించిన ఈ ధోరణి వెనుకబడ్డ ముస్లిం వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వటానికి తీవ్ర అడ్డంకిగా మారింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ధోరణి ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించటాన్ని ఇప్పటికే గుర్తించబడ్డ వెనుకబడ్డ వర్గాలకి వ్యతిరేకంగా భావించటం, లేదా వారి రిజర్వేషన్లని ముస్లింలు తీసేసుకుంటున్నారని భావించటం. వెనుకబడ్డ వర్గాల జనాభాతో పోలిస్తే 27శాతం రిజర్వేషన్లు తక్కువే. దానిని పెంచటానికి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా అందరూ ప్రయత్నించాలి. అయితే దానికి సుప్రీమ్ కోర్టు విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గానీ, రాష్ట్ర ప్రభుత్వమో, తెలంగాణా ముస్లింలో కారణం కాదు. 2004తో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటుతనం ఉందని హిందువుల్లో వెనుకబడ్డ తరగతుల ప్రతినిధులతో సహా అనేకమంది ఒప్పుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కల్పించిన 12శాతం వాటా అందరిలో కొత్త ఆశలని కల్పిస్తూనే అనుమానాల్ని కూడా కలిగిస్తోంది. కేంద్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకత తెలిసి కూడా ఏ నమ్మకంతో మన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు? హిందువుల్లో వెనుకబడ్డ వర్గాల ప్రతినిధులు, వ్యతిరేకించిన ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకోవటానికి ఇంకొంత ప్రయత్నం చేసి ఉండాలేమో? నిర్ణయం తీసుకోవటం ఎంత అవసరమో, ఆ నిర్ణయానికి ఈ పరిస్థితులలో మద్దతు కూడగట్టడం అంతే అవసరం కదా? వెనుకబడ్డ వర్గాలలో ముస్లింలకు, హిందువులకు మధ్య అనవసరమైన ఘర్షణని ఎలా తగ్గించాలి? రాజ్యంగ కమిటీ ముస్లింలకు ఉద్యోగాల్లో, విద్యలో, చట్ట సభల్లో రిజర్వేషన్లని కల్పించి, దేశ విభజన తరువాత, చివరి నిముషంలో వాటిని వెనక్కి తీసుకుంది. ఒక ప్రధాన మైనారిటీకి పాలనా వ్యవస్థలో, పౌర సమాజంలో చోటు కల్పించని రాజ్య వ్యవస్థలో వారికి కేవలం రక్షణ మాత్రమే కల్పించే ధోరణి ఇన్నాళ్లూ ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి కొంత మారి ప్రభుత్వాలు ముస్లింలని కూడా పాలితులుగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు, సమాన పౌరసత్వం కోసం రిజర్వేషన్లు కల్పించాలనే ధోరణి, చర్చ ప్రారంభమయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముస్లింల కోసం 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్నిచెయ్యటం ఆహ్వానించదగ్గ అడుగు. ముస్లింలని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి భాగస్వాముల్ని చేయటానికి ఈ విధానం అవసరం. ఈ విధానాన్ని సక్రమంగా అమలు పరచటం, మన రాష్ట్రంలో ముస్లింలని సమాన పౌరులుగా, పాలితులుగా గుర్తించటానికి అత్యంత అవసరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని అమలు చెయ్యాలని ఆశిద్దాం. డా. ఏ. సునీత | editorial |
19,415 | 13-04-2017 02:53:08 | ప్రీ క్వార్టర్స్లో సింధు | శ్రీకాంత్, సాయి ప్రణీత కూడాసింగపూర్ ఓపెన్ | sports |
8,373 | 28-11-2017 14:16:35 | మెట్రో రైలు కోసం... మెగా హీరో | మెట్రో రైలు ఎప్పుడొస్తుందా? ట్రాఫిక్ సమస్య ఎప్పుడు తీరుతుందా? హైదరాబాద్లో ఏ ఏరియాకైనా సూపర్ ఫాస్ట్గా ఎప్పుడు ప్రయాణిస్తామా? అని సామాన్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మన మెగా హీరో కూడా మెట్రో రైలు ఎప్పుడొస్తుందా? అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు మెట్రో రైడ్స్ అంటే చాలా ఇష్టం. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మెట్రో రైళ్లలో ప్రయాణించాను. హైదరాబాద్ మెట్రో రైలు తన సేవలను ఎప్పుడు ప్రారంభిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను." అంటూ తాను 2016లో బెంగుళూరు మెట్రో రైలు కోసం ఎదురు చూస్తున్న పిక్ను పోస్ట్ చేశాడు శిరీష్. | entertainment |
16,440 | 22-11-2017 11:19:05 | స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ! | పాట్నా: బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం స్కూల్ టీచర్లకు ఓ విచిత్రమైన డ్యూటీ వేసింది. బహిరంగ విసర్జనకు వెళ్లేవారిని ఓ కంట కనిపెట్టాలని ఆదేశించింది. మరుగుదొడ్లు వినియోగించకుండా బహిరంగంగా పనికానిచ్చే వారిని ఫోటోలు తీయాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు అన్ని బ్లాకుల్లోని విద్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం టీచర్లు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఎవరెవరు చెంబు పట్టుకుని వెళ్తున్నారో కాపలా కాయాల్సిఉంటుంది. అధ్యాపకులు ఈ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపల్స్కు అప్పగించారు. వృత్తికి సంబంధంలేని డ్యూటీలు చేయాలంటూ బీహార్ ప్రభుత్వం అక్కడి టీచర్లను ఆదేశించడం ఇదేం కొత్తకాదు. గతంలో జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల డ్యూటీలు, ఓటర్ల జాబితా సరిచూడడం సహా పలు కార్యక్రమాల్లో ఉపాధ్యాయులే విధులు నిర్వహించాల్సి వచ్చింది. | nation |
10,425 | 14-08-2017 10:16:08 | సాయి ధరమ్ తేజ్తో యాక్షన్ ధ్రిల్లర్ సినిమా: వివి. వినాయక్ | మెగా ఫ్యామిలీతో మరో సరికొత్త సినిమా తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ తెలిపారు. కడియం శ్రీభ్రమరాంబికా సమేత మల్లేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తామెళ్ల వేంకటేశ్వరరావు ఇంటిలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన దర్శకుడు వీవీ వినాయక్ స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. కుటుంబ కథా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కలిగిన సినిమా చిత్రీకరిస్తున్నట్లు వినాయక్ తెలిపారు. ఖైదీ 150 విజయవంతం కావడంతో తనపై సినీరంగంలో అంచనాలు పెరిగాయని అంతకు మించిన బాధ్యతతో తాను మంచి సందేశాత్మకమైన చిత్రాలు అందిస్తానని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు యువహీరో సాయి ధరమ్తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉందని ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతుందని విదేశాల్లో కూడా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వినాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి ప్రసాదు, వైస్ ఎంపీపీ వెలుగుబంటి నాని, మాజీ సర్పంచ్ డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం(నాని), పాలపర్తి ప్రకాష్కుమార్, చిలుకూరి సుబ్బరాజు, కడియం పోశి, ఎంపీటీసీలు నేలపూడి జ్ఞానశ్రీ, పాకా జానకి, ఆలయకమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. | entertainment |
15,936 | 20-08-2017 03:09:57 | యూపీలో ఘోర రైలు ప్రమాదం.. 14 బోగీలు విధ్వంసం | 23 మంది మృతి వంద మందికిపైగా గాయాలుసమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఓ బోగీమృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశంరాష్ట్రపతి, ప్రధాని, సోనియా దిగ్ర్భాంతిదర్యాప్తునకు ఆదేశించిన రైల్వే మంత్రిముజఫర్నగర్, ఆగస్టు 19: ఒక బోగీపై మరో బోగీ! ఒక బోగీలోకి మరో బోగీ! ఇంట్లోకి దూసుకుపోయిన ఇంకో బోగీ! ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యమిది. ఒడిసాలోని పూరీ నుంచి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వెళ్లే కళింగ ఉత్కళ్ ఎక్స్ప్రెస్ ముజఫర్నగర్కు 40 కిలోమీటర్ల దూరంలోని కటౌలీలో పట్టాలు తప్పింది. తుది వార్తలు అందేసరికి ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం 5.46 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. రైలుకు మొత్తం 23 బోగీలు ఉంటే వాటిలో ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు అయితే ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. పట్టాలు ఊళ్లోంచి వెళుతుండడంతో ఒక బోగీ అయితే సమీపంలోని ఇంట్లోకి దూసుకుపోయింది. మృతుల్లో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమందనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, పీఏసీ తదితర భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. బోగీలను వేరు చేసి క్షతగాత్రులను వెన్వెంటనే ముజఫర్నగర్ ఆస్పత్రికి తరలించాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, సమీపంలోని ఆరు ఆస్పత్రుల్లో చేర్పించామని ఈ దుర్ఘటనను పర్యవేక్షిస్తున్న యూపీ మంత్రి సంజీవ్ బల్యాన్ చెప్పారు. బొగీల్లో ఇంకా మృతదేహాలు ఉన్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిపారు. అయితే, మంత్రి వ్యాఖ్యలను స్థానికులు కొట్టిపారేస్తున్నారు. బోగీల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఇంకా చిక్కుకుని ఉన్నారని వారు వివరిస్తున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో స్థానికులు చురుగ్గా పాల్పంచుకున్నారు. చీకటి పడడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. కాగా, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని రకాల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయని ట్విటర్లో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. రైల్వే నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యూపీ ప్రభుత్వం, రైల్వే శాఖ సమన్వయంతో సహాయ పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఇద్దరు మంత్రులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలికి పంపారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కాగా, ఒడిసా రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షల చొప్పున; తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు; క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. కాగా, ఈ దుర్ఘటన రైల్వే వైఫల్యమని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మూడేళ్లలో 27 ప్రమాదాలు జరిగాయని, వాటిలో 259 మంది చనిపోయారని, 899 మంది గాయపడ్డారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద కోణం ఉందా!?ఉత్కళ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి తరలి వెళ్లింది. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తోంది. | nation |
17,807 | 01-04-2017 00:37:53 | నౌకాదళం, సరిహద్దు భద్రతకు 32 హెచ్ఏఎల్ హెలీకాప్టర్లు | బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం, తీరప్రాంత సరిహద్దు భద్రత కోసం 32 హెలీకాప్టర్లను అందించడానికి హిందూస్తాన ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రక్షణ శాఖతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.8వేల కోట్లతో తీర ప్రాంతాల భద్రతకు 16, నౌకాదళానికి మరో 16 హెలీకాప్టర్లను హెచ్ఏఎల్ సమకూర్చనుంది.బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం, తీరప్రాంత సరిహద్దు భద్రత కోసం 32 హెలీకాప్టర్లను అందించడానికి హిందూస్తాన ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రక్షణ శాఖతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.8వేల కోట్లతో తీర ప్రాంతాల భద్రతకు 16, నౌకాదళానికి మరో 16 హెలీకాప్టర్లను హెచ్ఏఎల్ సమకూర్చనుంది. | nation |
4,977 | 04-04-2017 12:36:17 | చిరు 151వ సినిమాలో వెంకటేశ్? | ఈ సినిమాలో చిరంజీవితోపాటు మరో ఇద్దరు సీనియర్ హీరోలు కనిపించనున్నారట. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. అలాగే మరో సీనియర్ హీరో వెంకటేష్ ఓ క్యామియో రోల్లో కనపడనున్నాడట. నిజానికి ‘ఖైదీ నెంబర్ 150’లోనే వెంకీతో స్పెషల్ రోల్ చేయాలని భావించిందట చిత్ర బృందం. అయితే అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా చేస్తానని వెంకీ మాటిచ్చాడట. ఇప్పటికే ఈ దిశగా వెంకీ అంగీకారం తీసుకున్నాడట రామ్చరణ్. | entertainment |
13,205 | 15-03-2017 16:38:45 | కూలిన.. భారత యుద్ధ విమానం | బార్మర్: భారత యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని శివశంకర్ గ్రామం సమీపంలో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ పడి కాలిపోయింది. అయితే పైలట్లు ముందుగానే ఆ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. బార్మర్: భారత యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని శివశంకర్ గ్రామం సమీపంలో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ పడి కాలిపోయింది. అయితే పైలట్లు ముందుగానే ఆ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. | nation |
10,304 | 08-04-2017 08:20:49 | జాతీయస్థాయి గుర్తింపు వస్తుందనుకోలేదు:తరుణ్ బాస్కర్ | - దాస్యం తరుణ్ భాస్కర్, పెళ్లి చూపులు సినిమా దర్శకుడు - మామిడి హరికృష్ణ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు | entertainment |
8,607 | 19-11-2017 12:38:54 | అప్పుడు తప్పు చేస్తే... ఇప్పుడూ చేయాలా? | తాజాగా, బహుళ ప్రజాదరణ పొందిన మనం చిత్రానికి బంగారు నంది కాకుండా, వెండి నంది ఎందుకు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే, అవార్డుల వ్యవహారాల్లో పండిపోయిన జ్యూరీ సభ్యులు కొందరు దానికి ఆంతరంగికంగా ఒక విషయం చెబుతున్నారు. నిజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమాలను ప్రోత్సహించడం కోసం అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది సరిగ్గా 52 ఏళ్ల క్రితం 1965లో! అంతకు క్రితం ఏడాది వచ్చిన చిత్రాల నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి, తొలిసారిగా అవార్డులు ప్రకటించారు. అప్పట్లోనే ఈ అవార్డులకు నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలు ప్రభుత్వం పెట్టింది. ఆత్మలు, దయ్యాలు, పునర్జన్మలు లాంటి భౌతికంగా ఋజువు కాని అంశాలకూ, మూఢనమ్మకాలు వగైరాలకూ అనుకూలంగా, వాటిని ప్రోత్సహించేలా ఉన్న చిత్రాలకు అవార్డులిచ్చి ప్రోత్సహించరాదన్నది అవార్డుల మార్గదర్శకాల్లో ఒకటని జ్యూరీ సభ్యులు తెలిపారు. ఒకవేళ ఇతర విభాగాల్లో ప్రశంసార్హమైన కృషికి గాను ఆ చిత్రం అవార్డుకు అర్హమనుకున్నా, దానికి టాప్ ప్రయారిటీ మాత్రం ఇవ్వరాదన్నది దానికి సారాంశంగా చెప్పుకొచ్చారు. సరిగ్గా 1964 లోనే అక్కినేని ‘మూగమనసులు’ రిలీజైంది. ఆ రోజుల్లోనే పునర్జన్మ కథాంశమైన అక్కినేని ‘మూగమనసులు’ చిత్రం సైతం నందికి నోచుకోలేకపోవడానికి ఆ గైడ్ లైన్స్ ఒక కారణమట! ఇప్పుడు అదే మళ్ళీ అదే నిబంధన ‘మనం’కి బంగారు నంది రాకుండా అడ్డం వచ్చిందంటున్నారు. అయితే, ఆ మధ్య పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ‘ఈగ’ చిత్రానికి 2012లో బంగారు నంది అవార్డు ఎలా ఇచ్చారని విమర్శకుల ప్రశ్న. ఒకసారి ఎవరో తప్పు చేశారని, ఈసారి మేము కూడా అలాగే చేయాలనుకోవడం, ఒక దొంగ తప్పించుకున్నాడని మరొకసారి దొంగతనాన్ని లీగలైజ్ చేయడం కరెక్ట్ కాదుగా అన్నది జ్యూరీ వాదన. | entertainment |
12,139 | 02-07-2017 12:36:25 | రాళ్లు రువ్వుడు ఘటనలు తగ్గాయి... | శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న ఆపరేషన్లలో భద్రతా దళాలపై అల్లరిమూకల రాళ్లురువ్విన ఘటనలు ఈ ఏడాది స్వలంగా తగ్గుముఖం పట్టినట్టు సీఆర్పీఎఫ్ డెరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ తెలిపారు. గత ఏడాది సీఆర్పీఎఫ్పై రాళ్లు రువ్విన ఘటనలు సుమారు 1,600 చోటుచేసుకున్నాయని, ఈ ఏడాది సగం కంటే తక్కువగా.. సుమారు 700 ఘటనలు చోటుచేసుకున్నాయని మీడియాకు తెలిపారు. రాళ్లు రువ్వుతున్నారన్న కారణంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు నిలిపేసిన సందర్భాలే లేవని అన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలను అల్లరిమూకలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తూనే ఉన్నాయని, వారిని నియంత్రించేందుకు ప్రమాణిక పద్ధతులే వాడుతున్నామని చెప్పారు. ప్రాణాపాయం లేని టియర్ గ్యాస్ షెల్స్, ప్లాస్టిక్ బుల్లెట్ల వాడకం పెరిగిందని భట్నాగర్ వెల్లడించారు. భద్రతా దళాలపై దాడులకు విఫలయత్నం చేసి కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఈ ఏడాది పెరిగిందని ఆయన చెప్పారు. గస్తీ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నామని, ఇటీవల టెర్రరిస్టులు భారీగా జరిపిన కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్ప్రూవ్ వాహనం కావడం వల్ల ముందు కూర్చుకున్న ఒక సబ్ఇన్స్పెక్టర్ మినహా ఆరుగురు జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారని భట్నాగర్ చెప్పారు. | nation |
4,798 | 25-08-2017 19:16:12 | మూడు రోజుల ముందు నుంచే ప్రీయమిర్ షోస్ | ఈ యేడాది ఇప్పటి వరకూ వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు 'వెళ్ళిపోమాకే' ప్రాజెక్ట్ను టేకోవర్ చేసుకున్నారు. అలీ మహమ్మద్ దర్శకత్వంలో విశ్వక్సేన్, సుప్రజ, శ్వేత ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతున్నానని, మూడు రోజుల ముందు నుండే ప్రీమియర్ షోస్ను ఏర్పాటు చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. | entertainment |
15,004 | 15-04-2017 02:13:42 | ఉమ్మడి పౌర స్మృతి వద్దు: ముస్లిం బోర్డు | న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్ 14: ఉమ్మడి పౌర స్మృతిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. లా కమిషనర్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహన్ను 12 మంది బోర్డు సభ్యులు గురువారం కలిసి ఈమేరకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ ముస్లిం సంస్థలు ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన పత్రాలను బోర్డు సభ్యులు జస్టిస్ చౌహన్కు సమర్పించారు. లా కమిషనర్ చైర్మన్తో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా, ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లింల్లోని అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే చట్టం తీసుకొస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ సీరియస్ అంశమని, భాగస్వామ్య పక్షాలతో పూర్తిస్థాయిలో చర్చలు జరపాల్సి ఉందన్నారు. ఏ నిర్ణయమైనా రాజ్యాంగ పరిధికి లోబడే తీసుకుంటామన్నారు. | nation |
13,010 | 15-07-2017 19:32:21 | 'మాతోశ్రీ'కి వెళ్లని కోవింద్... విస్మయంలో శివసేన | ముంబై: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న రామ్నాథ్ కోవింద్ వివిధ పార్టీల మద్దతు కోరుతూ జరుపుతున్న పర్యటనలో భాగంగా ముంబైలో శనివారంనాడు పర్యటించారు. బీజేపీ ఎంపీలు, శాసససభ్యులను స్వయంగా కలుసుకుని మద్దతు కోరారు. అయితే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకి మాత్రం 'ఫోన్ కాల్'తో సరిపెట్టేశారు. ఇది శివసేన వర్గాలను విస్మయానికి గురిచేసింది. సహజంగా ముంబై వచ్చిన అగ్రనేతలు 'మాతోశ్రీ' నివాసానికి వెళ్లి శివసేన సుప్రీంను నేరుగా కలవడం బాల్థాకరే కాలం నుంచి ఉన్నదే. అయితే కోవింద్ పర్యటనలో మాత్రం 'మాతోశ్రీ'కి వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిసే షెడ్యూల్ లేదు. కోవింద్ తన పర్యటనలో భాగంగా సౌత్ ముంబైలోని గార్వరె క్లబ్లో బీజేపీ, శివసేన, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి మద్దతును కోరారు. అనంతరం ఉద్ధవ్ థాకరేకి ఫోను చేసి తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ యూపీఏ తరపు రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉన్నప్పుడు బాల్ థాకరేను 'మాతోశ్రీ'లో కలిసి మద్దతు కోరారు. ఇందుకు భిన్నంగా కోవింద్ మాతోశ్రీకి వెళ్లకపోవడం శివసేన శ్రేణుల్లో చర్చనీయాంశమైనట్టు చెబుతున్నారు. గత నెలలో శివసేన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఉద్ధవ్ థాకరే ఆ తర్వాత తమ మద్దతు కోవింద్కేనని ప్రకటించారు. కోవింద్ పేరు ప్రకటించ ముందు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేర్లను శివసేన ప్రతిపాదించింది. | nation |
5,491 | 11-01-2017 09:41:17 | కొత్త ఏడాదిలో త్రిష ‘గర్జనై’ |
చెన్నై చిన్నది త్రిష కొత్త ఏడాదిని గర్జిస్తూ ప్రారంభించింది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గర్జనై’ అనే వైవిధ్యమైన టైటిల్ పెట్టారు. బాలీవుడ్లో అనుష్క శర్మ హీరోయిన్గా తెరకెక్కిన సూపర్హిట్ చిత్రం ‘ఎన్హెచ్ 10’కు తమిళ రీమేక్ ఇది. 2017ని ‘గర్జనై’తో ప్రారంభించా నంటూ త్రిష ట్విట్టర్లో ట్వీట్ చేసింది. కొత్త దర్శకుడు బి.సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంచురీ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో అమిత్ భార్గవ్, వంశీకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తు న్నారు. ‘గర్జనై’తో కొత్త ఏడాదిని ప్రారంభించిన త్రిషకి అంతా కలిసొచ్చేటట్టే ఉంది. వరుస ప్రాజెక్టులతో యమా బిజీగా ఉంది. వాటిలో అధికభాగం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలే. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘చదురంగవేట్టై2’, ‘96’, ‘మోహిని’, ‘1818’ చిత్రాలు ఉన్నాయి. | entertainment |
3,926 | 01-02-2017 01:56:54 | పూలపాన్పా? ముళ్ళబాటా? | పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో పంపిణీ చేయడం, ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టడం బడ్జెటు రూపకల్పన ప్రధాన ఉద్దేశం. కీలక నిర్ణయాల అనంతరం వెలువడుతున్న బడ్జెటు కాబట్టి కేంద్ర ప్రభుత్వ హామీలను ఈ బడ్జెటు నెరవేరుస్తుందని ప్రజానీకం కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడుతోన్న బడ్జెట్ ఆరు ప్రత్యేకతలతో కూడి ఉంది. సహజంగానే బడ్జెట్ వైపు అందరి చూపూ ఉంటుంది. ఈ దఫా బడ్జెట్కు ఉన్న ప్రత్యేకతల రీత్యా అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఎలా ఉండబోతుందనే విషయంలో సామాన్య ప్రజానీకంలో చర్చలు మరింత ఎక్కువగా జరుగుతోన్నాయి.పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువడుతున్న బడ్జెట్ ఇది. ఈ ఏడే వస్తు, సేవల పన్ను ప్రారంభం కానుంది. శతాబ్దపు సాంప్రదాయానికి తెరవేస్తూ, రైల్వే బడ్జెటును కూడా మిళితం చేసుకున్న సాధారణ బడ్జెటు ఇది. దేశ రాజకీయ చిత్రపటంపై తీవ్ర ప్రభావం చూపే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెటును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి నెల చివరి రోజు కాకుండా ముందస్తుగా ఈ బడ్జెటును ప్రవేశపెట్టడం మరో విశేషం. ప్రతిఏటా ఉన్నట్టు ఈ సంవత్సరం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం అనే తేడా లేదు. ఈ ఆరు ప్రత్యేకతలున్న ఈ బడ్జెటు తీరుతెన్నులు ఎలా ఉంటాయనే విషయంలో సహజంగానే ఊహాగానాలు అధికంగా ఉన్నాయి. అనేక ప్రయోజనాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆశల పల్లకీలో ఊరేగించిన సంచలనాత్మక నిర్ణయం నోట్ల రద్దు. దీని వల్ల ఒనగూరిన ప్రయోజనాలను బడ్జెట్ ప్రసంగం ద్వారా అరుణ్జైట్లీ ఆచరణ రూపంలోకి తీసుకువస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోట్ల రద్దువల్ల ప్రభుత్వానికి పన్నులు, జరిమానాల రూపంలో 32,800 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని అంచనా. రద్దయిన నోట్ల విలువలో 3.5 శాతం తిరిగి రాలేదని దేశీయ బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ లెక్క ప్రకారం బ్యాంకులకు తిరిగిరాని ధనం 40వేల కోట్ల రూపాయలు. ఈ ధనం చెలామణీలో ఉండదు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని మిగులు నిధుల కింద కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంది. ఈ మొత్తం పన్నులు కాకుండా ఇతర రూపాల్లో వచ్చిన నాన్-టాక్స్ మొత్తంగా కేంద్రం చూపించే అవకాశం ఉంది. ఈ మొత్తంతో కలిస్తే పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే మొత్తం ప్రయోజనం 72,800 కోట్ల రూపాయలు. కేంద్రానికి పన్నులు, జరిమానాల రూపంలో వసూలయ్యేందుకు అవకాశం ఉన్న 32,800 కోట్ల రూపాయలలో 24,200 కోట్ల రూపాయల మొత్తం గరీబ్ కళ్యాణ్ యోజన కింద వెల్లడించే ఆదాయంపై వచ్చే పన్ను. అంటే పన్నుల రూపంలో నోట్ల రద్దు వల్ల కలిగిన నిజమైన ప్రయోజనం కేవలం 8,600 కోట్ల రూపాయలు మాత్రమే. యాభై వేలకు పైబడిన బ్యాంక్ విత్డ్రాయల్స్లో ఆదాయపు పన్ను వసూలు చేయాలన్న ముఖ్యమంత్రుల కమిటీ నివేదిక అమలులోకి వస్తే ఆ మేరకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. నోట్ల రద్దు వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కనీసం రెండు శాతం పడిపోయే అవకాశం ఉందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం గమనార్హం. ఈ చర్య తాత్కాలికంగా ఆర్థిక పురోగమనాన్ని మందగింపజేసే అవకాశం ఉందని సాక్షాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసిన అభిప్రాయం నేపథ్యంలో వెలువడుతున్న ఈ బడ్జెట్ తమ జీవితాలకు పూలపాన్పు వేస్తుందా లేక ముళ్లబాటలో పయనింపజేస్తుందా అనే సందిగ్ధ దశలో ప్రజలున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని నివారించే ప్రయత్నాన్ని ఈ బడ్జెట్లో ప్రభుత్వం చేయవచ్చు. విత్తనాల కొనుగోలు సమయంలో డబ్బులు లేకపోవడం వల్ల రైతులు పెద్ద నోట్ల రద్దు సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట రుణాలకు ఇప్పటికే 60 రోజుల వడ్డీని మినహాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్లో మరిన్ని తాయిలాలు రైతులకు అందజేసే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా.ఈ బడ్జెట్ అమలులోకి వచ్చిన తరువాత జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వస్తోంది. ఇది సమగ్ర పన్నుల విధానం. ప్రస్తుత పరోక్ష పన్నుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన విధానం ఇది. బహుళ పన్నుల విధానం బదులుగా ఒకే పన్ను వేసే విధానమిది. ప్రస్తుతం వివిధ వస్తువులపై నాలుగో వంతు దాకా పన్ను ఉంది. ఈ పన్ను తగ్గే అవకాశాలున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధానం వల్ల కలిగే నష్టాన్ని పరిహారం రూపంలో అందజేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చేందుకు భారీగా రాష్ట్రాలకు నిధులను సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు ఈ బడ్జెటులో రాష్ట్రాలకు నిధులు భారీగానే కేటాయించే అవకాశాలున్నాయి. ఈ బడ్జెట్లో మరో ప్రధానమైన అంశం రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లోనే కలిసిపోవడం. గత 92 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెర వేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమిది. గత రైల్వే బడ్జెటులోనే కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయ కేటాయింపు 53,727 కోట్ల రూపాయలు. భద్రతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దృష్ట్యా ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్’ పథకం కింద 1.2 లక్షల కోట్ల విలువ చేసే నిధి సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రయాణికుల భద్రతకు ఈ పథకం కింద అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా ఆ మేరకు అదనపు సెస్ విధించే అవకాశం ఉంది. ఇటీవలి రైల్వే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని భద్రతకు అధిక కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి. గతంలో పలు కమిటీలు పేర్కొన్న ‘రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ’ (ఏసీడీ), స్వయంచాలిత రక్షక వ్యవస్థ అయిన ‘రైలు రక్షణ హెచ్చరిక వ్యవస్థ’ (టీపీడబ్ల్యూఎస్), ‘త్రినేత్ర’ తదితర వ్యవస్థల రూపకల్పన కోసం నిధులను కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు రైళ్లు, రైల్వే బడ్జెట్లు బీహార్ బాట పట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా రాష్ట్రాలవైపు అరుణ్జైట్లీ దృష్టి సారిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బడ్జెటులో అనేక వరాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లులతో ఈస్ట్కోస్ట్ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరును కూడా కలిపి నాలుగు డివిజన్లతో విశాఖ జోన్ ఆవిర్భవించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఈ బడ్జెటులో కేటాయింపులు జరగవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మరిన్ని రైళ్లను కూడా ఈ బడ్జెటులో ఆశించవచ్చు. ఖాజీపేట –- బల్లార్షా మూడో లైను, ఘటకేసర్ -– రాయగిరి ఎంఎంటీఎస్, మనోహరాబాదు -– కొత్తపల్లి, పెద్దపల్లి -– కరీంనగర్ -– నిజామాబాదు, కాకినాడ -– కోటిపల్లి, నడికుడి –- శ్రీకాళహస్తి, కడప -– బెంగుళూరు, ఓబుళవారిపల్లి -– కృష్ణపట్నం, గూడూరు -– విజయవాడ, విజయవాడ -– దువ్వాడ మూడో లైను తదితర ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరిగే నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్టే అయినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులేమీ లేకపోవచ్చు. అయితే వివిధ నూతన పథకాల ప్రభావం తప్పనిసరిగా ఎన్నికలపై ఉండే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు అధికార భారతీయ జనతాపార్టీకి అత్యంత కీలకమైనవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలివ్వబోయే తీర్పునే పెద్ద నోట్ల రద్దుపై ప్రజాభిప్రాయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ తప్పనిసరిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకంటూ కాకపోయినా కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ప్రకటించిన పథకాలకు ఈ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు. పేదలకు గృహ నిర్మాణ పథకాలు, రైతుల రుణాలకు 60 రోజుల వడ్డీ, తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం మూలంగా నాబార్డుకు వచ్చే నష్టానికి పరిహారం అందజేయడం, గర్భిణులకు నవీన పథకం, డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక రాయితీలు మొదలైన వాటికి కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబ్లలో, పన్ను రేట్లలో మార్పులను ప్రకటించవచ్చని పరిశీలకుల అంచనా. కార్పొరేట్ పన్నుల విషయంలోనూ మార్పులుండవచ్చని ఒక అంచనా. దేశీయ తయారీ రంగానికి జవసత్వాలు అందించేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఊతంగా తీసుకునే అవకాశం ఉంది. మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం నేపథ్యంలో స్వదేశీ వస్తు తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదలకు ప్రత్యేకంగా కొన్ని చర్యలు బడ్జెట్లో ఉంటాయని ఆశించవచ్చు. చిన్న తరహా వ్యాపారాలకు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఏర్పడుతుందని పరిశీలకుల విశ్లేషణ. స్టార్టప్ కంపెనీలకు టాక్స్ హాలీడేని మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కనీస ఆదాయ పథకానికి కూడా కేటాయింపులు జరపవచ్చు. ఆయా అంశాలు ఐదు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఈ దఫా కేంద్ర బడ్జెట్టు సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి నెలలో ఆఖరి రోజు కాకుండా మొదటి రోజే ప్రవేశపెట్టడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ, వార్షిక బడ్జెటు పార్లమెంటు ఆమోదానికి మే చివరి వారంలో మాత్రమే ఇప్పటివరకు వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే తప్పనిసరి ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెటును రూపొందించి, పార్లమెంటులో ఆమోదింపజేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ విధంగా జూన్నుంచి మాత్రమే వాస్తవంగా కొత్త బడ్జెటు కార్యరూపంలోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ప్రణాళికల అమలుకు కేవలం పది నెలల గడువు మాత్రమే ఉంటోంది. ఈ దఫా ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే కొత్త బడ్జెటు అమల్లోకి రావాలనే కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం కదిపిన అడుగుల పర్యవసానమే ముందస్తుగా ఫిబ్రవరి ఒకటిన బడ్జెటును ప్రవేశపెట్టడం. పూర్తిగా పన్నెండు నెలల ఖర్చు కాబట్టి కేటాయింపులు మరింత పెంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు అనే తారతమ్యాలుండకూడదని గతంలో రంగరాజన్ కమిటీ పేర్కొన్నప్పటికీ ప్రణాళికాసంఘం వ్యతిరేకించడంతో ఆ సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సాధారణంగా ప్రణాళిక వ్యయం అంటే అభివృద్ధి కోసం చేసే ఖర్చు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు వెచ్చించడం. ప్రణాళికేతర వ్యయం అంటే రక్షణపై, సబ్సిడీలు వంటివాటిపై చేసే ఖర్చు. ఫలితాలను ఆధారంగా చేసుకుని రూపొందించే బడ్జెటులో ఈ తారతమ్యాలుండవు. అందువల్లే ప్రభుత్వం ఈ తారతమ్యాలను తీసేందుకు గత సెప్టెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో పంపిణీ చేయడం, ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టడం బడ్జెటు రూపకల్పన ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం నెరవేర్చే ఈ ప్రధాన బాధ్యత ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపడం అనివార్యం. అందువల్లే బడ్జెటు వైపే ప్రజలందరి చూపు ఉంటుంది. ఈ సారి బడ్జెటు పైన పేర్కొన్న ఆరు ప్రధానాంశాలతో ముడిపడి ఉండడం వల్ల మరింత ఆకర్షణీయంగా మారింది. కీలక నిర్ణయాల అనంతరం వెలువడుతున్న బడ్జెటు కాబట్టి కేంద్ర ప్రభుత్వ హామీలను ఈ బడ్జెటు నెరవేరుస్తుందని ప్రజానీకం కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావుపెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువడుతున్న బడ్జెట్ ఇది. ఈ ఏడే వస్తు, సేవల పన్ను ప్రారంభం కానుంది. శతాబ్దపు సాంప్రదాయానికి తెరవేస్తూ, రైల్వే బడ్జెటును కూడా మిళితం చేసుకున్న సాధారణ బడ్జెటు ఇది. దేశ రాజకీయ చిత్రపటంపై తీవ్ర ప్రభావం చూపే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెటును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి నెల చివరి రోజు కాకుండా ముందస్తుగా ఈ బడ్జెటును ప్రవేశపెట్టడం మరో విశేషం. ప్రతిఏటా ఉన్నట్టు ఈ సంవత్సరం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం అనే తేడా లేదు. ఈ ఆరు ప్రత్యేకతలున్న ఈ బడ్జెటు తీరుతెన్నులు ఎలా ఉంటాయనే విషయంలో సహజంగానే ఊహాగానాలు అధికంగా ఉన్నాయి. అనేక ప్రయోజనాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆశల పల్లకీలో ఊరేగించిన సంచలనాత్మక నిర్ణయం నోట్ల రద్దు. దీని వల్ల ఒనగూరిన ప్రయోజనాలను బడ్జెట్ ప్రసంగం ద్వారా అరుణ్జైట్లీ ఆచరణ రూపంలోకి తీసుకువస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోట్ల రద్దువల్ల ప్రభుత్వానికి పన్నులు, జరిమానాల రూపంలో 32,800 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని అంచనా. రద్దయిన నోట్ల విలువలో 3.5 శాతం తిరిగి రాలేదని దేశీయ బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ లెక్క ప్రకారం బ్యాంకులకు తిరిగిరాని ధనం 40వేల కోట్ల రూపాయలు. ఈ ధనం చెలామణీలో ఉండదు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని మిగులు నిధుల కింద కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంది. ఈ మొత్తం పన్నులు కాకుండా ఇతర రూపాల్లో వచ్చిన నాన్-టాక్స్ మొత్తంగా కేంద్రం చూపించే అవకాశం ఉంది. ఈ మొత్తంతో కలిస్తే పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే మొత్తం ప్రయోజనం 72,800 కోట్ల రూపాయలు. కేంద్రానికి పన్నులు, జరిమానాల రూపంలో వసూలయ్యేందుకు అవకాశం ఉన్న 32,800 కోట్ల రూపాయలలో 24,200 కోట్ల రూపాయల మొత్తం గరీబ్ కళ్యాణ్ యోజన కింద వెల్లడించే ఆదాయంపై వచ్చే పన్ను. అంటే పన్నుల రూపంలో నోట్ల రద్దు వల్ల కలిగిన నిజమైన ప్రయోజనం కేవలం 8,600 కోట్ల రూపాయలు మాత్రమే. యాభై వేలకు పైబడిన బ్యాంక్ విత్డ్రాయల్స్లో ఆదాయపు పన్ను వసూలు చేయాలన్న ముఖ్యమంత్రుల కమిటీ నివేదిక అమలులోకి వస్తే ఆ మేరకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. నోట్ల రద్దు వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కనీసం రెండు శాతం పడిపోయే అవకాశం ఉందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం గమనార్హం. ఈ చర్య తాత్కాలికంగా ఆర్థిక పురోగమనాన్ని మందగింపజేసే అవకాశం ఉందని సాక్షాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసిన అభిప్రాయం నేపథ్యంలో వెలువడుతున్న ఈ బడ్జెట్ తమ జీవితాలకు పూలపాన్పు వేస్తుందా లేక ముళ్లబాటలో పయనింపజేస్తుందా అనే సందిగ్ధ దశలో ప్రజలున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని నివారించే ప్రయత్నాన్ని ఈ బడ్జెట్లో ప్రభుత్వం చేయవచ్చు. విత్తనాల కొనుగోలు సమయంలో డబ్బులు లేకపోవడం వల్ల రైతులు పెద్ద నోట్ల రద్దు సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట రుణాలకు ఇప్పటికే 60 రోజుల వడ్డీని మినహాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్లో మరిన్ని తాయిలాలు రైతులకు అందజేసే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా.ఈ బడ్జెట్ అమలులోకి వచ్చిన తరువాత జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వస్తోంది. ఇది సమగ్ర పన్నుల విధానం. ప్రస్తుత పరోక్ష పన్నుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన విధానం ఇది. బహుళ పన్నుల విధానం బదులుగా ఒకే పన్ను వేసే విధానమిది. ప్రస్తుతం వివిధ వస్తువులపై నాలుగో వంతు దాకా పన్ను ఉంది. ఈ పన్ను తగ్గే అవకాశాలున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధానం వల్ల కలిగే నష్టాన్ని పరిహారం రూపంలో అందజేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చేందుకు భారీగా రాష్ట్రాలకు నిధులను సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు ఈ బడ్జెటులో రాష్ట్రాలకు నిధులు భారీగానే కేటాయించే అవకాశాలున్నాయి. ఈ బడ్జెట్లో మరో ప్రధానమైన అంశం రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లోనే కలిసిపోవడం. గత 92 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెర వేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమిది. గత రైల్వే బడ్జెటులోనే కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యయ కేటాయింపు 53,727 కోట్ల రూపాయలు. భద్రతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దృష్ట్యా ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్’ పథకం కింద 1.2 లక్షల కోట్ల విలువ చేసే నిధి సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రయాణికుల భద్రతకు ఈ పథకం కింద అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా ఆ మేరకు అదనపు సెస్ విధించే అవకాశం ఉంది. ఇటీవలి రైల్వే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని భద్రతకు అధిక కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి. గతంలో పలు కమిటీలు పేర్కొన్న ‘రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ’ (ఏసీడీ), స్వయంచాలిత రక్షక వ్యవస్థ అయిన ‘రైలు రక్షణ హెచ్చరిక వ్యవస్థ’ (టీపీడబ్ల్యూఎస్), ‘త్రినేత్ర’ తదితర వ్యవస్థల రూపకల్పన కోసం నిధులను కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు రైళ్లు, రైల్వే బడ్జెట్లు బీహార్ బాట పట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా రాష్ట్రాలవైపు అరుణ్జైట్లీ దృష్టి సారిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బడ్జెటులో అనేక వరాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లులతో ఈస్ట్కోస్ట్ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరును కూడా కలిపి నాలుగు డివిజన్లతో విశాఖ జోన్ ఆవిర్భవించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఈ బడ్జెటులో కేటాయింపులు జరగవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మరిన్ని రైళ్లను కూడా ఈ బడ్జెటులో ఆశించవచ్చు. ఖాజీపేట –- బల్లార్షా మూడో లైను, ఘటకేసర్ -– రాయగిరి ఎంఎంటీఎస్, మనోహరాబాదు -– కొత్తపల్లి, పెద్దపల్లి -– కరీంనగర్ -– నిజామాబాదు, కాకినాడ -– కోటిపల్లి, నడికుడి –- శ్రీకాళహస్తి, కడప -– బెంగుళూరు, ఓబుళవారిపల్లి -– కృష్ణపట్నం, గూడూరు -– విజయవాడ, విజయవాడ -– దువ్వాడ మూడో లైను తదితర ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరిగే నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్టే అయినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులేమీ లేకపోవచ్చు. అయితే వివిధ నూతన పథకాల ప్రభావం తప్పనిసరిగా ఎన్నికలపై ఉండే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు అధికార భారతీయ జనతాపార్టీకి అత్యంత కీలకమైనవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలివ్వబోయే తీర్పునే పెద్ద నోట్ల రద్దుపై ప్రజాభిప్రాయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ తప్పనిసరిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకంటూ కాకపోయినా కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ప్రకటించిన పథకాలకు ఈ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు. పేదలకు గృహ నిర్మాణ పథకాలు, రైతుల రుణాలకు 60 రోజుల వడ్డీ, తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం మూలంగా నాబార్డుకు వచ్చే నష్టానికి పరిహారం అందజేయడం, గర్భిణులకు నవీన పథకం, డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక రాయితీలు మొదలైన వాటికి కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబ్లలో, పన్ను రేట్లలో మార్పులను ప్రకటించవచ్చని పరిశీలకుల అంచనా. కార్పొరేట్ పన్నుల విషయంలోనూ మార్పులుండవచ్చని ఒక అంచనా. దేశీయ తయారీ రంగానికి జవసత్వాలు అందించేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఊతంగా తీసుకునే అవకాశం ఉంది. మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం నేపథ్యంలో స్వదేశీ వస్తు తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదలకు ప్రత్యేకంగా కొన్ని చర్యలు బడ్జెట్లో ఉంటాయని ఆశించవచ్చు. చిన్న తరహా వ్యాపారాలకు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఏర్పడుతుందని పరిశీలకుల విశ్లేషణ. స్టార్టప్ కంపెనీలకు టాక్స్ హాలీడేని మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కనీస ఆదాయ పథకానికి కూడా కేటాయింపులు జరపవచ్చు. ఆయా అంశాలు ఐదు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఈ దఫా కేంద్ర బడ్జెట్టు సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి నెలలో ఆఖరి రోజు కాకుండా మొదటి రోజే ప్రవేశపెట్టడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ, వార్షిక బడ్జెటు పార్లమెంటు ఆమోదానికి మే చివరి వారంలో మాత్రమే ఇప్పటివరకు వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే తప్పనిసరి ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెటును రూపొందించి, పార్లమెంటులో ఆమోదింపజేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ విధంగా జూన్నుంచి మాత్రమే వాస్తవంగా కొత్త బడ్జెటు కార్యరూపంలోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ప్రణాళికల అమలుకు కేవలం పది నెలల గడువు మాత్రమే ఉంటోంది. ఈ దఫా ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే కొత్త బడ్జెటు అమల్లోకి రావాలనే కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం కదిపిన అడుగుల పర్యవసానమే ముందస్తుగా ఫిబ్రవరి ఒకటిన బడ్జెటును ప్రవేశపెట్టడం. పూర్తిగా పన్నెండు నెలల ఖర్చు కాబట్టి కేటాయింపులు మరింత పెంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు అనే తారతమ్యాలుండకూడదని గతంలో రంగరాజన్ కమిటీ పేర్కొన్నప్పటికీ ప్రణాళికాసంఘం వ్యతిరేకించడంతో ఆ సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సాధారణంగా ప్రణాళిక వ్యయం అంటే అభివృద్ధి కోసం చేసే ఖర్చు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు వెచ్చించడం. ప్రణాళికేతర వ్యయం అంటే రక్షణపై, సబ్సిడీలు వంటివాటిపై చేసే ఖర్చు. ఫలితాలను ఆధారంగా చేసుకుని రూపొందించే బడ్జెటులో ఈ తారతమ్యాలుండవు. అందువల్లే ప్రభుత్వం ఈ తారతమ్యాలను తీసేందుకు గత సెప్టెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో పంపిణీ చేయడం, ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టడం బడ్జెటు రూపకల్పన ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం నెరవేర్చే ఈ ప్రధాన బాధ్యత ప్రజల జీవన స్థితిగతులపై ప్రభావం చూపడం అనివార్యం. అందువల్లే బడ్జెటు వైపే ప్రజలందరి చూపు ఉంటుంది. ఈ సారి బడ్జెటు పైన పేర్కొన్న ఆరు ప్రధానాంశాలతో ముడిపడి ఉండడం వల్ల మరింత ఆకర్షణీయంగా మారింది. కీలక నిర్ణయాల అనంతరం వెలువడుతున్న బడ్జెటు కాబట్టి కేంద్ర ప్రభుత్వ హామీలను ఈ బడ్జెటు నెరవేరుస్తుందని ప్రజానీకం కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు | editorial |
19,999 | 09-08-2017 01:41:44 | నిరాశపరిచిన నిర్మల | మహిళల 400 మీ.లో భారత అథ్లెట్ నిర్మల ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. హీట్స్ సెమీఫైనల్లో నిర్మల 53.07 సెకన్ల టైమింగ్తో ఏడో స్థానంలో నిలవడంతో రేసు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. | sports |
15,515 | 22-07-2017 01:57:24 | వచ్చే ఏడాది చంద్రయాన్-2 ప్రయోగం | చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది చంద్రయాన్-2ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిరిశోధన సంస్థ (ఇస్రో) డైరెక్టర్ మయిల్స్వామి అన్నాదురై పేర్కొన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండో వర్థంతి (జూలై 27)ని పురస్కరించుకుని అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రామనాథపురం జిల్లా కీలకరైలోని మహ్మద్ సాదిక్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న మయిల్స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లోనే అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సరికొత్త ప్రయోగాలతో ముందుకు దూసుకెళ్తోందన్నారు. అత్యంత తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా మెరుగైన ప్రయోగాలు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. చంద్రయాన్-1, మంగళ్యాన్-1 ప్రయోగాలను ఇస్రో.. నాసా కన్నా తక్కువ ఖర్చులో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చంద్రయాన్-2ను వచ్చే ఏడాది ఆగస్టులో ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు. | nation |
7,776 | 16-09-2017 21:08:56 | హాట్ గాళ్ గా నిరుత్సాహపరచను ! | రాయ్ లక్ష్మి.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండె వేగం పెరిగిపోతుంది. టాలీవుడ్ లో తన అందచందాలతో మెప్పించిన ఈ బ్యూటీ తాజగా బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్దమయ్యింది. ఇదివరకు నేహా దూపియా హాట్ హాట్ గా కనిపించిన 'జూలీ' సినిమాకి సీక్వల్ గా వస్తున్న 'జూలీ 2' సినిమాలో రాయ్ లక్ష్మి తన అందాల ఆరబోతతో యువతరాన్ని మైమరిపించేందుకు రెడీగా ఉంది. అప్పట్లో నేహా దూపియా హాట్ గా కనిపించగా.. ఇప్పుడు రాయ్ లక్ష్మి అంతకుమించి హాట్ అందాలతో ఘాటుగా దర్శనమివ్వనుందని 'జూలీ 2' ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమా గొప్ప హిట్ ఖాయమనే నమ్మకంతో ఉన్న ఈ బ్యూటీ.. 'మీరు ఈ సినిమాను శృంగార చిత్రంలా చూడకండి. ఇందులో చాలా విశేషాలుంటాయి. హాట్ గాళ్ గా వెండితెరపై మిమ్మల్ని నిరుత్సాహపరచను' అని చెప్తోంది. సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. | entertainment |
3,935 | 20-12-2017 00:21:28 | సంబరం తరువాత.. | సంబరాలు ముగిసాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని స్థాయిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు మంగళవారం నాడు విజయవంతంగా తెరపడింది. ముగింపు సమావేశంలో తెలుగు భాషాసాహిత్యాల అభివృద్ధికి కీలకమయిన నిర్ణయాలను ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ ఘట్టాన్ని జనవరికి వాయిదా వేశారు. మరొకసారి పండితులతో, నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించి కేసీఆర్ మంచిపని చేశారు. భాషాసాహిత్యాలకు సంబంధించిన విధాననిర్ణయాలు జనాకర్షక నిర్ణయాల కోవలోకి రావు. వాటిని తగిన వివేచన, చర్చ తరువాత తీసుకోవడమే శ్రేయస్కరం. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమై, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంతో ముగిసిన మహాసభలు వైభవోపేతమైన నిర్వహణకు, ఆతిథులకు అందిన ఘనస్వాగతానికి, అనూహ్యమైన రీతిలో లభించిన జనాదరణకు గుర్తులుగా చరిత్రలో నిలిచిపోతాయి. సాహిత్య అకాడమీ ఏర్పాటు తరువాత, ప్రపంచ తెలుగు మహాసభల ఆలోచనను ప్రకటించినప్పటి నుంచి కేసీఆర్ దానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఒకసారి వాయిదా పడినప్పటికీ, డిసెంబర్లో నిర్ణయించిన మలి తేదీలలో విజయవంతంగా సభలు జరిగాయి. సభల కార్యక్రమ రూపకల్పన, సమావేశ స్థలాల ఎంపిక, ఎవరెవరిని సత్కరించాలన్న నిర్ణయం అన్నీ కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యమంత్రి మనోగతానికి అనుగుణంగా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ తదితర విభాగాలన్నిటినీ అభినందించవలసి ఉన్నది. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు ఉపాధ్యాయులందరినీ సమావేశాలకు అధికారికంగా ఆహ్వానించారు. సాధారణ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో సభలకు హాజరయ్యారు.తెలంగాణ ఉద్యమంలో భాషాసాహిత్య అంశాలు కూడా కీలకంగా పనిచేశాయి. తెలంగాణ భాషపై చిన్నచూపు, సాహిత్యానికి చరిత్రలో సముచిత స్థానం లభించకపోవడం– వంటి అంశాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఇంధనాలుగా పనిచేశాయి. రాష్ట్రం అవతరణ తరువాత, ఆ విజయోద్వేగాన్ని సాహిత్యరంగంలో ప్రకటించడానికి ఈ సభలు పనికి వచ్చాయి. ఈ సభల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుభాష వినియోగం గురించిన చర్చలు జరిగి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. ఎందువల్లనో, సాహిత్యరంగానికి సంబంధించిన సదస్సులే తప్ప, భాషాసమస్య గురించి లోతైన వివేచనకు ఆస్కారమిచ్చే సదస్సులు జరగలేదు. సంప్రదాయ సాహిత్యానికి, అవధానాల వంటి వాటికి కూడా అమిత ప్రాధాన్యం లభించింది కానీ, మౌలిక సమస్యల చర్చ జరగలేదు. మున్ముందు జరిగే చర్చల్లో ఈ లోటు పూర్తి కాగలదని, వాటి ఆధారంగా దీర్ఘకాలిక ప్రయోజనాలున్న నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆశించాలి. బోధనా భాషగా కనీసం ఏడో తరగతి వరకు తెలుగును నిర్బంధం చేసే అంశాన్ని ప్రభుత్వం మరోసారి పరిశీలించాలి. తెలంగాణ పదజాలాన్ని నిఘంటువులకు ఎక్కించడం, ఆధునిక భాషగా తెలుగును వినియోగించుకోవడానికి ఒక వ్యవస్థను నియమించడం– భాషాభిమానులు కోరుకుంటున్న చర్యలు. సహజంగానే ఈ సభల గురించి అనేక విమర్శలు కూడా వచ్చాయి. వివిధ దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులను ఆహ్వానించిన ప్రభుత్వం సాటి తెలుగురాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక పరిగణన ఇవ్వకపోవడాన్ని కొందరు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నామమాత్రంగానే ప్రతినిధులు హాజరయ్యారు కానీ, హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర రచయితలు, మేధావులు పెద్ద సంఖ్యలోనే గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఈ వేడుకకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని అనేకులు భావించారు. సభలలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రాకపోవడం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమం తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని, చారిత్రక గర్వాన్ని సంబరంగా ప్రకటించుకోవడానికి ఉద్దేశించినదని నిర్వాహకులే అనేక సందర్భాలలో చెప్పినందున, రాజకీయంగా వచ్చిన విమర్శలను ఆ దృష్టితో పరిశీలించవలసి ఉన్నది. ఇటువంటి సభలు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించవన్న విమర్శతో బహిష్కరించడం ఆనవాయితీగా చేస్తున్న విప్లవ సాహిత్యసంస్థలు నిరసన తెలపడానికి ప్రయత్నించాయి. వారి నిరసనలను అనుమతించి ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా వ్యక్తమయ్యేదని, అరెస్టులు చేయడం ద్వారా నిర్బంధ చర్యలకు దిగడం అవాంఛనీయమని సాహిత్యకారులలో అసంతృప్తి వ్యక్తమయింది. మహాసభలు జరగడానికి ముందు రోజునే తెలంగాణలో తొమ్మిది మంది ఎన్కౌంటర్ జరగడం, వాతావరణాన్ని గంభీరంగా మార్చింది. గత కొద్దికాలంగా తెలంగాణలో ఎన్కౌంటర్లు లేకపోవడం, ఎన్కౌంటర్లులేని తెలంగాణ గురించి కేసీఆర్ గతంలో స్వయంగా చెప్పి ఉండడం– ఈ నేపథ్యంలో పెద్ద ఎన్కౌంటర్ జరగడం బాధాకరంగా మారింది. ప్రభుత్వాల అణచివేత విధానాలను వ్యతిరేకించడం తెలంగాణలో ఒక ఉద్యమ సంప్రదాయంగా ఉంటూ, అది తెలంగాణ ఉద్యమంలో కూడా కొనసాగుతూ వచ్చింది. అందువల్ల, సభలకు ఎంతో ఉత్సాహంతో హాజరయిన తెలంగాణవాదులకు కొంత నిరుత్సాహం కలిగింది. మొత్తంగా తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు భాషాసాహిత్య అంశాలను ప్రధాన వేదిక మీదకు తీసుకువచ్చాయి. తెలుగు–తెలంగాణ మధ్య ఉన్న వైరుధ్యం పరిష్కారం కావడానికి ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. వీటిని ప్రభుత్వం కేవలం తిరుణాల వలె, ప్రజాసంబంధాల వ్యూహంగా పరిగణిస్తే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఒక అడుగైనా ముందుకు వేయడానికి ప్రయత్నం మొదలైతే, అది ఆంధ్రప్రదేశ్లోని తెలుగువారికి కూడా ప్రయోజనకారి అవుతుంది. ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో రెండు రాష్ట్రాలూ కలిసి పనిచేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు వంటి నిర్ణయాలతో ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ కూడా తెలుగు విషయంలో మరింత చొరవ తీసుకోవాలి. తక్కిన విషయాలు ఎట్లా ఉన్నా, తెలుగు సమాజాల భవిష్యత్తుకు ఉపకరించే చర్యలకు ఈ సభలు ఒక స్ఫూర్తి కావాలి. | editorial |
20,575 | 23-07-2017 21:45:05 | వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. | లండన్: ఐసీసీ మహిళల వల్డ్ కప్ పోటీల్లో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 43.3 ఓవర్లలో 196 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. మంధన 0, మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, రౌత్ 86, స్మృతీ వర్మ 0 పరుగులు చేసి అవుటయ్యారు. | sports |
10,786 | 14-08-2017 11:43:06 | ఇక నుంచి కాజల్ ఎవరినీ నమ్మదట! | తన మేనేజర్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన తరువాత కాజల్ ఒక నిర్ణయానికి వచ్చిందట! ఇక మీద ఎవరినీ నమ్మకూడదనీ, తన వ్యవహారాలు తను లేదా తన పేరెంట్స్ మాత్రమే చూసుకోవాలని డిసైడ్ అయ్యిందట! తన మేనేజర్ ఇలాంటివాడు అని తెలిసి ఉంటే అస్సలు దగ్గరకు రానిచ్చేది కాదని చెబుతోందట! అతగాడితో చనువుగా ఉన్న ఫోటోలు కూడా ఫేక్ ఫోటోలే అని, అతనితో తనకు ఎప్పుడూ అంత చనువు లేదని స్పష్టం చేసింది. | entertainment |
2,734 | 19-07-2017 00:20:43 | ఇళ్ల కొనుగోలుదారులకు ‘ఎస్బిఐ రియల్టీ’ | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఆమోదం పొందిన మూడు వేల ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను ఎంపిక చేసుకునేందుకు తమ కస్టమర్లకు అవకాశం కల్పిస్తూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ప్రత్యేకంగా ఒక రియల్టీ పోర్టల్ను ప్రారంభించింది. www.sbirealty.in పేరుతో ప్రారంభించిన ఈ పోర్టల్ ఇళ్ల కొనుగోలుదార్లకు వన్స్టాప్ ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్గా ఉంటుందని బ్యాంకు ఎండి రజనీష్ కుమార్ అన్నారు. 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 30 నగరాలకు చెందిన 9.5 లక్షల ఇళ్లు ఇందులో లిస్టింగ్ అయి ఉంటాయని ఆయన చెప్పారు. ఏ నగరంలో అయినా భిన్న ప్రదేశాల్లో ప్రాపర్టీల ధరలు ఎలా ఉన్నాయో అంచనా వేసుకుని తులనాత్మకంగా మదింపు చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే తమ ఆదాయం, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా తమ రుణ అర్హతను కూడా కస్టమర్లు మదింపు చేసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిశోధన, సమకాలీన నైపుణ్యాలు, శక్తివంతంగా ప్రాజెక్టుల అమలు, నిర్మాణంలో నాణ్యతలతో కూడిన నవ్యత పట్ల తమకు విశ్వాసం ఉన్నదని, అలాంటి ప్రాజెక్టులను మాత్రమే ఎంపిక చేసి ఇందులో లిస్టింగ్ చేయడం ద్వారా కస్టమర్లకు తమ కలల నివాసాన్ని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాప్ఈక్విటీ సంస్థ సహకారంతో ఎస్బిఐ క్యాప్ ఈ వెబ్సైట్ను రూపొందించింది. | business |
3,221 | 07-03-2017 00:28:12 | కనీస నిల్వ పెంపుతో 31 కోట్ల ఎస్బిఐ ఖాతాదారులకు దెబ్బ |
న్యూఢిల్లీ: సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నిర్ణయించిన నేపథ్యంలో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్బిఐ నిర్ణయ ప్రభావం 31 కోట్ల మంది ఖాతాదారులపై పడనుంది. ఆరు మెట్రో నగరాల్లోని తన ఎస్బి ఖాతా కస్టమర్లకు సంబంధించి నెలవారీ సగటు నిల్వ (ఎంఎబి) పరిమితిని ఏకంగా 5,000 రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఎస్బిఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకుల్లో (ఏప్రిల్ నుంచి వీటి విలీనం ఉంటుంది) ఖాతా కలిగిన వారు కూడా నెలవారీగా తమ ఖాతాలో కనీస నిల్వను ఉంచనట్టయితే వారికి 20 రూపాయల (గ్రామీణ శాఖలు) నుంచి 100 రూపాయల (మెట్రో నగరాల్లోని శాఖలు) వరకు జరిమానా విధించనున్నారు. మెట్రో శాఖల్లోని ఖాతాదారులు 5,000 రూపాయల కనీస నిల్వలను కలిగి ఉండకుంటే.. 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. అర్బన్, సెబీ అర్బన్ శాఖల్లోని ఖాతాదారులు వరుసగా 3,000 రూపాయలు, 2,000 రూపాయల నిల్వను ఉంచాలి. గ్రామీణ శాఖల్లో అయితే 1,000 రూపాయలు తప్పనిసరి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు జరిమానా తప్పదు. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు 500 రూపాయల నెలవారీ సగటు నిల్వను కొనసాగించాలన్న నిబంధన ఉంది. చెక్కు బుక్ కలిగిన వారు 1,000 నిల్వను కలిగి ఉండాలి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లోని సేవింగ్ ఖాతాల్లో ఉండాల్సిన సగటు నిల్వలను పెంచాలని ఎస్బిఐ నిర్ణయించింది. దీని వల్ల పెన్షనర్లు, విద్యార్థులు, ఇతర ఖాతాదారులపైనా ప్రభావం అధికంగా ఉండనుంది. ఇక ప్రభుత్వరంగంలోని బ్యాంకింగ్ దిగ్గజమే ఇలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటలో సాగవచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. | business |
18,219 | 19-08-2017 09:37:17 | మౌసా ఓకబీర్ కాల్చివేత... | బార్సిలోనా: స్పెయిన్ జంట దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 17 యేళ్ల యువకుడు మౌసా ఓకబీర్ను పోలీసులు మట్టుబెట్టారు. తీరప్రాంత పట్టణం కేంబ్రిల్స్లో అతడిని కాల్చిచంపినట్టు స్పెయిన్ అధికారులు ధ్రువీకరించారు. బార్సిలోనా దాడి జరిగిన కొద్ది సేపటికే కాంబ్రిల్స్లోనూ అచ్చం అదేమాదిరిగా వ్యాన్తో దాడిచేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే వ్యాన్ బోల్తా పడడంతో ఓ పోలీస్ అధికారి ఆ వ్యాన్లోని నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. గాయపడి అరెస్టయిన మరో ఉగ్రవాది కూడా కొద్ది గంటల్లోనే మృతి చెందాడు. వీరు బాంబులతో చుట్టుకున్న బెల్టులను బాంబ్ స్క్వాడ్ బృందం నిర్వీర్యం చేసింది. కాగా సిరియాలో వైమానిక దాడులకు ప్రతీకారంగానే జంటదాడులకు పాల్పడినట్టు ఐసిస్ ప్రకటించింది. | nation |
13,934 | 02-03-2017 02:36:06 | ‘లవ్ యువర్ నైబర్’! | అమెరికాలో తెలుగు యువకులపై కాల్పుల ఘటన తర్వాత అక్కడ ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. జాతి, మతం, రంగు ఆధారంగా మనుషులను వేరుగా చూసే విధానానికి చరమ గీతం పాడుదాం అని అక్కడివారు నినదిస్తున్నారు. వివిధ దేశాల ఎన్జీవోలన్నీ కలిసి నివాసాల మధ్య ‘లవ్ యువర్ నైబర్’ అంటూ ప్రత్యేకంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఒక్క భారతీయులే కాకుండా చైనీయులు, ఆఫ్రికన్లు కూడా భాగస్వాములవడంపై తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ, ఇతర ప్రధాన ప్రదేశాలు, నివాసల మధ్య ఈ తరహా సైన్బోర్డులు కనిపిస్తున్నాయి. - ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ | nation |
17,249 | 10-04-2017 15:00:07 | హిమాచల్ సీఎంకు షాక్...ఈడీ తాజా సమన్లు | ఛండీగఢ్: మనీలాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఆయనను ప్రశ్నించేందుకు గాను విచారణ ముందుకు హాజరుకావాలంటూ మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఇంతకుముందు కూడా ఈడీ సమన్లు పంపినప్పటికీ ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా హాజరుకాలేకపోతున్నట్టు ఆయన ఈడీకి తెలిపారు. దీంతో ఈడీ తాజా సమన్లు జారీ చేసింది. రూ.10 కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ సీఎం, ఆయన భార్య, మరికొందరిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఆ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో వీరభద్ర సింగ్ భార్య ప్రతిభ, కుమారుడు విక్రమాదిత్యను ఈడీ ప్రశ్నించింది. 2009-2011 మధ్య కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీరభద్రసింగ్, ఆయన కుటుంబసభ్యులు రూ.6.1 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. పీఎంఎల్ఏ చట్టం కింద రూ.14 కోట్ల ఆస్తులను కూడా ఈ కేసులో సీబీఐ స్వాధీనం చేసుకుంది. | nation |
12,373 | 09-03-2017 12:15:51 | భద్రతా సంస్థలపై రాజ్నాథ్ ప్రశంసలు | న్యూఢిల్లీ: అమెరికాలో పెచ్చరిల్లుతున్న విద్వేష దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు అమెరికాలో భారతీయుల దాడిపై పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘వుయ్ వాంట్ జస్టిస్’’ అని నినాదాలు చేస్తూ సభను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా దీనిపై వచ్చే వారం అన్ని వివరాలను ప్రవేశపెడతామని కేంద్రం పేర్కొంది. మరోవైపు శ్రీలంక దళాలు తమిళనాడు జాలర్లపై చేస్తున్న దాడులను నిలువరించాలంటూ తమిళనాడు ఎంపీలు డిమాండ్ చేశారు. ఉజ్జయిని రైలు పేలుళ్లు, లక్నో ఎన్కౌంటర్ తదితర అంశాలపైనా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ పార్లమెంటులో ప్రసంగించారు. 12 గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దళాలు ఐఎస్ అనుమానిత ఉగ్రవాది సైఫుల్లాను మట్టుబెట్టాయన్నారు. మొత్తం మూడు భద్రతా సంస్థలు ఉగ్రవాదులు తలపెట్టనున్న పెనుప్రమాదాన్ని ముందే పసిగట్టి నిలువరించాయని ప్రశంసించారు. రైలు పేలుళ్ల కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారన్నారు. | nation |
4,850 | 01-03-2017 13:38:49 | బయోపిక్స్పై సెన్సార్ బోర్డు సరికొత్త రూల్ | కాంట్రవర్సీ బయోపిక్స్ను ఎంచుకుని రచ్చ రచ్చ చేసే ఆ వివాదాస్పద దర్శకుడికి సెన్సార్ బోర్డు నిర్ణయం షాక్ ఇచ్చినంత పని చేసిందట. బోర్డు నిర్ణయం కారణంగా ఆయన నయా మూవీ విడుదల ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. సినిమాలకు కథలు కరువు కావడంతో... చాలామంది మూవీ మేకర్లు బయోపిక్స్పై పడిపోయారు. బయోపిక్స్ అంటే ఆడియెన్స్కు ఆసక్తి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఇలాంటి కథలను ఎంచుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇక ఇలాంటి కథలకు తనదైన ట్రేడ్ మార్క్ వివాదాన్ని జత చేసి ప్రేక్షకుల మీదకు వదలడం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరింత బాగా అలవాటైపోయింది. ప్రస్తుతం అమితాబ్ ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కిస్తున్న 'సర్కార్ 3' సినిమా కథ సైతం ముంబైలోని శివసేన మాజీ చీఫ్ బాల్ థాక్రేదే అనే విషయం బహిరంగ రహస్యం. అయితే 'సర్కార్ 3' సినిమాకు థాక్రే ఫ్యామిలీ అడ్డుపడితే ఆ సినిమా రిలీజ్ కావడం కష్టమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా బయోపిక్స్పై వివాదాలు పెరిగిపోవడంతో... అలాంటి కథలతో తెరకెక్కే సినిమాల ట్రైలర్ రిలీజ్కు ముందే సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ కంపల్సరీ అని సెన్సార్ బోర్డు ప్రకటించింది. సో 'సర్కార్ 3' సినిమా విడుదలకు థాక్రే ఫ్యామిలీకి చెందిన ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. 'సర్కార్' సినిమాపై గతంలో వీరి ఫ్యామిలీ నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమైన కారణంగా ఈ సారి 'సర్కార్ 3' సినిమాకు వీరి నుంచి నో అబ్జెక్షన్ వస్తుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బయోపిక్స్లో కాంట్రవర్సీ జోలికి పెద్దగా వెళ్లని వర్మ... 'సర్కార్ 3' విషయంలోనూ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సెన్సార్ బోర్డు తీసుకొచ్చిన సరికొత్త రూల్ కారణంగా వివాదాస్పద వర్మ జుట్టు థాక్రేల చేతికి చిక్కిందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. | entertainment |
4,536 | 05-06-2017 01:34:36 | ‘కన్నీటివాగు’ కవితా సంకలనం ఆవిష్కరణ |
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కవిసంధ్య సంయుక్త నిర్వహణలో బియాస్ నది మృతులపై శిల్పా జగదీష్ సంపాదకత్వంలో వెలువడిన ‘కన్నీటివాగు’ కవితా సంకలనం ఆవిష్కరణ జూన్ 8, 2017 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. నాయిని నర్సింహారెడ్డి, కె.శివారెడ్డి, మామిడి హరికృష్ణ, శిఖామణి, బైస రాదాసు, గుడిపాటి తదితరులు పాల్గొంటారు.- శిల్పాజగదీష్ | editorial |
4,623 | 20-02-2017 11:44:23 | నాగ్.. రెండ్రోజులు బయటకు రాలేదట! | వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న నాగార్జున తాజా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ సినిమా విషయంలో నాగ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ‘అన్నమయ్య’ అంతటి ఘనవిజయాన్ని ఈ సినిమా కూడా దక్కించుకుంటుందని ఆశించాడు. చాలా యాక్టివ్గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రీమియర్ షో వేసిన తర్వాత వచ్చిన ప్రశంసలు చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. నలువైపుల నుంచీ తన నటనకు ప్రశంసలు దక్కుతుంటే ఆనందపడిపోయాడు. అయితే సినిమా కమర్షియల్గా విజయవంతం కాలేకపోయింది. ఓపెనింగ్స్పరంగా, కలెక్షన్ల పరంగా సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇది నాగ్ను చాలా బాధించిందట. తన సినిమాల జయాపజయాల గురించి అంతగా పట్టించుకోని నాగ్ కూడా ఈ ఫలితం చూసి నివ్వెరపోయాడట. అందుకే దాదాపు రెండ్రోజుల పాటు ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయాడట. ఆ రెండ్రోజులూ ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడానికి, ఎవరినీ కలవడానికి నాగ్ ఇష్టపడలేదట. | entertainment |
13,964 | 09-11-2017 01:34:59 | నితీశ్ బాటలో డీఎంకే | యూపీఏకు త్వరలో గుడ్బై?.. మోదీతో భేటీకోసం విదేశం నుంచి ఆగమేఘాలపై తిరిగొచ్చిన స్టాలిన్న్యూఢిల్లీ, నవంబర్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ చైన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతూనే ఉంది. బీహార్ లో నితీష్ కుమార్ మాదిరే కరుణానిధి కూడా యూపీఏకి గుడ్ బై చెబుతారన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలు అవే సూచిస్తున్నాయని ఢిల్లీలో అధికార వర్గాలంటున్నాయి. బుధవారం నాడు పెద్ద నోట్ల రద్దు-వ్యతిరేక దినాన్ని డీఎంకే పాటించినా నామ్ కే వాస్తేగానే సాగింది. ప్రస్తుతం వ్యవహారాలు నడుపుతున్న కరుణానిధి వారసుడు స్టాలిన్ కూడా కోయంబత్తూరులో నల్ల బ్యాడ్జీ ధరించి కాసేపు నిరసనలో పాల్గొన్నారు. ఇక మరో పెద్ద సంకేతం... 2-జి కేసు తీర్పు వాయిదా. 2జి కుంభకోణం కేసుపై తీర్పును డిసెంబర్ 5 వరకు వాయిదా వేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పు గనుక కనుక వెలువడితే మాజీ కేంద్రమంత్రి రాజా సంగతి అటుంచి, కరుణానిధి కూతురు, రాజ్యసభ సభ్యురాలైన కనిమొళి రాజకీయ భవితవ్యం అంతమవుతుంది. రాజ్యసభకు ఆమె అనర్హురాలవుతారు. మరో 11 ఏళ్ల వరకు ఆమె పోటీ చేయడానికి వీలుండదు. నిజానికి నిన్న మొన్నటి వరకూ కరుణానిధి బీజేపీ అంటే మండిపడేవారు. పలు సార్లు మోదీ ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. ఇపుడు పరిస్థితి మారిపోయింది. మోదీ వస్తున్నారని తెలియగానే కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఆగమేఘాలపై విదేశాలనుంచి వచ్చారు. స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి చిరునవ్వులు చిందిస్తూ మోదీతో మాట్లాడారు. నరేంద్ర మోదీ కరుణానిధిని క లుస్తున్నారని తమిళనాడు బీజేపీ ఇన్ ఛార్జి ముర ళీధర్ రావు మంగళవారం ఉదయం 8-45 కు ట్వీట్ ఇచ్చేంతవరకూ వారి కలయిక గురించి ఎవరికీ తెలియదు.. దినతంతి కార్యక్రమంలో పాల్గొనడమే తప్ప ప్రధాని కార్యక్రమ షెడ్యూల్లో ఈ భేటీ ప్రస్తావన లేదు. స్టాలిన్ తన విదేశీ పర్యటనను ఆపేసుకొని తిరిగి వచ్చారంటే కొద్ది రోజుల క్రితం నుంచే తెరవెనుక మంతనాలు జరుగుతుండాలి.. అంతఃకలహాలతో ఛిద్రమైన అన్నాడీఎంకే కంటే అధికారంలోకొచ్చే డీఎంకేయే బెటరని అంచనాకొచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా స్టాలిన్తో తెరవెనుక మంత్రాంగం సాగించినట్లు స్పష్టమవుతోంది. | nation |
4,646 | 26-06-2017 23:10:14 | దసరా సీజన్లో ‘జై లవకుశ’ | ఎన్టీఆర్ తొలిసారి మూడు పాత్రలు పోషిస్తోన్న ‘జై లవకుశ’ చిత్రం దసరా సీజన్లో విడుదల కానుంది. బాబీ (‘పవర్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్ నాయికలు. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాత, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అధినేత నందమూరి కల్యాణ్రామ్ తెలిపారు. సెప్టెంబర్ 30న దసరా పండగ. అంటే దసరా సెలవుల ద్వారా పూర్తి స్థాయి ప్రయోజనం పొందాలనేది నిర్మాత ఉద్దేశం. జూలై తొలి వారంలో ఈ సినిమా టీజర్ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల్లో ఒక దానికి నెగటివ్ షేడ్స్ ఉంటాయనీ, ఈ పాత్రను తారక్ సవాలుగా తీసుకొని చేస్తున్నారనీ యూనిట్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్లుక్.. ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. హిందీలో ‘గుడ్డూ రంగీలా’, ‘కాబిల్’ సినిమాల్లో విలన్గా మంచి పేరు తెచ్చుకొన్న రోణిత్ రాయ్.. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్, రోణిత్పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. | entertainment |
12,958 | 25-05-2017 20:58:55 | బస్సు దగ్ధం.. 8 మంది సజీవ దహనం | పాట్నా: ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అందరూ చూస్తుండగానే దగ్ధమైంది. 8 మంది సజీవ దహనం కాగా 12 మందికిపైగా గాయపడ్డారు. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది. | nation |
171 | 14-06-2017 01:15:40 | మార్కెట్లో నోకియా స్మార్ట్ఫోన్లు | న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధి పొందిన నోకియా బ్రాండ్ మార్కెటింగ్ హక్కులు కలిగి ఉన్న హెచ్ఎండి గ్లోబల్ సంస్థ భారత మార్కెట్లో మంగళవారం మూడు నోకియా స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది. వచ్చే శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలోను అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర 9,499 రూపాయలు. నోకియా ప్రజల బ్రాండ్ అని, విశ్వసనీయత, నమ్మకం దాని పునాదులని, ఈ స్మార్ట్ఫోన్లు ఆ బ్రాండ్ గుర్తింపును కొనసాగిస్తాయని నోకియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా అన్నారు. వీటిలో నోకియా 3.. 9499 రూపాయల ధరలో అన్ని రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. 12,899 రూపాయల ధరలోని నోకియా 5 స్మార్ట్ఫోన్లు ప్రీ బుకింగ్ చేసుకుని జూలై 7 నుంచి డెలివరీ పొందవచ్చునని ఆయన తెలిపారు. నోకియా బ్రాండ్లో అగ్రగామిగా నిలిచే నోకియా 6 స్మార్ట్ఫోన్ను 14,999 రూపాయల ధరకు అమెజాన్ పోర్టల్లో జూలై 14 నుంచి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు ప్రపంచ శ్రేణి డిజైనింగ్తో కస్టమర్లకు చక్కని, వాస్తవిక అనుభూతిని అందిస్తాయని నోకియా గ్లోబల్ పోర్ట్ఫోలియో స్ర్టాటజీ విభాగం డైరెక్టర ప్రణవ్ ష్రాఫ్ అన్నారు. | business |
13,389 | 19-05-2017 12:16:06 | లండన్ వెళ్లిపోయిన కార్తీ చిదంబరం! | న్యూఢిల్లీ: కేంద్ర ఆర్దికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం లండన్ వెళ్లారు. గురువారం సాయంత్రమే ఓ మిత్రుడితో కలసి ఆయన లండన్ పయనమైనట్టు సమాచారం. ఆయనపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే ఉన్నట్టుండి బ్రిటన్ వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్-మ్యాక్సిస్ సంస్థల నుంచి ముడుపులు పుచ్చుకున్నారంటూ దాఖలైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం చిదంబరంతో పాటు కార్తీ నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కార్తి హుటాహుటిన లండన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా కార్తి ప్రయాణం ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకున్నది కాదనీ.. ముందుగా చేసుకున్నషెడ్యూల్ ప్రకారమే ఆయన బ్రిటన్ వెళ్లారని చిదంబరం పేర్కొన్నారు. కార్తీ విదేశీ ప్రయాణంపై నిషేధం లేదన్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన మళ్లీ స్వదేశానికి తిరిగివస్తారని వెల్లడించారు. పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి నేతృత్వంలోని ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఎఫ్ఐపీబీ అనుమతులు ఇచ్చేందుకు... చిదంబరం, కార్తి భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే కార్తి, ముఖర్జియాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ప్రస్తుతం ముఖర్జియా దంపతులు తమ కుమార్తె షీనా బోరా హత్యకేసులో ఊచలు లెక్కిస్తున్నారు. | nation |
8,499 | 09-07-2017 22:35:38 | ‘సూపర్’ స్టార్.. కిడ్! |
‘స్పైడర్’ సెట్స్పై మహేశ్, ఆయన ముద్దుల తనయ సితారను బ్లాక్ అండ్ వైట్లో అందంగా బంధించి, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ | entertainment |
3,697 | 03-05-2017 02:33:21 | ఎన్టీఆర్ వైద్య సేవలో కాటరాక్ట్ |
‘ప్రజలందరికీ ఆరోగ్యం’ అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’ పథకం రూపొందించింది. ఇది ఏంతో హర్షణీయం. ఈ పథకం ద్వారా మొత్తం సుమారు 1400 జబ్బులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే వృద్ధులలో 90 శాతానికి వచ్చే కంటి శుక్లాల తొలగింపునకు ఈ సేవలలో స్థానం కల్పించలేదు. దీనివలన బయట ఆస్పత్రులలో పాతికవేల నుంచి, ముప్పైవేల వరకు చెల్లించి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోంది. రెండు కళ్ళకు సుమారు 60వేల రూపాయలు ఖర్చు చేయగలగడం సామాన్యులకు భారమవుతోంది. కాబట్టి ప్రభుత్వం కంటి శుక్లాల ఆపరేషన్ని కూడా ఎన్టీఆర్ వైద్యసేవలో చేర్చాలి.- బిజిఆర్ మండవ, కన్వీనర్, తెలుగుదేశం సీనియర్ సిటిజెన్స్ ఫోరం, విజయవాడ. | editorial |
2,522 | 19-07-2017 00:24:04 | సెన్సెక్స్ పరుగుకు బ్రేక్ | సెన్సెక్స్ పరుగుకు బ్రేక్ పడింది. ఐటిసితో సహా ఎఫ్ఎంసిజి కంపెనీల షేర్ల లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన ఇండెక్స్లు రెండూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 363.79 పా యింట్ల నష్టంతో 31710 వద్ద, 88.8 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 9827 వద్ద క్లోజయ్యాయి. గత ఏడాది నవంబర్ 21 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. జిఎ్సటి కౌన్సిల్ సిగరెట్లపై సెస్సు పెంచేయడంతో సెన్సెక్స్ హెవీవెయిట్ షేర్లలో ఒకటైన ఐటిసి షేర్లు 12.63 శాతం నష్టపోయి రూ.284.60 దగ్గర ముగిశాయి. ఒక దశలో ఐటిసి షేర్లు 15 శాతం వరకు నష్టపోయాయి. ఇతర సిగరెట్ కంపెనీలైన గాడ్ఫ్రే ఫిలిప్స్, విఎ్సటి షేర్లూ ఎనిమిది శాతం వరకు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు అంతంత మాత్రంగా ఉండడం, తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై అంతంత మా త్రంగా ఉన్న అంచనాలు, లాభాల స్వీకరణ అ మ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అయి నా నిఫ్టీ త్వరలోనే 10000 పాయింట్ల మాజిక్ ఫిగర్కు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో ఎఫ్ఎంసిజి కంపెనీలతో పాటు రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జుమర్ డ్యూరబుల్స్, పవర్, పిఎస్ యు కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. అయి తే ఐటి, ఆటో, హెల్త్కేర్, టెక్ కంపెనీల షేర్లు మాత్రం కొద్ది పాటి లాభాలతో ముగిశాయి. మొబిక్వెస్ట్ లో పేటీఎం పెట్టుబడులుడిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం నోయిడాకు చెందిన మొబిక్వెస్ట్ మొబైల్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది. అయితే ఎం త మొత్తం పెట్టుబడి పెట్టిందో వెల్లడించలేదు. మొబిక్వెస్ట్ సంస్థ వివిధ కంపెనీలకు మొబైల్ ఆధారిత లాయల్టీ, ఎనలిటిక్స్ సేవలు అందిస్తోంది. టాటా గ్లోబల్లో తగ్గిన ఎల్ఐసి వాటాటాటా గ్లోబల్ బేవరేజెస్ ఈక్విటీలో పెట్టుబడులను ఎల్ఐసి తగ్గించుకుంది. ఇందులో భాగంగా మొత్తం ఈక్విటీలో 2.14 శాతానికి సమానమైన 1.35 కోట్ల షేర్లను మార్కెట్లో విక్రయించింది. గత ఏడాది జూలై 20 నుంచి ఈ నెల 4వ తేదీల మధ్య ఈ షేర్లను విక్రయించింది. దీంతో టాటా గ్లోబల్ ఈక్విటీలో ఎల్ఐసి వాటా 9.85 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. ఇల్లిక్విడ్ షేర్లపై జాగ్రత్త : బిఎస్ఇఖాతాదారుల కోసం షేర్లు కొనేటపుడు, ఏ మాత్రం లావాదేవీలు లేని కంపెనీల షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బిఎస్ఇ బ్రోకర్లను కోరింది. బిఎస్ ఇ సభ్యుల దగ్గర నమోదైన సభ్యులమంటూ ఇటీవల కొంత మంది ఇలాంటి షేర్ల కోసం ఆర్డర్లు ప్లేస్ చేయడంతో బిఎ్సఇ తన సభ్యులను అప్రమత్తం చేసింది. | business |
710 | 09-05-2017 00:33:46 | కాగ్నిజెంట్లో 30 వేల మందికి ఉద్వాసన! |
హైదరాబాద్లో 4,000 మంది ఇంటికి..హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. అలాంటిదేమీ లేదని కంపెనీ ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా ‘ఎకనామిక్స్ టైమ్స్’ పత్రికతో చెప్పినా, పనితీరు సరిగా లేదనే పేరుతో 25,000-30,000 మందిని ఇంటికి పంపించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసినట్టు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగ వర్గాలు చెప్పాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రం నుంచి 4,000 మంది ఉంటారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బి వీసాల జారీని కఠినం చేయడంతో అమెరికా కంపెనీ అయిన కాగ్నిజెంట్ కూడా అక్కడ నియామకాలు పెంచి, భారతలో తగ్గించాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం పనితీరు సరిగాలేని 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశం ఉందని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ ఏడాది తొలగింపులు అంతకంటే భారీగానే ఉంటాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ‘పని తీరు సరిగాలేని ఉద్యోగులను ఇంటికి పంపించడం సాధారణమే. అయితే ఏటా వీరి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో అర శాతం నుంచి ఒక శాతంలోపే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 7 నుంచి 10 శాతం మంది ఉద్యోగులను ఇలా ఇంటికి పంపిస్తున్నారు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగి ఒకరు చెప్పారు. రాజీనామాల కోసం ఒత్తిడిపనితీరు సరిగా లేదని తేల్చిన ఉద్యోగుల చేత రాజీనామా చేయుంచేందుకూ కాగ్నిజెంట్ అనేక ఎత్తుగడలు వేస్తోందని తెలుస్తోంది. తమ పేర్లు లిస్టులో ఉన్నాయని తెలిసి ఇప్పటికే కొంత మంది స్వచ్ఛందంగానే కంపెనీ నుంచి తప్పుకున్నారు. మిగిలిన వారి చేత రాజీనామా చేయుంచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పటికీ వినకపోతే నాలుగు నెలల జీతం ఇస్తాం... రాజీనామా చేస్తావా? అని అడుగుతున్నట్టు సమాచారం. ఇలా అడుగుతున్న ఉద్యోగుల్లో పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగులూ ఉన్నారు. గత పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు మంచి పనిమంతుడని ఏటా జీతాలు పెంచి, ఇప్పుడు హఠాత్తుగా పనితీరు బాగోలేదు రాజీనామా చేయండి అని దబాయించడం ఎంత వరకు న్యాయం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బయటి కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకుని కాగ్నిజెంట్నే నమ్ముకున్న ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత మంది ఉద్యోగులను ఒక్కసారే బయటికి పంపిస్తే పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయనే భయంతో కాగ్నిజెంట్ గత మూడు నెలల నుంచి దశల వారీగా ఇలా ఉద్యోగులను బయటికి పంపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. తగ్గిన అవకాశాలు..కాగ్నిజెంట్ నుంచి బయటపడుతున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమూ తీవ్ర సమస్యగా మారిపోయింది. ‘కాగ్నిజెంట్లో ఏటా రూ.6 లక్షల వేతనం తీసుకునేదాన్ని. ఇప్పుడు వేరే కంపెనీల్లో ప్రయత్నిస్తుంటే రూ.4 లక్షల కంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉద్యోగి ‘ఆంధ్రజ్యోతి బిజినె స్’తో అన్నారు. గతంలో కాగ్నిజెంట్ నుంచి వచ్చే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు మంచి జీతాలు ఆఫర్ చేసేవి. ఇప్పుడు ఆ కంపెనీయే ఉద్యోగులను తీసేస్తోందని తెలియడంతో వీలైనంత తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. నేడు లేబర్ కమిషనర్ దగ్గరికి చెన్నైలోనూ కాగ్నిజెంట్ ఇదే మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసివేయడంతో వారు అక్కడి లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు. ఇపుడు హైదరాబాద్ యూనిట్లో వేటు పడే ఉద్యోగులూ మంగళవారం లేబర్ కమిషనర్ను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విధుల నుంచి తొలగించే వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ కాగ్నిజెంట్ వివక్ష చూపిస్తోందని ఉద్యోగుల ఆరోపణ. డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్ల వంటి పెద్ద ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతం ఇచ్చి పంపిస్తుంటే, గొడ్డు చాకిరీ చేసే తమను మాత్రం రెండు నెలల నోటీసుతో ఇంటికి పంపిస్తోందని చెబుతున్నారు. రాజీనామాల కోసం ఒత్తిడిపనితీరు సరిగా లేదని తేల్చిన ఉద్యోగుల చేత రాజీనామా చేయుంచేందుకూ కాగ్నిజెంట్ అనేక ఎత్తుగడలు వేస్తోందని తెలుస్తోంది. తమ పేర్లు లిస్టులో ఉన్నాయని తెలిసి ఇప్పటికే కొంత మంది స్వచ్ఛందంగానే కంపెనీ నుంచి తప్పుకున్నారు. మిగిలిన వారి చేత రాజీనామా చేయుంచేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. అప్పటికీ వినకపోతే నాలుగు నెలల జీతం ఇస్తాం... రాజీనామా చేస్తావా? అని అడుగుతున్నట్టు సమాచారం. ఇలా అడుగుతున్న ఉద్యోగుల్లో పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగులూ ఉన్నారు. గత పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు మంచి పనిమంతుడని ఏటా జీతాలు పెంచి, ఇప్పుడు హఠాత్తుగా పనితీరు బాగోలేదు రాజీనామా చేయండి అని దబాయించడం ఎంత వరకు న్యాయం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బయటి కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకుని కాగ్నిజెంట్నే నమ్ముకున్న ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇంత మంది ఉద్యోగులను ఒక్కసారే బయటికి పంపిస్తే పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయనే భయంతో కాగ్నిజెంట్ గత మూడు నెలల నుంచి దశల వారీగా ఇలా ఉద్యోగులను బయటికి పంపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. తగ్గిన అవకాశాలు..కాగ్నిజెంట్ నుంచి బయటపడుతున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమూ తీవ్ర సమస్యగా మారిపోయింది. ‘కాగ్నిజెంట్లో ఏటా రూ.6 లక్షల వేతనం తీసుకునేదాన్ని. ఇప్పుడు వేరే కంపెనీల్లో ప్రయత్నిస్తుంటే రూ.4 లక్షల కంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉద్యోగి ‘ఆంధ్రజ్యోతి బిజినె స్’తో అన్నారు. గతంలో కాగ్నిజెంట్ నుంచి వచ్చే ఉద్యోగులకు కొన్ని కంపెనీలు మంచి జీతాలు ఆఫర్ చేసేవి. ఇప్పుడు ఆ కంపెనీయే ఉద్యోగులను తీసేస్తోందని తెలియడంతో వీలైనంత తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. నేడు లేబర్ కమిషనర్ దగ్గరికి చెన్నైలోనూ కాగ్నిజెంట్ ఇదే మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసివేయడంతో వారు అక్కడి లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు. ఇపుడు హైదరాబాద్ యూనిట్లో వేటు పడే ఉద్యోగులూ మంగళవారం లేబర్ కమిషనర్ను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విధుల నుంచి తొలగించే వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ కాగ్నిజెంట్ వివక్ష చూపిస్తోందని ఉద్యోగుల ఆరోపణ. డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్ల వంటి పెద్ద ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతం ఇచ్చి పంపిస్తుంటే, గొడ్డు చాకిరీ చేసే తమను మాత్రం రెండు నెలల నోటీసుతో ఇంటికి పంపిస్తోందని చెబుతున్నారు. | business |
8,038 | 22-01-2017 11:39:05 | దేవుళ్లు సినిమాలో నటించిన నిత్యా హీరోయిన్గా బిజీబిజీ! | సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది చిన్నతనంలోనే ఆరంగేట్రం చేసి ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన వారే ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా నటించి అందరినీ మెప్పిస్తుంటారు. అప్పట్లో శ్రీదేవీ నుంచి ఇప్పటి అవికా గోర్ దాకా చాలామంది అలా వచ్చిన వారే. తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి తారలు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఆమె నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు నిత్యా శెట్టి. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ దేవుళ్లు సినిమాలో భవానీ పాత్రలో నటించిన చిన్నపాప అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. భక్తురాలి పాత్రలో అమాయకంగా కనిపించిన ఈ అమ్మడు తెలుగులో దాగుడుమూతలు దండాకోరు సినిమాలో హీరోయిన్గా నటించింది. పడేశావే సినిమాలో కూడా ఓ లీడ్ రోల్ చేసింది. ఇంతకీ ఇప్పుడీ భామ సంగతి ఎందుకు ప్రస్తావనకొచ్చిందంటే ఇన్నాళ్లు తెలుగులోనే అడపాదడపా పాత్రలు చేసి మెప్పించిన నిత్యా ఇప్పుడు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. వరుస సినిమాలు చేసేందుకు సైన్ చేసింది. సాంప్రదాయ దుస్తుల్లోనే కాదు మోడ్రన్ డ్రస్సుల్లో కూడా నిత్యా తన గ్లామర్ను ఒలకబోస్తోంది. | entertainment |
18,126 | 30-09-2017 08:45:00 | క్యాన్సర్తో ప్రముఖ నటుడు కన్నుమూత... | Cancerన్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్ (67) కన్నుమూశారు. చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చర్మ క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉండడంతో ఆల్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు వారాలుగా ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో వైద్యులు ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా టామ్ ఆల్టర్ మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో పుట్టిన టామ్ ఆల్టర్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో నివసిస్తున్నారు. అమెరికా సంతతి వాడైనా ఆయనకు హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టు ఉండడం విశేషం. 1974లో ఆల్టర్ ప్రతిష్ఠాత్మక పుణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో డిప్లమో గ్రాడ్యుయేట్ చేసిన ఆల్టర్... తన ప్రతిభతో గోల్డ్ మెడల్ అందుకున్నారు. రంగస్థలంపై మౌలానా ఆజాద్, మీర్జా ఘాలిబ్ పాత్రలతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వెండితెరకు పరిచయమై 300కు పైగా సినిమాల్లోనూ, లెక్కకు మించిన టీవీ షోలలోనూ ఆల్టర్ నటించారు. 1976లో చరస్ అనే మూవీతో టామ్ ఆల్టర్ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. 'షత్రంజ్ కే ఖిలాడి', 'కర్మ', 'క్రాంతి', 'దేస్ పరదేశ్', 'జునూన్' , 'లోక్నాయక్', 'ది హంగామా' వంటి పలు చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. ఆల్టర్ చివరిగా ఈ ఏడాది వచ్చిన సర్గోషియా సినిమాలో కనిపించారు. ‘గాంధీ’, ‘వన్ నైట్ కింగ్’ వంటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. నటనతో పాటు డైరెక్షన్లోనూ ఆల్టర్ ప్రతిభ చాటుకున్నారు. 1980 నుంచి 1990 వరకూ ఆయన స్పోర్ట్ జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఇండియా టీమ్లో అడుగుపెట్టడానికి ముందు సచిన్ టెండూల్కర్ను తొలిసారి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితగా ఆయన ఒక నాన్-ఫిక్షన్, రెండు ఫిక్షన్ పుస్తకాలు రాశారు. 2008లో కళలు, సినీరంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారం ప్రదానం చేసింది. | nation |
606 | 04-01-2017 23:32:31 | వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్డిఎఫ్సి బ్యాంకు | డిహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలు చవక | business |
9,440 | 13-08-2017 22:40:23 | బిగ్ బాస్ హౌస్లోకి ఎంటరైన హీరో నవ్దీప్ | పూణె: బిగ్బాస్ హౌస్లోకి హీరో నవ్దీప్ ఎంటరయ్యాడు. నిన్న మహేశ్ కత్తి, నేడు కల్పన ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేశాడు. వాస్తవానికి నిన్ననే నవ్దీప్ బిగ్బాస్ హౌస్లోకి వచ్చేస్తాడని అంతా భావించారు. అయితే శనివారానికి బదులుగా ఆదివారం ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన నవ్దీప్.. ముమైత్ ఖాన్లాగే బిగ్బాస్ ద్వారా జనం ముందుకు వచ్చాడు. | entertainment |
15,084 | 01-02-2017 15:08:09 | పాకిస్తాన్పైనా అమెరికా వేటు! | వాషింగ్టన్: విశ్వవ్యాప్త ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా భావించే పాకిస్తాన్పైనా వేటు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారా? అవుననే అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు... అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా వీసా నిషేధం విధించిన దేశాల సరసన ఇప్పుడు పాకిస్తాన్ను చేర్చున్నట్టు ప్రకటించాయి. ట్రంప్తో మీడియా సంబంధాలపై జార్జ్ వాషింగ్టన్ వద్ద జరిగిన సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్ ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్తాన్ను మాత్రం ఎందుకు నిషేధించకూడదు. త్వరలో ఆ దేశాన్నీ నిషేధించాల్సి రావచ్చు. ఇంతకు ముందు గుర్తించిన దేశాలను మొదట నిషేధిత జాబితాలో చేర్చాం. 90 రోజుల రివ్యూ సందర్భంగా ఇందులో చేర్చాల్సిన ఇతర దేశాలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చే వారికి వీసాలు నిరాకరిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత... పాకిస్తాన్ను కూడా ఈ జాబితాలో చేర్చుతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిషేధం విధించిన దేశాల్లో ఇరాక్, సిరియా, సూడాన్, ఇరాన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇందులో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలను ఎందుకు చేర్చలేదంటూ గత కొద్ది రోజులుగా వైట్ హౌస్ ఉన్నతాధికారులకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. | nation |
18,951 | 30-10-2017 01:58:55 | కార్లలో ఎయిర్బ్యాగ్స్, సీట్బెల్ట్ సెన్సర్లు తప్పనిసరి | 2019 జులై నుంచి అమలు చేయాల్సిందేకార్ల తయారీ సంస్థలకు కేంద్రం సూచనన్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2019 జులై నుంచి కార్లలో ఎయిర్బ్యాగ్, సీట్ బెల్ట్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ వ్యవస్థలను తప్పనిసరిగా అమర్చాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ సూచించింది. కొత్తగా తయారయ్యే కార్ల వేగం 80కి మించితే ఆడియో అలర్ట్స్.. వేగం 100, 120 దాటితే హెచ్చరికలు జారీ చేసేలా కార్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఏదైనా ప్రమాదం జరిగితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వల్ల చాలా మంది కార్ల నుంచి బయటపడలేక మరణిస్తున్నారని అలాంటి వ్యవస్థలను తొలగించాలని సూచించింది. | nation |
13,396 | 22-01-2017 01:58:23 | పొత్తు పెటాకులే? | యూపీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్న అఖిలేశ్..100 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టీకరణన్యూఢిల్లీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇవ్వజూపుతున్న సీట్లు తీసుకోవడం తప్ప కాంగ్రె్సకు వేరేమార్గం కనిపించడం లేదు. లేదంటే ఈ రెండు పార్టీల కూటమి కలిసి పోటీచేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఓ పక్క నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఎస్పీ, బీజేపీ, బీఎ్సపీ, చివరకు ఆర్ఎల్డీ సహా అన్ని పార్టీలూ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం పొత్తుల కూడలిలో నిలబడి ఉంది. ఎస్పీ, అజితసింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీని కూడా కలుపుకొని మహాకూటమి ఏర్పాటుచేసి యూపీలో బలం పుంజుకుందామనుకున్న ఆ పార్టీ యత్నాలకు ఎస్పీ అధినేత, సీఎం అఖిలేశ్ ముందే చెక్పెట్టారు. ఆర్ఎల్డీతో పొత్తుకు ససేమిరా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కూ చుక్కలు చూపిస్తున్నారు. ఏడాది కిందటే ఆ పార్టీతో పొత్తుకు సంసిద్ధత తెలిపిన ఆయన.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తండ్రి ములాయంసింగ్ యాదవ్ రాజీకి రావడం, బాబాయి శివపాల్ యాదవ్ బేజారవడం, అసలు పార్టీ తనదేనని ఎన్నికల సంఘం ప్రకటించడం, సైకిల్ గుర్తు కూడా తనకే ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో అఖిలేశ్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. బలహీన కాంగ్రె్సకు ఎక్కువ సీట్లు ఇచ్చి బతికించకూడదని ఆయన తాజాగా భావిస్తున్నారు. వంద స్థానాలకు మించి ఆ పార్టీకి ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు హతాశులయ్యారు. పైగా ఆయన ఇప్పటికే 210 స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కూడా ఉన్నాయి. తొలుత 150 స్థానాలు కావాలని కోరిన కాంగ్రెస్.. 130 సీట్లు.. కనీసం 120 అయినా ఇవ్వాలని బెట్టుచేస్తోంది. ఈ పరిస్థితుల్లో పొత్తు అవకాశాలకు దాదాపు తెరపడినట్లేనని ఎస్పీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. పొత్తు కుదుర్చుకునేందుకు తామెన్ని ప్రయత్నాలు చేసినా.. సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ మొండిగా వ్యవహరిస్తూ బీజేపీకి సాయం చేస్తోందని ఆరోపించారు. తొలుత ఉత్తరప్రదేశ్లోని మొత్తం 403 స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సర్జికల్ దాడుల అనంతరం బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఎస్పీతో పొత్తుకు సిద్ధమయ్యారు. కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ.. తమకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తుందని అంచనా వేశారు. అది తలకిందులైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఒంటరిపోటీకి కూడా సన్నాహాలు చేసుకుంటోంది. పార్టీ ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై.. 140 స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసింది. అయితే వారి పేర్లు ప్రకటించలేదు. ఆదివారంలోపు ఏదో ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశ ఇంకా ఆ పార్టీలో ఉంది. అయితే, ముస్లిం జనాభా ప్రాబల్య నియోజకవర్గాల విషయంలోనే విభేదాలు తలెత్తినట్లు ఉభయ పార్టీల వర్గాలు చె బుతున్నాయి. మైనారిటీలు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు సమాజ్వాదీ చేతుల్లో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని అప్పగిస్తే.. నెగ్గుకు రావొచ్చని, తద్వారా దేశవ్యాప్తంగా ముస్లింలలో మళ్లీ పలుకుబడి పెరుగుతుందని కాంగ్రెస్ ఊహ. ఇది పసిగట్టిన అఖిలేశ్ సీట్ల సర్దుబాటుపై కటువుగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రియాంక దూతకు అఖిలేశ్ దర్శనం కరువురాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు తన అభ్యర్థులకే ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, ఇందుకు ఎస్పీ అంగీకరించలేదని సమాచారం. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో ప్రియాంకా వాధ్రా రంగంలోకి దిగా రు. శుక్రవారం అర్ధరాత్రి తన దూతగా ‘ధీరజ్’ అనే వ్యక్తిని పంపారు. కానీ ఫలితం లేకపోయింది. ఆయన లఖ్నవ్లోని ఓ హోటల్లో మకాం వేసి ఉన్నారు. సీఎం దర్శనం కాలేదు. ఆయన్నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. | nation |
19,926 | 17-12-2017 01:26:33 | ఐపీఎల్లో డీఆర్ఎస్? |
వైజాగ్: అంపైర్ నిర్ణయ సమీక్ష విధానా (డీఆర్ఎస్)నికి తొలుత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం జేసినా ఆ తర్వాత మనసు మార్చుకున్న బీసీసీఐ... తాజాగా ఐపీఎల్లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఐసీసీ ప్యానెల్లో లేని దేశానికి చెందిన 10 మంది టాప్ అంపైర్లకు డీఆర్ఎస్పై తొలిసారి శుక్రవారం ఇక్కడ బీసీసీఐ వర్క్షాప్ నిర్వహించింది. ఐసీసీ అంపైర్ల కోచ్ డెనిస్ బర్న్స్, అంపైర్ పాల్ రీఫెల్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ జరిగింది. ఇందులో పాల్గొన్నవారు ఐపీఎల్ లో బాధ్యతలు నిర్వర్తించేవారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. వచ్చే ఐపీఎల్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు అత్యున్నత అధికారి ఒకరు చెప్పాడు. | sports |
7,601 | 17-07-2017 14:09:42 | ‘ఏబీఎన్’తో మనసు విప్పి మాట్లాడిన రవితేజ తల్లి రాజ్యలక్ష్మి | భరత్ అంత్యక్రియల వ్యవహారంతో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు మాస్ హీరో రవితేజ. ఆ వివాదం సమసిపోక ముందే టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ కేసుతో రవితేజ పేరు మరోసారి వార్తల్లో వినిపించింది. ఈ రెండు విషయాలపై రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఏబీఎన్తో మనసు విప్పి మాట్లాడారు. ‘‘రవితేజ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడం షాక్కి గురిచేసింది. రవితేజకి డ్రగ్స్ వాడే అలవాటు లేదు. ప్రస్తుతం రవితేజ ఔటడోర్ షూటింగ్లో ఉన్నాడు. భరత్ ముఖం ఛిద్రమయ్యిందన్న కారణంగానే ఆఖరి చూపు చూడలేదు. కానీ ముఖం బాగానే ఉందని ఆ తర్వాత తెలిసింది. నేను, మా వారు చూడలేకే అంత్యక్రియలకు హాజరు కాలేదు. భరత్ ఫోన్ను పోలీసులు ఇంతవరకు మాకు ఇవ్వనిమాట నిజమే. భరత్ ఫోన్ హిస్టరీ చూసే డ్రగ్స్ కేసు మొదలయ్యిందన్న విషయం నాకు తెలియదు.’’ అని ఆమె చెప్పారు. అనంతరం ‘మీరు అంత్యక్రియల ప్రక్రియని ఫాలోఅప్ చేశారుగా’ అన్న ప్రశ్నకి రాజ్యలక్ష్మి తడబడ్డారు. పూరీజన్నాథ్ బ్యాచ్తో రవితేజకు స్నేహం ఉన్న మాట వాస్తవమేనని, అంత మాత్రాన వారితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసు వచ్చిందని, 22వ తేదీన విచారణకు హాజరు అవుతాడని ఆమె చెప్పారు. డ్రగ్స్ వ్యవహారం వచ్చిన ప్రతిసారి తమ పిల్లల పేర్లను కావాలని తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంలో భరత్ను రవితేజ ఎన్నోసార్లు మందలించారని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్లే మిగులుతారని రాజ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. | entertainment |
14,359 | 30-08-2017 03:16:41 | మూడు ద్వారాల గుహ | గుర్మీత్ బాబా తనకు నచ్చిన సాధ్వీలపై అత్యాచారాలు జరిపిన ‘గుఫా (గుహ)’కు మూడు ద్వారాలు ఉంటాయి. వాటిలో రెండు అందరూ వచ్చి వెళ్లడానికి వీలుగా ఉంటే.. మూడో గేటు బాలికల హాస్టల్లోకి తెరుచుకొని ఉంటుంది. అటువైపుగా వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఉండదు. బయట బాడీగార్డులున్నా.. ఆ గేటు దగ్గర మాత్రం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 దాకా మహిళా భక్తులే వంతుల వారీగా కాపలా కాసేవారు. | nation |
8,791 | 12-10-2017 19:55:36 | కాబోయే భార్య గురించి చెప్పమంటే.. వాటమ్మా రామ్? | 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరోసారి ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తోన్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీ ఆలపించిన 'వాటమ్మా.. వాట్ ఇజ్ దిస్సమ్మా' అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. శ్రీమణి రచించిన ఈ సాంగ్ రిలీజ్ తరువాత ఎవరి నోట విన్నా 'వాటమ్మా.. వాట్ ఇజ్ దిస్సమ్మా' అనే వినిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదేమో! అంత క్యాచీగా ఉన్నాయి లిరిక్స్. అయితే హీరో రామ్ తన ట్విట్టర్ పేజీలో దీనిపై ఓ సందేశం పంపించారు. ఇకపై నా పేరు మీద ట్యాగ్ చేసే అందరూ వాటమ్మా అనే ట్యాగ్ చేయండి. అలా చేస్తే భలే ఇంట్రస్టింగ్గా ఉంటుంది అంటూ కొంచెం సేపు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. అందులో ఓ అభిమాని వాటమ్మా అని ట్యాగ్ చేసి, నీవెప్పుడు సాంగ్ని పాడతావమ్మా అని ప్రశ్నిస్తే.. హా..హా.. ఎప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేవ్ అంటూ రామ్ రిప్లై ఇచ్చారు. మరో అభిమాని అన్నయ్యా.. మూవీ మీద నీవు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావని అర్ధమైపోయింది అన్నయ్యా అంటే.. కాన్ఫిడెన్స్ కన్నా సంతృప్తి.. అపారమైన సంతృప్తిని పొందుతున్నాను. రేపు మీరంతా కూడా ఇలానే ఈ సినిమాని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను... అంటూ రామ్ ఇచ్చిన రిప్తైకి ఆ అభిమాని ఎంతో సంతృప్తిని పొందినట్లుగా తిరిగి షేర్ చేసుకున్నాడు. మీకు కాబోయే భార్యలో మీరు చూసే అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఇంకా సింగిలేనమ్మా.. అంత డిటైల్డ్గా ఆలోచించలేదు.. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మాట్లాడాలిగా? కదా! అందుకే ఇంకా సింగల్ అనే అనుకుంటా! అంటూ రామ్ సమాధానం ఇచ్చారు. రామ్ నుండి ఇలా రిప్లై అందుకున్న అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవు. వెంటనే వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు కూడా. అదమ్మా మేటర్. | entertainment |
19,864 | 28-03-2017 05:07:34 | క్రికెట్కు టైట్ టాటా! |
మెల్బోర్న్: ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కెరీర్ ఆసాంతం గాయాలతో పోరాడిన టైట్ ఆటకు అర్ధంతరంగా టాటా చెప్పాడు. ప్రపంచ ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన 34 ఏళ్ల టైట్కు ఇటీవలే భారత పౌరసత్వం లభించింది. 2005లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేసిన టైట్ 15 ఏళ్ల కెరీర్లో ఆసీస్ తరఫున మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. 35 వన్డేలు, 21 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. | sports |
7,230 | 22-06-2017 13:32:11 | బాలయ్య కంటే ఎన్టీయారే ముందా? | స్వర్గీయ నందమూరి తారక రామారావు అధిరోహించని శిఖరాలు లేవు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ఎన్టీయార్. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే ఎన్టీయార్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య కంటే ముందుగానే సీనియార్ ఎన్టీయార్ పాత్రను పోషించబోతున్నాడట జూనియర్ ఎన్టీయార్. సావిత్రి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్రలో నటించమని జూనియర్ ఎన్టీయార్ను అడిగారట. అయితే ఎన్టీయార్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. నటనతోపాటూ రూపంలోనూ సీనియార్ ఎన్టీయార్కు దగ్గరగా ఉండే జూనియర్ ఎన్టీయార్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఓకే చెప్తే మాత్రం బాలయ్య కంటే ముందే సీనియర్ ఎన్టీయార్గా కనిపిస్తాడు జూనియర్ ఎన్టీయార్. | entertainment |
7,703 | 09-01-2017 21:31:05 | అలాంటి గుణం మా కుటుంబంలోనే లేదు : ఖైదీ నెంబర్ 150 | హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన తమ్ముడు నాగబాబు, రామ్గోపాల్ వర్మకు మధ్య జరిగిన ఎపిసోడ్పై ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఆ సమయంలో మాట్లాడుతూ.. అలాంటి గుణం తమ కుటుంబంలోనే లేదన్నారాయన. రామ్గోపాల్వర్మ గొప్ప వ్యక్తి అని, ఆయనతో నాకెందుకు గొడవలుంటాయన్నారు. మేం మంచి స్నేహితులుగానే ఉంటామమని స్పష్టం చేశారు చిరు. అంతేకాదు ఎప్పుడు ఎదురుపడినా మాట్లాడుకుంటామని కూడా చెప్పారాయన. వర్మతోనే కాదు, ఎవరితోనూ ఏ గొడవలూ ఉండవని, అలాంటి గుణం తమ కుటుంబంలోనే లేదని వర్మ విషయంలో తన స్పందన తెలియజేశారు చిరంజీవి. అయితే ఖైదీ నెం. 150 మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ తమపై వర్మ అనవసర వ్యాఖ్యలు చేయకుండా తనపని తాను చూసుకోవాలంటూ విరుచుకుపడ్డారు. అయింతే ఆ తర్వాత అందుకు దీటుగా వర్మ వరుస ట్వీట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. | entertainment |
10,868 | 29-09-2017 20:37:06 | 'స్పైడర్' 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ | సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'స్పైడర్' చిత్రం విజయ దశమి బరిలో దిగి విజయ ఢంకా మోగిస్తోంది. ఈ చిత్రం మొదటిరోజు వరల్డ్ వైడ్గా 51 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ అఫిషీయల్గా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. తాజాగా రెండో రోజు కలెక్షన్స్ని కూడా కలిపి 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అంటూ మరో పోస్టర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వారు రిలీజ్ చేసిన పోస్టర్లో వున్న లెక్కల ప్రకారం 'స్పైడర్' రెండు రోజులకు గానూ 72 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ లెక్కన రెండో రోజు 'స్పైడర్' కలెక్ట్ చేసిన మొత్తం 21 కోట్లు. ఇప్పుడు ఈ చిత్రానికి వీకెండ్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో 'స్పైడర్' 100 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయం. | entertainment |
11,464 | 13-03-2017 01:51:44 | ప్రధానికి కార్యకర్తల ఘన స్వాగతం | న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత మొదటి సారి బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొనడానికి కార్యాలయానికి వచ్చారు.ఈ సందర్భంగా వేలాది కార్యకర్తలు రోడ్డుకు ఇరు వైపుల నిలబడి హర్షధ్వనాలు మోగించారు. హర హర మోదీ... మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. | nation |
8,474 | 04-05-2017 16:06:14 | బాహుబలి చేస్తునన్ని రోజులూ ప్రభాస్కు ఆర్థిక కష్టాలు: రాజమౌళి | ఐదేళ్ల కష్టానికి ఫలితం ఊహించని రేంజ్లో దక్కింది. బాహుబలి-2లో భాగమైన నటీనటుల కెరీర్ను మలుపు తిప్పింది. రీజనల్ స్టార్లుగానే పేరున్న వారిని దేశవ్యాప్తం చేసింది. ముఖ్యంగా ప్రభాస్ హార్డ్వర్క్ను మెచ్చుకోవాలంటున్నారు. రానా అయినా.. బాహుబలితో పాటు.. మరో సినిమా చేశాడని, బాహుబలి-2 విడుదల కాకముందే అతడి ఘాజి సినిమా విడుదలైందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం ఆ టైంలో బాహుబలి మినహా వేరే ఏ సినిమాలూ ఒప్పుకోకుండా దానికే కమిట్ అవడం గ్రేట్ అని పొగిడేస్తున్నారు. అయితే.. ఆ సమయంలో ప్రభాస్ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యలో వెల్లడించాడు డైరెక్టర్ రాజమౌళి. బాహుబలిలో నటిస్తున్న సమయంలోనే ప్రభాస్కు అనేక ఆఫర్లు వచ్చాయట. కొందరు నిర్మాతలు ప్రభాస్కు చెక్కులు కూడా ఇచ్చారట. అయినా వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడట. ‘‘ప్రభాస్కు వరుసగా మూడు హిట్లున్నాయి. అలాంటి హీరో వెనక ఏ ప్రొడ్యూసర్ మాత్రం పడడు. అంతేకాదు.. కొందరు నిర్మాతలు చెక్కులతో వచ్చారు. అయినా ప్రభాస్ మాత్రం బాహుబలికే కమిట్ అయ్యాడు. నిర్మాతలెవరైనా చెక్కులిచ్చినా తీసుకోవద్దని, వారిని ఏమీ డిమాండ్ చేయొద్దని ప్రభాస్ తన మేనేజర్కు కూడా పక్కా ఆదేశాలు ఇచ్చాడు. అంతేకాదు.. ఆ టైంలో డబ్బు కోసం ప్రభాస్ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. నిర్మాతలు ఆఫర్లతో ప్రభాస్ ఇంటికి క్యూ కట్టారు. చెక్కులు, డబ్బుతో వచ్చి ఆఫర్లు ఇచ్చారు. దీంతో అతడు నాకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పమన్నాడు. పనితో సంబంధం లేకుండా ఇస్తున్న డబ్బు ఇది అని అఫిడవిట్ రాయించమన్నాను. అయితే దానికి అతడు తటపటాయించాడు. తర్వాత మళ్లీ వాళ్లు వచ్చి ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా ఇబ్బంది పెడితే ఎక్కడి నుంచి తేను అని అన్నాడు. అంతేకాదు.. రూ.10 కోట్ల విలువైన ఎండార్స్మెంట్ చేతికొచ్చినా తిరస్కరించాడు. అతడికి అబద్ధమాడడం తెలియదు. ఇతరుల సెంటిమెంట్ను హర్ట్ చేయడం అతడికి రాదు. ఇతరులు బాధ పడితే ప్రభాస్ చూడలేడు’’ అని రాజమౌళి అన్నాడు. | entertainment |
17,458 | 17-03-2017 18:37:02 | ఈవీఎంల ట్యాంపరింగ్పై మమత ఏమన్నారంటే..? | కోల్కతా : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశాలపై మొదలైన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈవీఎంల ట్యాంపరింగ్పై తొలుత అనుమానాలు వ్యక్తం చేయగా, ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దే వద్దని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్కు గల అవకాశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఈవీఎంలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడిన ఓ వీడియోను మమతా బెనర్జీ మీడియా ముందు శుక్రవారం ప్రదర్శించారు. ఎన్నికల కమిషన్ ఈవీఎంల వ్యవహారంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 'ప్రత్యేకించి నేను ఏమీ అనడం లేదు. సుబ్రహ్మణ స్వామి ఒక ప్రసంగంలో చేసిన మాటలు గురించే చెప్పదలచుకున్నాను' అని మీడియా సమావేశంలో ఆమె అన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ స్వామి చెప్పినట్టుగా ఉన్న ఓ వీడియోను ఆమె ప్రదర్శించారు. 'జపాన్లో ఈవీఎంలు తయారయినట్టు ఆయన (స్వామి) చెప్పారు. అయితే ఆ దేశం మాత్రం ఈవీఎంలు వాడేందుకు నిరాకరించినట్టు ఆయన మాట్లల్లో వినవచ్చు' అని మమత తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సందర్భాల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని, దర్యాప్తు జరపాలనే డిమాండ్లు వినిపించాయని ఆమె అన్నారు. | nation |
13,104 | 03-03-2017 02:34:22 | ఫ్రెంచ్ ఫ్రైస్లో బల్లి ఫ్రై | కోల్కతా మెక్డొనాల్డ్లో ఘటన కోల్కతా, మార్చి 2: కోల్కతాలో నివసించే ప్రియాంక తన కుమార్తెను తీసుకుని ఫాస్ట్పుడ్ తినడానికి మెక్డొనాల్డ్ ఔట్లెట్కు వెళ్లారు. ఫ్రెంచ్ ఫ్రై ఆర్డరిచ్చారు. ఇద్దరూ తింటున్న సమయంలో ఆమె కుమార్తె ఆహారంలో బాగా వేగిన బల్లిని గుర్తించింది. గర్భవతి అయిన ప్రియాంక.. ఆ బల్లిని చూడగానే తీవ్రఆందోళనకు గురయ్యారు. మేనేజర్కు చెబితే ఆయన సింపుల్గా సారీ చెప్పారు. దీంతో ఆమెకు కోపం నషాళానికంటింది. బల్లిని ఫోటో తీసి ఘటనపై, సిబ్బంది నిర్లక్ష్యంపై ఫుల్బగన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మెక్డొనాల్డ్ సంస్ధపై పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రియాంక భర ్త కూడా ఢిల్లీ, కోల్కతాలోని ఆ సంస్థ కార్యాలయాలను సంప్రదిస్తే సిబ్బంది కనీసం క్షమాపణ అయినా కోరకుండా బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై మెక్డొనాల్డ్ ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు | nation |
20,153 | 11-10-2017 02:01:09 | తేలేది భాగ్యనగరిలోనే.. |
రెండో టీ-20లో భారత్ చిత్తు చెలరేగిన బెరెండార్ఫ్ 8 వికెట్లతో ఆసీస్ విజయం 13న హైదరాబాద్లో చివరి మ్యాచ్8, 2, 0, 6 గువాహటిలో భారత టాప్-4 బ్యాట్స్మెన్ స్కోర్లు ఇవి..! కెరీర్లో రెండో టీ-20 ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ బెరెండార్ఫ్ (4-0-21-4) ధాటికి.. టీమిండియా ఎలా విలవిల్లాడిందో చెప్పేందుకు ఈ అంకెలే నిదర్శనం..! టన్నుల కొద్దీ పరుగులు బాదేసి... భీకరమైన ఫామ్లో ఉన్న రోహిత్, కోహ్లీ, ధవన్తో పాటు మనీష్ పాండే అతని దెబ్బకు బిత్తరపోయాడు..! కుర్ర స్పిన్నర్ ఆడమ్ జంపా (4-0-19-2) కూడా బంతిని గిరగిరా తిప్పేయడంతో గువాహటిలో కోహ్లీసేన కుప్పకూలింది..! వంద పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడింది..! చావోరేవో మ్యాచ్లో బౌలర్లు చెలరేగి ఆతిథ్య జట్టును కట్టడి చేసిన చోట.. హెన్రిక్స్, హెడ్ భారీ షాట్లతో విజృంభించడంతో రెండో టీ-20లో ఆసీస్ ఘన విజయం సాధించింది..! దాంతో, మూడు టీ-20ల సిరీస్ 1-1తో సమం చేసింది..! ఇక, సిరీస్ ఫలితం తేలేది భాగ్యనగరంలోనే..! గువాహటి: భారత్కు షాక్. ఆస్ట్రేలియాపై వరుసగా ఏడు టీ-20ల విజయ యాత్రకు బ్రేక్. గువాహటిలోనే సిరీస్ను పట్టేయాలని ఆశించిన కోహ్లీసేనకు భంగపాటు ఎదురైంది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో టీ-20లో ఆసీస్ ఎనిమిది వికెట్లతో భారత్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి 20 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. కేదార్ జాదవ్ (27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్తో 27), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 1 సిక్సర్తో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జట్టులో కేవలం నలుగురే రెండంకెల స్కోరు చేశారు. ఆడమ్ జంపా (2/19) కూడా భారత్ను దెబ్బకొట్టాడు. అనంతరం 119పరుగుల లక్ష్యాన్ని మోసీ హెన్రిక్స్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్), ట్రావిస్ హెడ్ (34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 48 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగడంతో ఆస్ట్రేలియా మరో 27 బంతులు మిగిలుండగానే రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా చేరుకుంది. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (2)ను బుమ్రా, ఆరోన్ ఫించ్ (8)ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో ఆతిథ్య జట్టులో ఆశలు రేగాయి. భువీ (3-0-9-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 5 ఓవర్లకు ఆసీస్ 25/2తో నిలిచింది. కానీ, అతని స్పెల్ ముగిశాక హెన్రిక్స్, హెడ్ భారీ షాట్లతో విజృంభించారు. మూడో వికెట్కు అజేయంగా 115 జోడించి ఆసీస్ను గెలిపించారు. బెరెండార్ఫ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈనెల 13న హైదరాబాద్లో చివరి మ్యాచ్ జరగనుంది. బెరెండార్ఫ్ దెబ్బకు బెంబేలుఅంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ను ఆసీస్ పేసర్ జాసన్ బెరెండార్ఫ్ బెంబేలెత్తించాడు. రాంచీలో టీ-20లో అరంగేట్రం చేసిన ఈ 27 ఏళ్ల పేసర్ నిప్పులు చెరిగే బౌలింగ్తో రెచ్చిపోయాడు. బంతిని రెండు వైపుల స్వింగ్ చేసిన అతను.. ఆతిథ్య టాపార్డర్ను కకావికలు చేసేశాడు. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0)ను అవుట్ చేసి భారత్కు షాకిచ్చిన జాసన్.. శిఖర్ ధవన్ (2), మనీష్ పాండే (6)ను కూడా బుట్టలో వేసుకున్నాడు. దాంతో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. కేదార్, హార్దిక్ పోరాడకుంటే స్కోరు వంద కూడా దాటేది కాదు. వాస్తవానికి అంతర్జాతీయ మ్యాచ్కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన వేదికపై.. ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో బెరెండార్ఫ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ మెరుపు ఆరంభమే ఇచ్చాడు. భారత బ్యాట్స్మెన్ అంతా ఫామ్లో ఉండడంతో అభిమానులు భారీ స్కోరును ఆశించారు. కానీ, ఆ ఆశలను ఆదిలోనే చిదిమేశాడు బెరెండార్ఫ్. తర్వాతి బంతికే అద్భుతమైన ఇన్స్వింగర్తో రోహిత్ను ఎల్బీ చేసిన ఆసీస్ పేసర్.. రెండు బంతుల అనంతరం కోహ్లీని రిటర్న్ క్యాచ్తో వెనక్కిపంపడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. తన తర్వాతి ఓవర్లోనే బెరెండార్ఫ్ మరో స్వింగ్ బాల్తో మనీష్ పాండేను కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కిపంపాడు. ఆపై అతని బౌలింగ్లోనే డేవిడ్ వార్నర్ పట్టిన అద్భుత క్యాచ్కు ధవన్ కూడా అవుటవడంతో భారత శిబిరంలో నిస్తేజం ఆవహించింది. ఈ దశలో కేదార్, ధోనీ (13) ఐదో వికెట్కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఆసీస్ వదిలితే కదా! ఈ సారి స్పిన్నర్ ఆడమ్ జంపా ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో ధోనీ, కేదార్ను అవుట్ చేయడంతో కోహ్లీసేన 70/7తో బిత్తరచూపులు చూసింది. కుల్దీప్ యాదవ్ (16) సాయంతో హార్దిక్ పాండ్యా ఒక్కో పరుగు చేర్చసాగాడు. ఆండ్రూ టై బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్తో ఆకట్టుకున్నాడు. స్కోరు 100 దాటించిన తర్వాత అతను అవుటయ్యాడు. చివరి మూడు ఓవర్లలో 17 పరుగులు చేసిన భారత్ ఆఖరి బంతికి ఆలౌటైంది. స్కోరుబోర్డుభారత్: రోహిత్ (ఎల్బీ) బెరెండార్ఫ్ 8, ధవన్ (సి) వార్నర్ (బి) బెరెండార్ఫ్ 2, కోహ్లీ (సి అండ్ బి) బెరెండార్ఫ్ 0, మనీష్ (సి) పెయిన్ (బి) బెరెండార్ఫ్ 6, కేదార్ (బి) జంపా 27, ధోనీ (స్టంప్డ్) పెయిన్ (బి) జంపా 13, హార్దిక్ (సి) సబ్/క్రిస్టియన్ (బి) స్టొయినిస్ 25, భువనేశ్వర్ (సి) హెన్రిక్స్ (బి) కల్టర్నైల్ 1, కుల్దీప్ (సి) పెయిన్ (బి) ఆండ్రూ టై 16, బుమ్రా (రనౌట్) 7, చాహల్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 118 ఆలౌట్; వికెట్ల పతనం: 1-8, 2-8, 3-16, 4-27, 5-60, 6-67, 7-70, 8-103, 9-115; బౌలింగ్: బెరెండార్ఫ్ 4-0-21-4, కల్టర్నైల్ 4-0-23-1, జంపా 4-0-19-2, టై 4-0-30-1, స్టొయినిస్ 4-0-20-1. ఆస్ట్రేలియా: ఫించ్ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ 8, వార్నర్ (సి) కోహ్లీ (బి) బుమ్రా 2, హెన్రిక్స్ (నాటౌట్) 62, హెడ్ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు: 2; మొత్తం: 15.3 ఓవర్లలో 122/2; వికెట్ల పతనం: 1-11, 2-13; బౌలింగ్: భువనేశ్వర్ 3-0-9-1, బుమ్రా 3-0-25-1, హార్దిక్ 2-0-13-0, కుల్దీప్ 4-0-46-0, చాహల్ 3.3-0-29-0. | sports |
6,565 | 19-12-2017 07:25:23 | ‘అరుంధతి’ విలన్కు ఆ అవార్డు ఎందుకిచ్చారంటే... | ‘అభినేత్రి’, ‘ఆగడు’, ‘భాయ్’, ‘జులాయ్’, ‘అరుంధతి’ తదితర సినిమాల్లో నటించిన సోనూసూద్ ‘పంజాబ్ రత్న’ అవార్డు అందుకున్నారు. 1971లో హింద్- పాక్ యుద్ధంలో విజయానికి గుర్తుగా పంజాబ్ ప్రభుత్వం సరిహద్దుల్లో విజయ్ దివస్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సోనూసూద్కు పంజాబ్ రత్న అవార్డును అందించారు. ఈ అవార్డును అందుకునేందుకు ఆయన పంజాబ్లోని మోగ్ పట్టణంలోగల తన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర తరువాత తనకు పంజాబ్ రత్న అవార్డు వచ్చిందని ఆనందంగా తెలిపారు. జెపీ దత్త ‘పల్టూన్’ సినిమాలో.. ఆర్మీ ఆఫీసర్ కావాలన్న తన కలను నెరవేర్చారర్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వస్తారా? అని ఆయనను అడిగినపుడు భవిష్యత్లో అడుగుపెట్టే అవకాశాలున్నాయన్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో సోనూసూద్ మొత్తం 80 సినిమాలు చేశారు. | entertainment |
485 | 09-02-2017 00:16:11 | రెండు రోజులు బిఎస్ఎన్ఎల్ మెగా మేళా |
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) మెగా మేళాను నిర్వహించనుంది. ఈ సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా సిమ్ కార్డులను పొందవచ్చు. కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్రాంచైజీలు/రిటైల్ ఔట్లెట్లు, రోడ్ షోల ద్వారా ఈ సిమ్లను కస్టమర్లు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. సంస్థ సిబ్బంది నిర్వహించే మేళాల్లో లాండ్లైన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను కూడా బుక్ చేసుకోవచ్చని బిఎ్సఎన్ఎల్ తెలంగాణ టెలికాం సర్కిల్ సిజిఎం ఎల్ అనంతరామ్ తెలిపారు. | business |
291 | 09-11-2017 00:49:02 | రూ.750 కోట్ల టర్నోవర్పై నటరాజ్ ఆగ్రో దృష్టి | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే ఏడాదిలో రూ.750 కోట్ల టర్నోవర్ను సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు నటరాజ్ ఆగ్రో ఇండియా చైర్మన్ శ్యామ్ సుందర్ లోయ తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉందని చెప్పారు. 75 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నంలో రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నామని, ఇది వచ్చే ఏడాది ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రైస్బ్రాన్, రిఫైన్డ్ సన్ఫ్లవర్, మస్టర్డ్, రిఫైన్డ్ సోయాబీన్, డబుల్ ఫిల్టర్ గ్రౌండ్నట్ వంట నూనెలను ఎపి, తెలంగాణ సహా వివిధ రాష్ర్టాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. రానున్నకాలంలో దేశవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కంపెనీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. | business |
1,459 | 07-04-2017 23:54:39 | 2020నాటికి 25,000 కోట్ల డాలర్లు | న్యూఢిల్లీ : భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2020నాటికి 25,000 కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని బిసిజి- టై నివేదిక చెబుతోంది. ఆన్లైన్ వినియోగదారుల సంఖ్యలో జోరుగా పెరుగుదల, డేటా వినియోగంలో వృద్ధి వంటి అంశాలే ఇందుకు ప్రధానంగా దోహదపడనున్నట్టు పేర్కొంది. ఇప్పటికైతే ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ దేశ జిడిపిలో 5 శాతం (10,000-13,000 కోట్ల డాలర్లు)గా ఉందని, 2020నాటికి ఇది 7.5 శాతానికి (21,500 కోట్ల డాలర్లు-26,500 కోట్ల డాలర్లు) చేరుకోనుందని పేర్కొంది. ఈ వృద్ధిలో ఇ-కామర్స్, ఫైనాన్షియల్ సర్వీసులు కీలక పాత్ర పోషించనున్నట్టు పేర్కొంది. ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థలో ఇ-కామర్స్, ఫైనాన్షియల్ సర్వీసుల వాటా 4,000-5,000 కోట్ల డాలర్లు, ఇ-కామర్స్ ఉత్పత్తులు 4,500-5,000 కోట్ల డాలర్లు, డిజిటల్ మీడియా, అడ్వర్టైజింగ్ 500-800 కోట్ల డాలర్లుగా ఉంటుందని తెలిపింది. ఇందులో అధిక మొత్తం ప్రైవేటు, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలు (5000-6000 కోట్ల డాలర్లు), ఆన్ కనెక్టివిటీ (4,500-5,500 కోట్ల డాలర్లు), డివైజెస్ (3000-4000 కోట్ల డాలర్లు) ద్వారా రానున్నట్టు పేర్కొంది. దేశంలో 39.1 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. ఈ విషయంలో భారత ప్రపంచంలో రెండో దేశంగా ఉంది. 2020నాటికి మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 65 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. | business |
12,614 | 19-08-2017 00:55:23 | మిషన్ 350 సీట్లు | మోదీ-షా సంకల్పమిది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లకు బీజేపీ టార్గెట్కేంద్ర మంత్రులు సహా 30 మంది సీనియర్లతో భేటీపార్టీని కొత్త ప్రాంతాలకు విస్తరించాలని దిశానిర్దేశంతమిళనాడు, కేరళ, బెంగాల్, కర్ణాటకలపై కన్నువాటిలో 150 అదనపు స్థానాలే బీజేపీ టార్గెట్ఉత్తరాదిలో మళ్లీ విజయానికి నిశ్శబ్దంగా పావులుఒక్కో మంత్రికి ఐదు లోక్సభ స్థానాల బాధ్యతన్యూఢిల్లీ, ఆగస్టు 18: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువుంది. కానీ, ఢిల్లీలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ‘టార్గెట్ మోదీ, షా’ అంటూ 16 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైతే, ఈసారి మనది ‘మిషన్ 350+’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంకల్పం చెప్పుకొన్నారు. ఏడుగురు కేంద్ర మంత్రులు సహా 30 మంది పార్టీ సీనియర్లతో ఇటీవల ఢిల్లీలో మేధోమథనం జరిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఏమి చేయాలని చర్చించారు. పార్టీ ఓటరు బేస్ను విస్తరించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నిజానికి, గత సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా ‘మిషన్ 272’ అంటూ సంకల్పం చెప్పుకొన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 282 సీట్లను సాధించింది. ఈసారి దానికి అదనంగా మరో 70 సీట్లను చేజిక్కించుకోవాలని షా నిర్ణయించారు. న్యూఢిల్లీ, ఆగస్టు 18: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువుంది. కానీ, ఢిల్లీలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ‘టార్గెట్ మోదీ, షా’ అంటూ 16 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైతే, ఈసారి మనది ‘మిషన్ 350+’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంకల్పం చెప్పుకొన్నారు. ఏడుగురు కేంద్ర మంత్రులు సహా 30 మంది పార్టీ సీనియర్లతో ఇటీవల ఢిల్లీలో మేధోమథనం జరిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఏమి చేయాలని చర్చించారు. పార్టీ ఓటరు బేస్ను విస్తరించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నిజానికి, గత సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా ‘మిషన్ 272’ అంటూ సంకల్పం చెప్పుకొన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 282 సీట్లను సాధించింది. ఈసారి దానికి అదనంగా మరో 70 సీట్లను చేజిక్కించుకోవాలని షా నిర్ణయించారు. దక్షిణాదిపైనే షా కన్నుఉత్తరాదిలో సంతృప్త స్థాయికి చేరుకున్నామని మోదీషా భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. వాటిలో గత సార్వత్రిక ఎన్నికల్లో 73 సీట్లను బీజేపీ సాధించింది. వచ్చే ఎన్నికల్లో అంతకు మించి సాధించే అవకాశాలు ఉండవని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కూడా బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, షా ఈసారి దక్షిణాదిపై గురి పెట్టారు. పార్టీని కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించాలని ఆ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిసా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో 150 అదనపు సీట్లపై ఈసారి గురి పెట్టాలని వివరించారు. రెండు దిగ్గజ ప్రాంతీయ పార్టీల తమిళనాడు కోటలోకి బీజేపీ అడుగు పెట్టడం అసాధ్యమని అంతా భావించారు. కానీ, ప్రధాని మోదీ స్వయంగా అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించారు. ఇప్పుడు అన్నాడీఎంకే రెండు వర్గాలూ ఏకమయ్యేలా పావులు కదిపారు. ఈ మొత్తం పరిణామాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలనేది అమిత్ షా అంతిమ వ్యూహం. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్ నిన్న మొన్నటి వరకూ వామపక్ష కంచుకోటలు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కంచుకోటగా మారింది. కానీ, ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండాను రెపరెపలాడించాలని అమిత్ షా కంకణం కట్టుకున్నారు. నిజానికి, గత సార్వత్రిక ఎన్నికల వరకూ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి కనీసం నిలువ నీడ కూడా లేదు. కానీ, పట్టువిడుపుల్లేని మోదీషా ప్రయత్నాలతో అక్కడ కమలం వికసిస్తోంది. నిన్న మొన్నటి వరకూ అక్కడ సోదిలోకి కూడా లేని బీజేపీ ఆరు వార్డులను సొంతం చేసుకుంది. ఇక, కేరళ అనగానే, కాంగ్రెస్, వామపక్షాల కంచుకోట. ఆరెస్సెస్ సహకారంతో అక్కడ కూడా ఇప్పుడే బీజేపీ విస్తరిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ తమ కమ్యూనల్ ఎజెండానే ప్రయోగించాలని బీజేపీ నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. ఉత్తరాదిపై పూర్తి నిఘాదేశవ్యాప్తంగా దాదాపు కాంగ్రెస్ పార్టీని బీజేపీ తుడిచి పెట్టేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొంత అసంతృప్తి ఉంది. మధ్యప్రదేశ్లో ఇటీవల రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన మాండసర్ జిల్లాలో ఇటీవల ఉప ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో, మధ్యప్రదేశ్పై షా ప్రత్యేకంగా దృష్టిసారించారు. రాజస్థాన్, హరియాణా బీజేపీ ‘సుపరిపాలన’కు నిదర్శనాలుగా ఇప్పుడు లేవు. మహారాష్ట్రలోనూ రైతుల అసంతృప్తిని చల్లార్చడంలో ముఖ్యమంత్రి ఫడణవీస్ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను అడ్డు పెట్టుకుని అమిత్ షా పరిస్థితిని చక్కదిద్దుతున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కాగా కేంద్రంలోని ఒక్కో మంత్రికి 5 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను అమిత్ షా అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. | nation |
20,683 | 05-05-2017 01:42:30 | అదరగొట్టిన గాబ్రియెల్ |
పాక్పై 106 రన్స్తో విండీస్ విక్టరీ బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): గాబ్రియెల్ (5/11), హోల్డర్ (3/23) విజృంభించడంతో పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. విండీస్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనలో.. మ్యాచ్కు చివరి రోజు పాక్ రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అజర్ అలీ (10)ను త్వరగా పెలియన్ చేర్చిన గాబ్రియెల్.. పాక్ పతనాన్ని శాసించాడు. విండీస్ బౌలర్ల ధాటికి పర్యాటక బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 268 రన్స్ చేసింది. పాక్ మొదటి ఇన్నింగ్స్లో 393 పరుగులు చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో టెస్ట్ మంగళవారం నుంచి జరగనుంది. | sports |
6,549 | 26-08-2017 10:19:17 | నాగార్జున 'రాజుగారి గది-2' టైటిల్ లోగో రిలీజ్ | గతంలో ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన రాజుగారి గది మూవీ హర్రర్.. కామెడి కలబోతతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే మళ్లీ అదే టైటిల్తో నాగార్జున ప్రధాన పాత్రలో మరో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ మెయిన్ రోల్స్ నటిస్తున్నారు. మొదట వచ్చిన రాజుగారి గది మూవీకి సీక్వెల్ కాదు కానీ.. టైటిల్ మాత్రం అదే. వినాయకచవితి సందర్భంగా రాజుగారి గది-2 టైటిల్ లోగోను ఆవిష్కరించారు. సింపుల్గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది టైటిల్ లోగో. ఫస్ట్లుక్ పోస్టర్ను ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. | entertainment |
13,766 | 21-12-2017 01:00:27 | కేంద్ర కార్యాలయాల్లో 4.12 లక్షల ఖాళీలు | న్యూఢిల్లీ, డిసెంబరు 20: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 36.34లక్షల పోస్టుల్లో 4,12,752 ఖాళీలున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్సభకు తెలిపారు. భారతీయ రైల్వేల్లోని భద్రతా విభాగాల్లో 1,28,942 ఖాళీలున్నాయని రైల్వే శాఖ సహాయమంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. కేంద్ర సర్వీసుల్లో 1,051 ఐఏఎస్ లకు 493 మందే ఉన్నారని, రాష్ట్రాలు మరికొందరిని డిప్యుటేషన్పై పంపాలని కేంద్రప్రభుత్వం కోరింది. | nation |
13,664 | 12-08-2017 04:00:35 | చిన్నారి ఊపిరిని అడ్డగించిన బెలూన్ | ఆడుకుంటూ బెలూన్ను నోట్లో పెట్టుకున్న 8 నెలల బాలుడుగొంతులోకి జారి శ్వాస ఆడక ప్రాణాలు విడిచిన పసిగుడ్డునాశిక్, ఆగస్టు 11: పుట్టిన రోజు వేడుకలు.. రిటైర్మెంట్ ఫంక్షన్లు.. ఇతర శుభకార్యాల్లో స్టేజీ అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు బెలూన్లను అలంకరిస్తుంటారు. ఇక, అక్కడికి వచ్చే చిన్నారులు ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఆ బెలూన్లను తీసుకుని చేసే హంగామా అంతాఇంతా కాదు. కానీ, చిన్నారులు ఆటలాడుకునే ఆ బెలూనే ప్రాణం మీదకు తెస్తే.. ఊపిరిని గొంతు మధ్యలోనే ఆపేస్తే.. ముక్కుపచ్చలారని ఓ 8 నెలల చిన్నారి ఊపిరి అలాగే ఆగిపోయింది. గొంతులో అడ్డుపడిన బెలూన్ చిన్నారి ఊపిరిని గొంతు దాటనీయకుండా చేసింది. నేలమీద ముద్దుముద్దుగా పాకుతూ ఆడుకుంటూ కంటికి కనిపించిన బెలూన్ను తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు ఆ పసిగుడ్డు. అది గొంతులోకి జారిపోయి చిన్నారి ఊపిరిని తీసేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాశిక్ హనుమాన్ నగర్ ప్రాంతంలో గురువారం సంభవించింది. ఘటనకు సంబంధించిన వివరాలను అంబద్ పోలీసులు వెల్లడించారు. చిన్నారి ఆడుకుంటూ కిందపడిపోయిన బెలూన్ను తీసుకుని నోట్లో పెట్టుకోవడంతో గొంతులోకి జారిపోయిందని, వెంటనే ఆ చిన్నారిని తండ్రి స్థానికంగాగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడని తెలిపారు. అక్కడి వైద్యులు పెద్దాసుపత్రికి రిఫర్ చేయడంతో, అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు చనిపోయాడని నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బాలుడి తండ్రి ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ నుంచి నాశిక్కు వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. | nation |
3,957 | 05-09-2017 04:21:30 | తెలంగాణ యాంటీ ట్రెండ్ | ముఖ్యమంత్రిదేమో రాత్రికిరాత్రి వ్యవస్థను సమూలంగా మార్చాలన్న ఉరుకులాట! ఆలోచించే సీఎంకు, ఆలోచించడం ఆగిపోయిన ప్రభుత్వ సిబ్బందికి మధ్య పొసగకపోవడమే సమస్య. అందువల్లే పథకాల అమల్లో లోపాలు. సంధి సమయంలో ఇది సహజమే కావచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దీటుగా పనిచేయించడమే దీనికి పరిష్కారం. ఇందులో ప్రభుత్వానిది ఎంత బాధ్యతో, పౌర చైతన్యమూ అంతే కీలకం. ‘‘అయ్యా.. నా బిడ్డ ప్రసూతికి ఉంది. సిద్దిపేట సర్కారు దవాఖానలో ఎవరికన్న చెప్పవా? తీస్కపోత’’ ఇది మొన్న ఊరికి పోయినప్పడు చాకలి సత్తెవ్వ అడిగిన మాట. ‘‘సర్కారు దవాఖానకే ఎందుకు? ప్రైవేటు హాస్పిటల్లో చెబుతాలే’’ అని నేనంటే. ‘‘వద్దయ్యా. ఆడైతే పైసల కోసం ఊకెనే కడుపు కోస్తరు. సర్కారు దవాఖాన మంచిగుందట. అక్కరుంటేనే పెద్దాపరేషన్ చేస్తన్నరట. కర్సు కూడా ఉండదు’’ ఇది సత్తెవ్వ జవాబు. సిద్దిపేటలో దశాబ్దాలుగా ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో సగటున రోజుకు 3-4 చొప్పున, నెలకు 90–120 దాకా సిజేరియన్లు జరిగేవి. ఇప్పుడా సంఖ్య 30 లోపుకు పడిపోయింది. దీంతో హాస్పిటల్ నిర్వహణే కష్టమవుతోందని డాక్టర్ దంపతులు వాపోయారు. ‘‘అరేయ్.. నా కొడుక్కు హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూడరా?’’ కరీంనగర్లో ఉండే నా మిత్రుడు, దాదాపు 100 మంది స్టాఫ్కు ఉపాధినిచ్చే పెద్ద ప్రైవేటు స్కూలు యజమాని, మా ఇంటిదాకా వచ్చి అడిగిన మాట. ఇంత పెద్ద స్కూలున్న నీ కొడుక్కు ఉద్యోగం ఎందుకంటే... ‘‘పిల్లలంతా గురుకులాలకు పోతున్నారు. ఇంకో నాలుగేళ్లైతే స్కూలు నడుస్తుందో లేదో!’’ అంటూ రంధితో బదులిచ్చాడు నా మిత్రుడు! దాదాపు 1400 మంది విద్యార్థులతో, ప్రతి ఏటా సంఖ్య పెరిగే ఆ బడిలో, తొలిసారి ఈ ఏడాది స్ర్టెంత్ ఒకేదఫా మూడు వందలు తగ్గిందట! చడీచప్పుడు లేకుండా, చాపకింద నీరులా జరుగుతున్న మార్పులకు చిన్న ఉదాహరణలివి. తెలంగాణలో ఇప్పుడు ‘భవిష్యత్తును అంచనా వేయలేని’ మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ప్రపంచమంతా ప్రైవేటీకరణ, పట్టణీకరణ దిశగా సాగుతుంటే, మూడేళ్ల క్రితం పుట్టిన రాష్ట్రం మాత్రం, అందుకు విరుద్ధ దిశలో ప్రభుత్వీకరణ, గ్రామీణీకరణవైపు ప్రయాణిస్తోంది! ప్రత్యామ్నాయ విధాన ఆవిష్కరణకు తెలంగాణ ఇప్పుడొక ప్రయోగశాలగా మారుతోందా అనిపిస్తోంది. సర్కారీ నియంత్రణను తగ్గించడం, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, మనిషి బతుకును మార్కెట్కు వదిలేయడం అనేవి ఆర్థిక సంస్కరణల ప్రధాన ఎజెండా. దీనివల్ల కొన్ని సౌకర్యాలు సమకూరినా, ఎన్నో అవకరాలూ వచ్చాయి. సజీవమైన పల్లెకు బదులు, పరాన్నభుక్కు అయిన పట్టణం జీవన కేంద్రంగా మారింది. తల్లిలాంటి పల్లె నుంచి ప్రియురాలిలాంటి పట్నానికి వలసలు పెరిగాయి. చెక్ లేని ప్రైవేటు రంగంతో మన బతుకు బ్యాలెన్స్ తప్పింది. ‘మనం ఎన్నుకునే, మన సంక్షేమ ప్రభుత్వం’తో సంబంధాలు తెగిపోయి, మార్కెట్తో, మనీతో తప్ప మనతో ఏ అనుబంధమూ లేని, ఎవరికీ జవాబుదారీ కాని ప్రైవేటు రంగంతో అనివార్యమైన, అవాంఛనీయ బంధం ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రైవేటులో జవాబుదారీతనం తెచ్చి, పల్లెను ఆదరించి, పట్నానికి దీటుగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరంగా కనిపిస్తోంది. విద్యావ్యవస్థ మొత్తం ప్రైవేటు బడులు, కార్పొరేట్ కాలేజీల చేతుల్లోకి వెళ్లిపోయి, ఫీజుల్ని, పరీక్షల్ని, ర్యాంకుల్ని, చివరికి పేపర్ లీకేజీలను సైతం అవే నిర్ణయించే కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వాటిలో కొంత పోటీతత్వం, జవాబుదారీతనం వచ్చాయి. పాఠశాల రంగంలో ప్రభుత్వ రంగంలో వస్తున్న వందలాది గురుకుల బడులు ప్రైవేటు స్కూళ్ల ఏకపక్ష ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులకు ఒక ‘చాయిస్’ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల్ని తగ్గించడమే కాదు; బడి బాటలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. వైద్య విలువలకన్నా డబ్బే ప్రధానమనుకున్న ప్రైవేటు ఆస్పత్రుల వల్ల, అపెండిసైటిస్, సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంత ప్రభుత్వ దవాఖానాల నవీకరణ, మాతా శిశువులకు ఆరోగ్య కిట్లు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. అడ్డగోలు కొనుగోలు ఒప్పందాలను పక్కనబెట్టి ఇప్పుడు ప్రభుత్వమే సొంతంగా విద్యుత్కేంద్రాలను నిర్మించుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒకప్పుడు కాంట్రాక్టర్లు చెప్పినట్టు ఆడి, మొబిలైజేషన్ అడ్వాన్సులు పంచిపెట్టారు. ఇప్పుడు ఈపీసీని ఎత్తివేయడమే కాదు; పదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణదారులకే అప్పగించి జవాబుదారీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ విధానం పూర్తిగా రద్దైతే, ఏజెన్సీల దోపిడీ ఆగే అవకాశం ఉంది. పల్లెవైపు చూస్తే... ఈ రోజు ఏ పల్లెలోనైనా తొండలు గుడ్లు పెట్టని భూమి కూడా ఎకరా ఆరు లక్షలకు తక్కువ లేదు. అత్యధిక పరిహారం ఆశచూపినా భూమిని వదులుకోవడానికి రైతులు సిద్ధపడకపోవడానికి.. భూమిపై ప్రేమ ఒక కారణమైతే, వ్యవసాయం ఆశాజనకంగా మారడం మరో కారణం. 60 శాతం మంది ఆధారపడిన సాగు మెరుగుపడితే అంతకు మించి కావాల్సింది ఏముంది? చేతివృత్తిదార్లను ప్రోత్సహించే చర్యల వల్ల వలసలు తగ్గుముఖం పట్టడమే కాదు; స్వయం ఉపాధి మెరుగుపడుతుంది. రైతులు తమ దిగుబడులను షావుకార్లకు అమ్మే పరిస్థితి పోయి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారు. యూనిఫారాలు, బతుకమ్మ చీరల వంటివాటితో సిరిసిల్ల చేనేత కార్మికుడి కడుపు నిండుతూనే, టెయిలర్లకు ఉపాధి దొరుకుతోంది. గ్రామీణ రోడ్ల మెరుగుదల వల్ల, సమీప పట్టణాలతో కనెక్టివిటీ పెరిగి పల్లె నిలుస్తూనే, పట్టణంతో కలుస్తున్నది. ఒకప్పుడు ఊర్లలో వాగులో చెలమలు తోడి మంచినీళ్లు తీసుకునేవారు. 30 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. తాగే నీళ్లు కూడా కొనుక్కోవాల్సి రావడం! స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత, ఒక రాష్ట్రంలో, ప్రతి ఇంటికీ మంచి నీరు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడమే గొప్ప విషయం కదా! అది తెలంగాణలో జరుగుతోంది. అయితే ఇక్కడే రెండు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... ప్రైవేటు రంగంలో అవలక్షణాలున్నప్పటికీ, ప్రభుత్వ రంగం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా అది ఉపాధి కల్పిస్తున్నది. ఇది కాదనలేని వాస్తవం. బడా కార్పొరేట్ సంస్థల్ని పక్కనబెడితే, తెలంగాణ యువకులే నడుపుకుంటున్న స్కూళ్లు, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. అవి మూతబడితే, వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది పరిస్థితి ఏమిటి? ప్రైవేటు ఆస్పత్రుల విషయమూ ఇంతే! అయితే కాలానుగుణంగా మారగలిగినవాడే మనుగడ సాగిస్తాడన్నది దీనికి జవాబు. చెత్తపోయి సత్తా ఉన్నవే మిగులుతాయి. ఇంజనీరింగ్ కాలేజీలే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం చేసిన కట్టడి కారణంగా ఇప్పుడు ప్రమాణాలు కొంత మెరుగుపడ్డాయి. నాసిరకం కాలేజీలు మూతపడుతున్నాయి. ఒక్కడే పది కాలేజీల్లో చదువు చెప్పినట్టు చూపించడాన్ని అడ్డుకోవడంతో, మరో పది మందికి ఉద్యోగాలు, మంచి వేతనాలు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. కొందరికి సమస్యలూ తప్పవు. రెండో కీలకాంశం. ప్రభుత్వీకరణ, పల్లెల బాగు చర్యలు క్షేత్ర స్థాయిలో అనుకున్నట్టుగా అమలవుతున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులనే తీసుకుంటే, రోగుల రాక పెరగడం ఎంత వాస్తవమో, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా జనం అవస్థలూ అంతే వాస్తవం. ప్రసవాల్లో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల లేమి వెక్కిరిస్తోంది. గురుకుల పాఠశాలలపై ప్రకటనలు ఉన్నంత అద్భుతంగా, నిర్వహణ లేదు. గొర్రెల పథకం ఆశించినంతగా సఫలం కానట్టు కనిపిస్తోంది. కిందిస్థాయి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి తగ్గలేదు. అలుగునూరు ఆత్మాహుతే ఇందుకు నిదర్శనం. వీటికి ప్రధాన కారణం నిధుల లేమితో పాటు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం. ఒక ఐపీఎస్ అధికారి అన్నట్టు.. ముఖ్యమంత్రి ఐదేళ్లుండి పోయేవాడు. తాము 35 ఏళ్లు ఉండేవాళ్లం! అదీ ధీమా! ముఖ్యమంత్రిలో ఆల్టర్నేట్ కోషంట్ (ప్రత్యామ్నాయాన్ని పరిశోధించే- ఏక్యూ) ఎక్కువ. ప్రభుత్వ వ్యవస్థ సహజంగా స్టేటస్కోయిస్టు (యథాతథవాది)! మారకుండా ఉండడానికి యంత్రాంగం మొరాయిస్తుంది. ముఖ్యమంత్రిదేమో రాత్రికిరాత్రి వ్యవస్థను సమూలంగా మార్చాలన్న ఉరుకులాట! ఆలోచించే సీఎంకు, ఆలోచించడం ఆగిపోయిన ప్రభుత్వ సిబ్బందికి మధ్య పొసగకపోవడమే సమస్య. అందువల్లే పథకాల అమల్లో లోపాలు. సంధి సమయంలో ఇది సహజమే కావచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దీటుగా పనిచేయించడమే దీనికి పరిష్కారం. ఇందులో ప్రభుత్వానిది ఎంత బాధ్యతో, పౌర చైతన్యమూ అంతే కీలకం. పాలకుల సృజనాత్మకత, ఉద్యోగుల బాధ్యత మధ్య తేడాకు ఈ దృష్టాంతం చదవండి. సరిగ్గా వారం క్రితం, గత మంగళవారం, రాత్రి బేగంపేట ఫ్లైఓవర్పై కారు ఢీకొని ఒక కుక్క చనిపోయింది. కానీ మూడు రోజుల పాటు ఆ కుక్క కళేబరాన్ని తీసిన వారు లేరు. ఒక పుణ్యాత్ముడు దాన్ని పక్కకు జరిపి, ప్లాస్టిక్ డివైడర్లు అడ్డుపెట్టి పోయాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది మొదలుకుని ఐఏఎస్ల దాకా రోజూ వందలాది అధికారులు ఆ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తుంటారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్- గౌరారం మధ్యలో ఒకచోట, సమీప గ్రామాల రైతులంతా, తాము పండించి కూరగాయలు అమ్ముకుంటుంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. అయితే హైవే పక్కనే కావడంతో, వాహనాలు మీదికి దూసుకొచ్చి ప్రమాదాలు జరిగేవి. ఎండా వానా సరేసరి. తరచూ ఆ రోడ్డుపై ప్రయాణించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి ఇది వచ్చింది. ఆ రైతుల కోసం అక్కడే మార్కెట్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హరీశ్రావు, పక్కనే ఉన్న భూమి యజమానితో మాట్లాడి, దాదాపు ఎకరం జాగా కొన్నారు. 120 మంది తమ ఉత్పత్తులు అమ్ముకునేలా, మడిగెలతో మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు అప్పగించారు. హైవే మీద ప్రయాణించేవారికి ఇప్పుడది తాజా కూరగాయలు దొరికే పెద్ద మార్కెట్. రోజుకు వెయ్యి రెండు వేల మందిదాకా వస్తున్నారు. కార్లకోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్థలం, రైతులు, వినియోగదార్ల కోసం చిన్న టిఫిన్ సెంటర్, పిల్లల ఆట సామగ్రి! ఆ మడిగెల్లోని రైతులకు ఇప్పుడు ఎంత సంతోషమో! పదేళ్ల నుంచీ వాళ్లక్కడ కూరగాయలు అమ్ముతున్నా, వందలాది అధికారులు ఆ రోడ్డు మీద వెళ్లినా ఎవరికీ ఈ ఆలోచన రాలేదు. బాధ్యత బరువేం కాదు; ఇష్టపడితే! క్రియేటివిటీ సింపుల్గానే ఉంటుంది; ఆలోచించగలిగితే! పాలకులకే కాదు; ప్రభుత్వ సిబ్బందీ దీన్ని ఫీలయినప్పుడే ఫలితం. ప్రభుత్వ వ్యవస్థల్ని కాపాడుకుంటేనే కదా, ప్రభుత్వానికైనా, ప్రభుత్వ ఉద్యోగులకైనా రెలెవెన్స్ ఉండేది!! ఏటికి ఎదురీదేవాడే సాహసి. మార్పుకు నాంది పలికేవాడే మహాత్ముడు.తిగుళ్ల కృష్ణమూర్తి ‘‘అయ్యా.. నా బిడ్డ ప్రసూతికి ఉంది. సిద్దిపేట సర్కారు దవాఖానలో ఎవరికన్న చెప్పవా? తీస్కపోత’’ ఇది మొన్న ఊరికి పోయినప్పడు చాకలి సత్తెవ్వ అడిగిన మాట. ‘‘సర్కారు దవాఖానకే ఎందుకు? ప్రైవేటు హాస్పిటల్లో చెబుతాలే’’ అని నేనంటే. ‘‘వద్దయ్యా. ఆడైతే పైసల కోసం ఊకెనే కడుపు కోస్తరు. సర్కారు దవాఖాన మంచిగుందట. అక్కరుంటేనే పెద్దాపరేషన్ చేస్తన్నరట. కర్సు కూడా ఉండదు’’ ఇది సత్తెవ్వ జవాబు. సిద్దిపేటలో దశాబ్దాలుగా ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో సగటున రోజుకు 3-4 చొప్పున, నెలకు 90–120 దాకా సిజేరియన్లు జరిగేవి. ఇప్పుడా సంఖ్య 30 లోపుకు పడిపోయింది. దీంతో హాస్పిటల్ నిర్వహణే కష్టమవుతోందని డాక్టర్ దంపతులు వాపోయారు. ‘‘అరేయ్.. నా కొడుక్కు హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూడరా?’’ కరీంనగర్లో ఉండే నా మిత్రుడు, దాదాపు 100 మంది స్టాఫ్కు ఉపాధినిచ్చే పెద్ద ప్రైవేటు స్కూలు యజమాని, మా ఇంటిదాకా వచ్చి అడిగిన మాట. ఇంత పెద్ద స్కూలున్న నీ కొడుక్కు ఉద్యోగం ఎందుకంటే... ‘‘పిల్లలంతా గురుకులాలకు పోతున్నారు. ఇంకో నాలుగేళ్లైతే స్కూలు నడుస్తుందో లేదో!’’ అంటూ రంధితో బదులిచ్చాడు నా మిత్రుడు! దాదాపు 1400 మంది విద్యార్థులతో, ప్రతి ఏటా సంఖ్య పెరిగే ఆ బడిలో, తొలిసారి ఈ ఏడాది స్ర్టెంత్ ఒకేదఫా మూడు వందలు తగ్గిందట! చడీచప్పుడు లేకుండా, చాపకింద నీరులా జరుగుతున్న మార్పులకు చిన్న ఉదాహరణలివి. తెలంగాణలో ఇప్పుడు ‘భవిష్యత్తును అంచనా వేయలేని’ మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ప్రపంచమంతా ప్రైవేటీకరణ, పట్టణీకరణ దిశగా సాగుతుంటే, మూడేళ్ల క్రితం పుట్టిన రాష్ట్రం మాత్రం, అందుకు విరుద్ధ దిశలో ప్రభుత్వీకరణ, గ్రామీణీకరణవైపు ప్రయాణిస్తోంది! ప్రత్యామ్నాయ విధాన ఆవిష్కరణకు తెలంగాణ ఇప్పుడొక ప్రయోగశాలగా మారుతోందా అనిపిస్తోంది. సర్కారీ నియంత్రణను తగ్గించడం, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, మనిషి బతుకును మార్కెట్కు వదిలేయడం అనేవి ఆర్థిక సంస్కరణల ప్రధాన ఎజెండా. దీనివల్ల కొన్ని సౌకర్యాలు సమకూరినా, ఎన్నో అవకరాలూ వచ్చాయి. సజీవమైన పల్లెకు బదులు, పరాన్నభుక్కు అయిన పట్టణం జీవన కేంద్రంగా మారింది. తల్లిలాంటి పల్లె నుంచి ప్రియురాలిలాంటి పట్నానికి వలసలు పెరిగాయి. చెక్ లేని ప్రైవేటు రంగంతో మన బతుకు బ్యాలెన్స్ తప్పింది. ‘మనం ఎన్నుకునే, మన సంక్షేమ ప్రభుత్వం’తో సంబంధాలు తెగిపోయి, మార్కెట్తో, మనీతో తప్ప మనతో ఏ అనుబంధమూ లేని, ఎవరికీ జవాబుదారీ కాని ప్రైవేటు రంగంతో అనివార్యమైన, అవాంఛనీయ బంధం ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రైవేటులో జవాబుదారీతనం తెచ్చి, పల్లెను ఆదరించి, పట్నానికి దీటుగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరంగా కనిపిస్తోంది. విద్యావ్యవస్థ మొత్తం ప్రైవేటు బడులు, కార్పొరేట్ కాలేజీల చేతుల్లోకి వెళ్లిపోయి, ఫీజుల్ని, పరీక్షల్ని, ర్యాంకుల్ని, చివరికి పేపర్ లీకేజీలను సైతం అవే నిర్ణయించే కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వాటిలో కొంత పోటీతత్వం, జవాబుదారీతనం వచ్చాయి. పాఠశాల రంగంలో ప్రభుత్వ రంగంలో వస్తున్న వందలాది గురుకుల బడులు ప్రైవేటు స్కూళ్ల ఏకపక్ష ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులకు ఒక ‘చాయిస్’ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల్ని తగ్గించడమే కాదు; బడి బాటలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. వైద్య విలువలకన్నా డబ్బే ప్రధానమనుకున్న ప్రైవేటు ఆస్పత్రుల వల్ల, అపెండిసైటిస్, సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంత ప్రభుత్వ దవాఖానాల నవీకరణ, మాతా శిశువులకు ఆరోగ్య కిట్లు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. అడ్డగోలు కొనుగోలు ఒప్పందాలను పక్కనబెట్టి ఇప్పుడు ప్రభుత్వమే సొంతంగా విద్యుత్కేంద్రాలను నిర్మించుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒకప్పుడు కాంట్రాక్టర్లు చెప్పినట్టు ఆడి, మొబిలైజేషన్ అడ్వాన్సులు పంచిపెట్టారు. ఇప్పుడు ఈపీసీని ఎత్తివేయడమే కాదు; పదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణదారులకే అప్పగించి జవాబుదారీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ విధానం పూర్తిగా రద్దైతే, ఏజెన్సీల దోపిడీ ఆగే అవకాశం ఉంది. పల్లెవైపు చూస్తే... ఈ రోజు ఏ పల్లెలోనైనా తొండలు గుడ్లు పెట్టని భూమి కూడా ఎకరా ఆరు లక్షలకు తక్కువ లేదు. అత్యధిక పరిహారం ఆశచూపినా భూమిని వదులుకోవడానికి రైతులు సిద్ధపడకపోవడానికి.. భూమిపై ప్రేమ ఒక కారణమైతే, వ్యవసాయం ఆశాజనకంగా మారడం మరో కారణం. 60 శాతం మంది ఆధారపడిన సాగు మెరుగుపడితే అంతకు మించి కావాల్సింది ఏముంది? చేతివృత్తిదార్లను ప్రోత్సహించే చర్యల వల్ల వలసలు తగ్గుముఖం పట్టడమే కాదు; స్వయం ఉపాధి మెరుగుపడుతుంది. రైతులు తమ దిగుబడులను షావుకార్లకు అమ్మే పరిస్థితి పోయి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారు. యూనిఫారాలు, బతుకమ్మ చీరల వంటివాటితో సిరిసిల్ల చేనేత కార్మికుడి కడుపు నిండుతూనే, టెయిలర్లకు ఉపాధి దొరుకుతోంది. గ్రామీణ రోడ్ల మెరుగుదల వల్ల, సమీప పట్టణాలతో కనెక్టివిటీ పెరిగి పల్లె నిలుస్తూనే, పట్టణంతో కలుస్తున్నది. ఒకప్పుడు ఊర్లలో వాగులో చెలమలు తోడి మంచినీళ్లు తీసుకునేవారు. 30 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. తాగే నీళ్లు కూడా కొనుక్కోవాల్సి రావడం! స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత, ఒక రాష్ట్రంలో, ప్రతి ఇంటికీ మంచి నీరు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడమే గొప్ప విషయం కదా! అది తెలంగాణలో జరుగుతోంది. అయితే ఇక్కడే రెండు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... ప్రైవేటు రంగంలో అవలక్షణాలున్నప్పటికీ, ప్రభుత్వ రంగం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా అది ఉపాధి కల్పిస్తున్నది. ఇది కాదనలేని వాస్తవం. బడా కార్పొరేట్ సంస్థల్ని పక్కనబెడితే, తెలంగాణ యువకులే నడుపుకుంటున్న స్కూళ్లు, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. అవి మూతబడితే, వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది పరిస్థితి ఏమిటి? ప్రైవేటు ఆస్పత్రుల విషయమూ ఇంతే! అయితే కాలానుగుణంగా మారగలిగినవాడే మనుగడ సాగిస్తాడన్నది దీనికి జవాబు. చెత్తపోయి సత్తా ఉన్నవే మిగులుతాయి. ఇంజనీరింగ్ కాలేజీలే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వం చేసిన కట్టడి కారణంగా ఇప్పుడు ప్రమాణాలు కొంత మెరుగుపడ్డాయి. నాసిరకం కాలేజీలు మూతపడుతున్నాయి. ఒక్కడే పది కాలేజీల్లో చదువు చెప్పినట్టు చూపించడాన్ని అడ్డుకోవడంతో, మరో పది మందికి ఉద్యోగాలు, మంచి వేతనాలు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. కొందరికి సమస్యలూ తప్పవు. రెండో కీలకాంశం. ప్రభుత్వీకరణ, పల్లెల బాగు చర్యలు క్షేత్ర స్థాయిలో అనుకున్నట్టుగా అమలవుతున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులనే తీసుకుంటే, రోగుల రాక పెరగడం ఎంత వాస్తవమో, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా జనం అవస్థలూ అంతే వాస్తవం. ప్రసవాల్లో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల లేమి వెక్కిరిస్తోంది. గురుకుల పాఠశాలలపై ప్రకటనలు ఉన్నంత అద్భుతంగా, నిర్వహణ లేదు. గొర్రెల పథకం ఆశించినంతగా సఫలం కానట్టు కనిపిస్తోంది. కిందిస్థాయి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి తగ్గలేదు. అలుగునూరు ఆత్మాహుతే ఇందుకు నిదర్శనం. వీటికి ప్రధాన కారణం నిధుల లేమితో పాటు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం. ఒక ఐపీఎస్ అధికారి అన్నట్టు.. ముఖ్యమంత్రి ఐదేళ్లుండి పోయేవాడు. తాము 35 ఏళ్లు ఉండేవాళ్లం! అదీ ధీమా! ముఖ్యమంత్రిలో ఆల్టర్నేట్ కోషంట్ (ప్రత్యామ్నాయాన్ని పరిశోధించే- ఏక్యూ) ఎక్కువ. ప్రభుత్వ వ్యవస్థ సహజంగా స్టేటస్కోయిస్టు (యథాతథవాది)! మారకుండా ఉండడానికి యంత్రాంగం మొరాయిస్తుంది. ముఖ్యమంత్రిదేమో రాత్రికిరాత్రి వ్యవస్థను సమూలంగా మార్చాలన్న ఉరుకులాట! ఆలోచించే సీఎంకు, ఆలోచించడం ఆగిపోయిన ప్రభుత్వ సిబ్బందికి మధ్య పొసగకపోవడమే సమస్య. అందువల్లే పథకాల అమల్లో లోపాలు. సంధి సమయంలో ఇది సహజమే కావచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దీటుగా పనిచేయించడమే దీనికి పరిష్కారం. ఇందులో ప్రభుత్వానిది ఎంత బాధ్యతో, పౌర చైతన్యమూ అంతే కీలకం. పాలకుల సృజనాత్మకత, ఉద్యోగుల బాధ్యత మధ్య తేడాకు ఈ దృష్టాంతం చదవండి. సరిగ్గా వారం క్రితం, గత మంగళవారం, రాత్రి బేగంపేట ఫ్లైఓవర్పై కారు ఢీకొని ఒక కుక్క చనిపోయింది. కానీ మూడు రోజుల పాటు ఆ కుక్క కళేబరాన్ని తీసిన వారు లేరు. ఒక పుణ్యాత్ముడు దాన్ని పక్కకు జరిపి, ప్లాస్టిక్ డివైడర్లు అడ్డుపెట్టి పోయాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది మొదలుకుని ఐఏఎస్ల దాకా రోజూ వందలాది అధికారులు ఆ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తుంటారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్- గౌరారం మధ్యలో ఒకచోట, సమీప గ్రామాల రైతులంతా, తాము పండించి కూరగాయలు అమ్ముకుంటుంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. అయితే హైవే పక్కనే కావడంతో, వాహనాలు మీదికి దూసుకొచ్చి ప్రమాదాలు జరిగేవి. ఎండా వానా సరేసరి. తరచూ ఆ రోడ్డుపై ప్రయాణించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి ఇది వచ్చింది. ఆ రైతుల కోసం అక్కడే మార్కెట్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హరీశ్రావు, పక్కనే ఉన్న భూమి యజమానితో మాట్లాడి, దాదాపు ఎకరం జాగా కొన్నారు. 120 మంది తమ ఉత్పత్తులు అమ్ముకునేలా, మడిగెలతో మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు అప్పగించారు. హైవే మీద ప్రయాణించేవారికి ఇప్పుడది తాజా కూరగాయలు దొరికే పెద్ద మార్కెట్. రోజుకు వెయ్యి రెండు వేల మందిదాకా వస్తున్నారు. కార్లకోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్థలం, రైతులు, వినియోగదార్ల కోసం చిన్న టిఫిన్ సెంటర్, పిల్లల ఆట సామగ్రి! ఆ మడిగెల్లోని రైతులకు ఇప్పుడు ఎంత సంతోషమో! పదేళ్ల నుంచీ వాళ్లక్కడ కూరగాయలు అమ్ముతున్నా, వందలాది అధికారులు ఆ రోడ్డు మీద వెళ్లినా ఎవరికీ ఈ ఆలోచన రాలేదు. బాధ్యత బరువేం కాదు; ఇష్టపడితే! క్రియేటివిటీ సింపుల్గానే ఉంటుంది; ఆలోచించగలిగితే! పాలకులకే కాదు; ప్రభుత్వ సిబ్బందీ దీన్ని ఫీలయినప్పుడే ఫలితం. ప్రభుత్వ వ్యవస్థల్ని కాపాడుకుంటేనే కదా, ప్రభుత్వానికైనా, ప్రభుత్వ ఉద్యోగులకైనా రెలెవెన్స్ ఉండేది!! ఏటికి ఎదురీదేవాడే సాహసి. మార్పుకు నాంది పలికేవాడే మహాత్ముడు.తిగుళ్ల కృష్ణమూర్తి | editorial |
11,455 | 06-10-2017 04:19:39 | జమిలికి మేం రెడీ | కేంద్రానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారుఈసీ ప్రకటనకు కాంగ్రెస్ స్పందనఎన్నికల కమిషన్ కూడా కేంద్రం భాషే మాట్లాడుతోంది: లెఫ్ట్జమిలి ఎన్నికలు సాధ్యం కాదని వ్యాఖ్యన్యూఢిల్లీ, అక్టోబరు 5: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో కేంద్రం ఉంటే.. ‘వచ్చే సెప్టెంబరు నాటికి జమిలి ఎన్నికల నిర్వహణకు మేం సై’ ..అని ఎన్నికల కమిషన్ అంటోంది! అందుకు అవసరమైన వీవీపాట్ యంత్రాలను, ఇతర సామగ్రిని సన్నద్ధం చేసుకుంటోంది. 24 లక్షల ఈవీఎంలు.. 16 లక్షల పేపర్ ట్రయల్ యంత్రాలు ఉంటే చాలని ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ గురువారం అన్నారు. అయితే, ఇన్నాళ్లుగా లేనిది.. ఈసీ తాజా ప్రకటనతో విపక్షాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఈసీ సైతం కేంద్ర ప్రభుత్వ భాషే మాట్లాడుతోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. జమిలి ఎన్నికలను అవి వ్యతిరేకిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ పట్ల.. ఆయన శుష్కవాగ్దానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, ఎన్నికలు జరిగితే కేంద్రానికి తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. ‘‘‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ 2004లో ప్రచారం చేసుకుని ముందస్తు ఎన్నికలు నిర్వహించిన వాజపేయీ సర్కారును ఓడించినట్టుగానే.. ప్రస్తుత సర్కారుకూ తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ‘మోదీజీ అచ్ఛే దిన్ ఎక్కడ’ అని నిలదీయడానికే వారు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు’’ అన్నారు. మరోవైపు.. వామపక్షాలు మాత్రం, జమిలి ఎన్నికల వంటి పెద్ద నిర్ణయాన్ని కేంద్రం ఏకపక్షంగా తీసుకోరాదని అంటున్నాయి. ఇది సాధ్యం కాదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ఇది రాజకీయ అంశమని.. వ్యక్తిగతంగా నిర్ణయించేది కాదని సీపీఎం నేత బృందా కరత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం ఐదేళ్లని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని మార్చలేరని ఆమె గుర్తుచేశారు. కాగా.. జమిలి ఎన్నికల నిర్వహణకు చట్టపరమైన ఏర్పాట్లు అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు ఎమ్మెస్ గిల్, ఎన్ గోపాలస్వామి తదితరులు అంటున్నారు. తగిన యంత్రసామగ్రి ఉంటే నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని.. కానీ, అన్ని రాష్ట్రాల పదవీకాలం ఒకేసారి ముగిసేలా చేయాలంటే అందుకు చట్టం చేయాల్సిన అవసరం ఉందని గోపాలస్వామి.. రాజ్యాంగ సవరణ అవసరమని గిల్ అభిప్రాయపడ్డారు. | nation |