SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
12,829
17-01-2017 01:53:23
దావూద్‌ ఇంటికి రమ్మన్నాడు
ముంబై, జనవరి 16: భారత మోస్ట్‌ వాంటెడ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను తాను దుబాయ్‌లో రెండుసార్లు కలిశానని.. అతడితో కలిసి టీ తాగానని బాలీవుడ్‌ మునుపటితరం నటుడు రిషికపూర్‌(64) పేర్కొన్నాడు. అది కూడా.. ‘ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్‌’ పేరుతో విడుదల చేసిన తన స్వీయ జీవితచరిత్ర పుస్తకంలో. తన తండ్రి రాజ్‌కపూర్‌ గురించి.. తన చిన్ననాటి అనుభవాల గురించి.. తనకొచ్చిన పేరు ప్రతిష్ఠల గురించి.. ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలను ఆ పుస్తకంలో రాసిన రిషీ రెండుసార్లు దావూద్‌ ఇబ్రహీంను కలిసిన సందర్భాల గురించి అందులో వివరించాడు. మొదటిసారి 1988లో దుబాయ్‌లో ‘ఆశా భోంస్లే-ఆర్డీ బర్మన్‌ నైట్‌’ కార్యక్రమం కోసం స్నేహితుడు బిట్టు ఆనంద్‌తో కలిసి వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టులో దావూద్‌ మనుషుల్లో ఒకడు రిషీకపూర్‌ వద్దకు వెళ్లి ‘దావూద్‌ సాబ్‌ మీతో మాట్లాడతారట’ అంటూ అతడి చేతికి ఒక ఫోన్‌ ఇచ్చాడట. రిషీకపూర్‌ మాట్లాడగా.. దావూద్‌ అతణ్ని ఆ రోజు సాయంత్రం తన ఇంటికి ఆహ్వానించాడట.  రిషీ అంగీకారం తెలపడంతో.. అతణ్ని, అతడి స్నేహితుణ్ని కొత్తగా మెరిసిపోతున్న రోల్స్‌ రాయ్‌స్‌ కారులో ఎక్కించుకుని, ఏ దారిలో వెళ్తున్నారో వారికి తెలియకుండా అనేక మలుపులు తిరుగుతూ చివరికి దావూద్‌ ఇంటికి తీసుకెళ్లారట. అక్కడ దావూద్‌ రిషీకి ఘనస్వాగతం పలికి.. తాను మద్యం తాగనని, ఎవరికీ ఇవ్వనని అందుకే టీకి పిలిచానని చెప్పి చాయ్‌, బిస్కెట్లు ఇచ్చాడట. రిషీతో కాసేపు మాట్లాడిన దావూద్‌.. ‘తవాయిఫ్‌’ సినిమాలో రిషీకపూర్‌ పాత్ర పేరు దావూద్‌ అయినందున ఆ సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పాడట. తాను చేసే పనుల గురించి చెప్పి, అలా చేస్తున్నందుకు తానేమీ చింతించట్లేదని కూడా చెప్పాడట.  ‘నేనెన్నో నేరాలు చేశానుగానీ.. హత్యలు మాత్రం చేయలేదు’ అని చెప్పాడట. అయితే, అల్లా ఆజ్ఞలకు విరుద్ధంగా అబద్ధం చెప్పిన ఒక వ్యక్తిని ముంబై కోర్టులో చంపాల్సి వచ్చిందని దావూద్‌ చెప్పినట్టు (ఈ సంఘటన ఆధారంగానే 1985లో సన్నీడియోల్‌ హీరోగా అర్జున్‌ అనే సినిమా వచ్చింది) రిషీ వివరించాడు. నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీ చివర్లో.. ‘నీకు ఏం కావాల్సి వచ్చినా.. డబ్బు, ఇంకేదైనా సరే.. మొహమాట పడకుండా నన్ను అడుగు’ అని రిషీకి చెప్పి మరీ పంపించాడట దావూద్‌. మళ్లీ ఏడాది తిరక్కుండానే.. 1989లో వీరిద్దరూ దుబాయ్‌లోనే రెండోసారి కలిశారు. ఈసారి రిషీకపూర్‌ తన భార్య నీతూతో కలిసి ఒక లెబనీస్‌ షాపులో బూట్లు కొనుక్కోవడానికి వెళ్లగా.. దావూద్‌ కూడా అక్కడ ఉన్నాడట. చేతిలో మొబైల్‌ ఫోన్‌, చుట్టూ 8-10 మంది బాడీగార్డులతో ఉన్నాడని.. షాపులో తనకు కావాల్సినవి తీసుకోవాల్సిందిగా ఆఫర్‌ ఇచ్చాడని, తాను ‘నో’ చెప్పానని రిషీ కపూర్‌ పుస్తకంలో పేర్కొన్నాడు. అంతే కాదు.. దావూద్‌ ఇబ్రహీం అప్పుడు రిషీకపూర్‌కు తన మొబైల్‌ నంబర్‌ ఇచ్చాడని చెప్పాడు.  భారత్ లో తనకు న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే పారిపోయి వచ్చానని... ఇండియాలో ఎంతో మంది రాజకీయ నాయకులు తన జేబులో ఉన్నారని, వారికి తాను చాలా డబ్బు ఇచ్చానని కూడా రిషీకి దావూద్‌ చెప్పాడట. ఇక.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, తన తండ్రి అయిన రాజ్‌కపూర్‌ గురించి కూడా రిషీ కపూర్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సినిమాలు, మద్యం, కథానాయికలు.. ఇవే తన తండ్రిలోకమని వెల్లడించాడు. నర్గీస్‌, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి ఉన్న సంబంధాల గురించీ వివరించాడు.
nation
13,939
13-04-2017 03:32:54
మర్మాంగం కోసేసి..! కళ్లు పీకేసి!!
కూతురుతో సంబంధం పెట్టుకున్నాడని టీనేజర్‌పై కుటుంబ సభ్యుల దుశ్చర్య లాహోర్‌, ఏప్రిల్‌ 12: తన కూతురుతో సంబంధం పెట్టుకున్నాడని పరువు కోసం బాలిక కుటుంబ సభ్యులు 15ఏళ్ల టీనేజర్‌ మర్మాంగం కోసేసి, కళ్లు పీకేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఫిబ్రవరిలో చోటుచేసుకుంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితుడిని రక్షించేందుకు డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు తొమ్మిదో తరగతి చదువుతున్న టీనేజర్‌ను పాఠశాల ప్రాంగణంలో కిడ్నాప్‌ చేశారు. అతన్ని రావి నది దగ్గర ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లి మర్మాంగం కోసి, కళ్లు పీకేసి వెళ్లిపోయారు. అటువచ్చిన వాళ్లు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని చూసి ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఘటనకు బాధ్యులైన ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
nation
15,788
10-05-2017 18:18:05
సత్యాగ్రహ దీక్ష చేస్తున్న.. కపిల్ మిశ్రాపై దాడి
న్యూఢిల్లీ: ఆప్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రాపై దాడి జరిగింది. బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఆయనపై అంకిత్ భరద్వాజ్ అనే వ్యక్తి దాడి చేసినట్లు తెలుస్తోంది.  రూ.400 కోట్ల వాటర్ ట్యాంకర్ కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.2 కోట్ల ముడుపులు ముట్టాయని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆ డబ్బును కేజ్రీవాల్‌కు ఇస్తుండగా తాను చూసినట్లు వెల్లడించి సంచలనం రేపారు. దీనిపై మంగళవారం ఏసీబీతో పాటు సీబీఐకి ఆయన ఫిర్యాదు చేశారు.  అలాగే విదేశీ పర్యటనల పేరుతో పార్టీ నిధులు దుర్వినియోగం చేసిన ఆప్ నేతల పేర్లను బయటపెట్టాడని డిమాండ్ చేస్తూ కపిల్ మిశ్రా బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంకిత్ భరద్వాజ్ అనే వ్యక్తి ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
nation
12,242
20-04-2017 16:28:53
శివసేన ఎంపీ గైక్వాడ్‌పై.. చర్యల్లో ఆలస్యమెందుకు ?
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆ సంస్థ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ఆయనపై యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. మార్చి 23న జరిగిన ఈ ఘటనపై బాధితుడితో పాటు ఎయిర్ ఇండియా కూడా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల గడుస్తున్నా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఎయిర్ ఇండియా సిబ్బందిపై ప్రభావం చూపుతుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
nation
7,070
25-10-2017 22:15:21
ప్రభాస్ లాంటి హీరోతో నటించడమంటే..
ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న కొత్త సినిమా 'సాహూ'. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి కల్లా ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్. అయితే ఈ సంవత్సరంలో చాలా హిట్ సినిమాల్లో నటించిన నీల్ నితిన్‌ ముఖేశ్‌ బుధవారం రోజు ముంబయిలో ఏర్పాటు చేసిన ‘తాలీబ్‌’ అనే మ్యూజిక్‌ వీడియో విడుదల కార్యక్రమానికి హాజరై హీరో ప్రభాస్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. ‘ప్రభాస్‌ వంటి యాక్టర్ తో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నా పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తున్నాను. ప్రతీ భాషలో కూడా భాషతో పాటు హావభావాలు కూడా మార్చాలి. అలా చేయడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను’ అని ఆయన అన్నాడు.
entertainment
8,329
28-06-2017 09:50:30
భరత్‌ను ఆ డైరెక్టర్‌ మోసం చేశాడా?
టాలీవుడ్‌ స్టార్‌హీరో రవితేజ సోదరుడు భరత్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇంతకుముందే భరత్‌ మీద పలు ఆరోపణలు వచ్చిన విషయమూ తెలిసిందే. నిజానికి సినిమాల్లోకి రావాలనే ఆలోచన మొదట్లో భరత్‌కు లేదట. సినిమాల్లోకి రాకముందు భార్యతోపాటు అమెరికాలో నివాసం ఉండేవాడట భరత్‌. ఆ సమయంలో అమెరికాలోని తానా సభలకు హాజరైన ఓ డైరెక్టర్‌.. భరత్‌ను సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించాడట. ‘నువ్వు అచ్చం మీ అన్నయ్యలా ఉన్నావు.. నువ్వు హైదరాబాద్‌ వస్తే నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాన’ని మాటిచ్చాడట. దాంతో ఆ డైరెక్టర్‌ మాటలను నమ్మి హైదరాబాద్‌ వచ్చేశాడట భరత్‌. అయితే ఆ డైరెక్టర్‌ హీరో వేషం కాదు కదా.. తన సినిమాల్లో చిన్న వేషం కూడా భరత్‌కు ఇవ్వలేదట. దీంతో డిప్రెషన్‌కు గురైన భరత్‌.. తాగుడుకు, డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. కళ్లను చూసి హీరో పేరు చెప్పండి, నగదు బహుమతులు గెలుచుకోండి ఉదయ్‌కిరణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
entertainment
4,763
30-11-2017 19:18:10
'మహానటి'లో సమంత పాత్ర ఇదే..!
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మహానటి'. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అయితే సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్‌సల్మాన్, ఎస్‌వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు చేస్తున్నాడని కన్ఫార్మ్ చేసినప్పటికీ.. సమంత పాత్ర ఏంటనేది మాత్రం కాస్త సస్పెన్స్ లో పెట్టింది చిత్రయూనిట్. అయితే జమున పాత్రలో సమంత కనిపించనుందని మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె పోషించేది జర్నలిస్ట్ పాత్ర అంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ఇంతకీ సమంత పోషించనున్న పాత్ర ఏంటని సందిగ్ధంలో పడిపోయారు ప్రేక్షకులు. కాగా తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'చిత్రంలో సమంత చేసేది జమున పాత్రే అని చెప్పుకొచ్చింది'. తాజా పరిణామంతో 'మహానటి' సమంత పాత్ర పట్ల ప్రేక్షకుల్లో కొంచం క్లారిటీ వచ్చింది కానీ యూనిట్ అఫీషల్ గా ప్రకటించే వరకు సమంత పాత్ర అనేది సస్పెన్సే అంటున్నారు కొందరు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2018 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
20,749
15-12-2017 01:57:58
ఐవోఏ చీఫ్‌గా బాత్రా ఎన్నిక
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నరీందర్‌ బాత్రా ఎన్నికయ్యాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) చీప్‌గా ఉన్న 60 ఏళ్ల బాత్రా.. ఇప్పుడు జాతీయ ఒలింపిక్‌ సంఘానికి కూడా అధ్యక్షుడయ్యాడు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగను న్నాడు. వార్షిక సర్వసభ్య సమావేశంలో గురువారం జరిగిన పోలింగ్‌లో బాత్రా 142-13 ఓట్ల తేడాతో ప్రత్యర్థి అనిల్‌ ఖన్నాపై ఘనవిజయం సాధించాడు. ఆలిండి యా టెన్నిస్‌ సంఘం (ఐటా) మాజీ అధ్యక్షుడైన ఖన్నా ముందు నామినేషన్‌ వేశాడు. కానీ ఆ తర్వాత బాత్రాకు మద్దతు తెలుపుతూ.. తన నామినేషన్‌ ఉపసంహరించుకు న్నట్టు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాడు. కానీ అప్పటికే ఉపసంహరణ గడువు ముగియడంతో ఓటింగ్‌ అనివార్య మైంది. ప్రస్తుతం జనరల్‌ సెక్రటరీగా ఉన్న రాజీవ్‌ మెహతా.. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నియ్యాడు. కోశాధికారిగా ఆనం దేశ్వర్‌ పాండే, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఆర్కే ఆనంద్‌ ఎన్నిక య్యారు. అయితే ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ హైకోర్టుదే తుది నిర్ణయం. స్పోర్ట్స్‌కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని.. ఐవోఏ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని న్యాయవాది రాహుల్‌ మెహ్రా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. కానీ కోర్టు అందుకు విముఖత వ్యక్తం చేసింది. కాగా, 2032 ఒలింపిక్స్‌, 2030 ఆసియా క్రీడలు, 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు తీసుకెళ్తామని గెలిచిన అనంతరం బాత్రా చెప్పాడు. పాకిస్థాన్‌తో సంబంఽ దాలు బలపడనంత వరకు ఆ దేశం తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదన్నాడు. ఐవోఏ స్వయం ప్రతిపత్తి తో కూడినదని ప్రభుత్వం గుర్తించాల్సి న అవసరం ఉందన్నాడు. సీఎం రమేష్‌-పవన్‌ వర్గానికి ఓటు హక్కుఆంధ్ర ఒలింపిక్‌ సంఘం గుర్తింపు అంశం సరికొత్త మలుపు తిరిగింది. గురువారం జరిగిన ఐవోఏ ఎన్నికల్లో ఓటువేసే అధికారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘం తరఫు న అధ్యక్షుడు సీఎం రమేష్‌, కార్యదర్శి జేసీ పవన్‌ రెడ్డికి కల్పి స్తూ ఐవోఏ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీం తో ఎంపీ గల్లా జయదేవ్‌ వర్గాన్ని ఓటింగ్‌కు రాకుండా నిరోధించింది.
sports
11,999
12-01-2017 03:21:15
పంజాబ్‌ సీఎం.. పంజాబీనే!
 నేను ఢిల్లీ సీఎంగానే ఉంటా..: కేజ్రీవాల్‌ పాటియాలా, జనవరి 11: పంజాబ్‌లో తమ పార్టీ గెలిస్తే.. పంజాబ్‌ వ్యక్తే సీఎం అవుతారని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. తాను ఆ రేసులో లేనే లేనన్నారు. మంగళవారం ఆప్‌ కీలక నేత సిసోడియా పంజాబ్‌లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. కేజ్రీవాలే మీ సీఎం అవుతారని భావించి ఓటేయాలని కోరారు. కేజ్రీనే పంజాబ్‌ సీఎం కానున్నారని చెప్పారు. దీంతో ఆప్‌ను.. కేజ్రీవాల్‌ను కాంగ్రెస్‌, బీజేపీ, శిరోమణి అకాళీదల్‌ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. పంజాబ్‌కు హరియాణా వ్యక్తి సీఎం కావడం ఏంటని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ తాను ఢిల్లీలోనే ఉంటానని.. పంజాబీనే పంజాబ్‌ సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆప్‌ తరపున పంజాబ్‌కు ఎవరు సీఎం అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనేదనని చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక ఒక అబద్ధ్దమని విమర్శించారు.
nation
9,584
24-11-2017 20:04:31
అజిత్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్.. వివాదాలకు దారితీస్తుందా..!
స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక తమ అభిమాన కథానాయకులను ఆరాధ్య దైవాలుగా భావించే అభిమానులు వారిని ఎవరైనా ఏమైనా అంటే సహించలేరు. ఈ కథాంశంతో తమిళంలో ఓ చిత్రం రూపొందింది. మన దేశంలో సినిమా నటులను అమితంగా ఆరాధిస్తుంటారు. దక్షిణాదిలో ఇది ఇంకాస్త ఎక్కువ. ముఖ్యంగా అగ్ర కథానాయకులకు అదిరిపోయే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే వారి అభిమానుల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. కోలీవుడ్ విషయానికొస్తే మొదటి తరంలో టి.కె. భాగవతార్-చిన్నప్ప ఆ తర్వాతి తరంలో ఎమ్.జి.ఆర్ - శివాజీ, మలితరంలో రజని - కమల్ ప్రస్తుతం అజిత్ వర్సెస్ విజయ్ అభిమానుల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో ఈ పోటీ కొనసాగింది, సాగుతోంది. ప్రస్తుతం అజిత్, విజయ్ అభిమానుల రైవల్రీనే బేస్ చేసుకుని తమిళంలో 'విసిరి' అనే చిత్రం తెరకెక్కింది.  నూతన నటులు రామ్ శరవణ, రాజ్ సూరియా, రమోనా స్టెఫాని ముఖ్య పాత్రధారులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ వెట్రి మహాలింగం. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి తమిళనాట అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న అజిత్ - విజయ్ ఒప్పుకున్నారా? ఫ్యాన్స్ కథాంశంతో తీసిన ఈ చిత్రం విడుదల తర్వాత వివాదాలకు దారితీసే అవకాశం ఉందా? అన్నది తేలాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.
entertainment
13,769
06-06-2017 21:30:20
అత్యాచార నిందితుల.. . ఊహాచిత్రాలు విడుదల
గుర్గావ్: హర్యానాలో సంచలనం రేపిన అత్యాచార ఘటనకు సంబంధించిన నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన నజరానా ఇస్తామని ప్రకటించారు. గుర్గావ్ జిల్లాలోని మనేసర్‌లో గత రాత్రి ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు ఆమెకు చెందిన 9 నెలల పాపను ఆటో నుంచి రోడ్డుపై విసిరేయడంతో తీవ్ర గాయాలతో ఆ చిన్నారి చనిపోయింది. హర్యానా పోలీసులు ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలతో ముగ్గురు అత్యాచార నిందితుల ఊహా చిత్రాలు విడుదల చేశారు. వారి ఆచూకీ తెలపాలని ప్రజలను పోలీసులు కోరారు.
nation
10,714
13-08-2017 18:57:36
హల్ చల్ చేస్తున్న డాన్స్ వీడియో
గురువారం విడుదలైన సంజయ్ దత్ నటించిన తాజా చిత్రం 'భూమి' ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. విశేషం ఏమంటే అదే రోజున సంజూభాయ్ కుమార్తు త్రిషాలా పుట్టిన రోజు. ట్రైలర్ విడుదల సమయంలో వాయిస్ మెసేజ్ ద్వారా తండ్రితో కలసి తన ఆనందాన్ని పంచుకుంది త్రిషాలా. ఇక అదే రోజు రాత్రి తన కుమార్తె పుట్టిన రోజు పార్టీలో భార్య మాన్యతతో కలసి సూపర్‌గా డాన్స్ చేశాడు సంజయ్ దత్. 'భూమి' ట్రైలర్‌ను మించి ఈ డాన్స్ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
entertainment
19,581
28-01-2017 03:53:13
చెల్లి చరిత్రా.. అక్క సంచలనమా!
రికార్డు టైటిల్‌పై సెరెనా గురివీన్‌సతో ఫైనల్‌ నేడుమెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆసక్తికర పోరుకు తెరలేచింది. అమెరికా సిస్టర్స్‌ సెరెనా, వీనస్‌ టైటిల్‌ ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... 36, 35 ఏళ్ల వయసులో ఈ ఇద్దరూ మళ్లీ మేజర్‌ టోర్నీలో టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. వాస్తవానికి ఈ టోర్నీ ఇలా ముగుస్తుందని రెండు వారాల ముందు ఎవరూ ఊహించలేదు. 2003లో రన్నర ప్‌గా నిలిచాక.. గత 14 ఏళ్లలో వీనస్‌ ఇక్కడ ఒక్కసారి కూడా తుదిపోరుకు చేరుకోలేదు. ఇక.. రాడ్‌ లేవర్‌ ఎరీనాలో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకునేందుకు విలియమ్స్‌ సిస్టర్స్‌ సిద్ధమయ్యారు. ఈ కోర్టులోనే 1998లో ఇద్దరూ తొలిసారి ఓ ప్రొఫెషనల్‌ మ్యాచ్‌లో పరస్పరం తలపడ్డారు. నాడు రెండో రౌండ్లో వీనస్‌ వరుస సెట్లలో సెరెనాను ఓడించింది. కానీ, ఈ 19 ఏళ్లలో ఇద్దరిలో ఎంతో మార్పు వచ్చింది. 17వ సీడ్‌ వీనస్‌ 7 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గగా... రెండో సీడ్‌ సెరెనా 22 టైటిళ్లను ఖాతాలో వేసుకుంది. ఇక, అక్కతో ముఖాముఖీ పోరుల్లో సెరెనా తన ఆధిపత్యాన్ని ఎప్పుడో చాటుకుంది. ప్రస్తుతం ఆమె 16-11తో వీన్‌సపై మెరుగైన రికార్డుతో ఉంది. ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో ఆరు టైటిళ్లతో ఘనమైన రికార్డున్న సెరెనాకు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో అక్కపై 6-2తో మెరుగైన రికార్డు ఉంది. సెరెనాతో పోరు అంటే మానసికంగానే కాకుండా శారీరకంగా ఎంతో సవాల్‌తో కూడుకున్నదని వీన్‌సకు తెలుసు. కానీ, ఇప్పటికీ వీనస్‌ తన చెల్లె సెరెనాను ఇబ్బంది పెట్టగలదు. అయితే 2008 తర్వాత ఇద్దరి మధ్య ఒక విధానం ఏర్పడింది. సెరెనా రెండు మ్యాచ్‌లు నెగ్గితే.. వీనస్‌ తర్వాతి పోరులో ఆమెను ఓడిస్తుంది. ఈ లెక్క నిజమైతే ఇక్కడ వీన్‌సనే ఫేవరెట్‌ అనొచ్చు. ఎందుకంటే సెరెనాతో గత రెండు మ్యాచ్‌ల్లో ఆమె పరాజయం పాలైంది. చివరగా 2015 యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో సెరెనా.. వీన్‌సపై నెగ్గింది. ఇక సెమీ్‌సలో కొకొ వాండెవెగ్‌లో వీనస్‌ ఆటను చూస్తే తుదిపోరులో ఆమె అండర్‌ డాగ్‌ అని చెప్పొచ్చు. అందువల్ల, తొలి ఆసే్ట్రలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకునేందుకు వీన్‌సకు ఇదే సరైన సమయం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నెగ్గితే తొమ్మిదేళ్ల విరామం తర్వాత తొలి మేజర్‌ టైటిల్‌ను అందుకోనుంది. అయితే, అది అంతసులభమేమీ కాదు. ప్రస్తుతం సెరెనా ఫామ్‌ను చూస్తే రికార్డు గ్రాండ్‌స్లామ్‌ ఆమెకు సులభమనొచ్చు. మెల్‌బోర్న్‌లో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా తుదిపోరుకు వచ్చిన రెండో సీడ్‌ మునుపటి ఫామ్‌ను అందుకుంది. ఇక, గతేడాది వింబుల్డన్‌ నెగ్గి స్టెఫీ గ్రాఫ్‌ 22 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు సమం చేసిన ఈ మాజీ నెంబర్‌వన్‌ యూఎస్‌ ఓపెన్‌ సెమీ్‌సలో అనూహ్యంగా ఓడింది. ఈ ఆసే్ట్రలియన్‌ ఓపెన్‌తో స్టెఫీగ్రా్‌ఫను దాటడంతో పాటు ఆసీస్‌ దిగ్గజం మార్గరెట్‌ కోర్ట్‌ 24 గ్రాండ్‌స్లామ్‌ల ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరువయ్యేందుకు సెరెనాకు ఇదే సువర్ణావకాశం. ఇక, ఈ మ్యాచ్‌లో నెగ్గితే.. నెంబర్‌ వన్‌ ర్యాంకూ తిరిగి దక్కించుకోనుంది.
sports
14,052
10-08-2017 16:47:01
కార్తి చిదంబరం ఊరట పొందారు
చెన్నై : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై పాస్‌పోర్టు చట్టం ప్రకారం జారీ అయిన లుక్ ఔట్ నోటీసును రద్దు చేయాలన్న విజ్ఞప్తిని పాక్షికంగా ఆమోదించింది. వచ్చే నెల 4 వరకు లుక్ ఔట్ నోటీసుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. కార్తి విదేశాలకు వెళ్ళకుండా నిరోధించేందుకు లుక్ ఔట్ నోటీసు జారీ అయింది. ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నోటీసును జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది.
nation
10,167
08-04-2017 19:55:50
తమిళనాట కొలువుదీరిన కొత్త నిర్మాతల మండలి
ఇటీవల జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్‌ ప్యానెల్‌ ఘనవిజయం సాధించింది. గురువారం నూతన కార్య వర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించింది. సినీయర్‌ నిర్మాతల చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే. రైతుల విషయంలో ప్రకటించిన హామీని నిలబెట్టుకునేలా ఓ సంచలన ప్రకటన చేశాడు విశాల్. ఆ ప్రకటనేంటో తెలుసుకోవాలంటే పై వీడియో క్లిక్ చేయండి.
entertainment
1,586
12-09-2017 02:40:20
సైయెంట్‌ చేతికి బి అండ్‌ ఎఫ్‌ డిజైన్‌ ఇంక్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన బి అండ్‌ ఎఫ్‌ డిజైన్‌ ఇంక్‌ సంస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైయెంట్‌ ప్రకటించింది. ఈ కొనుగోలుకు ఎంత వెచ్చించనుందనేది మాత్రం వెల్లడించలేదు. బి అండ్‌ ఎఫ్‌ డిజైన్‌ ఇంక్‌లో వంద శాతం ఈక్విటీ యాజమాన్యాన్ని చేజిక్కించుకునేందుకు కంపెనీ అనుబంధ సంస్థ సైయెంట్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఇంక్‌ ఈ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. 1965లో రేమండ్‌ ఎఫ్‌ ఫోర్జియోన్‌ అమెరికాలోని న్యూ బ్రిటన్‌, కనెక్టికట్‌లో బి అండ్‌ ఎఫ్‌ డిజైన్‌ ఇంక్‌ను ఏర్పాటు చేశారు. తొలుత స్థానిక మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు డిజైన్‌ సేవలందించిన ఈ కంపెనీ అనంతర కాలంలో హై క్వాలిటీ డిజైన్‌, టూలింగ్‌ కేపబులిటీ కీలకంగా మారింది. ప్రస్తుతం ప్రెసిషన్‌ ఇంజన్‌, అసెంబ్లీ ఎక్వి్‌పమెంట్‌, రిపేర్‌ టూలింగ్‌, ఫిక్చర్స్‌, గేజెస్‌, ఇంజన్‌ ఫ్యాక్టరీ మోడ్రనైజేషన్‌ డిజైన్‌, తయారీలో కీలకంగా ఉంది. బి అండ్‌ ఎఫ్‌ డిజైన్‌లో 47 మంది ఉద్యోగులుండగా రెవెన్యూలు 80-90 లక్షల డాలర్లుగా ఉన్నాయి. బి అండ్‌ ఎఫ్‌... ఏరోస్పేస్‌ టూలింగ్‌లో టెక్నికల్‌, డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌లో పటిష్ఠమైన టీమ్‌ను కలిగి ఉంది. డిజైన్‌-బిల్డ్‌-మెయింటెయిన్‌ వ్యూహంలో భాగంగా గత మూడేళ్ల కాలంలో సైయెంట్‌ చేపట్టిన ఆరో కొనుగోలు ఇదని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ పరమేశ్వరన్‌ తెలిపారు. 15.5 కోట్ల డాలర్ల నగదు నిల్వలు కలిగిన సైయెంట్‌...పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా కొనుగోలు చేపడుతూ వస్తోందని, భవిష్యత్‌లోనూ కొనుగోళ్లను చేపట్టనుందని ఆనంద్‌ తెలిపారు.
business
19,179
04-03-2017 01:23:28
ఔట్‌సోర్సింగ్‌ ఔట్‌!
వాషింగ్టన్‌, మార్చి 3: హెచ్‌ 1బీ వీసాలపై కత్తిగట్టి భారతీయ ఉద్యోగులను ప్రత్యక్షంగా దెబ్బగొట్టే యత్నంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు పరోక్షంగా మరో దెబ్బ కొట్టేందుకు ఎత్తు వేసింది. అదే.. ఔట్‌సోర్సింగ్‌ సేవలపై వేటు. టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్‌ కావచ్చు.. కాల్‌సెంటర్‌ ఔట్‌సోర్సింగ్‌ కావచ్చు.. పేరేదైనాగానీ, విదేశాల నుంచి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించే అమెరికా కంపెనీలకు గ్రాంట్లు, రుణాలు, ఇతరత్రా ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ఇవ్వకూడదంటూ అమెరికన్‌ కాంగ్రె్‌సలోని ప్రతినిధుల సభలో శుక్రవారం బిల్లు ప్రవేశపెట్టారు. ‘యూఎస్‌ కాల్‌సెంటర్‌, వినియోగదారుల పరిరక్షణ చట్టం’ పేరిట.. ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు జీన్‌ గ్రీన్‌, అధికార పక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు డేవిడ్‌ మెకిన్లీ కలిసి ఈ బిల్లును ప్రతిపాదించడం గమనార్హం. ‘విదేశాల్లో’ అని ఈ బిల్లులో పేర్కొన్నప్పటికీ అసలు లక్ష్యం భారతదేశమే. ఎందుకంటే అమెరికా కంపెనీల్లో చాలావరకూ భారత, ఫిలిప్పీన్స్‌, తదితర దేశాల్లో కాల్‌సెంటర్లు ఏర్పరచుకుని అక్కడి సిబ్బందికి తక్కువ వేతనాలిచ్చి పని చేయించుకుంటున్నాయి. వీటిలో మెజారిటీ మనదేశంలోనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే.. సదరు ఉద్యోగాలు భారతకు వెళ్లకుండా అడ్డుకోవడం, స్థానికులకే వచ్చేలా చేయడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దాంతో పాటు దేశీయంగా కాల్‌ సెంటర్లు ఏర్పాటుచేసే కంపెనీలకు రాయితీలివ్వాలని కూడా అందులో పేర్కొన్నారు. ‘‘అన్ని ఉద్యోగాలను లేదా సేవల పనులన్నిటినీ ఇతర దేశాలకు తరలించే చెడ్డ కంపెనీల జాబితాను తయారుచేయాలి. ఈ లిస్టులో ఉండే కంపెనీలకు ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లూ అందవు. వారు తీసుకునే రుణాలకు గ్యారెంటీ ఇవ్వదు’’ అని గ్రీన్‌, మెకిన్లీ తెలిపారు. అంతేకాదు.. ఈ బిల్లు చట్టమైతే విదేశాల్లో ఉండే కాల్‌ సెంటర్లు తమ చిరునామా గురించి వివరాలను కస్టమర్లకు తెలపాల్సి ఉంటుంది. వారు కోరితే వారి వినతులను అమెరికాలో ఉండే డొమెస్టిక్‌ సర్వీసు ఏజెంటుకు అవి బదలాయించాల్సి ఉంటుంది. ‘అమెరికన్‌ ఉద్యోగులకు మంచి సర్వీస్‌ సెక్టార్‌ ఉద్యోగాలు రావలసిన అవసరం ఉంది. వారు మంచి వేతనాలు తీసుకోవాల్సి ఉంది.  దురదృష్టవశాత్తూ.. ఇక్కడి కాల్‌ సెంటర్‌ జాబులన్నీ భారతకు, ఫిలిప్పీన్స్‌కు, ఇతర దేశాలకు తరలిపోయాయి. గత దశాబ్ద కాలంలో విదేశాల్లో ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్ల సంఖ్య బాగా పెరిగింది. అక్కడి ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. పైగా అమెరికన్‌ పన్నుచెల్లింపుదారులు చెల్లించిన కోట్ల డాలర్లతో ఆయా కంపెనీలకు రాయితీలు, రుణాలను ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఉద్యోగాలు ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లిపోయాయి. అమెరికన్‌ ఉద్యోగాలను రక్షించుకోవడమే మా బిల్లు ఏకైక లక్ష్యం’ అని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో టెక్సాస్‌, అమెరికావ్యాప్తంగా ఉన్న కాల్‌సెంటర్‌ ఉద్యోగులకు రక్షణ లభిస్తుందని , అమెరికన్‌ వినియోగదారుల పట్ల అనుచిత ప్రవర్తనకు అవకాశం ఉండదని తెలిపారు. ‘అంతేకాదు.. ఉద్యోగాలను తరలించే కంపెనీలకు రాయితీలివ్వడం జరగదు. కాల్‌ సెంటర్లను అమెరికాలోనే ఉంచాలని ఈ బిల్లు చెప్పదు. కానీ ఇక్కడి నుంచి వేరే దేశాలకు తరలిస్తే మాత్రం ప్రభుత్వ గ్రాంట్లు రావని చెబుతుంది. ఆ కంపెనీలు వివేకంతో అర్థం చేసుకోవాలి’ అని మెకిన్లీ స్పష్టం చేశారు. కాగా.. ఇలాంటి బిల్లునే బరాక్‌ ఒబామా హయాంలో 2013లో కాంగ్రె్‌సలో ప్రవేశపెట్టారు. దీనికి అప్పట్లో ఆమోదం లభించలేదు. అమెరికాలో అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలని, వాటిని విదేశాలకు తరలించే కంపెనీలపై చర్యలు తప్పవని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిస్తున్న నేపథ్యంలో గ్రీన్‌, మెకిన్లీ తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు.
nation
15,251
26-02-2017 01:42:31
అఫ్ఘాన్‌ మసీదుపై ఐఎస్‌ కాల్పులు
10మంది పోలీసులు, ఓ మహిళ మృతి కాబూల్‌, ఫిబ్రవరి 25: ఆఫ్ఘానిస్థాన్‌లోని జాజ్వాన్‌ ప్రావిన్స్‌ ఉత్తర ప్రాంతంలో మసీదుపై ఐఎస్‌ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 11మంది మరణించారు. మృతుల్లో 10 మంది పోలీసులు, ఓ పోలీస్‌ కమాండర్‌ భార్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం వారంతా మసీదు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని జాజ్వాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. భర్తపై కాల్పులు జరగగానే బయటకు వచ్చిన కమాండర్‌ భార్య కూడా ఉగ్రవాదుల తూటాలకు బలైపోయినట్లు తెలిపారు. మరోవైపు.. గడిచిన రెండ్రోజుల్లో దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భద్రతా బలగాల దాడుల్లో 23మంది ఐఎస్‌ ఉగ్రవాదులు సహా 38మంది మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు ఆఫ్ఘాన్‌ హోంశాఖ ప్రకటించింది. అటు.. సిరియా ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ప్రభుత్వ ఆధీనంలోని హమ్స్‌లో భద్రతా బలగాల స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో 42మంది ప్రాణాలు కోల్పోయారు.
nation
2,957
02-02-2017 23:28:32
విజయా బ్యాంకు నికర లాభం రూ.230 కోట్లు
బెంగళూరు: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి విజయా బ్యాంకు నికర లాభం దాదాపు నాలుగింతలు పెరిగి 230.28 కోట్ల రూపాయలకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం 52.61 కోట్ల రూపాయలుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 3,237 కోట్ల రూపాయల నుంచి 3,714 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకు స్థూల మొండి పద్దులు (ఎన్‌పిఎ) 4.32 శాతం నుంచి 6.98 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు 2.98 శాతం నుంచి 4.74 శాతానికి ఎగబాకాయి. మొండి పద్దుల మొత్తం 278.72 కోట్ల రూపాయల నుంచి 424.17 కోట్ల రూపాయలకు చేరుకుంది.
business
12,129
25-07-2017 14:44:04
కోవింద్ ప్రసంగం స్ఫూర్తిదాయకం: మోదీ
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథో కోవింద్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కోవింద్ ప్రారంభోపన్యాసం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, భారతదేశం బలం, ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం సారాంశాన్ని అద్భుతంగా ఆయన ఆవిష్కరించారని ట్విట్టర్‌ పోస్ట్‌లో మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంగళవారంనాడు పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా ప్రమాణస్వీకారం చేసిన కోవింద్ తన ప్రసంగంలో డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ వంటి ఎందరో ప్రముఖులు నడిచిన రాజ్‌పథ్ దారిలో నడవడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు అప్పగించిన బాధ్యతలను వినమ్రంగా స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రపంచం ఒక కుటుంబం అనే ఫిలాసఫీని భారత్ బలంగా నమ్ముతుందన్నారు. మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కోవింద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణస్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కోవింద్ వెంట ఆయన భార్య సవిత కూడా ఉన్నారు.
nation
12,102
24-03-2017 16:43:35
కావేరీ జలాలు ఇవ్వలేం...తేల్చిచెప్పిన కర్ణాటక
బెంగళూరు: కావేరీ జలాలను తమిళనాడుకు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారంనాడు తేల్చిచెప్పింది. కర్ణాటక రాష్ట్రం స్యయంగా తాగునీటి కొరతను ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎంబి పాటిల్ మీడియాతో మాట్లాడుతూ 'తాగునీటి అవసరాలకు బాగా కొరత ఉంది. పుష్కలంగా నీళ్లుంటే విడుదల చేసి ఉండేవాళ్లం. బెంగళూరు, మైసూరు, పరిసర గ్రామాలకు 3 నుంచి 4 టీఎంసీల తాగునీటి కొరత ఉంది. అందవల్ల నీటిని విడుదల (తమిళనాడుకు) చేసే ప్రసక్తే లేదు' అని చెప్పారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు తమిళనాడుకు నీళ్లు విడుదల చేస్తారా అని మంత్రిని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, కర్ణాటకలో తాగునీటి సమస్యను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాష్ట్రానికి చెందిన లీగల్ టీమ్ ఈ అంశంపై దృష్టి సారిస్తుందని మంత్రి జవాబిచ్చారు. ప్రస్తుతానికైతే లీగల్ టీమ్ ఇంకా సమావేశం కాలేదన్నారు. కాగా, ఈనెల 21న విచారణ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్...తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ తమిళనాడుకు 20000 క్యూసెక్కుల కావేరీ జలాల విడుదలను కొనసాగించాలని కర్ణాటకకు స్పష్టం చేసింది.
nation
7,180
05-02-2017 11:46:26
హీరోయిన్‌పై అభిమానాన్ని చాటుకున్న వెన్నెల కిషోర్!
టాలీవుడ్‌లో కమెడియన్ కిషోర్ అంటే తెలియని వారుంటారేమో కానీ వెన్నెల కిషోర్ అంటే తెలియని వారుండరు. టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ స్టార్ కమెడియన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటాడు. ఈ మధ్యే తన ట్విట్టర్ అకౌంట్లో ఓ హీరోయిన్ ఫోటో పోస్ట్ చేసి లవ్ సింబల్‌ ఎమోజీలను పోస్ట్ చేశాడు. అయితే ఆ హీరోయిన్ తెలుగులో ఇంతవరకూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ ఆమె నటిస్తున్న తెలుగు సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. మలయాళ ప్రేమమ్ మలర్... అదేనండి సాయి పల్లవి. మలయాళ ప్రేమమ్ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె ఇటీవలే తన ఫేస్‌బుక్‌లో ఫ్లాష్ దట్ స్మైల్ అంటూ తన స్మైలీ ఫోటోను పోస్ట్ చేసింది. రెడ్ శారీలో చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫోటోకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ ఫిదా అయిన వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. సాయి పల్లవి స్మైల్‌కు ఫిదా అయిన వెన్నెల కిషోర్ ఆమెపై ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగులోకి ఈ ప్రేమమ్ టీచర్ ఎంట్రీ ఇస్తోంది.
entertainment
10,030
29-07-2017 22:04:02
ప్రేమ అబద్ధమా?
నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘లై’ (లవ్‌.. ఇంటలిజెన్స్‌.. ఎనిమిటీ) చిత్రం ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. వెంకట్‌ బోయినపల్లి సమర్పిస్తున్నారు. ఆగస్ట్‌ మొదటి వారంలో థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియజేస్తూ, ‘‘ఇటీవల విడుదల చేసిన ‘బాంభాట్‌..’, ‘మిస్‌ సన్‌షైన్‌..’ పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. టీజర్‌ను బాగా ఆదరించారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తర్వాత మా బేనర్‌లో హనుతో చేస్తున్న భారీ యాక్షన్‌ మూవీ ఇది. తప్పకుండా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు.
entertainment
2,784
03-10-2017 23:35:49
మాల్యా మళ్లీ అరెస్టు, విడుదల
లండన్‌: మనీ లాండరింగ్‌ కేసులో మాజీ లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా మంగళవారం నాడు లండన్‌లో అరెస్టయ్యారు. ఆ వెంటనే బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. ఎస్‌బిఐ కన్సార్షియం నుంచి తీసుకున్న 9,000 కోట్ల రూపాయల రుణాల్లో కొంతభాగాన్ని అక్రమంగా విదేశాలకు తరలించినట్టుగా విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కేసు నమోదు చేసింది. దాదాపు అరడజను దేశాల్లో ఉన్న డొల్ల కంపెనీల్లోకి ఈ నిధులు చేరినట్టుగా ఇడి ఆరోపించింది. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్‌ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసు అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. లండన్‌ పోలీసులు మంగళవారం నాడు ఆయన్ను అరెస్టు చేసిన కొద్దిసేపట్లోనే వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లండన్‌కు పరారైన తర్వాత మాల్యా అరెస్టయి విడుదల కావడం ఇది రెండో సారి. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల మేర రుణా లు తీసుకొని ఎగవేసిన మాల్యా గతేడాది మార్చిలో దేశం నుంచి పరారై లండన్‌లో ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌ -బ్రిటన్‌ మధ్య ఉన్న ఒప్పందాల మేరకు మాల్యాను భారత్‌కు అప్పగించాల్సింది విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు నేరస్తుల మార్పిడి ఒప్పందాల కింద ఈ ఏడాది మొదట్లో ఆయన అరెస్టుకు వారెంట్‌ జారీచేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన మాల్యా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయన్ను అరెస్ట్‌ చేశారు. తొలి కేసుకు సంబంధించి డిసెంబరు 4న న్యాయస్థానంలో మాల్యా హాజరుకావాల్సి ఉంది. మొదటిసారి బెయిల్‌ సందర్భంగా విధించిన షరతులనే ఈ సారి బెయిల్‌కు కూడా విధించారు. డిసెంబరు 4 నుంచి రెండు వారాల పాటు మాల్యా కేసుపై విచారణ జరుగనుంది. ఇడి తాజా కేసుతో మాల్యాకు వ్యతిరేకంగా ఉచ్చు బలంగా బిగుస్తోందని నిపుణులు అంటున్నారు. డిసెంబరు లో విచారణ తర్వాత మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో స్పష్టతకు అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నా తప్పేం లేదు.. కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడిన మాల్యా ఎప్పటిలానే, తనపై ఆరోపణలు కట్టుకథలని కొట్టిపారేశారు. తాను ఏ న్యాయస్థానం నుంచీ తప్పించుకు పోలేదని స్పష్టం చేశారు. కోర్టుకు హాజరుకావడం తన చట్టబద్ధమైన బాధ్యత అని అన్నారు. కోర్టుకు హాజరుకావడం సంతోషంగా ఉందని చెప్పారు. తన తప్పేం లేదని నిరూపించుకునే సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు.
business
3,850
21-12-2017 00:58:26
మోదీ, రాహుల్‌, జిగ్నేష్‌
గుజరాత్‌ ఫలితాల తరువాత మాట్లాడవలసింది మోదీ–రాహుల్‌ బలాబలాల గురించి కాదు, జిగ్నేష్‌ మెవానీ గురించి. ఆయన గెలుపు దేశవ్యాప్తంగా దళితులలో, ప్రజాస్వామ్యవాదులలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. అతను తన సామాజిక వర్గం గురించే కాదు, దేశభవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఫాసిజం అనే ప్రమాదం వాస్తవమైనదని, దాన్ని ఎదుర్కొని తీరతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కుతూహలం, ఉత్కంఠ నెలకొన్నాయి. ఒకదాని వెనుక ఒక రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఏకఛత్రాధిపత్యం దిశగా వెడుతున్న భారతీయ జనతాపార్టీకి, సుదీర్ఘకాలంగా అది అధికారంలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో చుక్కెదురు అవుతుందని, దానితో బిజెపి అవరోహణ మొదలవుతుందని ప్రతిపక్షాలవారు ఆశించారు. గుజరాత్‌ విజయంతో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం వస్తుందని బిజెపి శ్రేణులు భావించాయి. 2019 ఎన్నికలకు గుజరాత్‌ ఫలితాలు ఒక అంచనా అందిస్తాయన్నది పరిశీలకులందరూ అనుకున్నారు. అయితే, గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని, దేశంలో వాతావరణం తలకిందులవుతుందని గట్టి నమ్మకం ఎవరికీ లేదు. కాకపోతే, బిజెపికి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్నదని, ఎంతో కొంత బిజెపి బలాన్ని తగ్గించగలుగుతుందని ఒక సాధారణ అభిప్రాయం పోలింగ్‌ నాటికి నెలకొన్నది. ఓట్ల లెక్కింపు మొదటి గంటసేపు ఫలితాల ధోరణి, కాంగ్రెస్‌ విజయం ఖాయమనే తీరులోనే సాగింది. అంతిమంగా బిజెపి గెలిచింది. కాంగ్రెస్‌ బలపడింది. గుజరాత్‌ ఎన్నికల హడావుడిలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగడం, ఫలితాలకు ముందే అధికారికంగా రాహుల్‌ గాంధీ ఎన్నికను ప్రకటించడం జరగడంతో, ఈ ఎన్నికలు రాహుల్‌ నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా కూడా కనిపించాయి. బిజెపి ఘనవిజయం సాధించి ఉంటే, రాహుల్‌ ప్రతిష్ఠ బాగా దెబ్బతిని ఉండేది. బొటాబొటి విజయం కావడంతో రాహుల్‌గాంధీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దేశంలో రెండుపార్టీల పద్ధతి దాదాపుగా స్థిరపడిపోవడంతో, రాజకీయాలను ఆ చట్రం నుంచే చూడడం అలవాటు అయ్యింది. ప్రభుత్వ విధానాల వైఫల్యసాఫల్యాలు, అభ్యర్థుల మంచిచెడ్డలు వంటి అంశాలు కాక, పార్టీల అధినేతల వ్యూహరచనా సామర్థ్యం, సామాజిక శ్రేణుల నిర్వహణ మొదలైనవి రాజకీయ పరిశీలకులకు కొలమానాలుగా ఉంటు న్నాయి. గుజరాత్‌ అభివృద్ధిని నమూనాగా చెబుతూ దేశవ్యాప్తంగా ఓట్లు సంపాదించుకున్న నరేంద్ర మోదీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మాత్రం దాని ఊసెత్తితే ఒట్టు. లౌకికవాదం అనీ, సామాజిక న్యాయం అని పెద్ద మాటలు చెప్పే రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో ముస్లిముల మాట ఎత్తితే అపచారం అన్నట్టుగా వ్యవహరించడమే కాక, తాను ఎంత గొప్ప హిందువో చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఇటువంటి అవకాశ వాద నాయకులు ఒకరి తరువాత ఒకరు అధికారంలోకి వచ్చి ప్రజల అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే కానీ, దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగే స్థితిలో లేరు. రెండు శక్తులలో ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని దుస్థితి ఓటర్లది. కానీ, నిజమైన రాజకీయాలు, అధికారంలోనో ప్రతిపక్షంలోనో ఉన్న వారి ఇష్టాయిష్టాలను బట్టే కొనసాగవు. సోషల్‌ ఇంజనీరింగ్‌తోనో, బూత్‌ మేనేజ్‌మెంట్‌తోనో ఎల్లకాలం చక్రం తిప్పడం సాధ్యం కాదు. అధికారం అవినీతికి ఆస్కారమిస్తే, తిరుగులేని అధికారం అహంకారానికి కూడా దారితీస్తుంది. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో తెలియని దుస్థితిలోకి, తెలుసుకోనక్కరలేని మనస్తత్వంలోకి పాలకులు వెళ్లిపోతారు. ఈ అధికారం శాశ్వతమని, అణగిఉన్నవారు అణిగే ఉంటారని, ఏ పరిణామాన్నైనా తమ చాణక్యంతో ఎదుర్కొనగలమని ఒక అవాస్తవ అతిశయంలోకి నియంతలు జారిపోతారు. సామాజిక రాజకీయాలను, ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలను రద్దుచేసి, తిరిగి జాతీయ పార్టీల వైభవాన్ని తేగలమని, మతభావనలతోనో ఉద్వేగాలతోనో దేశాన్నంతా ఒక జాతిగా మార్చగలమని అనుకుంటే, అవి వారికి కోరుకోదగ్గ ఆకాంక్షలే కావచ్చును కానీ, అవాస్తవిక ఆలోచనా ధోరణికి చిహ్నాలు కూడా. భారతదేశంలో ప్రజల చైతన్యం సమాంతరంగా వృద్ధి చెందుతూనే ఉన్నది. అది ఒక్కోసారి ప్రధానస్రవంతి రాజకీయ కార్యక్రమాలలో ప్రతిఫలించవచ్చు, ఒక్కోసారి కేవలం ఉద్యమాలుగానే కనిపించవచ్చు. భారతీయ జనతాపార్టీ గత మూడేళ్ల పాలన, అధికార రాజకీయాలలో తన అధికార శతువ్రు అయిన కాంగ్రెస్‌ను దారుణంగా దెబ్బతీయగలిగి ఉండవచ్చు, అవినీతితో దుష్పరిపాలనతో కునారిల్లుతున్న కొన్ని ప్రాంతీయ శక్తులను కూడా బలహీనపరిచి ఉండవచ్చు. కానీ, కొత్త శత్రువులను, శక్తిశాలురైన కొత్త శత్రువులను తానే రూపొందించుకుంటున్నది. అప్రధానంగా, తేలికపాటిగా ప్రభుత్వమూ, మీడియా పరిగణించిన పరిణామాల గర్భం నుంచే కొత్త సమీకరణాలు, కొత్త నాయకత్వం అవతరిస్తున్నది. ఇది కొత్త వ్యక్తుల అవతరణ కాదు, నూతన రాజకీయ అజెండాల అవతరణ కూడా. విశ్వవిద్యాలయాల్లో ఛాందస భావాల వ్యాప్తి, విద్యార్థులపై అణచివేత చర్యలు కన్హయ్య కుమార్‌, షీలా రషీద్‌, అనిర్బాన్‌ వంటి గొంతుకలను రంగం మీదకు తీసుకువస్తే, గోరక్షణ పేరుతో హంతకదాడులు జిగ్నేష్‌ మెవానీ వంటి నాయకుడిని రూపొందించాయి. గుజరాత్‌ ఫలితాల తరు వాత మాట్లాడవలసింది మోదీ–రాహుల్‌ బలాబలాల గురించి కాదు, జిగ్నేష్‌ మెవానీ గురించి. అల్పేష్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పటేల్‌ కూడా చెప్పుకోదగ్గవారే, కానీ, జిగ్నేష్‌ మరింత ప్రత్యేకం. ఓబిసి ఉద్యమంలో పనిచేస్తున్న అల్పేష్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోయారు. పటీదార్ల సమస్యలకే పరిమితమై ఉద్యమించిన హార్దిక్‌పటేల్‌ కూడా, వయసు చాలక శాసనసభకు పోటీచేయలేదు కానీ, ఈ ఎన్నికల్లో గెలిచేవాడే. అతని పరిధి, అవగాహన పరిమితం. ఎన్నికల ఫలితాల అనంతరం, ప్రమాదకారులని నరేంద్రమోదీ హెచ్చరించిన కులతత్వశక్తులు ఈ ముగ్గురే. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌తో కలసి నడిచినా, జిగ్నేష్‌ గెలిచింది మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే. మాకు వేయకున్నా పరవాలేదు, నోటాకు వేయండి కానీ, జిగ్నేష్‌కు మాత్రం వేయవద్దు అని బిజెపి అతని నియోజకవర్గంలో ఓటర్లను ప్రాధేయపడింది. గుజరాత్‌లో ఉనా అనే చోట, పశుకళేబరాల చర్మం వలుస్తున్న దళితులను గోహంతకులని ఆరోపిస్తూ హింసించిన సంఘటన సంచలనం కలిగించింది. న్యాయవాది, మేధావి, అప్పటికే అనేక కార్మిక ఉద్యమాలలో పనిచేసిన జిగ్నేష్‌ ఉనా ఆందోళనకు నాయకత్వం వహించారు. దళితుల ఆత్మగౌరవ యాత్రను నిర్వహించారు. పశుకళేబరాలను తొలగించవద్దని దళితులకు పిలుపునిచ్చారు. అతను నిర్వహించిన ఉద్యమంలో ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థినాయకులు పాలుపంచుకున్నారు. గౌరీలంకేష్‌ జిగ్నేష్‌ను, ముగ్గురు విద్యార్థినాయకులను తన దత్తసంతానంగా ప్రకటించి ఆశీర్వదించారు. గుజరాత్‌లో 7శాతం మాత్రమే ఉన్న దళితులు ఉపకులాల పొరపొచ్చాలతో అనైక్యంగా ఉండేవారు. తమ ఉపకులం ప్రతినిధికే ఎన్నికలలో ఓటుచేసేవారు. మొదటిసారిగా జిగ్నేష్‌ వారిని ఏకం చేశారు. జిగ్నేష్‌ తండ్రి స్వయంగా పశుచర్మాలు వలిచే వృత్తిచేసినవారు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని అధ్యయనం చేసిన జిగ్నేష్‌, ప్రజా పోరాటాలపై వాస్తవ దృక్పథం కలిగినవారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎంత అవసరమో, వీదుల్లో పోరాటాలు చేయడమూ అంతే అవసరమని నమ్మేవారు. తన కర్తవ్యం గుజరాత్‌కే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా దళితుల ఏకీకరణకు పనిచేస్తానని చెబుతున్నారు. బిజెపి పాలన ఫాసిజమని, దానికి ముగింపు పలకడానికి ఎవరితోనైనా పనిచేస్తానని ఆయన అంటారు. వర్గసమస్యలకు పరిమితమై, వామపక్షవాదులు కులాన్ని విస్మరించారని ఆయన విమర్శిస్తారు. అదే సమయంలో దళితులు, వామ పక్షవాదులు సహజమిత్రులని అంటారు. అంబేద్కర్‌ను వ్యక్తిపూజతో ఆరాధిస్తూ, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకపోవడం అపచారమని, తనను గుడ్డిగా నమ్మడం బాబాసాహెబ్‌ అంగీకరించలేదని జిగ్నేష్‌ గుర్తు చేస్తారు. ఉనా ఆందోళన సందర్భంగా ప్రతి దళితకుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలన్న ఆర్థిక డిమాండ్‌ను కూడా ఆయన ప్రధానంగా ముందుకు తెచ్చారు. శాసనసభ్యుడిగా తన మొదటి బాధ్యత పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి ఆదాయాలను పెంచడమంటారాయన. భారత రాజ్యాంగం అస్పృశ్యతానిర్మూలన గురించి మాట్లాడుతుంది తప్ప, కులనిర్మూలన గురించి చెప్పలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. కులనిర్మూలన అంతిమ లక్ష్యమని, తానిప్పుడు దళితుడననే చెప్పుకోవాలని, కానీ, భవిష్యత్తులో తాను కూడా అట్లా చెప్పుకోనవసరం లేని విధంగా సమాజంలో సమానత్వం రావాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో అన్నారు. జిగ్నేష్‌ ఒకడే. కానీ, ఆయన గెలుపు దేశవ్యాప్తంగా దళితులలో, ప్రజాస్వామ్యవాదులలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. అతను తన సామాజిక వర్గం గురించే కాదు, దేశభవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఫాసిజం అనే ప్రమాదం వాస్తవమైనదని, దాన్ని ఎదుర్కొని తీరతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గుజరాత్‌ ఎన్నికల కూడికలు తీసివేతల్లో మిగిలిన విలువైన శేషం–జిగ్నేష్‌. మనకు తెలిసిన జిగ్నేష్‌ ఒక్కడే. కానీ, దేశంలో నలుమూలలా అనేకమంది జిగ్నేష్‌లు క్షేత్రస్థాయిలో ఉంటారు. వారిని గుర్తించవలసినది సమాజమే. వారి నుంచే నూతన రాజకీయ తరం ఉద్భవించాలి. జిగ్నేష్‌లది కులతత్వం కాదు. అంతిమంగా కులనిర్మూలనను సాధ్యం చేసే సామాజిక న్యాయవాదం. బిజెపి అనే మహాశక్తిని ఎదిరించడానికి రాహుల్‌ గాంధీ ఇవ్వాళ జిగ్నేష్‌ వంటివారితో కలిసి నడవవచ్చు. ప్రాధాన్యాల రీత్యా జిగ్నేష్‌లు కూడా రాహుల్‌ వంటివారికి చేయూత ఇవ్వవచ్చు. సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి నిలబడేంత నైతిక శక్తి కాంగ్రెస్‌కు లేదు. అంతిమంగా, జిగ్నేష్‌లు తమకు తామే, తమ సొంత మిత్రులతో మాత్రమే నడవాలి.గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కుతూహలం, ఉత్కంఠ నెలకొన్నాయి. ఒకదాని వెనుక ఒక రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఏకఛత్రాధిపత్యం దిశగా వెడుతున్న భారతీయ జనతాపార్టీకి, సుదీర్ఘకాలంగా అది అధికారంలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో చుక్కెదురు అవుతుందని, దానితో బిజెపి అవరోహణ మొదలవుతుందని ప్రతిపక్షాలవారు ఆశించారు. గుజరాత్‌ విజయంతో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం వస్తుందని బిజెపి శ్రేణులు భావించాయి. 2019 ఎన్నికలకు గుజరాత్‌ ఫలితాలు ఒక అంచనా అందిస్తాయన్నది పరిశీలకులందరూ అనుకున్నారు. అయితే, గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని, దేశంలో వాతావరణం తలకిందులవుతుందని గట్టి నమ్మకం ఎవరికీ లేదు. కాకపోతే, బిజెపికి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్నదని, ఎంతో కొంత బిజెపి బలాన్ని తగ్గించగలుగుతుందని ఒక సాధారణ అభిప్రాయం పోలింగ్‌ నాటికి నెలకొన్నది. ఓట్ల లెక్కింపు మొదటి గంటసేపు ఫలితాల ధోరణి, కాంగ్రెస్‌ విజయం ఖాయమనే తీరులోనే సాగింది. అంతిమంగా బిజెపి గెలిచింది. కాంగ్రెస్‌ బలపడింది. గుజరాత్‌ ఎన్నికల హడావుడిలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగడం, ఫలితాలకు ముందే అధికారికంగా రాహుల్‌ గాంధీ ఎన్నికను ప్రకటించడం జరగడంతో, ఈ ఎన్నికలు రాహుల్‌ నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా కూడా కనిపించాయి. బిజెపి ఘనవిజయం సాధించి ఉంటే, రాహుల్‌ ప్రతిష్ఠ బాగా దెబ్బతిని ఉండేది. బొటాబొటి విజయం కావడంతో రాహుల్‌గాంధీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దేశంలో రెండుపార్టీల పద్ధతి దాదాపుగా స్థిరపడిపోవడంతో, రాజకీయాలను ఆ చట్రం నుంచే చూడడం అలవాటు అయ్యింది. ప్రభుత్వ విధానాల వైఫల్యసాఫల్యాలు, అభ్యర్థుల మంచిచెడ్డలు వంటి అంశాలు కాక, పార్టీల అధినేతల వ్యూహరచనా సామర్థ్యం, సామాజిక శ్రేణుల నిర్వహణ మొదలైనవి రాజకీయ పరిశీలకులకు కొలమానాలుగా ఉంటు న్నాయి. గుజరాత్‌ అభివృద్ధిని నమూనాగా చెబుతూ దేశవ్యాప్తంగా ఓట్లు సంపాదించుకున్న నరేంద్ర మోదీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మాత్రం దాని ఊసెత్తితే ఒట్టు. లౌకికవాదం అనీ, సామాజిక న్యాయం అని పెద్ద మాటలు చెప్పే రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో ముస్లిముల మాట ఎత్తితే అపచారం అన్నట్టుగా వ్యవహరించడమే కాక, తాను ఎంత గొప్ప హిందువో చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఇటువంటి అవకాశ వాద నాయకులు ఒకరి తరువాత ఒకరు అధికారంలోకి వచ్చి ప్రజల అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే కానీ, దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగే స్థితిలో లేరు. రెండు శక్తులలో ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని దుస్థితి ఓటర్లది. కానీ, నిజమైన రాజకీయాలు, అధికారంలోనో ప్రతిపక్షంలోనో ఉన్న వారి ఇష్టాయిష్టాలను బట్టే కొనసాగవు. సోషల్‌ ఇంజనీరింగ్‌తోనో, బూత్‌ మేనేజ్‌మెంట్‌తోనో ఎల్లకాలం చక్రం తిప్పడం సాధ్యం కాదు. అధికారం అవినీతికి ఆస్కారమిస్తే, తిరుగులేని అధికారం అహంకారానికి కూడా దారితీస్తుంది. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో తెలియని దుస్థితిలోకి, తెలుసుకోనక్కరలేని మనస్తత్వంలోకి పాలకులు వెళ్లిపోతారు. ఈ అధికారం శాశ్వతమని, అణగిఉన్నవారు అణిగే ఉంటారని, ఏ పరిణామాన్నైనా తమ చాణక్యంతో ఎదుర్కొనగలమని ఒక అవాస్తవ అతిశయంలోకి నియంతలు జారిపోతారు. సామాజిక రాజకీయాలను, ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలను రద్దుచేసి, తిరిగి జాతీయ పార్టీల వైభవాన్ని తేగలమని, మతభావనలతోనో ఉద్వేగాలతోనో దేశాన్నంతా ఒక జాతిగా మార్చగలమని అనుకుంటే, అవి వారికి కోరుకోదగ్గ ఆకాంక్షలే కావచ్చును కానీ, అవాస్తవిక ఆలోచనా ధోరణికి చిహ్నాలు కూడా. భారతదేశంలో ప్రజల చైతన్యం సమాంతరంగా వృద్ధి చెందుతూనే ఉన్నది. అది ఒక్కోసారి ప్రధానస్రవంతి రాజకీయ కార్యక్రమాలలో ప్రతిఫలించవచ్చు, ఒక్కోసారి కేవలం ఉద్యమాలుగానే కనిపించవచ్చు. భారతీయ జనతాపార్టీ గత మూడేళ్ల పాలన, అధికార రాజకీయాలలో తన అధికార శతువ్రు అయిన కాంగ్రెస్‌ను దారుణంగా దెబ్బతీయగలిగి ఉండవచ్చు, అవినీతితో దుష్పరిపాలనతో కునారిల్లుతున్న కొన్ని ప్రాంతీయ శక్తులను కూడా బలహీనపరిచి ఉండవచ్చు. కానీ, కొత్త శత్రువులను, శక్తిశాలురైన కొత్త శత్రువులను తానే రూపొందించుకుంటున్నది. అప్రధానంగా, తేలికపాటిగా ప్రభుత్వమూ, మీడియా పరిగణించిన పరిణామాల గర్భం నుంచే కొత్త సమీకరణాలు, కొత్త నాయకత్వం అవతరిస్తున్నది. ఇది కొత్త వ్యక్తుల అవతరణ కాదు, నూతన రాజకీయ అజెండాల అవతరణ కూడా. విశ్వవిద్యాలయాల్లో ఛాందస భావాల వ్యాప్తి, విద్యార్థులపై అణచివేత చర్యలు కన్హయ్య కుమార్‌, షీలా రషీద్‌, అనిర్బాన్‌ వంటి గొంతుకలను రంగం మీదకు తీసుకువస్తే, గోరక్షణ పేరుతో హంతకదాడులు జిగ్నేష్‌ మెవానీ వంటి నాయకుడిని రూపొందించాయి. గుజరాత్‌ ఫలితాల తరు వాత మాట్లాడవలసింది మోదీ–రాహుల్‌ బలాబలాల గురించి కాదు, జిగ్నేష్‌ మెవానీ గురించి. అల్పేష్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పటేల్‌ కూడా చెప్పుకోదగ్గవారే, కానీ, జిగ్నేష్‌ మరింత ప్రత్యేకం. ఓబిసి ఉద్యమంలో పనిచేస్తున్న అల్పేష్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోయారు. పటీదార్ల సమస్యలకే పరిమితమై ఉద్యమించిన హార్దిక్‌పటేల్‌ కూడా, వయసు చాలక శాసనసభకు పోటీచేయలేదు కానీ, ఈ ఎన్నికల్లో గెలిచేవాడే. అతని పరిధి, అవగాహన పరిమితం. ఎన్నికల ఫలితాల అనంతరం, ప్రమాదకారులని నరేంద్రమోదీ హెచ్చరించిన కులతత్వశక్తులు ఈ ముగ్గురే. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌తో కలసి నడిచినా, జిగ్నేష్‌ గెలిచింది మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే. మాకు వేయకున్నా పరవాలేదు, నోటాకు వేయండి కానీ, జిగ్నేష్‌కు మాత్రం వేయవద్దు అని బిజెపి అతని నియోజకవర్గంలో ఓటర్లను ప్రాధేయపడింది. గుజరాత్‌లో ఉనా అనే చోట, పశుకళేబరాల చర్మం వలుస్తున్న దళితులను గోహంతకులని ఆరోపిస్తూ హింసించిన సంఘటన సంచలనం కలిగించింది. న్యాయవాది, మేధావి, అప్పటికే అనేక కార్మిక ఉద్యమాలలో పనిచేసిన జిగ్నేష్‌ ఉనా ఆందోళనకు నాయకత్వం వహించారు. దళితుల ఆత్మగౌరవ యాత్రను నిర్వహించారు. పశుకళేబరాలను తొలగించవద్దని దళితులకు పిలుపునిచ్చారు. అతను నిర్వహించిన ఉద్యమంలో ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థినాయకులు పాలుపంచుకున్నారు. గౌరీలంకేష్‌ జిగ్నేష్‌ను, ముగ్గురు విద్యార్థినాయకులను తన దత్తసంతానంగా ప్రకటించి ఆశీర్వదించారు. గుజరాత్‌లో 7శాతం మాత్రమే ఉన్న దళితులు ఉపకులాల పొరపొచ్చాలతో అనైక్యంగా ఉండేవారు. తమ ఉపకులం ప్రతినిధికే ఎన్నికలలో ఓటుచేసేవారు. మొదటిసారిగా జిగ్నేష్‌ వారిని ఏకం చేశారు. జిగ్నేష్‌ తండ్రి స్వయంగా పశుచర్మాలు వలిచే వృత్తిచేసినవారు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని అధ్యయనం చేసిన జిగ్నేష్‌, ప్రజా పోరాటాలపై వాస్తవ దృక్పథం కలిగినవారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎంత అవసరమో, వీదుల్లో పోరాటాలు చేయడమూ అంతే అవసరమని నమ్మేవారు. తన కర్తవ్యం గుజరాత్‌కే పరిమితంకాదని, దేశవ్యాప్తంగా దళితుల ఏకీకరణకు పనిచేస్తానని చెబుతున్నారు. బిజెపి పాలన ఫాసిజమని, దానికి ముగింపు పలకడానికి ఎవరితోనైనా పనిచేస్తానని ఆయన అంటారు. వర్గసమస్యలకు పరిమితమై, వామపక్షవాదులు కులాన్ని విస్మరించారని ఆయన విమర్శిస్తారు. అదే సమయంలో దళితులు, వామ పక్షవాదులు సహజమిత్రులని అంటారు. అంబేద్కర్‌ను వ్యక్తిపూజతో ఆరాధిస్తూ, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకపోవడం అపచారమని, తనను గుడ్డిగా నమ్మడం బాబాసాహెబ్‌ అంగీకరించలేదని జిగ్నేష్‌ గుర్తు చేస్తారు. ఉనా ఆందోళన సందర్భంగా ప్రతి దళితకుటుంబానికి ఐదెకరాల భూమి ఇవ్వాలన్న ఆర్థిక డిమాండ్‌ను కూడా ఆయన ప్రధానంగా ముందుకు తెచ్చారు. శాసనసభ్యుడిగా తన మొదటి బాధ్యత పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి ఆదాయాలను పెంచడమంటారాయన. భారత రాజ్యాంగం అస్పృశ్యతానిర్మూలన గురించి మాట్లాడుతుంది తప్ప, కులనిర్మూలన గురించి చెప్పలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. కులనిర్మూలన అంతిమ లక్ష్యమని, తానిప్పుడు దళితుడననే చెప్పుకోవాలని, కానీ, భవిష్యత్తులో తాను కూడా అట్లా చెప్పుకోనవసరం లేని విధంగా సమాజంలో సమానత్వం రావాలని ఆయన ఆ ఇంటర్వ్యూలో అన్నారు. జిగ్నేష్‌ ఒకడే. కానీ, ఆయన గెలుపు దేశవ్యాప్తంగా దళితులలో, ప్రజాస్వామ్యవాదులలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. అతను తన సామాజిక వర్గం గురించే కాదు, దేశభవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఫాసిజం అనే ప్రమాదం వాస్తవమైనదని, దాన్ని ఎదుర్కొని తీరతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గుజరాత్‌ ఎన్నికల కూడికలు తీసివేతల్లో మిగిలిన విలువైన శేషం–జిగ్నేష్‌. మనకు తెలిసిన జిగ్నేష్‌ ఒక్కడే. కానీ, దేశంలో నలుమూలలా అనేకమంది జిగ్నేష్‌లు క్షేత్రస్థాయిలో ఉంటారు. వారిని గుర్తించవలసినది సమాజమే. వారి నుంచే నూతన రాజకీయ తరం ఉద్భవించాలి. జిగ్నేష్‌లది కులతత్వం కాదు. అంతిమంగా కులనిర్మూలనను సాధ్యం చేసే సామాజిక న్యాయవాదం. బిజెపి అనే మహాశక్తిని ఎదిరించడానికి రాహుల్‌ గాంధీ ఇవ్వాళ జిగ్నేష్‌ వంటివారితో కలిసి నడవవచ్చు. ప్రాధాన్యాల రీత్యా జిగ్నేష్‌లు కూడా రాహుల్‌ వంటివారికి చేయూత ఇవ్వవచ్చు. సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి నిలబడేంత నైతిక శక్తి కాంగ్రెస్‌కు లేదు. అంతిమంగా, జిగ్నేష్‌లు తమకు తామే, తమ సొంత మిత్రులతో మాత్రమే నడవాలి.
editorial
12,412
30-06-2017 12:56:09
జీఎస్‌టీపై గుటకలు మింగిన మంత్రి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి నోళ్లనోనూ నానుతున్న ఒకే ఒక్క మాట జీఎస్‌టీ. ఈ అర్థరాత్రి (తెల్లారితే శనివారం) నుంచే వస్తు సేవల పన్ను అమల్లోకి రాబోతోంది. 'ఒకే దేశం ఒకే పన్ను' అంటూ ఊదరగొట్టేస్తూ తీసుకువస్తున్న జీఎస్‌టీపై ఎవరి అనుమానాలు వారికున్నారు. ఎవరి అపోహలు, అనుమానాలు, ఆందోళనలు ఎలా ఉన్న బీజేజీపి, ఆ పార్టీ అధికారంలో ఉన్న మంత్రులకు తప్పనిసరిగా ఈ కొత్త పన్నుల వ్యవస్థపై అవగాహన ఉండితీరాలి. డిబేట్‌లో పాల్గొంటూ ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ ఉండాలి. అయితే ఇందుకు భిన్నంగా యూపీ మంత్రి ఒకరు జీఎస్‌టీ అంటే ఏమిటో చెప్పమంటే నీళ్లు నమిలారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన మరెవరో కాదు...ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ, షెడ్యూల్ కులాలు, గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న రమాపతి శాస్త్రి. స్థానిక వ్యాపారులతో ఆయన జీఎస్‌టీ ప్రయోజనాల గురించి చెబుతున్నప్పుడు...జీఎస్‌టీ నిర్వచనం గురించి ఓ విలేఖరి ఆయన్ని ప్రశ్నించాడు. దాంతో ఆయన తెల్లముఖం వేశారు. వెంటనే తేరుకుని 'పూర్తి నిర్వచనం నాకు తెలుసు' అనేశారు. అయితే చెప్పండని మళ్లీ ఆ విలేఖరి అడక్కుండా....'నాకు తెలుసు. జీఎస్‌టీ గురించి మరింత తెలుసుకునేందుకు కీలక డాక్యుమెంట్లన్నీ తెప్పించుకుని పరిశీలిస్తున్నానని బుకాయించేశారు.
nation
12,662
09-02-2017 14:59:15
శశికళ కంటే ముందే పన్నీరు సెల్వంకు గవర్నర్ అపాయింట్‌మెంట్!
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులను గమనిస్తుంటే రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం రాజకీయాల్లో తలపండిన వారికి కూడా సాధ్యం కావడం లేదు. క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే శశికళ, పన్నీరు సెల్వం మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎవరి వైపు ఎంత మంది ఎమ్మెల్యేలున్నారనే విషయంపై ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం లేదు. ఎమ్మెల్యేలు శశికళ వైపే ఉన్నారని మొదట అందరూ భావించినా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  దాదాపు 50 మంది ఎమ్మెల్యేల దాకా పన్నీర్ పంచన చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కాసేపట్లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నై రానున్నారు. ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు పన్నీరు సెల్వం వెళ్లాలని భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పన్నీర్‌ సెల్వంకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాత్రి 7.30 నిమిషాలకు శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు. దీంతో ఇన్ని రోజుల నుంచి ఆధిపత్యం కోసం సాగిన ఈ పోరులో గవర్నర్ జోక్యంతో ఈ రాత్రికి ఒక స్పష్టత రానుంది.
nation
4,768
18-04-2017 15:47:37
మరో మెగా హీరోతో చాన్స్ కొట్టేసిన లావణ్య!
ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్న లావణ్యా త్రిపాఠీ.. మెగా క్యాంప్‌లో హ్యాట్రిక్ ఆఫర్ అందుకోబోతోందట. రీసెంట్‌గా 'మిస్టర్' సినిమాలో తళుక్కుమన్న లావణ్యా త్రిపాఠీ.. బాక్సాఫీస్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా మంచి కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. కొంతకాలంగా స్టడీగా కొనసాగుతున్న ఈ స్లిమ్ బ్యూటీ.. మెగా క్యాంప్‌లో అడుగుపెట్టాక మరింత స్పీడ్ పెంచింది. అల్లు శిరీష్‌తో 'శ్రీరస్తు- శుభమస్తు' చిత్రంలో నటించిన లావణ్య.. తాజాగా మెగా క్యాంప్‌లోనే హ్యాట్రిక్ ఆఫర్ అందుకోబోతోంది. సాయిధరమ్ తేజ్ సినిమాలో తళుక్కుమనబోతోంది. ప్రస్తుతం బీవీఎస్ఎన్ రవి డైరెక్షన్‌లో 'జై జవాన్' అనే సినిమాలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్.. ఇది పూర్తైన వెంటనే మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే లావణ్య హీరోయిన్‌గా ఎంపికైందట. ఇటీవలే అమ్మడికి స్క్రిప్ట్ వినిపించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని తెలుస్తోంది. మరోవైవు కోలీవుడ్‌లోనూ బిజీగా మారుతున్న లావణ్య.. భవిష్యత్తులో మెగాక్యాంప్‌లోని స్టార్ హీరోల సరసనా తళుక్కుమనే అవకాశాన్ని చేజిక్కించుకుంటుందేమో చూడాలి.
entertainment
5,283
02-12-2017 17:07:52
పెళ్లి తర్వాత హ.. హ.. హాసిని ఎంట్రీ..
తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో హాసిని గా ముద్దు ముద్దు మాటలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న జెనీలియా గత కొంతకాలంగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'సై', 'హ్యాపీ', 'బొమ్మరిల్లు', 'రెడీ' సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈమె.. తన తొలి సినిమా హీరో రితేష్ దేశముఖ్‌ను పెళ్లాడింది. పెళ్ళైన నాటి నుండి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేసింది. అయితే తాజాగా మరోసారి సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది జెనీలియా. ఇటీవల ముంబై లో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరైన ఈమె అక్కడ ఈ విషయాన్ని తెలిపింది. త్వరలో ఓ మరాఠి సినిమాలో మెయిన్ రోల్‌లో కనిపించనున్నానని చెప్పింది. ఈ సినిమాతో మొదలుపెట్టి సౌత్ లోని అన్ని భాషల్లో మరోసారి తన అందచందాలు, అల్లరి చేష్టలతో వెండితెరపై దర్శనం ఇస్తానని చెప్పుకొచ్చింది జెనీలియా.
entertainment
7,972
06-05-2017 00:08:58
‘వెంకటాపురం’లో హత్య!
గుడ్‌ సినిమా గ్రూప్‌ పతాకంపై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తుము ఫణికుమార్‌ నిర్మిస్తున్న సినిమా ‘వెంకటాపురం’. రాహుల్‌, మహిమా మక్వాన్ జంటగా నటించారు. వేణు దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మేం చాలా జాగ్రత్తలు తీసుకుని, ప్రేమించి చేసిన చిత్రమిది. ఓ యువతి హత్య నేపథ్యంలో సాగుతుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్ లో నడిచే యూత్ ఫుల్‌ థ్రిల్లర్‌. రాహుల్‌ న్యూ లుక్‌ కోసం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. మే 12న విడుదల చేస్తాం’’ అని చెప్పారు. కంటెంట్‌ని నమ్మి తీసిన చిత్రమని రాహుల్‌ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది కాన్సెప్ట్‌ ఫిల్మ్‌. కొత్తగా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి పాత్రా కొత్తగా అనిపిస్తుంది. కెమెరాపనితనం, సంగీతం సినిమాలో హైలైట్‌ అంశాలు’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, సహ నిర్మాతలు: ఉమాదేవి కూనపరాజు.
entertainment
3,077
31-01-2017 00:22:46
శ్రీ సిమెంట్‌ స్పెషల్‌ డివిడెండ్‌
న్యూఢిల్లీ: శ్రీ సిమెంట్‌ డిసెంబరు త్రైమాసిక నికర లాభంలో కేవలం 0.72 శాతం వృద్ధిని ప్రకటించింది. ఈ సంస్థ ఆర్జించిన లాభం 233.75 కోట్ల రూపాయల నుంచి 235.45 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర అమ్మకాలు 3.24 శాతం పెరిగి 2091.17 కోట్ల రూపాయలకు చేరాయి. సిమెంట్‌ అమ్మకాలపై ఆదాయం 11.73 శాతం పెరిగి 2063.99 కోట్ల రూపాయలకు చేరగా విద్యుత విభాగం నుంచి ఆదాయం 32.74 శాతం తగ్గి 246.47 కోట్ల రూపాయలకే పరిమితం అయింది. కర్ణాటకలోని కోడ్లా గ్రామంలో 1800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి 28 లక్షల టన్నుల క్లింకర్‌, 30 లక్షల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ ఏర్పాటుకు డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్టు కంపెనీ తెలిపింది. 10 రూపాయల ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుపై 100 రూపాయల ఏకకాల ప్రత్యేక డివిడెండ్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం బిఎ్‌సఇలో శ్రీసిమెంట్స్‌ షేరు 1.34 శాతం తగ్గి 15,677.30 రూపాయల వద్ద ముగిసింది.
business
11,114
26-02-2017 01:59:09
మీ ఫోన్‌కు సర్కారీ సమాచారం
ఈ-సంపర్క్‌ వేదికగా ప్రభుత్వ ప్రచారం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సమాచారం తెలియాలంటే వార్తా పత్రికలు చదవాలి. లేకుంటే న్యూస్‌ చూడాలి. ఈ రెండూ మిస్‌ అయితే నెట్‌లో వెదకాలి. వీటికి అనుబంధంగా ఇప్పుడు మరో వేదిక వచ్చింది. అదే ‘ఈ-సంపర్క్‌.’ దీంతో ప్రభుత్వం ప్రజలకు చెప్పదలచుకున్న సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌, వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా పంపుతోంది. ఇప్పటికే 380 అంశాలపై 21,471 కోట్ల సందేశా లు పంపింది. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై కూడా విస్తృతంగా సందేశాలు పంపేందుకు ఏ ర్పాట్లు చేస్తోంది. సమాచార సాంకేతికతను వాడుకోవటంలో మోదీ ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంతరా లు, మధ్యవర్తులు లేకుండా స్వయంగా పీఎంఓ ఈ సంపర్క్‌ను ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎనఐసీ) ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. పీఎంవో మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు కూడా ఈ వేదికను ఉపయోగించుకుని ప్రజలకు సమాచారాన్ని పంపించుకోవచ్చు. పంపిన సమాచారం ఎవరెవరికి చేరింది? ఎంత మంది ఎక్కువగా స్పందించారు? అన్న సమీక్ష కూడా జరపొచ్చు. ఈ మేరకు ఒక డ్యాష్‌బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మీకూ ప్రభుత్వ సందేశాలు కావాలంటే ’ఈ-సంపర్క్‌’ వెబ్‌సైట్‌ ద్వారా సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవచ్చు. 01122901707 నంబరుకూ మిస్డ్‌కాల్‌ ఇవ్వవచ్చు. ప్రధాని హోదాలో మోదీ ఇప్పటి వరకూ ఈ వేదికను ఉపయోగించుకుని పలు సందేశాలను పంపించారు. రైల్వే మంత్రి సురేశ ప్రభు ఇదే బాటలో నడిచారు. మనకీ బాత కార్యక్రమం గురించి ఎక్కువగా ఈ వేదిక ద్వారానే సందేశాలు పంపారు.
nation
18,002
02-10-2017 10:25:51
"పదే పదే ఆ మాట చెబుతున్నారు అందులో ప్రత్యేకతేముంది మోదీజీ?"
- ప్రధానిని ప్రశ్నించిన ఖర్గేబెంగళూరు: ‘ప్రధాని నరేంద్రమోదీ జపాన్‌, చైనా, థాయ్‌లాండ్‌దేశాల పర్యటనలో ‘నమో బుద్ధ’ అంటారు. యూరప్‌కు వెళ్ళినప్పుడు గౌతమబుద్ధుడి జన్మస్థలం నుంచి వచ్చామని గొప్పలు పోతారు. అయితే దేశంలో శాంతి ఉందా..?’ అంటూ లోకసభ కాంగ్రె్‌సపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. రాజ్యాంగనిర్మాత డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ బౌద్ధధర్మాన్ని స్వీకరించి 62 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ధర్మప్రవర్తన సదస్సులో పాల్గొన్నారు. అణగారిన వర్గాలు, నిరక్షరాస్యులను రాజకీయ అధికారంలోకి తీసుకురావాల్సి ఉందని అయితే రాజస్థాన్‌లో గ్రామసర్పంచ్‌ కావాలంటే 8వ తరగతి, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు కావాలంటే 10వ తరగతి పూర్తి చేయాలనే నిబంధన ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోని ప్రతివ్యక్తికి రాజకీయ పదవులు దక్కాల్సి ఉందన్నారు. దేశంలో ఇంకా 30శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారని ఈ నిబంధనతో వారందరినీ రాజకీయ పదవులకు దూరం చేసినట్లవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తాను చిన్నప్పుడు చాయ్‌అమ్మానని పలుసార్లు చెప్పుకుంటారని ఇందులో ప్రత్యేకత ఏముందన్నారు. తాను ఒక కార్మికుడి కుమారుడినని లోకసభలో ప్రతిపక్షనాయకుడిగా, గతంలో కేంద్రంలో కీలక మంత్రి పదవులలో కొనసాగలేదా.. అన్నారు. ఇది రాజ్యాంగం భారతీయులందరికీ కల్పించిన హక్కు అన్నారు. ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో ఇప్పటికీ స్వతంత్రం లేదని విచారం వ్యక్తం చేశారు. అందుకు పలు చోట్ల దాడులు, హింస కొనసాగుతున్నాయన్నారు.  ఇటీవలి కాలంలో బ్రాహ్మణులను విమర్శిస్తే గొప్పవారైనట్లు భావించుకుంటున్నారని, లింగాయతుల ఆరాధ్యం దైవం బసవణ్ణ అని, ఆయన నాగార్జున బ్రాహ్మణులనేది మరవరాదన్నారు. బ్రాహ్మణత్వంతో విరోధించవచ్చునని బ్రాహ్మణులను కాదన్నారు. బసవతత్వాల పట్ల అంబేద్కర్‌ ఆసక్తి చూపారన్నారు. జీవితంలో ఎవరు ఎవరిని కొలవాలనేది వారి వ్యక్తిగతమైన అంశమన్నారు.
nation
9,249
03-08-2017 17:50:04
చదువుకుంటూనే సినిమాలు చేస్తా: నివేదా థామస్
ఇన్నాళ్లూ పక్కింటి అమ్మాయిలా సాదాసీదాగా కనిపించిన నివేద తన అప్ కమింగ్ మూవీలో కొత్త లుక్‌తో ఆశ్చర్యపరచబోతోందట. అంతేకాదు నటనతో పాటు చదువునూ వీడనంటోంది ఈ మలయాళ మనోహరి. 'జెంటిల్మెన్', 'నిన్నుకోరి' చిత్రాల్లో కథానాయికగా నటించిన నివేదా థామస్ అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'జై లవకుశ'లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఎన్టీఆర్ గెటప్ రివీల్ అయినప్పటికీ నివేద లుక్ మాత్రం వెల్లడి కాలేదు. అయితే గత చిత్రాల్లో సాదాసీదాగా కనిపించిన నివేద 'జై లవకుశ'లో గ్లామర్ లుక్‌లో కనిపించనుందట. 'జై లవకుశ' సెట్‌లో స్టైలిష్ లుక్‌లో కొత్తగా కనిపిస్తోన్న తన ఫొటోను తాజాగా ట్వీట్ చేసింది నివేద. ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలకు పనిచేసే అశ్విన్ ఈ సినిమా కోసం నివేదకు స్టైలిష్ట్‌గా పనిచేస్తున్నాడు. నివేద ట్వీట్ చేసిన ఫొటోలో అశ్విన్ కూడా ఉన్నాడు. నటనపై ఆసక్తితో చదువును అటకెక్కించే వారే ఎక్కువ. కానీ నివేద మాత్రం కథానాయికగా బిజీగా ఉన్నప్పటికీ చదువును కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీఆర్క్ చదువుతోంది నివేదా థామస్. నాలుగేళ్ల కోర్సులో ఇది చివరి సంవత్సరం కాగా. తన చదువు కోసం సినిమా అవకాశాలను కూడా ఆచితూచి అంగీకరిస్తోందట. హీరోయిన్‌గా సెలబ్రిటీ హోదా వచ్చినప్పటికీ ఓ సాదాసీదా విద్యార్థిలా క్లాసులకు హాజరవుతోంది ఈ మలయాళ మనోహరి. ఓ వైపు తొలిసారి ‘జై లవకుశ’ ద్వారా స్టార్ హీరోతో సినిమా చేస్తున్న నివేద మరోవైపు చదువులోనూ సత్తా చాటుతుందన్న మాట. మరి నివేదకు ఆల్ ద బెస్ట్ చెబుదామా..!
entertainment
11,609
30-01-2017 03:34:49
ట్రంప్‌ను రానివ్వొద్దు
బ్రిటన్‌లో పిటిషన్‌..గంటల్లో లక్షల మంది సంతకాలు
nation
1,075
26-06-2017 22:51:15
ఆర్‌ఐఎల్‌ రూ.25 వేల కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) భారీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో డిబెంచర్లు జారీ చేయడం ద్వారా 25 వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు వాటాదారుల అనుమతి కోరనున్నట్టు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. వచ్చే నెల 21వ తేదీన నిర్వహిస్తున్న 40వ వార్షిక సర్వసభ్య సమావేశం అజెండాలో ఈ అంశం పెట్టినట్లు పేర్కొంది. ఒక్కోటి 25 వేల రూపాయల విలువ గల సెక్యూర్డ్‌/అన్‌సెక్యూర్డ్‌ రిడీమబుల్‌ నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్లను ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేయడం లేదా ఇన్వెస్ట్‌ చేయాల్సిందిగా ఆహ్వానించనున్నట్టు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. అలాగే 2017 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 10 రూపాయల పూర్తి పెయిడప్‌ ఈక్విటీ షేరుపై 11 రూపాయల డివిడెండు చెల్లింపును కూడా ఆ అజెండాలో ప్రతిపాదించినట్టు తెలిపింది. అంతే కాదు నీతా అంబానీని డైరెక్టర్‌గా తిరిగి నియమించే అంశం కూడా అందులో ఉంది.
business
9,941
07-10-2017 19:14:37
చైతూసామ్ జంటకు వెల్లువలా శుభాకాంక్షలు..
అక్కినేని వారింట్లో అడుగుపెట్టింది సమంత. నాగచైతన్యతో గోవాలో శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరుపుకోనుంది. చైతూ, సమంత ఇద్దరుకూడా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న నటులు కావడంతో వీరిద్దరి వివాహానికి వెల్లువలా శుభాకాంక్షలు వస్తున్నాయి. పెళ్లి హడావిడిలో కూడా ఓ వైపు నాగార్జున ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటే.. మరోవైపు సమంత సోషల్‌మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలపడం ఆసక్తి కలిగిస్తోంది. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి తర్వాత.. హైదరాబాద్‌లో ఘనంగా విందు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో సినీతారలతో పాటు పలువురు ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు అంతా పాల్గొననున్నారు.
entertainment
5,484
09-06-2017 17:23:02
బాలయ్య సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్!
ప్రతిష్ఠాత్మక వందో చిత్రంగా చారిత్రక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసిన నందమూరి బాలకృష్ణ.. 101వ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జట్టు కట్టాడు. ఈ సినిమాలో మాఫియా డాన్‌లా నందమూరి నటసింహం కనిపిస్తాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య 101వ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్‌ను తన ట్విట్టర్‌లో విడుదల చేశారు పూరీ జగన్నాథ్. ఎవరూ ఊహించని టైటిల్‌ను పూరీ తన మార్క్ స్టైల్లో పెట్టారు. ‘తేడా సింగ్’, ‘ఉస్తాద్’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నా.. వాటిని తోసిరాజని ‘పైసా వసూల్’ అంటూ డిఫరెంట్ టైటిల్‌ను సినిమాకు ఖరారు చేశారు. ఇక, ఫస్ట్ లుక్‌లో బాలయ్యను పూరీ తన మార్కు హీరోయిజంతో చూపించారు. భవ్య క్రియేషన్స్ బానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అనూప్ రూబెన్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి, బాలయ్య బర్త్‌డేకు విడుదలైన ‘పైసా వసూల్’ ఫస్ట్‌లుక్‌లు నందమూరి అభిమానులకు ఫీస్ట్ అవుతాయా!           తండ్రి ఎన్టీఆర్‌కు తమ్ముడిగా బాలకృష్ణ నటించిన సినిమా ఏదో తెలుసా..?
entertainment
17,248
02-04-2017 00:26:07
ఈపీఎఫ్‌ పెన్షనర్లకూ వైద్యసేవలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దాదాపు 58 లక్షల మంది ఈపీఎఫ్‌ పెన్షనర్లు అన్ని రకాల వైద్యసేవలు పొందనున్నారు. వారికి మెడికల్‌ బెనిఫిట్స్‌ అమలయ్యేలా త్వరలో ఓ పథకాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈపీఎ్‌ఫలో ఉద్యోగి రూ.6000 వరకు జమ చేసే మొత్తాలకు మాత్రమే వడ్డీ చెల్లించే నిబంధనను సడలించామని, ఇకపై రూ.15 వేల వరకు జమ చేసే మొత్తంపైనా వడ్డీని చెల్లిస్తామని తెలిపారు. బాల కార్మిక చట్టాలనూ సవరించామన్నారు. 14 ఏళ్ల లోపు బాల బాలికలు ఎలాంటి పని చేయడానికి వీల్లేదని చెప్పారు. 14-18 ఏళ్ల వయసున్న వారు ప్రమాదభరిత పరిశ్రమలు, సంస్థల్లో పని చేయరాదన్నారు. కోడ్‌ ఆఫ్‌ వేజెస్‌ చట్టాలను క్రోడీకరించి, ఒకే కోడ్‌ అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆసియా-పసిఫిక్‌ దేశాల సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ హైదరాబాద్‌ ఎన్‌ఐఆర్‌డీలో తమ శాఖను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ సంస్థకు ఇప్పటి వరకు ఢాకా, జకార్తాల్లోనే కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. చట్టాల్లో లొసుగులను ఆసరా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తేవడంపై కేంద్ర ఆర్థిక మంత్రితో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఈఎ్‌సఐ ప్రాంగణంలో సోమవారం సబ్‌ డివిజనల్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. రాంచీలో ఆదివారం రాష్ట్రపతి ఈఎ్‌సఐసీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
nation
20,857
23-07-2017 01:35:19
మెరిసిన విరాట్‌
రాణించిన రహానె, ధవన్‌, శర్మభారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాకొలంబొ : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌తో రెండు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీ (53) సహా భారత టాప్‌ బ్యాట్స్‌మెన్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌ లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 312 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 135/3తో భారత్‌ శనివారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించగా కోహ్లీ అర్ధసెం చరీతో పాటు, మిడిలార్డర్‌లో రహానె (40), రోహిత్‌ శర్మ (38), ధవన్‌ (41) రాణించారు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, రహానె రెండోరోజు మరో ఎనిమిది ఓవర్లు ఆడిన అనంతరం మిగిలిన బ్యాట్స్‌మెన్‌కు ఛాన్స్‌ ఇచ్చేందుకు రిటైరయ్యారు. అనంతరం రోహిత్‌, ధవన్‌ 16 ఓవర్లలో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రిటైరయ్యారు. చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం విశ్రాంతి తీసుకొని బరిలో దిగిన శర్మ..తనదైన శైలిలో వేగంగా ఆడాడు. ఒక బౌండ్రీ, రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఇక టెస్ట్‌ జట్టులో ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీపడుతున్న ధవన్‌ కూడా ఏడు ఫోర్లతో మెరిశాడు. ఆపై కీపర్‌ సాహా (36 నాటౌట్‌), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (13), జడేజా (18)కు కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన అనంతరం భారత్‌ మరోసారి ఫీల్డింగ్‌కు దిగే అవకాశమున్నా అందుకు నిరాకరించింది. భారత్‌-శ్రీలంక నడుమ తొలి టెస్ట్‌ 26న గాలెలో ప్రారంభమవుతుంది.
sports
9,915
16-12-2017 15:26:57
‘అజ్ఞాతవాసి’ టీజర్ కోసం అభిమానుల సందేశం
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు మాములుగా లేవు. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్ తెలిసినా పవన్ అభిమానుల ఆనందానికి అవధులే లేవంటే అతిశయోక్తి ఉండదేమో!. డిసెంబర్ 16 ‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదల అవుతుందని ఎప్పుడైతే చిత్ర యూనిట్ ప్రకటించిందో.. అప్పటి నుండి ‘అజ్ఞాతవాసి టీజర్ డే’ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది. టీజర్ విడుదల ఇంకొన్ని గంటలే ఉన్న సమయంలో సినిమాకి సంబంధించిన స్టిల్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో పవన్ కల్యాణ్ అభిమానులు నెట్ ప్రపంచాన్ని వదలలేకపోతున్నారు. టీజర్ 6 గంటల సమయంలో విడుదల అవుతుందని చెప్పినా.. వినకుండా ఒకవేళ ముందే విడుదల చేస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో వారు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండటం విశేషం. అంతేకాదు పవన్ అభిమానుల నుండి ఓ సందేశం కూడా ఇప్పటికే అభిమాన సంఘాలకి వచ్చేశాయి. అదేంటంటే ‘‘అజ్ఞాతవాసి మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు లేదా 6 తరువాత  వస్తుంది. మిత్రులారా ఈ టీజర్ రికార్డ్స్ మనకి చాలా అవసరం గుర్తుపెట్టుకోండి. దయచేసి వీడియో డౌన్లోడ్ చేసి వీడియో వాట్సప్ గ్రూప్‌లలో, ఫేస్ బుక్ టైమ్ లైన్‌లలో పోస్ట్ చేయకండి. కేవలం వీడియో యూట్యూబ్ లింక్ మాత్రమే సెండ్ చేయండి..’’ అంటూ అభిమానులు సృష్టిస్తున్న అలజడి చూస్తుంటే.. ‘అజ్ఞాతవాసి’ టీజర్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గురించిన ఈ క్విజ్ పూర్తి చేసే అభిమానులెందరు? చిరంజీవి, ఎన్టీఆర్, మోహన్ బాబు.. విషయం తెలియాలంటే క్విజ్ ఆడండి
entertainment
10,901
08-10-2017 11:07:15
నా కూతురు నాకు కలిసొచ్చింది: మురళీమోహన్
ఓ వారాలబ్బాయి జయభేరి 10(గతవారం తరువాయి)అలా మూడునెలలూ గడిచాయి. మా ఆవిడను కాపురానికి పంపడానికి వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకున్నారు. విజయవాడలో కాపురం పెట్టాలి. అప్పుడు నాకు వచ్చే జీతం వంద రూపాయలు. ఆ విషయాన్నే ఆవిడతో కూర్చుని మాట్లాడాను. ‘మీరు ఏమీ ఆలోచించకండి, ఫర్లేదు సర్దుకుందాం’ అని ధైర్యమిచ్చింది. అనుకూలవతి అయిన భార్య దొరకడంకంటే అదృష్టం ఏం ఉంటుంది? అనిపించింది ఆ క్షణం. మా అమ్మావాళ్లు, వాళ్ల పుట్టింటివాళ్లు కలిసి ఆవిడను కాపురానికి తీసుకొచ్చారు. వస్తున్నప్పుడే ఆవిడ వాళ్ల ఇంటి నుంచి పప్పులు, పచ్చళ్లు అన్నీ తెచ్చేసింది. ‘మీరు ధైర్యంగా ఉండండి’ అంటే అర్థం ఇదా అని మనసులో అనుకున్నా. దాని గురించి నేనెప్పుడూ ఆవిడ దగ్గర ప్రస్తావించలేదు. వాళ్ల ఇంటినుంచి ఏమేం తెచ్చేదో తానూ నాకు ఎప్పుడూ చిట్టారాసి చదవలేదు. మనసులోని మాటలను ఒకరికొకరం అర్థం చేసుకుంటూ సాగాం. అలా ఆ నెల గడిచింది. ఒకరోజు చిన్నాన్నగారు ఇంటికి వచ్చారు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక ‘ఒరే అబ్బాయ్‌.. ఫ్యామిలీ పెట్టావు కదా.. బెజవాడలో వందరూపాయలతో జీవితబండిని లాగడం కష్టం. ఈ నెల నుంచి 150రూపాయలు తీసుకో’ అన్నారు. వెంటనే మా ఆవిడవైపు చూశా. ‘అమ్మాయివైపు చూడ్డం దేనికిరా.. నాకు తెలుసుకదా. ఇదిగో అమ్మాయి 150రూపాయలు, చెయ్యిపట్టు’ అని ఆవిడ చేతిలోపెట్టి వెళ్లిపోయారు.  రిక్షాలో సినిమాకిఉన్నపళాన జీతం సగం ఎక్కువ కావడంతో మాకు ఏ లోటూ అనిపించలేదు. జీతం పెరిగిందని ఆవిడ వాళ్ల ఊళ్లో పండే దినుసులను తీసుకురావడం మానలేదు. పచ్చళ్లు, పొడులు.. ఇటు మా అమ్మ కూడా పంపేది. చేతిలో 150 రూపాయలు ఉండేవి. దాంతో ఆవిడను నెలకు దర్జాగా రెండుసినిమాలకు తీసుకెళ్లేవాడిని. అది కూడా నేను మనసులో కోరుకున్నట్టు రిక్షాలో వెళ్లేవాళ్లం. వస్తూ వస్తూ పచారీ కొట్లో సామాన్లు తెచ్చుకునేవాళ్లం. ఇంటికి అవసరం అనిపించినవి ఏవి కొనాలన్నా ఇద్దరం వెళ్లేవాళ్లం. ఆ అలవాటు ఎంతగా మారిందంటే కూరగాయలు కావాలన్నా, చివరకు మాంసంకొట్టుకు వెళ్లాలన్నా ఆవిడను వెంటపెట్టుకునే వెళ్లేవాడిని. అంతటి అన్యోన్యంగా సాగుతున్న మా సంసారానికి చిహ్నంగా ఆవిడ నెలతప్పింది.  అమ్మాయి పుట్టింది !ఇంటి పనులూ, వంట పనులూ తనే చేసుకునేది. ఎప్పుడైనా నేను సాయం చేయడానికి ముందుకెళ్లినా ‘మీరు వద్దండి. నేను చేసుకోగలను’ అని నవ్వుతూ చెప్పేది. ఏలూరులో ఆసుపత్రిలో రెగ్యులర్‌గా చెకప్‌కి తీసుకెళ్లేవాడిని. మా ఊరికి ఏలూరు దగ్గర కాబట్టి నెలలు నిండేసరికి మా ఇంటికి పంపించేశాను. నేను మాత్రం విజయవాడలోనే ఉండేవాడిని. ఒకరోజు ఏలూరువెళ్తే, ‘మరేం ఫర్వాలేదు. మేమందరం ఉన్నాం. నువ్వు వ్యాపారంమీద శ్రద్ధపెట్టు. నొప్పులు మొదలవగానే కబురుపెడతాం’ అని మావాళ్లు నన్ను పంపించేశారు. సరేనని విజయవాడకు వచ్చేశా. షాప్‌ తెరిచి కాసేపయ్యాక ఏదో పనిమీద గుంటూరు వెళ్లా. అక్కడ మా పైపుల గురించి మాట్లాడుతుండగా ఒకతను పరుగుపరుగున నా దగ్గరకు వచ్చాడు. ‘రాజబాబుగారూ..తమరి భార్య నొప్పులు పడుతున్నారంటండీ. తమరికి చెప్పమని ఇంటినుంచి ఫోను చేశారండీ. బ్యాంకు మేనేజర్‌గారు మీకు కబురివ్వమన్నారండీ’ అని చెప్పారు. ఎందుకో నాకు టెన్షన్‌ మొదలైంది. సరేనని వెళ్లినపని సగంలోనే వదిలేసి, వెంటనే అక్కడినుంచి ఏలూరు బస్సు ఎక్కేశా. నా తొందరకు, బస్సు ఆలస్యానికి లెక్క కుదరలేదు. నాకేమో ఎన్నెన్నో ఆలోచనలు.. ‘నొప్పులు పడుతోందంట.. ఎలా ఉందో? ఏమో? సేఫ్‌గా డెలివరీ అవుతుందో లేదో.. కొంతమందికి ఆపరేషన్లు కూడా చేస్తారట.                   మరి ఈమెకు ఏం చేస్తారో..’ ఇలా అనుకుంటూ వెళ్లా. తీరా బస్సు దిగి ఆసుపత్రికి వెళ్లేసరికి చెమటలు కక్కసాగాయి. నా పరిస్థితికి మా వాళ్లు లోపల్లోపల నవ్వుకునే ఉంటారు. కానీ ‘అమ్మాయి పుట్టిందిరా. తల్లీబిడ్డా బావున్నారు. ఆరోగ్యంగా ఉందని డాక్టర్‌ చెప్పింది. చేతులుకాళ్లు కడుక్కుని రా..చూద్దువుగానీ’ అన్నారు. మనసులోనే దేవుళ్లందరికీ దణ్ణం పెట్టుకున్నా. ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే ఆనందంతో తబ్బిబ్బయ్యా. కాళ్లూచేతులూ కడుక్కుని ఆసుపత్రి గదిలోకివెళ్లా. పాప నన్ను చూడగానే నవ్వినట్టు అనిపించింది. చిన్నపాపలను ఎలా పట్టుకోవాలో తెలియదు. కానీ ఎత్తుకోవాలనే ఆతృత. ఆ తొందరలో మా ఆవిడను పలకరించడం కూడా మర్చిపోయా. బిడ్డను ఎలా ఎత్తుకోవాలా? అని సంశయిస్తుంటే..‘జాగ్రత్తగా మెడకింద చెయ్యివేయి. జాగ్రత్తగా పట్టుకో’ అని అమ్మ అంది. ఎలా పట్టుకోవాలో మా సిస్టర్స్‌ దగ్గరకొచ్చి చూపించారు. జాగ్రత్తగానే, కాస్త భయపడుతూ పట్టుకున్నా. తొలిబిడ్డను తండ్రి ఎత్తుకోవడం.. అదో మరపురాని అనుభూతి. అనుభవించినవారు కూడా మాటల్లో చెప్పలేరు.              కాసేపు నాబిడ్డను ఎత్తుకున్న ముచ్చటతీరాక ఆవిడవైపు చూశా. మామూలుగా పురిటిగదిలోకి వెళ్లగానే ఏ పురుషుడైనా పుట్టినబిడ్డవైపు మమకారంగా చూసుకుని మురిసిపోతాడు. ఆ తర్వాతే భార్యను పలకరిస్తారు. కానీ నిజానికి ముందు పలకరించాల్సింది భార్యనే కదా..ఈ విషయం నా మనసులో అంతకుముందు ఎన్నోసార్ల్లు మెదిలింది. కానీ ఆ సమయం వచ్చేసరికి నేను కూడా అందరిలాగానే మారిపోయా. నా బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూసుకున్నాక, మా ఆవిడను పలకరించా. ‘ఆరోగ్యం కుదుటపడిందా? నీరసంగా ఉందా?..’ ఇలా ఏవో అడిగా. నిజానికి అవి ఆ సమయంలో అడగదగ్గవేనా? అలాగే అడగాలా? అలానే అడుగుతారా? నాక్కూడా తెలియదు. బిడ్డనూ, తల్లినీచూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆనందంతో ఏం మాట్లాడానో తెలియకుండా మాట్లాడేశా. స్త్రీ తన భర్తను తండ్రిగా మార్చిన ఆ క్షణం.. భర్త కూడా బిడ్డగా మారడం గమనిస్తుందేమో. నా శ్రీమతీ అంతేనేమో. నేనడిగిన ప్రశ్నలు అన్నిటికీ నవ్వుతూ సమాధానమిచ్చి ‘పాపకి ఏం పేరు పెడదామండీ’ అని అడిగింది.  పాపకి నేనే పేరు పెట్టా!        మా ఆవిడ ‘పేరు’ ప్రస్తావన తీసుకురాగానే ‘నేనే పెడతాను. మంచి పేరు పెడతాను’ అన్నా. ‘మీరే పెట్టండి. అంతకన్నా భాగ్యమా’ అంది. అప్పుడు నాకు ‘మధుమతి’ అనే సినిమా గుర్తుకొచ్చింది. ‘మధుమతి’ హిందీ సినిమా. ఆ రోజుల్లో తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా బాగా చూసేవాడిని. దిలీప్‌కుమార్‌గారు హీరోగా, వైజయంతిమాల హీరోయిన్‌గా ‘మధుమతి’ సినిమా విడుదలైంది. అందులో వైజయంతిమాలగారి పేరు మధుమతి. హీరో ఆమెను మధూ అని పిలుస్తుంటారు. సినిమా నాకు బాగా నచ్చేసి ఆరోజుల్లోనే 25, 30 సార్లు చూశా. ఆ ప్రేమతో పాపకు మధుమతి అని పేరుపెట్టాలని నిర్ణయించుకున్నా.  మా ఆవిడతో ‘మన పాపకు మధుమతి అని పేరు పెడదాం’ అన్నా.‘చాలా బావుందండీ’ అని చెప్పింది. ‘బావుండటం కాదు. అందులో చిన్న లాజిక్‌ కూడా ఉంది’ అన్నా.‘లాజిక్కేంటి?’ అనుమానంగా చూసింది.‘ఏం లేదోయ్‌.. నెంబర్‌ 1. అది నాకు ఇష్టమైన సినిమా పేరు. నెంబర్‌ 2. ఏంటంటే.. మా నాన్నగారి పేరు మాధవరావు. మా అమ్మ పేరు వసుమతి. నాన్నగారి పేరులో నుంచి మధు, అమ్మగారి పేరు నుంచిమతి తీసుకుని మధుమతి అని పేరు పెట్టుకుంటాను అని చెప్పా’‘అబ్బో..’ అన్నట్టు ఆనందంగా, అభినందనగా చూసింది.సరేనని కుటుంబ నియంత్రణ ప్రస్తావన తీసుకొచ్చా. ‘మనకు ఒక బిడ్డ చాలు. కుటుంబ నియంత్రణ చేయించుకో’ అని చెప్పా.       ‘ఒక్క బిడ్డ కాదండీ. ఇంకొకరు ఉంటే బావుంటుంది. ఇంకొక్కసారి ఆలోచించండి’ అని చెప్పింది. మాతోపాటు ఉన్న మా పెద్దవాళ్లు కూడా ‘అదేంట్రా ఒక బిడ్డ ఏం చాలు.. అసలు ఆ మాటలేంటి? ఇంకొకరు కావాల్సిందే’ అని గట్టిగా చెప్పారు. అప్పుడు మా ఆవిడచేతిని నా చేతిలోకి తీసుకుని.. ‘తర్వాత పుట్టేది ఆడైనా, మగైనా ఫర్వాలేదు. ఇద్దరు పిల్లలు చాలు. నువ్వు కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాల్సిందే. లేకుంటే నేనైనా చేయించుకుంటా’ అని చెప్పా. అప్పటికి నేను ఆపరేషన్‌ గురించి గట్టిగా పట్టుబట్టకపోయేసరికి మా ఆవిడకి రిలీఫ్‌గా అనిపించింది.  కూతురు కలిసొచ్చిందిపాపను మూడునెలలకే నేను బెజవాడకు తీసుకొచ్చేశాను. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా? ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఉండేది నా పరిస్థితి. మధు అంటే ప్రేమ పెరిగింది. కొత్తగా ఏం చూసినా కొనాలనిపించేది. ఆటబొమ్మలు ఎన్నిఉన్నా కొత్తగా ఏవోఒకటి తెస్తూనే ఉండేవాడిని. ‘ఇంకా బోర్లాపడటం కూడా చేతకాదు. అప్పుడే అన్ని బొమ్మలు తెస్తున్నారేంటి?’ అనేది మా ఆవిడ. తను ఆడుకోనక్కర్లేదు. ‘రంగురంగుల బొమ్మలను చూసినా నాకు సంతోషమే’ అని నేను సమాధానమిచ్చేవాడిని. నా ప్రేమ మా పాపకు కూడా అర్థమైపోయినట్టుంది. సాయంత్రం నేను ఇంటికి వచ్చేసమయానికి తను గేటువైపు చూస్తూ ఉండేదట.         అప్పట్లో నాకు మోటార్‌ సైకిల్‌ లేదు. సైకిల్‌ ఉండేదంతే. సాయంత్రం కాగానే సైకిల్‌మీద ఇంటికి వచ్చేవాడిని. మా ఇంటి ముందు గేటు ఉండేది. ఆ గేటు తీయగానే సౌండ్‌ వచ్చేది. ఆ సౌండ్‌ వినగానే నిద్రపోతున్న పాపకూడా వెంటనే లేచి, హుషారుతో దిక్కులు చూసేది. అందులోనూ గేటువైపు చాలా ఆసక్తిగా చూసేది. నేను కూడా ఆ విషయం రెండు, మూడుసార్లు గమనించాను. గమనించడంతోపాటు ప్రతిరోజూ ఇంటికి వెళ్లగానే మా ఇంటి మహారాణితో కాసేపు కబుర్లు చెప్పేవాడిని. ‘మీరు చెప్పడమేకానీ మధుకి అవేం అర్థమవుతాయి?’ అనేది మా ఆవిడ. ‘నా సంతోషం నాది.. నీకేంటి?’ అనేవాడిని. అలా కాసేపు కబుర్లయ్యాక భోజనాలు కానిచ్చేవాళ్లం.ఇందాకటినుంచీ.. మా ఇల్లు అని చెబుతుంటే మేం సొంతంగా కొన్న ఇల్లు అనుకునేరు....అప్పటికి నేను ఇల్లు కొనలేదండీ. అద్దెఇల్లే. ఒక పెద్దాయన ఇంటి ఔట్‌హౌస్‌కి నలభైరూపాయలు అద్దెకడుతూ ఉండేవాళ్లం. ఇంతకీ ఆ ఇంటి ఓనర్‌ పెద్దాయన ఎవరంటే.. (ఇంకా ఉంది)– డా. చల్లా భాగ్యలక్ష్మి సుమన్, విజయశాంతి గురించి ఈ విషయం మీకు తెలుసా?  చైతూని పెళ్లి కొడుకు చేసింది ఎవరో తెలుసా?
entertainment
18,328
02-08-2017 16:54:18
లష్కరే కమాండర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పాక్ 'నో'
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లో మంగళవారంనాడు భద్రతా దళాలు మట్టుబెట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబూ దుజనా మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి పాక్ నిరాకరించింది. దీంతో దుజనా మృతదేహాన్ని జమ్మూకశ్మీర్‌లోని ఉరిలో పూడ్చిపెట్టనున్నట్టు తెలుస్తోంది. లష్కరే కమాండర్ అబూ దుజనా మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకునే విషయాన్ని న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు దృష్టికి తీసుకువెళ్లాలని హోం శాఖను తాము కోరనున్నట్టు బుధవారం ఉదయం కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫో పోలీస్ మునిర్ ఖాన్ తెలిపారు. ఒకవేళ అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లకపోతే తామే అంత్యక్రియలు జరిపిస్తామని కూడా ఆయన చెప్పారు. అంత్యక్రియలకు ముందు దుజనా తల్లిదండ్రులకు అతడి మృతదేహాన్ని చూపించాలని పోలీసు అధికారులు కోరుతున్నందున పాక్ హైకమిషన్‌ను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. తీవ్రవాద వ్యతిరేక దాడుల్లో మరణించిన ఓ పాకిస్తానీ మృతదేహాన్ని అప్పగిస్తామంటూ అధికారులు పాక్ కమిషన్‌ను సంప్రదించడం ఇదే తొలిసారి. అబూ దుజనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ నివాసి. మరోవైపు అంత్యక్రియల కోసం దుజనా మృతదేహాన్ని స్థానికులకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కశ్మీర్‌తో సంబంధం లేని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులకు అప్పగించడంలో అర్థంలేదని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అబూ దుజానా మృతదేహాన్ని తీసుకునేందుకు పాక్ నిరాకరించడంతో ఉరీలోనే పూడ్చిపెడతారని తెలుస్తోంది.శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లో మంగళవారంనాడు భద్రతా దళాలు మట్టుబెట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది అబూ దుజనా మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి పాక్ నిరాకరించింది. దీంతో దుజనా మృతదేహాన్ని జమ్మూకశ్మీర్‌లోని ఉరిలో పూడ్చిపెట్టనున్నట్టు తెలుస్తోంది. లష్కరే కమాండర్ అబూ దుజనా మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకునే విషయాన్ని న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు దృష్టికి తీసుకువెళ్లాలని హోం శాఖను తాము కోరనున్నట్టు బుధవారం ఉదయం కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫో పోలీస్ మునిర్ ఖాన్ తెలిపారు. ఒకవేళ అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లకపోతే తామే అంత్యక్రియలు జరిపిస్తామని కూడా ఆయన చెప్పారు. అంత్యక్రియలకు ముందు దుజనా తల్లిదండ్రులకు అతడి మృతదేహాన్ని చూపించాలని పోలీసు అధికారులు కోరుతున్నందున పాక్ హైకమిషన్‌ను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. తీవ్రవాద వ్యతిరేక దాడుల్లో మరణించిన ఓ పాకిస్తానీ మృతదేహాన్ని అప్పగిస్తామంటూ అధికారులు పాక్ కమిషన్‌ను సంప్రదించడం ఇదే తొలిసారి. అబూ దుజనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ నివాసి. మరోవైపు అంత్యక్రియల కోసం దుజనా మృతదేహాన్ని స్థానికులకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కశ్మీర్‌తో సంబంధం లేని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులకు అప్పగించడంలో అర్థంలేదని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అబూ దుజానా మృతదేహాన్ని తీసుకునేందుకు పాక్ నిరాకరించడంతో ఉరీలోనే పూడ్చిపెడతారని తెలుస్తోంది.
nation
12,838
14-10-2017 12:05:26
శబరిమల దేవస్థానం చీఫ్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై : ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు చీఫ్ ప్రయర్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రేపాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ శబరిమల దేవస్థానంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన పక్షంలో మర్యాదస్థుల కుటుంబాల్లోని మహిళలు దాన్ని పాటించరన్నారు. వ్యక్తిగతమైనదేదీ లేదన్నారు. ఆచార, సంప్రదాయాలతోపాటు భద్రత కూడా ముఖ్యమేనన్నారు. 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులైన మహిళలు దేవాలయంలోకి ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, మర్యాదస్థుల కుటుంబ సభ్యులెవరైనా ప్రవేశించరని అన్నారు. సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో, ఎటువంటి భద్రత లేకుండా మహిళలు కొండలను ఎలా ఎక్కగలుగుతారని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను తప్పుబడుతున్నవారిపై గోపాలకృష్ణన్ విరుచుకుపడ్డారు. శబరిమలను థాయ్‌లాండ్‌గా మార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. ఒకవేళ శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తే, ఇదొక యాత్రా కేంద్రంగా మారిపోతుందన్నారు.
nation
353
24-03-2017 23:33:20
కోల్‌ ఇండియాకు రూ. 591 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి రంగంలోని ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియాకు 591 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ప్రకటించింది. బొగ్గు సరఫరాకు సంబంధించిన ఒప్పందాల్లో అసంబద్ధమైన షరతులు విధిస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్టు సిసిఐ తెలిపింది. పోటీ స్ఫూర్తికి విరుద్ధమైన వ్యాపార విధానాలకు స్వస్తిచెప్పాలని కూడా కోల్‌ ఇండియాను సిసిఐ ఆదేశించింది. విద్యుత ఉత్పత్తి సంస్థలకు నాన్‌-కోకింగ్‌ కోల్‌ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన వ్యాపార ఒప్పందాల్లో కోల్‌ అసంబద్ధమైన, వివక్షతో కూడిన షరతులను విధించడాన్ని సిసిఐ 56 పేజీల ఉత్తర్వుల్లో తీవ్రంగా తప్పుబట్టింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా పరస్పరఅంగీకార యోగ్యంగా ఉండే విధంగా ఒప్పందం ముసాయిదాలను ఖరారు చేయకుండా తన చిత్తం వచ్చిన షరతులతో పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్షంగా ఇంధన సరఫరా ఒప్పందాలను కోల్‌ ఇండియా ఖరారు చేస్తోందని సిసిఐ ఆక్షేపించింది. ఈ ఉల్లంఘనలకు గానూ 591.01 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. 2009-10 నుంచి 2011-12 మధ్య మూడేళ్ల కాలంలో కోల్‌ ఇండియా సగటు టర్నోవర్‌ను లెక్కలోకి తీసుకొని అందులో ఒక శాతాన్ని జరిమానాగా విధించారు. గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు.. వీటి మధ్య ఎలాంటి బేధభావం లేకుండా ఒప్పందాల విషయంలో అందరితోనూ సమంగా వ్యవహరించాలని కోల్‌ ఇండియాకు సిసిఐ హితవు చెప్పింది.
business
1,858
20-05-2017 01:52:26
ఎస్‌బిఎస్ తో టీవీఎస్‌ జూపిటర్‌
హైదరాబాద్‌ : స్కూటర్‌ మార్కెట్లో టీవీఎస్‌ జూపిటర్‌ సంచలనం సృష్టిస్తోంది. మార్కెట్లోకి విడుదల చేసిన 30 నెలల కాలంలోనే 10 లక్షల యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దేశీ రహదారులపై 16 లక్షల జుపీటర్‌ స్కూటర్లు దౌడు తీస్తున్నాయి. తాజాగా సింక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌బిఎస్)తో సరికొత్త జూపిటర్‌ను టీవీఎస్‌ తీసుకువచ్చింది. వెనుక బ్రేక్‌ను వినియోగించినపుడు ఆటోమెటిక్‌గా ముందు వీల్‌ బ్రేక్‌లు యాక్టివేట్‌ అవుతాయని టీవీఎస్‌ తెలిపింది. 1275 ఎంఎం తో జూపిటర్‌ వీల్‌బే్‌సను రూపొందించినట్లు పేర్కొంది. టీవీఎస్‌ జూపిటర్‌ బేస్‌ వెర్షన్‌ ధర 53,171 రూపాయల (బెంగళూరు ఎక్స్‌షోరూమ్‌)ని తెలిపింది.
business
508
06-06-2017 02:03:42
రూ.22.4 లక్షల కోట్లకు చేరనున్న ఐటి పరిశ్రమ
ముంబై : కొన్ని ఇబ్బందులున్నా భారత ఐటి-బిపిఎం పరిశ్రమ వృద్ధికి ఎలాంటి ఢోకా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏటా 15,000 కోట్ల డాలర్లున్న (సుమారు రూ.9.60 లక్షల కోట్లు) పరిశ్రమ టర్నోవర్‌ 2025 నాటికి 35,000 కోట్ల డాలర్లకు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం రూ.22.4 లక్షల కోట్లు) చేరుకుంటుందని నాస్కామ్‌ కార్యనిర్వాహక మండలి సభ్యుడు కేశవ్‌ మురుగేష్‌ చెప్పారు. గత మూడేళ్లలో ఆరు లక్షల కొత్త కొలువులు సృష్టించిన ఐటి-బిపిఎం రంగంలో ముందు కాలంలో కూడా ఉపాధి కల్పన భారీగానే ఉంటుందన్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులూ ఐటి రంగానికి మేలు చేస్తాయన్నారు.
business
5,793
28-10-2017 11:01:18
ట్రైల‌ర్ బాగోలేద‌ని చెప్పా.. ద‌ర్శ‌కుడు తిట్టాడు: స‌ందీప్ కిష‌న్‌
`వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌` సినిమాతో ఘ‌న‌విజ‌యం అందుకున్న యువ హీరో సందీప్ కిష‌న్‌.. ఆ త‌ర్వాత ఆ స్థాయి స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయాడు. ఇటీవ‌ల ఆయ‌న చేసిన సినిమాలేవీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు. దీంతో త‌ను ఎంత‌గానో అభిమానించే కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `న‌క్ష‌త్రం` సినిమా చేశాడు. అది కూడా దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ సినిమా గురించి, డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో సందీప్ మాట్లాడాడు. `కృష్ణ‌వంశీతో ప‌నిచేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాను. `న‌క్ష‌త్రం` సినిమాతో ఆ అవ‌కాశం వ‌చ్చినందుకు ఎంతో ఆనందించా. ప్రాణానికి తెగించి చాలా ప్ర‌మాద‌క‌ర యాక్ష‌న్ సన్నివేశాలు చేశా. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని స‌గంలోనే నాకు తెలిసిపోయింది. నిజానికి ఆ సినిమా ట్రైల‌రే నాకు న‌చ్చ‌లేదు. ఆ విష‌యమే ద‌ర్శ‌కుడికి చెప్పా. ఆయ‌న న‌న్ను తిట్టాడ`ని సందీప్ తెలిపాడు.
entertainment
8,814
07-10-2017 12:08:47
నా చేతిలో సినిమాల్లేవు అనుకున్నా పర్వాలేదు: అనుష్క
ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోనంటోంది అనుష్క. అరుంధతి సినిమాతో తన ఆకలి తీరిపోయిందని.. ఇక ఆ రేంజ్ సినిమా వస్తుందనుకోలేదని తెలిపింది. కానీ అదృష్టవశాత్తు బాహుబలి, రుద్రమదేవి కథలు తనకు దొరికాయంటోంది. "ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ ఆకలి తీరిన తర్వాతే కొత్త రుచులు కావలనిపిస్తుంది. ఇదే విషయం సినిమాల్లోనూ వర్తిస్తుంది." అంటోంది. కేరీర్ ప్రారంభంలోనే అరుంధతితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో అదరగొట్టింది.  ఆ రేంజ్ సినిమాలు చేసిన తర్వాత మళ్లీ చిన్న సినిమాల జోలికి వెళ్లలేరు కదా.. అందుకే కథల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తున్నానంటోంది. తన చేతిలో సినిమాలు లేవు అనుకున్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటే ఇప్పటి వరకూ చేసిన సినిమాల్ని అపహాస్యం చేసినట్టవుతుందని పేర్కొంది అనుష్క. ఆమె అప్ కమింగ్ మూవీ భాగమతి 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
11,113
18-07-2017 12:26:08
రాజ్యసభకు రాజీనామా చేస్తా : మాయావతి
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండోరోజే రాజ్యసభ రసాభాసగా మారింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే దళితుల సమస్యలపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ మాయావతి పట్టుబట్టారు. మాట్లాడుతుండగానే త్వరగా ముగించాలంటూ డిప్యూటీ స్పీకర్ కురియన్ కోరడంతో ఆమె ఆగ్రహావేశానికి గురయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో దళితులపై వేధింపులు ఎక్కువయ్యాయనీ... తనను మరికొంతసేపు మాట్లాడనివ్వాలని ఆమె కోరారు. తనను మాట్లాడనివ్వకపోతే రాజ్యసభ సభ్యుత్వానికి రాజీనామా చేస్తానన్నారు. అయితే పూర్తి చర్చ కోసం డిమాండ్ చేయవచ్చుగానీ, పూర్తి సమయం మాట్లాడతానంటే కుదరదని కురియన్ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించారు.  అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకపోవడంతో... కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కలుగజేసుకున్నారు. సభాపతి స్థానాన్ని ధిక్కరించినందుకు మాయావతి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభాపతి తన గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ మాయావతి సభనుంచి వాకౌట్ చేశారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. మిగతా బీఎస్పీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి బిగ్గరగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం 2గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.
nation
9,343
20-11-2017 18:14:30
‘జవాన్’ అందుకే వదులుకున్నాను: హరీష్ శంకర్
సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పిస్తున్న చిత్రం జవాన్. డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమర్పకుడిగా దర్శకుడు హరీష్ శంకర్ పేరు వినిపించింది. కానీ దిల్ రాజు ఈ సినిమా సమర్పకుడిగా ఎంటరవ్వడానికి గల కారణాన్ని హరీష్ శంకర్ ఈ వేడుకలో వివరించారు. ‘‘ఈ సినిమా ప్రారంభం తర్వాత 'దువ్వాడ జగన్నాథం' సినిమా షూటింగుతో బిజీబిజీగా.. ఆ సినిమా కోసమే టైమ్ మొత్తం కేటాయించాల్సి వచ్చింది. దీంతో 'జవాన్' సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం సాధ్యపడలేదు. ఇంక లాభం లేదనుకుని ‘డీజే’ నిర్మాత అయిన దిల్ రాజుగారికి ఈ ప్రాజెక్టు ఇచ్చేశాను. సాయిధరమ్‌కి కూడా దిల్ రాజు గారంటే మంచి గురి ఉంది. ఇదే ఈ సినిమా నుంచి నేను తప్పుకోవడానికి కారణం. అంతే తప్ప దీని వెనుక ఎటువంటి రహాస్యాలు లేవు" అంటూ హరీష్ శంకర్ తెలిపారు.
entertainment
17,922
10-03-2017 15:59:56
ఎగ్జిట్ పోల్స్‌ ఓ ఫార్స్..!
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌ పేరుతో వదంతులు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహరించడమేనంటూ పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటాన్ని పలు పార్టీలు తప్పుపట్టాయి. ఫలితంపై శనివారంనాడే స్పష్టతవస్తుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ పేరుతో వరుస కథనాలను టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. వాస్తవ అంశాలపై దృష్టి సారించడానికి బదులు వదంతులు, అబద్ధాలను గుదిగుచ్చి ప్రసారం చేయడమేమిటని నిలదీశారు. 'టీవీ ఛానెల్స్‌పై వచ్చే ఒత్తిడి నేను అర్థం చేసుకోగలను. జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై ఆ ఛానెల్స్ దృష్టి పెట్టడం లేదు. ఎగ్జిట్ పోల్స్ వరుస ప్రసారాలు, పేనలిస్టులతో ఊదరగొట్టే చర్చలు వంటివి ప్రజాస్వామ్య దేశంలోని ప్రజల తెలివితేటలను కించపరచడం కిందే లెక్క' అని ఆమె అన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది. పూర్తి మెజారిటీతో అఖిలేష్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత రవిదాస్ మెహ్రోత్రా అన్నారు. అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువయ్యాయని, ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా అంతేనని అన్నారు. అసలు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనని సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ తర్వాత తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. మరో 24 గంటలు ఆగితే ఆ విషయం ఏమిటో తేలిపోతుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ పెద్ద పార్టీగా నిలుస్తుందని, పంజాబ్‌లో సాద్-బీజీపీ కూటమికి దెబ్బపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారంనాడు వెలువడనున్నాయి.
nation
6,242
16-09-2017 17:31:09
బాలీవుడ్‌పై రకుల్ కన్ను
సౌత్‌లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేసింది. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఓ సినిమా మీదే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.టాలీవుడ్, కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకొనే హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరసలో ఉంటుంది. ఆమెకు దక్షిణాదినే కాకుండా ఉత్తరాది‌లో కూడా ఇప్పుడు భలే డిమాండ్ ఏర్పడింది . సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన ప్రస్తుతం 'అయియారీ' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది రకుల్ . సిద్ధార్ధ్ కు ఈ మధ్యకాలంలో హిట్స్ ఏమీ లేవు కనుక అతడ్ని నమ్ముకోనవసరం లేదు. కానీ ఈ సినిమాకి దర్శకుడు నీరజ్ పాండే . అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా కోసం టెన్షన్ పడుతోంది. నీరజ్ పాండే బాలీవుడ్ మంచి పేరున్న డైరెక్టర్. ఎన్నో ఉత్తమ చిత్రాల్ని తీసిన ట్రాక్ రికార్డుంది. ఓపెనింగ్స్ అద్బుతంగా ఉండడమే కాకుండా రీచ్ కూడా బాగా ఉంటుంది. గతంలో ఒక చిన్న హిందీ సినిమాలో మాత్రమే నటించిన రకుల్‌కు ఇది బాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇస్తుందని ఆమె అభిలాష. ఈ సినిమా హిట్టయితే ఒక్కసారిగా స్టార్ హీరోల దృష్టిలో పడొచ్చని రకుల్ ఆశ. అందుకే ఈ సినిమా విడుదల కోసం రకుల్ ఆసక్తి చూస్తోంది. సౌత్‌లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నా, బాలీవుడ్‌లో మాత్రం రెమ్యూనరేషన్‌తో పనే లేదంటోంది. మరి ఈ సినిమాతో రకుల్ బాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాలి.
entertainment
14,848
02-10-2017 01:29:16
అరుణాచల్‌ సరిహద్దులకు చైనా రోడ్డు
బీజింగ్‌, అక్టోబరు 1: అరుణాచల్‌ప్రదేశ్‌పై కన్నేసిన చైనా.. టిబెట్‌ గుండా ఆ రాష్ట్ర సరిహద్దు దాకా వేసిన 409కి.మీ.ల ఎక్స్‌ప్రెస్‌ వేని ఆదివారం ప్రారంభించింది. దాదాపు రూ.37వేల కోట్లతో చైనా.. టిబెట్‌లోని లాసా నుంచి న్యింగ్చి వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేని నిర్మించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే గుండా చైనా ఆర్మీ తమ బలగాలు, ఆయుధాలను రవాణా చేయనున్నట్లు సమాచారం.
nation
15,490
24-12-2017 02:04:02
16 వేల మంది కావాలట!
ఈ బాబా.. మామూలోడు కాదు!వీరేంద్ర దీక్షిత్‌పై 1998లోనే కేసులుఆశ్రమాల్లో మహిళలపై అత్యాచారాలుదేశవ్యాప్తంగా 80 ఆశ్రమాలుయూపీలో 47 మందిని కాపాడిన పోలీసులు ఆశ్రమాల్లో మహిళలపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా 80 ఆశ్రమాలుయూపీలో 47 మందిని కాపాడిన పోలీసులున్యూఢిల్లీ, డిసెంబరు 23: ఆధ్యాత్మికత పేరుతో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మరో డేరా బాబా.. వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 16 వేల గోపికలను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా.. అమ్మాయిల తల్లిదండ్రులతో బలవంతంగా సంతకాలు చేయించుకొంటూ వారిని ఆశ్రమాల్లో ఉంచుకుంటున్న దీక్షిత్‌ అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ బాబా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ ఆశ్రమంపై పోలీసులు దాడి చేసి 41 మంది మహిళలను రక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు తీగ లాగుతుంటే దీక్షిత్‌ డొంక కదులుతోంది. పరారీలో ఉన్న ఈ బాబాపై 1998లోనే నాలుగు సామూహిక అత్యాచారం కేసులు నమోదైనట్లు గుర్తించారు. అంతేకాదు అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై తన అనుచరులతో కలిసి దాడి చేయడంతో దీక్షిత్‌పై మరో కేసు నమోదైంది. అదే ఏడాది అతనిపై విద్యుత్తు చౌర్యం కేసు కూడా నమోదైంది.  2011లో ఓ మహిళను హతమార్చేందుకు ఆమెను అపహరించారంటూ మహారాజ్‌గంజ్‌లో మరో కేసు నమోదైంది. ఫరూకాబాద్‌లో అత్యాచారం కేసులు పెట్టిన మహిళలంతా ఆశ్రమానికి చెందినవారేనని ఓ పోలీసు అధికారి తెలిపారు. 1997లో సామూహిక అత్యాచారం జరగ్గా.. బాధితులు ఆశ్రమం నుంచి తప్పించుకొని బయటపడిన తర్వాత 1998లో దీక్షిత్‌తో పాటు అతని అనుచరుడు రవీందర్‌ దాస్‌పై ఫిర్యాదు చేశారు. ‘‘ఫరూకాబాద్‌ జిల్లాలో దీక్షిత్‌పై ఏడెనిమిది క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం. ఆయా కేసులపై అలహాబాద్‌ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న దీక్షిత్‌.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు’’ అని కాన్పూర్‌ డీఐజీ అలోక్‌ సింగ్‌ తెలిపారు. దీక్షిత్‌.. బాబాగా మారాడిలా...దీక్షిత్‌ 1942లో ఫరూకాబాద్‌ జిల్లాలోని అహ్మద్‌గంజ్‌ గ్రామంలో జన్మించాడు. తర్వాత అతని కుటుంబం కంపిల్‌కు మకాం మార్చింది. 1965లో కంపిల్‌లో ప్రాథమిక పాఠశాల, కల్యాణ్‌గంజ్‌లోని బాలికల పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1969లో గుజరాత్‌ వర్సిటీ నుంచి సంస్కృతంలో పరిశోధన ప్రారంభించాడు. అదే ఏడాది రాజస్థాన్‌లోని మౌంట్‌ అబులో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చేరాడు. కొన్ని దశాబ్దాల తర్వాత బాబాగా మారి, దేశవ్యాప్తంగా 80 ఆశ్రమాలను నెలకొల్పాడు. ‘‘1984లో దీక్షిత్‌ ఓ అమ్మాయిని రేప్‌ చేయడంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. తండ్రి చనిపోయిన తర్వాత దీక్షిత్‌ మౌంట్‌ అబు నుంచి ఇక్కడికొచ్చాడు. ఇంటిని కూలగొట్టి ఆశ్రమం కట్టాడు’’ అని కంపిల్‌లోని ఆశ్రమం ఎదురుగా నివసిస్తున్న దేవ్‌సింగ్‌ యాదవ్‌ చెప్పారు. ఢిల్లీలోని రోహిణి ఆశ్రమంలో పోలీసులు దాడులు చేస్తున్న సమయంలోనే కంపిల్‌ ఆశ్రమం నుంచి ఆరుగురు మహిళలను ఓ వ్యాన్‌లో తరలించినట్లు సమాచారం. యూపీలో మరో 47 మందిని.. యూపీ పోలీసులు దీక్షిత్‌కు చెందిన సిక్తర్‌బాద్‌, కంపిల్‌లోని రెండు ఆశ్రమాలపై దాడులు జరిపి, 47 మంది మహిళలతో పాటు ఓ బాలికను కాపాడారు. ఆశ్రమాల్లో ఉన్నవారు ప్రతిఘటించడంతో పోలీసులు పక్క భవనాలపైనుంచి ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌, పోలీసులు కలిసి శనివారం రాజధానిలోని ద్వారకలో ఉన్న మరో ఆశ్రమంలో ఐదుగురు అమ్మాయిలను కాపాడారు.
nation
4,560
07-07-2017 00:34:37
రుద్రమ మరణం 1289లోనే...
సమకాలీన సాహిత్య గ్రంథాలు రుద్రమ మరణాన్ని ఎందుకు పేర్కొనలేదంటే... రుద్రమ అప్పటికి 82 సంవత్సరాలు పైబడిన వృద్ధ స్త్రీ అని. అందునా వృద్ధురాలిని అంబదేవుడు చంపటం వీరత్వంగా కాక ఆనాటికి పేరుబడసిన మహాతల్లిని చంపిన నీచత్వంగా భావించటమే. అది వీరత్వంగా అంబదేవుడు తన శాసనాలల్లో ప్రకటించుకునే లోపే అతన్ని ప్రతాపరుద్రుడు చంపాడు. రుద్రమ యుద్ధంలోనే మరణించిందా?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో జూన్‌ 18న డాక్టర్‌ ముప్పాళ్ల హనుమంతరావు రాసిన వ్యాసంలో– పరబ్రహ్మశాస్త్రి రాసినట్లు రుద్రమదేవి క్రీ.శ. 1289లో అంబదేవుడనే సామంతునితో జరిగిన యుద్ధంలో మరణించలేదని, కాబట్టే సమకాలీన శాసనాలు, సాహిత్య గ్రంథాలు ఆ విషయాన్ని పేర్కొనలేదని ఆయన తెలిపారు. పరబ్రహ్మశాస్త్రి కంటే ముందుకాలపు చరిత్రకారులు భావించినట్లుగా రుద్రమదేవి క్రీ.శ. 1295 లో సహజ మరణం చెందిందని తెలుగువారి చరిత్రను మళ్ళీ సవరించుకోవాలని ఆయన సూచించారు. హనుమంతరావు కొత్త సందేహాలకు శాస్త్రీయమైన శాసనాధారిత సమాధానాలు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌, బెంగళూరు కేంద్రం వారు 2011లో ప్రచురించిన ‘ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ కాకతీయాస్‌ ఆఫ్‌ వరంగల్‌’ అనే గ్రంథం పుటలు 480–547లో లభిస్తాయి. రుద్రమదేవి క్రీ.శ. 1289లో చనిపోయింది కాబట్టి చందుపట్ల శాసనంతో పాటు మరో 7శాసనాలు ఆమెకు శివలోకంలో పుణ్యం, ధర్మం కలగాలని ఆమె సామంతులు, అధికారులు ఆయా ఆలయాలకు/దేవుళ్ళకు దానాలు చేసిన వివరాలు క్లుప్తంగా రాస్తాను. రుద్రమదేవి మరణాన్ని ధ్రువీకరించే/సూచించే వివరాలున్న శాసనాలు:– 1289 నవంబర్‌ 25న నల్గొండ జిల్లా చందుపట్ల శాసనంలో ‘రుద్రమ మహాదేవి శివలోకానికి విచ్చేస్తేని.. శివలోక ప్రాప్తిగాను’; 1289లో నల్గొండ జిల్లా సర్వేల్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు పున్నెముసేసి’; 28–11–1289లో గుంటూరు జిల్లా ఈపూరు శాసనంలో ‘రుద్ర దేవ మహారాజులకు ధర్మార్థముగా’; 11–8–1291 కృష్ణా జిల్లా గుడిమెట్ట శాసనంలో రుద్రదేవ మహారాజులు’; ధనువు, సంక్రాంతినాడు గుంటూరు జిల్లా లామ్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు ధర్మువుగా’; నల్గొండ జిల్లా పానగల్‌ (ఛాయా సోమేశ్వరం గోడపై) శాసనంలో ‘రుద్రదేవ మహారాజునకు పుణ్యముగాను’; 7–6–1294లో నెల్లూరు జిల్లా వేంపాడు శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు అభివృద్ధిగాను’ ఇవి. పైన పేర్కొన్న శాసనాల్లో కనిపించే ‘రుద్రదేవ మహారాజు’ అంటే రుద్రమదేవియే. ఆమెను ఎక్కువ శాసనాల్లో మహారాజు అనే సంబోధించారు. నిజానికి ‘మహారాజు’ అని పిలువబడిన తొలి కాకతీయ రాజు/రాణి ఆమెనే. రాజులు బతికి ఉన్నప్పుడు కూడా వారికి ‘పుణ్యముగాను’ అంటూ వారి సామంతులు, అధికారులు దానాలు చేసే సాంప్రదాయం ఉండేది. కాబట్టి పై శాసనాల్లో పుణ్యముగాను, ధర్మార్థముగా, ధర్మువుగా అనే పదాలను పేర్కొనేవాటిని రుద్రమదేవి బతికి ఉన్నప్పుడే వేయించిన శాసనాలుగా భావించినా చందుపట్ల శాసనంలో ‘శివలోకానికి విచ్చేస్తేని’ ‘శివలోక ప్రాప్తిగాను’ అనే మాటలు ఉన్నవికాబట్టి అవి రుద్రమదేవి మరణాన్నే సూచిస్తాయని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ శాసనం పేర్కొన్న శక సంవత్సరం ‘విరోధి’ క్రీ.శ. 1289లోనే వచ్చింది. కాబట్టి రుద్రమ ఆ సంవత్సరంలో చనిపోయిందని చెప్పడానికి అభ్యంతరముండదు. ఇక వేంపాడు శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు అభివృద్ధిగాను’ అని పేర్కొన్న వాక్యంలో కనిపించే రుద్రదేవ మహారాజు అంటే కాకతీయ చివరి రాజు (రుద్రమ వారసుడు/మనుమడు) ప్రతాపరుద్రుడే. ఆయనను చాలా శాసనాలు షార్ట్‌కట్‌గా రుద్రదేవుడని, రుద్రుడని, కుమార రుద్రుడని, కుమార ప్రతాపుడని పలు రకాలుగా పేర్కొన్నాయి. కాబట్టి క్రీ.శ. 1289 నుంచి రుద్రదేవ మహారాజును పేర్కొన్న శాసనాలు ప్రతాపరుద్రునికి పుణ్యముగా/ధర్మర్థముగా వేయించినవి కూడా కావచ్చు. ఇలాంటి సందిగ్ధత లేకుండా ‘రుద్రమ మహాదేవి శివలోక ప్రాప్తి’ని (మరణాన్ని) స్పష్టంగా పేర్కొనే ఒకే ఒక్క శాసనం చందుపట్ల శాసనం. దానికంటే ఏడెనిమిది నెలల ముందే వేయబడిన పాలకవీడు శాసనం ప్రతాపరుద్ర మహారాజును పేర్కొన్నప్పటికీ అది పేర్కొన్న సూర్య గ్రహణం అదే పేర్కొన్నట్లు మార్గశిర మాసంలో కాకుండా కార్తీక మాసంలో రావడంతో చరిత్రకారులు ఆ శాసన కాలానికే (క్రీ.శ.1289 ఏప్రిల్‌ 8న) రుద్రమ చనిపోయిందని రాయడానికి సాహసించలేదు. అట్లాగే క్రీ.శ. 1289 సెప్టెంబర్‌ 16న వేయించిన ఖండవల్లి శాసనం ప్రతాపరుద్రుని వంశ చరిత్రను వర్ణించినా, క్రీ.శ. 1290 ఫిబ్రవరి 29న వేయబడిన ఉత్తరేశ్వర శాసనం ‘ప్రతాపరుద్ర మహారాజు’ను పేర్కొన్నా అవి పేర్కొన్న సూర్యగ్రహణం, చంద్రగ్రహణం తేదీల విషయంలో సందేహాలు తలెత్తి భారతి మాస పత్రికలో అయిదారు దశాబ్దాలుగా వాదోపవాదాలు ప్రచురించబడినా రుద్రమ మరణాన్ని, ప్రతాపరుద్రుని పట్టాబిషేకాన్ని స్పష్టంగా నిర్ధారించలేకపోయారు. ఈ విషయంలో చందుపట్ల శాసనం తరువాత స్పష్టత నిచ్చింది గత సంవత్సరం నేను వెలుగులోకి తెచ్చిన ‘మేడి మల్‌కల్‌’ శాసనమే అది క్రీ.శ. 1290 ఫిబ్రవరి 11 నాటికి ప్రతాప రుద్రుడు మహారాజు అని, అంటే అంతక్రితమే చందుపట్ల శాసనం రుద్రమ క్రీ.శ. 1289లో మరణించిందని ధ్రువీకరించింది. ఇక ఇప్పుడు రుద్రమదేవి క్రీ.శ. 1289 తర్వాత రాజ్యం చేయలేదని ప్రతాపరుద్రుడు మాత్రమే మహారాజుగా ప్రస్తావించబడ్డాడని తెలిపే దాన శాసనాలను చూద్దాం. ప్రతాప రుద్రుడినే రాజుగా కీర్తించే వివరాలు తెలిపే శాసనాలు: 16–9–1289లో పశ్చిమగోదావరి ఖండవల్లి శాసనంలో ‘ప్రతాపరుద్రుని వంశ చరిత్ర’; 11–2–1290లో నాగర్‌కర్నూల్‌ జిల్లా మేడిమల్‌కల్‌ శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’; 25–2–1290లో ఉత్తరేశ్వర శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’; 21–3–1290లో నల్గొండ జిల్లా మట్టంపల్లి శాసనంలో ‘ప్రతాప రుద్ర మహారాజు’; 16–5–1290లో నల్గొండజిల్లా పానుగల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు, పృథ్వీరాజ్యంబు సేయుచుండంగాను’; 5–9–1290లో పేరూరు శాసనంలో ‘రుద్రకుమారుడు పృథ్వీ రాజ్యం సేయు చుండంగాను’; 19–10–1290లో పాతర్లపాడు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యం చేయుచుండంగాను’; 7–11–1291లో గుంటూరు జిల్ల్లా జూలకల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులకు పుణ్యముగాను’; 27–11–1292లో నెల్లూరు జిల్లా భీమవరంలో ‘ప్రతాపరుద్ర మహారాజులకు బుణ్యముగాను’; 21–1–1292లో గుంటూరు జిల్లా తేరాల శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు’; 20–3–1292 కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యము సేయంగాను’; 23–3–1292లో నల్గొండ జిల్లా ఇంక్రియాల్‌ శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగంట సుఖలీలా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయు చుండంగాను; 21–౪–1292లో గుంటూరు జిల్లా పిన్నలి శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగల్లు నిజ రాజధానిగాను సుఖసంకథా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయుచుండంగాను’; 10–3–1293లో ప్రకాశం జిల్లా కండ్లకుంట శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’; 10–3–1293లో ప్రకాశం జిల్లా రావినూతల శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’; 9–9–1293లో గుంటూరు జిల్లా గోరవెంకపల్లి శాసనంలో ‘ప్రతాపరుద్ర వంశ చరిత్ర’; 9–6–1294లో నల్గొండ జిల్లా కూరెళ్ళ శాసనంలో ‘ప్రతాపరుద్రుని రాజ్యం’; 3–3–1295లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజ సామ్రాజ్యం’; 18–7–1295 లో నల్గొండ జిల్లా ఆలుగడప శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యంబు సేయుచుండంగా’... ఇలా ఈ శాసనాలన్నీ స్పష్టంగా ప్రతాపరుద్రున్నే మహారాజుగా పేర్కొన్నాయి. రుద్రమ దేవిని, ఆమె రాజ్యాన్ని (రాజరికాన్ని) స్త్రీగా గాని, పురుషుడుగా గాని పాలించినట్లు ప్రస్తావించలేదు. అంటే సమకాలీన శాసనాలు రుద్రమదేవి పాలనను క్రీ.శ. 1289 తర్వాత పేర్కొనలేదని స్పష్టమైంది కదా! ఇక సమకాలీన సాహిత్య గ్రంథాలు –– ముప్పాళ్ళ ప్రస్తావించిన మార్కొపోలో యాత్రా గ్రంథం, క్రీడాభిరామం, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర, హేమాద్రి వ్రత ఖండం –– రుద్రమ మరణాన్ని ఎందుకు పేర్కొనలేదంటే... రుద్రమ అప్పటికి 82 సంవత్సరాలు పైబడిన వృద్ధ స్త్రీ అని. అందునా వృద్ధురాలిని అంబదేవుడు చంపటం వీరత్వంగా కాక ఆనాటికి పేరుబడసిన మహాతల్లిని చంపిన నీచత్వంగా భావించటమే. అది వీరత్వంగా అంబదేవుడు తన శాసనాలల్లో ప్రకటించుకునే లోపే అతన్ని ప్రతాపరుద్రుడు చంపాడు. పైగా, రుద్రమదేవిని గణపతి దేవుని కూతురిగా కాక తప్పుగా భార్య అని పేర్కొన్న మార్కొపోలో యాత్రా కథనం, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రలను ముప్పాళ్ల ప్రామాణికంగా తీసుకోవడం సబబు కాదు. పరబ్రహ్మ శాస్త్రిని ముప్పాళ్ల ఒక్కసారే కలిశారట. నాకు ఆయనతో 2006 నుంచి పదేళ్ల అనుబంధం ఉంది. అయినాశాస్త్రి వాదనను నేను గుడ్డిగా కాకుండా 30 శాసనాల వివరాలను ఇచ్చాను. వాటిల్లో ఏది అబద్ధమైనా తదుపరి చర్చలకు, మార్పు చేర్పులకు సిద్ధమే. లేదంటే ఇప్పటికి చరిత్ర పుస్తకాల్లో రాసినట్లు చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీ.శ. 1289లోనే మరణించిందనేదే చారిత్రక సత్యం అని తెలుగువారందరూ అంగీకరించాలి.డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణరుద్రమ యుద్ధంలోనే మరణించిందా?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో జూన్‌ 18న డాక్టర్‌ ముప్పాళ్ల హనుమంతరావు రాసిన వ్యాసంలో– పరబ్రహ్మశాస్త్రి రాసినట్లు రుద్రమదేవి క్రీ.శ. 1289లో అంబదేవుడనే సామంతునితో జరిగిన యుద్ధంలో మరణించలేదని, కాబట్టే సమకాలీన శాసనాలు, సాహిత్య గ్రంథాలు ఆ విషయాన్ని పేర్కొనలేదని ఆయన తెలిపారు. పరబ్రహ్మశాస్త్రి కంటే ముందుకాలపు చరిత్రకారులు భావించినట్లుగా రుద్రమదేవి క్రీ.శ. 1295 లో సహజ మరణం చెందిందని తెలుగువారి చరిత్రను మళ్ళీ సవరించుకోవాలని ఆయన సూచించారు. హనుమంతరావు కొత్త సందేహాలకు శాస్త్రీయమైన శాసనాధారిత సమాధానాలు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌, బెంగళూరు కేంద్రం వారు 2011లో ప్రచురించిన ‘ఇన్‌స్క్రిప్షన్స్‌ ఆఫ్‌ కాకతీయాస్‌ ఆఫ్‌ వరంగల్‌’ అనే గ్రంథం పుటలు 480–547లో లభిస్తాయి. రుద్రమదేవి క్రీ.శ. 1289లో చనిపోయింది కాబట్టి చందుపట్ల శాసనంతో పాటు మరో 7శాసనాలు ఆమెకు శివలోకంలో పుణ్యం, ధర్మం కలగాలని ఆమె సామంతులు, అధికారులు ఆయా ఆలయాలకు/దేవుళ్ళకు దానాలు చేసిన వివరాలు క్లుప్తంగా రాస్తాను. రుద్రమదేవి మరణాన్ని ధ్రువీకరించే/సూచించే వివరాలున్న శాసనాలు:– 1289 నవంబర్‌ 25న నల్గొండ జిల్లా చందుపట్ల శాసనంలో ‘రుద్రమ మహాదేవి శివలోకానికి విచ్చేస్తేని.. శివలోక ప్రాప్తిగాను’; 1289లో నల్గొండ జిల్లా సర్వేల్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు పున్నెముసేసి’; 28–11–1289లో గుంటూరు జిల్లా ఈపూరు శాసనంలో ‘రుద్ర దేవ మహారాజులకు ధర్మార్థముగా’; 11–8–1291 కృష్ణా జిల్లా గుడిమెట్ట శాసనంలో రుద్రదేవ మహారాజులు’; ధనువు, సంక్రాంతినాడు గుంటూరు జిల్లా లామ్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు ధర్మువుగా’; నల్గొండ జిల్లా పానగల్‌ (ఛాయా సోమేశ్వరం గోడపై) శాసనంలో ‘రుద్రదేవ మహారాజునకు పుణ్యముగాను’; 7–6–1294లో నెల్లూరు జిల్లా వేంపాడు శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు అభివృద్ధిగాను’ ఇవి. పైన పేర్కొన్న శాసనాల్లో కనిపించే ‘రుద్రదేవ మహారాజు’ అంటే రుద్రమదేవియే. ఆమెను ఎక్కువ శాసనాల్లో మహారాజు అనే సంబోధించారు. నిజానికి ‘మహారాజు’ అని పిలువబడిన తొలి కాకతీయ రాజు/రాణి ఆమెనే. రాజులు బతికి ఉన్నప్పుడు కూడా వారికి ‘పుణ్యముగాను’ అంటూ వారి సామంతులు, అధికారులు దానాలు చేసే సాంప్రదాయం ఉండేది. కాబట్టి పై శాసనాల్లో పుణ్యముగాను, ధర్మార్థముగా, ధర్మువుగా అనే పదాలను పేర్కొనేవాటిని రుద్రమదేవి బతికి ఉన్నప్పుడే వేయించిన శాసనాలుగా భావించినా చందుపట్ల శాసనంలో ‘శివలోకానికి విచ్చేస్తేని’ ‘శివలోక ప్రాప్తిగాను’ అనే మాటలు ఉన్నవికాబట్టి అవి రుద్రమదేవి మరణాన్నే సూచిస్తాయని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ శాసనం పేర్కొన్న శక సంవత్సరం ‘విరోధి’ క్రీ.శ. 1289లోనే వచ్చింది. కాబట్టి రుద్రమ ఆ సంవత్సరంలో చనిపోయిందని చెప్పడానికి అభ్యంతరముండదు. ఇక వేంపాడు శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు అభివృద్ధిగాను’ అని పేర్కొన్న వాక్యంలో కనిపించే రుద్రదేవ మహారాజు అంటే కాకతీయ చివరి రాజు (రుద్రమ వారసుడు/మనుమడు) ప్రతాపరుద్రుడే. ఆయనను చాలా శాసనాలు షార్ట్‌కట్‌గా రుద్రదేవుడని, రుద్రుడని, కుమార రుద్రుడని, కుమార ప్రతాపుడని పలు రకాలుగా పేర్కొన్నాయి. కాబట్టి క్రీ.శ. 1289 నుంచి రుద్రదేవ మహారాజును పేర్కొన్న శాసనాలు ప్రతాపరుద్రునికి పుణ్యముగా/ధర్మర్థముగా వేయించినవి కూడా కావచ్చు. ఇలాంటి సందిగ్ధత లేకుండా ‘రుద్రమ మహాదేవి శివలోక ప్రాప్తి’ని (మరణాన్ని) స్పష్టంగా పేర్కొనే ఒకే ఒక్క శాసనం చందుపట్ల శాసనం. దానికంటే ఏడెనిమిది నెలల ముందే వేయబడిన పాలకవీడు శాసనం ప్రతాపరుద్ర మహారాజును పేర్కొన్నప్పటికీ అది పేర్కొన్న సూర్య గ్రహణం అదే పేర్కొన్నట్లు మార్గశిర మాసంలో కాకుండా కార్తీక మాసంలో రావడంతో చరిత్రకారులు ఆ శాసన కాలానికే (క్రీ.శ.1289 ఏప్రిల్‌ 8న) రుద్రమ చనిపోయిందని రాయడానికి సాహసించలేదు. అట్లాగే క్రీ.శ. 1289 సెప్టెంబర్‌ 16న వేయించిన ఖండవల్లి శాసనం ప్రతాపరుద్రుని వంశ చరిత్రను వర్ణించినా, క్రీ.శ. 1290 ఫిబ్రవరి 29న వేయబడిన ఉత్తరేశ్వర శాసనం ‘ప్రతాపరుద్ర మహారాజు’ను పేర్కొన్నా అవి పేర్కొన్న సూర్యగ్రహణం, చంద్రగ్రహణం తేదీల విషయంలో సందేహాలు తలెత్తి భారతి మాస పత్రికలో అయిదారు దశాబ్దాలుగా వాదోపవాదాలు ప్రచురించబడినా రుద్రమ మరణాన్ని, ప్రతాపరుద్రుని పట్టాబిషేకాన్ని స్పష్టంగా నిర్ధారించలేకపోయారు. ఈ విషయంలో చందుపట్ల శాసనం తరువాత స్పష్టత నిచ్చింది గత సంవత్సరం నేను వెలుగులోకి తెచ్చిన ‘మేడి మల్‌కల్‌’ శాసనమే అది క్రీ.శ. 1290 ఫిబ్రవరి 11 నాటికి ప్రతాప రుద్రుడు మహారాజు అని, అంటే అంతక్రితమే చందుపట్ల శాసనం రుద్రమ క్రీ.శ. 1289లో మరణించిందని ధ్రువీకరించింది. ఇక ఇప్పుడు రుద్రమదేవి క్రీ.శ. 1289 తర్వాత రాజ్యం చేయలేదని ప్రతాపరుద్రుడు మాత్రమే మహారాజుగా ప్రస్తావించబడ్డాడని తెలిపే దాన శాసనాలను చూద్దాం. ప్రతాప రుద్రుడినే రాజుగా కీర్తించే వివరాలు తెలిపే శాసనాలు: 16–9–1289లో పశ్చిమగోదావరి ఖండవల్లి శాసనంలో ‘ప్రతాపరుద్రుని వంశ చరిత్ర’; 11–2–1290లో నాగర్‌కర్నూల్‌ జిల్లా మేడిమల్‌కల్‌ శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’; 25–2–1290లో ఉత్తరేశ్వర శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’; 21–3–1290లో నల్గొండ జిల్లా మట్టంపల్లి శాసనంలో ‘ప్రతాప రుద్ర మహారాజు’; 16–5–1290లో నల్గొండజిల్లా పానుగల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు, పృథ్వీరాజ్యంబు సేయుచుండంగాను’; 5–9–1290లో పేరూరు శాసనంలో ‘రుద్రకుమారుడు పృథ్వీ రాజ్యం సేయు చుండంగాను’; 19–10–1290లో పాతర్లపాడు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యం చేయుచుండంగాను’; 7–11–1291లో గుంటూరు జిల్ల్లా జూలకల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులకు పుణ్యముగాను’; 27–11–1292లో నెల్లూరు జిల్లా భీమవరంలో ‘ప్రతాపరుద్ర మహారాజులకు బుణ్యముగాను’; 21–1–1292లో గుంటూరు జిల్లా తేరాల శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు’; 20–3–1292 కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యము సేయంగాను’; 23–3–1292లో నల్గొండ జిల్లా ఇంక్రియాల్‌ శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగంట సుఖలీలా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయు చుండంగాను; 21–౪–1292లో గుంటూరు జిల్లా పిన్నలి శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగల్లు నిజ రాజధానిగాను సుఖసంకథా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయుచుండంగాను’; 10–3–1293లో ప్రకాశం జిల్లా కండ్లకుంట శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’; 10–3–1293లో ప్రకాశం జిల్లా రావినూతల శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’; 9–9–1293లో గుంటూరు జిల్లా గోరవెంకపల్లి శాసనంలో ‘ప్రతాపరుద్ర వంశ చరిత్ర’; 9–6–1294లో నల్గొండ జిల్లా కూరెళ్ళ శాసనంలో ‘ప్రతాపరుద్రుని రాజ్యం’; 3–3–1295లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజ సామ్రాజ్యం’; 18–7–1295 లో నల్గొండ జిల్లా ఆలుగడప శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యంబు సేయుచుండంగా’... ఇలా ఈ శాసనాలన్నీ స్పష్టంగా ప్రతాపరుద్రున్నే మహారాజుగా పేర్కొన్నాయి. రుద్రమ దేవిని, ఆమె రాజ్యాన్ని (రాజరికాన్ని) స్త్రీగా గాని, పురుషుడుగా గాని పాలించినట్లు ప్రస్తావించలేదు. అంటే సమకాలీన శాసనాలు రుద్రమదేవి పాలనను క్రీ.శ. 1289 తర్వాత పేర్కొనలేదని స్పష్టమైంది కదా! ఇక సమకాలీన సాహిత్య గ్రంథాలు –– ముప్పాళ్ళ ప్రస్తావించిన మార్కొపోలో యాత్రా గ్రంథం, క్రీడాభిరామం, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర, హేమాద్రి వ్రత ఖండం –– రుద్రమ మరణాన్ని ఎందుకు పేర్కొనలేదంటే... రుద్రమ అప్పటికి 82 సంవత్సరాలు పైబడిన వృద్ధ స్త్రీ అని. అందునా వృద్ధురాలిని అంబదేవుడు చంపటం వీరత్వంగా కాక ఆనాటికి పేరుబడసిన మహాతల్లిని చంపిన నీచత్వంగా భావించటమే. అది వీరత్వంగా అంబదేవుడు తన శాసనాలల్లో ప్రకటించుకునే లోపే అతన్ని ప్రతాపరుద్రుడు చంపాడు. పైగా, రుద్రమదేవిని గణపతి దేవుని కూతురిగా కాక తప్పుగా భార్య అని పేర్కొన్న మార్కొపోలో యాత్రా కథనం, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రలను ముప్పాళ్ల ప్రామాణికంగా తీసుకోవడం సబబు కాదు. పరబ్రహ్మ శాస్త్రిని ముప్పాళ్ల ఒక్కసారే కలిశారట. నాకు ఆయనతో 2006 నుంచి పదేళ్ల అనుబంధం ఉంది. అయినాశాస్త్రి వాదనను నేను గుడ్డిగా కాకుండా 30 శాసనాల వివరాలను ఇచ్చాను. వాటిల్లో ఏది అబద్ధమైనా తదుపరి చర్చలకు, మార్పు చేర్పులకు సిద్ధమే. లేదంటే ఇప్పటికి చరిత్ర పుస్తకాల్లో రాసినట్లు చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీ.శ. 1289లోనే మరణించిందనేదే చారిత్రక సత్యం అని తెలుగువారందరూ అంగీకరించాలి.డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ
editorial
6,642
08-01-2017 11:10:21
నాపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి ప్రత్యక్షంగా చూశా: కోట
 అమితాబ్‌ సంస్కారం ప్రత్యక్షంగా చూశా            ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో కూడా ‘‘వర్మగారి దర్శకత్వంలో నటించడమే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందులోనూ కోట శ్రీనివాసరావుగారితో నటించడం మరింత థ్రిల్‌గా అనిపించింది’’ అన్నారట. వర్మగారు ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్పారు.  రాష్ట్రపతి భవన్‌లో అమితాబ్‌, అభిషేక్‌ ప్రశంస               అమితాబ్‌గారి మైండ్‌లో నేను ఎంతగా గుర్తులేకపోతే నన్ను అందరిలో అంత గౌరవంగా పలకరిస్తారూ. ఆ రోజు నామీద ఆయనకున్న అభిమానాన్ని మరోసారి ప్రత్యక్షంగా చూశా. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత అక్కడే టీ అరేంజ్‌ చేశారు.  గుమ్మడి ప్రశంస             ‘ఏంటండీ’ అనబోయా. అంతలోనే ఆయన, ‘నీ దుంపతెగ ఇన్నాళ్లూ ఎక్కడున్నావయ్యా అసలు. నువ్వు చేస్తుంటే నాకు నాగభూషణం, రావుగోపాల రావు గుర్తుకొస్తున్నారు. అంత పెద్ద డైలాగు గుక్కతిప్పుకోకుండా ఎంత స్పష్టంగా చెప్పావ్‌’ అని మెచ్చుకున్నారు. గుమ్మడిగారితో పోలిస్తే నేనెక్కడ? తెలుగుభాషను ఆయన చాలా స్పష్టంగా పలుకుతారు. డైలాగ్‌ డిక్షన, క్లారిటీ, ఒత్తుల్ని స్పష్టంగా పలకడం... ఇలా భాషకు సంబంధించి ఎన్నిరకాల మాటలుంటాయో అన్నిటిలోనూ ఆయన పర్ఫెక్ట్‌. అలాంటి వ్యక్తి మెచ్చుకునేసరికి ఆనందమేసింది. ‘థాంక్యూ సార్‌. వస్తానండీ. ఇంకో షూటింగ్‌ ఉంది’ అని చెప్పి ఆ రోజుకు సెలవు తీసుకున్నా.              ఆ తర్వాత చాలాసార్లు ఆయనతో కలిసి ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లా. షాట్‌ గ్యాపుల్లో మేం కలిసి కూర్చున్న ప్రతిసారీ ఆయన ‘ఎక్కడ కామా ఉండాలి? ఎక్కడ ఫుల్‌స్టాప్‌ ఉండాలి? ఎక్కడ ప్రశ్నార్ధకం ఉండాలి?’ వంటి విషయాల గురించి చెప్పేవారు. మేం ఎక్కువగా నాటకాల గురించి మాట్లాడుకునేవాళ్లం. మాధవపెద్ది వెంకట్రామయ్యగారి శిష్యుడు గుమ్మడిగారు. ఎప్పుడూ తన గురువు గారిని గుర్తుచేసుకునేవారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కారణంగానే తెలుగుపై తనకు మంచిపట్టు వచ్చిందని చెప్పేవారు. ఎప్పుడైనా ఆయనకు నా నటన నచ్చితే ‘బావుంది’ అని ఏదో ఒక్కమాటలో తేల్చి చెప్పడంలాంటివి చేసేవారు కాదు. ఫోన చేసి ‘కోటా. ఫలానా పాత్ర చూశా. ఫలానా సన్నివేశంలో బాగా చేశావ్‌. నువ్వు చేసిన ఫలానా అంశం బావుంది’ అని వివరంగా చెప్పేవారు.  రావుగోపాలరావు ప్రశంస                 ‘అయ్యా కోటయ్య.. మీతో రెండు నిమిషాలు మాట్లాడుదామని... కాలక్షేపం’ అన్నారు.‘ఇప్పుడే వచ్చానండీ షూటింగ్‌నుంచి. మీరు కబురుపెడితే నేనే వచ్చేవాణ్ణి కదా’ అన్నా.  ‘అట్టాకాదుగానీ ఫర్వాలేదు. కాసేపు మాట్లాడు కుందాం. అరగంటో, పావుగంటో కూర్చుంటాను’ అని లోపలికి వచ్చారు. నేను లుంగీ కట్టుకుని వచ్చి కూర్చున్నా.  ఏవేవో విషయాలు, పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. అరగంట, గంట దాటింది. ఆయన ఒక్క నిమిషం గంభీరంగా మారిపోయారు.  ‘ఏం లేదయ్యా. మా పిల్లలు నీకు ఫ్యాన్స్ అయ్యా. ఆయన నటించిన ఓ సినిమా చూడండి నాన్నా అని మూడేళ్లుగా చంపుతున్నారయ్యా నన్ను. ‘ఒక్క సినిమాను చూడండి, అందులో కోటగారు ఎలా చేశారో మీకే తెలుస్తుంది’ అని మరీ మరీ చెప్పారు. నా బిజీ, నా గోలలో నేను ఇన్నాళ్లూ చూడ లేదు. ఇదిగో ఈ రోజు నా రూమ్‌లో నీ సినిమా వీడియో కేసెట్‌ వేస్తే పిల్లలు చెప్పిన మాట గుర్తొచ్చి చూశాను’ అన్నారు.              అప్పట్లో రూమ్‌కి కేసెట్లు వేసేవారులెండి. రూముల్లో ఉన్న వారికి ఖాళీ ఉంటే కాలక్షేపం కోసమని ఏదో ఒక కేసెట్‌ వేసేవారు.‘ఇవాళే ఆ కేసెట్‌ చూశానయ్యా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మరలా విలన అనే పదానికి కొత్త ఒరవడి తెచ్చే నటుడు దొరికాడని నాకు అనిపించింది అన్నారు. నువ్వు డైలాగ్‌ చెబుతుంటే ఫైర్‌ ఇంజన్ గణగణగణమని గంట కొట్టినట్టు ఉంటుంది’ అని ప్రశంసించారు.  ‘ఏ సినిమా సార్‌ అది’ అన్నా.
entertainment
3,265
07-06-2017 01:48:50
సుపరిపాలనతో ఆనందాంధ్రప్రదేశ్‌!
ఆనంద సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అలోచన. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, ఎవరైనా సరే ‘పీపుల్‌ ఫస్ట్’‌ (ప్రజలే ముందు) అన్న దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ‘సమాజమే దేవాలయం-–ప్రజలే దేవుళ్లు’ అన్న ఎన్టీఆర్‌ ఆశయస్ఫూర్తితో 'ప్రజలే ముందు' (పీపుల్‌ ఫస్ట్‌) అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజలే. ఇది నినాదంకాదు. పారదర్శకమైన జవాబుదారీతనానికి, నిఖార్సైన పాలనకు ప్రతిరూపంగా నిలిచే రియల్‌ టైం గవర్నెన్స్‌కు మారుపేరే 'ప్రజలే ముందు'. ఇప్పటికే మీకోసం, ఏపీ సీఎం కనెక్ట్‌, కైజాలా యాప్‌, కమాండ్‌ కంట్రోల్‌తో పాటు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లతో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది. రాష్ట్రంలో ఆనంద సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలి, దేశంలోనే మన రాష్ట్రం బెంచ్‌మార్క్‌గా నిలవాలి, ప్రజలే కేంద్రంగా వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనులు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అలోచన. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, ఎవరైనా సరే ప్రజలే ముందు అన్న దృక్పథంతో పనిచేయాలని పీపుల్‌ఫస్ట్‌ యాప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పీపుల్‌ ఫస్ట్‌ (ప్రజలే ముందు) పేరిట ఒక కాల్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ప్రజలు 1100 నెంబరుకు నేరుగా ఫోన్‌ చేసి తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలను, అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేయడమే గాక, పరిష్కారం కూడా పొందవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే చంద్రన్న బీమా గురించి 52 వేల ఫోన్‌ కాల్స్‌, పింఛన్ల గురించి 6.40 లక్షలు, రేషన్‌ అమలు తీరుపై 9.50 లక్షల మంది. మొత్తంగా 16.42 లక్షల మంది నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 3 వేల మందికి సంబంధించిన అవినీతి గురించి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వంలోని అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి 750 మంది సిబ్బందితో ప్రజలే ముందు (1100) కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అవినీతి గురించి ఎవరైనా బయటపెడితే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతోంది. వారికి చట్టపరంగా రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పటికే అవినీతి అధికారులు తిన్న లంచాన్ని ప్రభుత్వం తిరిగి కక్కిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకే పరిమితమయిన వ్యవస్థకాదు. ప్రజా ప్రతినిధులు, ఇతర వ్యవస్థల్లోని వారు ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కాల్‌సెంటర్‌ దృష్టికి తీసుకురావచ్చు. సుపరిపాలన-, సాంకేతిక విజ్ఞాన వినియోగం ద్వారానే అవినీతిరహిత భారతదేశాన్ని ఆవిష్కరించగలమనేది తెలుగుదేశం పార్టీ విశ్వాసం. 1995–-2004 మధ్య 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేసి ఉత్తమ ఫలితాలు రాబట్టారు. తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పదేళ్ళ పాలన పెచ్చుమీరిన అవినీతితో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. 2014 జూన్‌లో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుడ్‌ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలకు వేగవంతంగా, మెరుగైన సేవలు అందించటంలో నవ్యాంధ్రప్రదేశ్‌ దేశంలో ముందువరుసలో ఉంది. ఆన్‌లైన్‌లో మున్సిపాలిటీ పన్నులు చెల్లించడం, మీ ఇంటికే మీ భూమి, మీ-సేవా, ఫైబర్‌గ్రిడ్‌, ఈ–-ప్రగతి, పరిష్కారవేదిక, కైజాలా యాప్‌ తదితర సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను అందిస్తోంది. అనేక సందర్భాలలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా పరిష్కరించేందుకు, ప్రజలకు అవినీతి రహితపాలనను అందించేందుకు ప్రభుత్వం వినూత్న కృషి చేస్తోంది. విశ్వవ్యాప్తమైన ఐటీ ఆధారిత సేవలకు నేడు ప్రపంచవ్యాప్తంగా అపారమైన మార్కెట్‌ అవకాశాలున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1995కి ముందు హైదరాబాద్‌కు ఐటీ అంటే తెలియదు. అటువంటి సమయంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో సైబరాబాద్‌ అనే కొత్త నగర నిర్మాణం చేపట్టి దానిని ఐటీకి కేరాఫ్‌గా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రిదే. ఆయన దూరదృష్టి ఫలితమే హైదరాబాద్‌లో 13 లక్షల మందికి ఉపాధి కల్పన. ఆ నగర నిర్మాణమే నేడు తెలంగాణకు వస్తున్న అధిక ఆదాయానికి కారణం. గతంలో మైక్రోసాఫ్‌్ట అధినేత బిల్‌గేట్స్‌ ఢిల్లీ వచ్చినప్పుడు, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఎంతో శ్రమపడి 5 నిమిషాల అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇద్దరి మధ్యా భేటీ ప్రారంభమయ్యాక, ఆ ఐదు నిముషాల సమయం కాస్తా గంటకు పైగా కొనసాగింది. దీన్ని బట్టే అర్థమవుతోంది మన ముఖ్యమంత్రి విజన్‌ ఏమిటో..! నాటి ఆ మీటింగ్‌ పుణ్యమే మన హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌ అనే ఒక నగర నిర్మాణం జరిగి రాష్ట్రం ప్రపంచ పటంలో నిలిచింది. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు కంటే దీటుగా నవ్యాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి చెందాలంటే పెట్టుబడులే ప్రధానమని గుర్తించి చంద్రబాబు ఇప్పటి వరకు మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, దావోస్‌, రష్యా, అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ ఐటీ కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఐటీ, హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్‌ రంగాల్లోనే కాకుండా వ్యవసాయం, ఆటోమోటివ్‌, హెల్త్‌ కేర్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లోనూ భారీ పెట్టుబడులను ఆకర్షించి నవ్యాంధ్రలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తాజాగా గన్నవరం సమీపంలో ఏపీఐఐసీకి చెందిన మేధా టవర్స్‌లో 7 కంపెనీలు ప్రారంభించడంతో పాటు హెచ్‌సీఎల్‌ కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ఇవ్వడంతో పాటు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా ఇతర దేశాలు ఐటీతో పాటు ఇతర రంగాల్లో నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం 133 ప్రభుత్వవిభాగాలలో అన్ని సేవలను డిజిటలైజేషన్‌ చేస్తోంది. ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం పూర్తి అయింది. ఇప్పటికే 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంటర్‌ ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్‌ఈఏ) లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఈ-–ప్రగతి రూపకల్పన జరిగింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్‌ లెస్‌ గవర్నమెంట్‌ సిస్టమ్‌ (సీఎల్జీఎస్‌), డయల్‌ ఏపీ, మన రాష్ట్రం టెలీహెల్త్‌, ఈ–-ఎడ్యుకేషన్‌, హరిత, ఈ-–మండీ, సిటిజెన్‌ ఇన్‌బాక్స్‌, డిజిటల్‌ లిటరసీ, ఈ-ఎస్‌హెచ్‌జీ, స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ గ్రిడ్‌ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్‌ రేటు తదితర ప్రామాణికాల నిర్ధారణకు ఈ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీసేవ, సీఎం డ్యాష్‌ బోర్డు, మీ భూమి తదితర కామన్‌ అప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరీలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు. ఐటీవల్ల పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు పనుల్లో వేగం సాధ్యమవుతుంది. రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. పనులకోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఇప్పుడు చాలా వరకు ఆ సమస్యను ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే కుల,ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఈసీ, బీ1 అడంగల్‌ వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్‌ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు వంటివి ఆన్‌లైన్‌లో అతి సులువుగా, అంతే వేగంగా జరిగిపోతున్నాయి. ఈ–-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్థకం, పౌల్ట్రీ తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఈ–-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొందవచ్చు, పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్‌, ఈ-మండీ తదితర వివరాలన్నీ లభ్యమవుతాయి. మాన్యువల్‌ సాయంతో చేసే వేల కొద్దీ పనులు ఈ రోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది. ఏ సమాజమైనా సుస్థిరంగా, సురక్షితంగా ఉండాలంటే శాంతిభద్రతలు అత్యంత అవసరం. ప్రజల రక్షణకు,భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్‌, వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు సాంకేతికత సాయంతో చంద్రన్న ప్రభుత్వం చెక్‌పెట్టింది. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా పోలీసు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ అత్యాధునిక భద్రతా చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళల రక్షణకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక బృందాలను, ప్రత్యేక పోలీస్‌స్టేషన్లను సిద్ధం చేయడమే గాక, సీసీటీవీ పరిజ్ఞానంతో నేరాల కట్టడికి నడుం బిగించింది. తద్వారా సురక్షితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. సుస్థిరమైన శాంతిభద్రతలుంటేనే పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీస్‌ వ్యవస్థను పటిష్ఠపరిచి, పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేరాలను పూర్తిగా అరికట్టడం జరుగుతోంది. పోలీస్‌ సమాచారం నెట్‌వర్క్‌ను డిజిటలైజ్‌ చేయడంతోపాటు డయల్‌ 100 ను అనుసంధానించడం జరిగింది. మహిళల భద్రత, ప్రజల రక్షణను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 6 వేల పోస్టులను భర్తీ చేసింది. రేయింబవళ్లు శాంతిభద్రతలను కాపాడేందుకు శ్రమించే పోలీసులు, అధికారులతోపాటు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్స్‌ ఇన్సూరెన్స్‌ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ వినియోగం ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచి అవినీతికి అడ్డుకట్ట వేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ, ప్రతి ఏటా రూ.5,700 కోట్ల విలువైన పింఛన్ల పంపిణీ, రూ.3 వేల కోట్ల రేషన్‌ పంపిణీలో పైసా అవినీతి లేకుండా అమలుచేయడం తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయం. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కాల్‌ సెంటర్‌ లాంటి వినూత్న వ్యవస్థలను నెలకొల్పి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది మన చంద్రబాబు ప్రభుత్వం. సుపరిపాలన ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.-చెరుకూరి కుటుంబరావుఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు  రాష్ట్రంలో ఆనంద సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలి, దేశంలోనే మన రాష్ట్రం బెంచ్‌మార్క్‌గా నిలవాలి, ప్రజలే కేంద్రంగా వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనులు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అలోచన. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, ఎవరైనా సరే ప్రజలే ముందు అన్న దృక్పథంతో పనిచేయాలని పీపుల్‌ఫస్ట్‌ యాప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పీపుల్‌ ఫస్ట్‌ (ప్రజలే ముందు) పేరిట ఒక కాల్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ప్రజలు 1100 నెంబరుకు నేరుగా ఫోన్‌ చేసి తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలను, అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేయడమే గాక, పరిష్కారం కూడా పొందవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే చంద్రన్న బీమా గురించి 52 వేల ఫోన్‌ కాల్స్‌, పింఛన్ల గురించి 6.40 లక్షలు, రేషన్‌ అమలు తీరుపై 9.50 లక్షల మంది. మొత్తంగా 16.42 లక్షల మంది నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 3 వేల మందికి సంబంధించిన అవినీతి గురించి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వంలోని అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి 750 మంది సిబ్బందితో ప్రజలే ముందు (1100) కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అవినీతి గురించి ఎవరైనా బయటపెడితే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతోంది. వారికి చట్టపరంగా రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పటికే అవినీతి అధికారులు తిన్న లంచాన్ని ప్రభుత్వం తిరిగి కక్కిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకే పరిమితమయిన వ్యవస్థకాదు. ప్రజా ప్రతినిధులు, ఇతర వ్యవస్థల్లోని వారు ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కాల్‌సెంటర్‌ దృష్టికి తీసుకురావచ్చు. సుపరిపాలన-, సాంకేతిక విజ్ఞాన వినియోగం ద్వారానే అవినీతిరహిత భారతదేశాన్ని ఆవిష్కరించగలమనేది తెలుగుదేశం పార్టీ విశ్వాసం. 1995–-2004 మధ్య 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేసి ఉత్తమ ఫలితాలు రాబట్టారు. తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పదేళ్ళ పాలన పెచ్చుమీరిన అవినీతితో వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. 2014 జూన్‌లో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుడ్‌ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలకు వేగవంతంగా, మెరుగైన సేవలు అందించటంలో నవ్యాంధ్రప్రదేశ్‌ దేశంలో ముందువరుసలో ఉంది. ఆన్‌లైన్‌లో మున్సిపాలిటీ పన్నులు చెల్లించడం, మీ ఇంటికే మీ భూమి, మీ-సేవా, ఫైబర్‌గ్రిడ్‌, ఈ–-ప్రగతి, పరిష్కారవేదిక, కైజాలా యాప్‌ తదితర సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనను అందిస్తోంది. అనేక సందర్భాలలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా పరిష్కరించేందుకు, ప్రజలకు అవినీతి రహితపాలనను అందించేందుకు ప్రభుత్వం వినూత్న కృషి చేస్తోంది. విశ్వవ్యాప్తమైన ఐటీ ఆధారిత సేవలకు నేడు ప్రపంచవ్యాప్తంగా అపారమైన మార్కెట్‌ అవకాశాలున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1995కి ముందు హైదరాబాద్‌కు ఐటీ అంటే తెలియదు. అటువంటి సమయంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో సైబరాబాద్‌ అనే కొత్త నగర నిర్మాణం చేపట్టి దానిని ఐటీకి కేరాఫ్‌గా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రిదే. ఆయన దూరదృష్టి ఫలితమే హైదరాబాద్‌లో 13 లక్షల మందికి ఉపాధి కల్పన. ఆ నగర నిర్మాణమే నేడు తెలంగాణకు వస్తున్న అధిక ఆదాయానికి కారణం. గతంలో మైక్రోసాఫ్‌్ట అధినేత బిల్‌గేట్స్‌ ఢిల్లీ వచ్చినప్పుడు, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఎంతో శ్రమపడి 5 నిమిషాల అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇద్దరి మధ్యా భేటీ ప్రారంభమయ్యాక, ఆ ఐదు నిముషాల సమయం కాస్తా గంటకు పైగా కొనసాగింది. దీన్ని బట్టే అర్థమవుతోంది మన ముఖ్యమంత్రి విజన్‌ ఏమిటో..! నాటి ఆ మీటింగ్‌ పుణ్యమే మన హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌ అనే ఒక నగర నిర్మాణం జరిగి రాష్ట్రం ప్రపంచ పటంలో నిలిచింది. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు కంటే దీటుగా నవ్యాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి చెందాలంటే పెట్టుబడులే ప్రధానమని గుర్తించి చంద్రబాబు ఇప్పటి వరకు మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, దావోస్‌, రష్యా, అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ ఐటీ కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఐటీ, హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్‌ రంగాల్లోనే కాకుండా వ్యవసాయం, ఆటోమోటివ్‌, హెల్త్‌ కేర్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లోనూ భారీ పెట్టుబడులను ఆకర్షించి నవ్యాంధ్రలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తాజాగా గన్నవరం సమీపంలో ఏపీఐఐసీకి చెందిన మేధా టవర్స్‌లో 7 కంపెనీలు ప్రారంభించడంతో పాటు హెచ్‌సీఎల్‌ కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ఇవ్వడంతో పాటు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా ఇతర దేశాలు ఐటీతో పాటు ఇతర రంగాల్లో నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం 133 ప్రభుత్వవిభాగాలలో అన్ని సేవలను డిజిటలైజేషన్‌ చేస్తోంది. ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం పూర్తి అయింది. ఇప్పటికే 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంటర్‌ ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్‌ఈఏ) లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఈ-–ప్రగతి రూపకల్పన జరిగింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్‌ లెస్‌ గవర్నమెంట్‌ సిస్టమ్‌ (సీఎల్జీఎస్‌), డయల్‌ ఏపీ, మన రాష్ట్రం టెలీహెల్త్‌, ఈ–-ఎడ్యుకేషన్‌, హరిత, ఈ-–మండీ, సిటిజెన్‌ ఇన్‌బాక్స్‌, డిజిటల్‌ లిటరసీ, ఈ-ఎస్‌హెచ్‌జీ, స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ గ్రిడ్‌ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్‌ రేటు తదితర ప్రామాణికాల నిర్ధారణకు ఈ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీసేవ, సీఎం డ్యాష్‌ బోర్డు, మీ భూమి తదితర కామన్‌ అప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరీలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు. ఐటీవల్ల పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు పనుల్లో వేగం సాధ్యమవుతుంది. రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. పనులకోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఇప్పుడు చాలా వరకు ఆ సమస్యను ప్రభుత్వం తొలగించింది. ఇప్పటికే కుల,ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఈసీ, బీ1 అడంగల్‌ వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్‌ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు వంటివి ఆన్‌లైన్‌లో అతి సులువుగా, అంతే వేగంగా జరిగిపోతున్నాయి. ఈ–-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్థకం, పౌల్ట్రీ తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఈ–-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొందవచ్చు, పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్‌, ఈ-మండీ తదితర వివరాలన్నీ లభ్యమవుతాయి. మాన్యువల్‌ సాయంతో చేసే వేల కొద్దీ పనులు ఈ రోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది. ఏ సమాజమైనా సుస్థిరంగా, సురక్షితంగా ఉండాలంటే శాంతిభద్రతలు అత్యంత అవసరం. ప్రజల రక్షణకు,భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్‌, వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు సాంకేతికత సాయంతో చంద్రన్న ప్రభుత్వం చెక్‌పెట్టింది. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా పోలీసు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ అత్యాధునిక భద్రతా చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళల రక్షణకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక బృందాలను, ప్రత్యేక పోలీస్‌స్టేషన్లను సిద్ధం చేయడమే గాక, సీసీటీవీ పరిజ్ఞానంతో నేరాల కట్టడికి నడుం బిగించింది. తద్వారా సురక్షితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. సుస్థిరమైన శాంతిభద్రతలుంటేనే పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీస్‌ వ్యవస్థను పటిష్ఠపరిచి, పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేరాలను పూర్తిగా అరికట్టడం జరుగుతోంది. పోలీస్‌ సమాచారం నెట్‌వర్క్‌ను డిజిటలైజ్‌ చేయడంతోపాటు డయల్‌ 100 ను అనుసంధానించడం జరిగింది. మహిళల భద్రత, ప్రజల రక్షణను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 6 వేల పోస్టులను భర్తీ చేసింది. రేయింబవళ్లు శాంతిభద్రతలను కాపాడేందుకు శ్రమించే పోలీసులు, అధికారులతోపాటు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్స్‌ ఇన్సూరెన్స్‌ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ వినియోగం ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచి అవినీతికి అడ్డుకట్ట వేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ, ప్రతి ఏటా రూ.5,700 కోట్ల విలువైన పింఛన్ల పంపిణీ, రూ.3 వేల కోట్ల రేషన్‌ పంపిణీలో పైసా అవినీతి లేకుండా అమలుచేయడం తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయం. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కాల్‌ సెంటర్‌ లాంటి వినూత్న వ్యవస్థలను నెలకొల్పి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది మన చంద్రబాబు ప్రభుత్వం. సుపరిపాలన ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.-చెరుకూరి కుటుంబరావుఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు
editorial
1,620
07-08-2017 23:57:45
నాట్కోకు టామీఫ్లూ కిక్‌
 జూన్‌ త్రైమాసిక లాభంలో రెండింతల వృద్ధిహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రెండింతలు వృద్ధి చెంది 97.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 47.5 కోట్ల రూపాయలుగా ఉంది. అమెరికా మార్కెట్లో జెనరిక్‌ టామీఫ్లూ ఔషధ విక్రయానికి ప్రత్యేక హక్కులు లభించటం కంపెనీకి కలిసివచ్చింది. త్రైమాసిక సమీక్షా కాలంలో నాట్కో రాబడులు కూడా 30 శాతం వృద్ధితో 345.5 కోట్ల రూపాయల నుంచి 448.70 కోట్ల రూపాయలకు దూసుకుపోయింది. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చితే మాత్రం నికర లాభం 47 శాతం క్షీణించగా రాబడి 22 శాతం తగ్గింది. గిలీడ్‌, రోచేతో ఉన్న వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవటంతో గత ఏడాది డిసెంబరులో అమెరికా మార్కెట్లోకి ఇన్‌ఫ్లుయెంజా చికిత్సలో వినియోగించే జెనరిక్‌ ఔషధం టామీఫ్లూ క్యాప్సూల్స్‌ను నాట్కో ఫార్మా విడుదల చేసింది. బహుళ జాతి దిగ్గజ సంస్థలతో కేసు పరిష్కరించుకోవటంతో 30 ఎంజి, 45 ఎంజి, 75 ఎంజి సామర్థ్యం గల టామీఫ్లూ ఔషధాలను పరిమితకాలంపాటు విక్రయించేందుకు నాట్కోకు ప్రత్యేక హక్కులు లభించాయి. ఈ ప్రత్యేక హక్కులతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నాట్కో రాబడులు, లాభాలు గణనీయంగా పెరిగాయి. డివిడెండ్‌: ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 1.25 రూపాయల (62.5 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను నాట్కో ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపు రికార్డు తేదీని ఈ నెల 18వ తేదీని ఖరారు చేసినట్లు పేర్కొంది. కాగా డివిడెండ్‌ను ఈ నెల 23న చెల్లించనున్నట్లు తెలిపింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో బిఎస్‌ఇలో నాట్కో షేరు 1.22 శాతం లాభంతో 960.80 రూపాయల వద్ద స్థిరపడింది.
business
5,474
12-05-2017 00:17:09
ప్లేబ్యాక్‌ సింగర్‌... బాలకృష్ణ
నందమూరి నటసింహం నేపథ్య గానంలో తొలి అడుగులు వేసింది. తొలిసారిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ ఈ కొత్త క్రేజీ కాంబినేషనకు తగ్గట్లుగా సరికొత్తగా సింగర్‌ అవతారమెత్తారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తన 101వ చిత్రం కోసం ఆయన ఈ కొత్త ఫీట్‌ చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం కోసం 40 రోజుల భారీ షెడ్యూల్‌కి కోసం చిత్రయూనిట్‌ గురువారం సాయంత్రం పోర్చుగల్‌కు ప్రయాణమైంది. కొన్ని పాటలతో సహా సినిమాలోని కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన ఘట్టాల్లో అధిక భాగం ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించే ఓ పక్కా మాస్‌ పాట కోసం అనూప్‌ రూబెన్స్‌ సంగీత బాణీలో, భాస్కరభట్ల సాహిత్యాన్ని బాలకృష్ణ హుషారుగా పాడేశారు. బాలకృష్ణ గళానికి కోరస్‌ గొంతు కలపగా ‘మావా.. ఏక్‌ పెగ్‌ లావో...’ అంటూ సాగే ఈ హుషారైన గీతం విన్నవాళ్ళు ఇప్పటికే వహ్వా అంటున్నారు. ‘‘బాలకృష్ణ గారికి సంగీతం మీద మంచి అభిరుచి ఉందని తెలుసు. కానీ, అతి తక్కువ సమయంలో ఆయన అంత చక్కగా, ప్రొఫెషనల్‌ సింగర్‌లా పాడడం చూసి ఆశ్చర్యపోయాం. పాటలు విడుదలయ్యాక అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటారు’’ అని పూరీ జగన్నాథ్‌ వ్యాఖ్యానించారు. నిర్మాత సైతం ‘‘భారీగా నిర్మిస్తున్న మా చిత్రానికి అదనపు విలువ బాలయ్య స్వరం. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగానే, ఓకే అంటూ పాడడానికి ఆయన ఒప్పుకోవడం సంతోషంగా అనిపించింది. ఈ పాట విన్నప్పుడు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం’’ అన్నారు. ఇక యువ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఆనందానికైతే అవధులు లేవు. ‘‘బాలకృష్ణ గారి లాంటి ఒక లెజెండ్‌ నేను స్వరపరచిన గీతాన్ని తొలి పాటగా పాడడం ఎప్పటికీ మర్చిపోలేను. తక్కువ టైమ్‌లో పక్కా ప్రొఫెషనల్‌గా ఆయన పాడిన పాట కచ్చితంగా ఛార్జ్‌ బస్టర్‌ సాంగ్‌ అవుతుంది’’ అని ఉద్వేగంగా అన్నారు. పాటలోని ఊపుకు తగ్గట్లు, పాడుతున్నంత సేపూ రికార్డింగ్‌ థియేటర్‌లో ఉత్సాహం ఉరకలెత్తించిన బాలకృష్ణ కూడా తెర మీదే కాక, తెర వెనుక కూడా ఈ సినిమా అందించిన కొత్త పాత్రతో సహజంగానే ఆనందంగా ఉన్నారు. సినిమాకు ప్రాణం సంగీతం, పాటలు అని నమ్మే శతచిత్ర కథానాయకుడు బాలకృష్ణ గతంలో హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమ చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా అందరి ఎదుటా పాట పాడి, ఆశ్చర్యపరిచారు. ఇప్పుడిలా నేరుగా రికార్డింగ్‌ థియేటర్‌లో తన ప్రతిభ చూపెట్టారు. మొత్తానికి మాఫియా నేపథ్యంలో, బాలకృష్ణను కొత్త హెయిర్‌ స్టయిల్‌, కొత్త తరహా కాస్ట్యూమ్స్‌లో చూపించే ఈ 101వ చిత్రం దసరా కానుకగా మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో!
entertainment
9,811
14-08-2017 13:04:05
రామ్ చరణ్‌పై వినిపిస్తున్న గుసగుసలు నిజమయ్యేనా?
సమంతతో జంటగా నటిస్తున్న రంగస్థలం సినిమాతోపాటు మరో సినిమాకు రామ్ చరణ్ కమిట్ అయినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నా ఆ సినిమా మాత్రం పట్టాలపైకి రావడం లేదు. కానీ ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అంటే మణిరత్నం.. ఎప్పటి నుంచో చెర్రీ, మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నా.. అడుగు మాత్రం ముందుకు పడటం లేదు. చరణ్‌కి జోడీగా ఐశ్వర్యారాయ్ నటిస్తున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు కొత్తగా చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ వెలువడలేదు.
entertainment
2,379
12-12-2017 00:53:20
ముగింపు సెషన్‌ మెరుగు
తిథి : మార్గశిర బహుళ దశమినక్షత్రం : శ్రవణంపునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ, తుల రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ : 10322.25 (+56.60) టెండ్‌ మార్పు వేళలు : 11.29, 12.12, 12.55ధోరణి : గ్రహగతులను బట్టి మెరుగ్గా ప్రారంభమై 11.30 నుంచి 1.15 మధ్యలో నిస్తేజంగా ట్రేడవుతూ ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా మారే ఆస్కారం ఉంది. ట్రేడింగ్‌ వ్యూహం...నిఫ్టీ ఫ్యూచర్స్‌ 11.30 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్‌ పొజిషన్లు తీసుకుని 1.15 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 1.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్‌ పొజిషన్లల తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్‌ చేసుకోవచ్చు.ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు : 10365, 10400 మద్దతు స్థాయిలు : 10280, 10245గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.డా.భువనగిరి అమరనాథశాస్ర్తి www.thefinanciala strologer.blogspot.in
business
8,679
06-01-2017 18:00:37
అభిమానులతో కలిసే సినిమా చూస్తాడట!
చాలా ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి తీస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది. అతడి సినిమా కోసం చిరు అభిమానులు, ఇండస్ట్రీలోని పెద్దలు పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రివ్యూలకు సిద్ధం చేస్తున్నారు. అయితే.. చిరంజీవి తనయుడు, ఖైదీ నంబర్ 150తో నిర్మాతగా మారిన రామ్‌చరణ్ మాత్రం ప్రివ్యూ చూడనని అంటున్నాడు. సినిమా విడుదల రోజే అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూస్తానని అంటున్నాడు. నిర్మాతగా తాను సినిమాలోని కొన్ని బిట్లను చూశానని, పూర్తి సినిమాను మాత్రం అభిమానుల సమక్షంలో థియేటర్లోనే చూస్తానని వెల్లడించాడు. ప్రివ్యూ చూసే అవకాశం ఉన్నా.. ఆ పని చేయట్లేదని చెప్పాడు. చాలా మంది అభిమానుల్లాగే తానూ చిరంజీవికి పెద్ద అభిమానినని, అభిమానుల కోలాహలం మధ్యే ఆయన డాన్సులు, ఫైట్లను ఎంజాయ్ చేస్తానని వెల్లడించాడు.
entertainment
18,104
27-03-2017 10:33:06
20 గంటలు పనిచేస్తేనే ఉద్యోగం...లేకుంటే ఇంటికే..!
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టి సందేశం ఇచ్చారు. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధమవ్వాలనీ... లేకుంటే ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవచ్చునని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గోరఖ్‌పూర్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఎలాంటి తాత్సారం చేసినా ప్రభుత్వం సహించదు. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పనిచేసేందుకు ఇష్టమున్నవారే ప్రభుత్వంతో కొనసాగాలి. లేకుంటే వారు ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవచ్చు..’’ అని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. ‘‘కష్టపడిపనిచేయడం నాకు ఇష్టం... అధికారులు కూడా దానికి తగ్గట్టుగా అమలు చేయగలగాలి...’’ అని పేర్కొన్నారు. అధికార దర్పంతో కాకుండా జవాబుదారీతనంతో పనిచేయాలని తోటి మంత్రివర్గ సహచరులకు సూచించారు.
nation
19,930
08-01-2017 01:16:33
ముంబై బోణీ..!
5-2తో యూపీపై విజయం ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌-2 న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌-2లో ముంబై మహారథి ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా తొలిరెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబై ఇక్కడి కేడీ జాదవ్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-2తో యూపీ దంగల్‌పై గెలుపొందింది. ప్రీతమ్‌ (70 కిలోలు)-అమిత్‌ థంకర్‌ మధ్య తొలిబౌట్‌ 3-3తో టై అయింది. కానీ చివరిరౌండ్‌లో మూడువరుస పాయింట్లు నెగ్గినందుకు ముంబై ప్లేయర్‌ ప్రీతమ్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం ఎరికా వీబ్‌ (75 కిలోలు) 4-0తో మరియాను చిత్తుచేయడంతో ముంబై ఆధిక్యం రెట్టింపైంది. మూడోబౌట్‌లోనూ కరోలినా (48 కిలోలు) 3-1తో ఎలిస్టాను ఓడించడంతో ముంబై 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక యూపీ ఆటగాడు ఆండ్రే (65 కిలోలు)-వికాస్‌ బౌట్‌ కూడా 4-4తో టై అయింది. కానీ రెండోరౌండ్‌లో ఆండ్రే 2-0తో నెగ్గడంతో అతడినే విజేతగా ప్రకటించారు. ఇక ఐదోబౌట్‌లో సరిత (58 కిలోలు) 9-1తో మనీషను చిత్తుచేయడంతో ముంబై 4-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. తదుపరి బౌట్‌లో ముంబై ప్లేయర్‌ జబ్రయిల్‌ హసనొవ్‌ (74 కేజీలు) 3-1తో తరియెల్‌పై నెగ్గాడు. చివరి బౌట్‌లో దంగల్‌ ఆటగాడు అమిత్‌కుమార్‌ (57 కేజీలు) 3-2తో రాహుల్‌పై నెగ్గినా ముంబై 5-2తో మ్యాచ్‌ను ముగించింది.
sports
3,968
15-10-2017 23:33:11
దాడిని ఖండిస్తున్నాం!
ఐలయ్య వైశ్యుల మీద, వారికి ఒక కుల సమూహంగా ఉండే సామాజిక ప్రవర్తనపై ఘాటుగా వ్యక్తీకరిస్తూ పుస్తకం రాయడం అది రాజ్యాంగబద్ధమైన చట్రంలోనే జరగడం అది అతని హక్కును వినియోగించుకున్నట్టే అవుతుంది తప్ప అక్రమం ఏమీ లేదు. ప్రతి విషయాన్ని సున్నితంగానో, సుతిమెత్తంగానో చెప్పాలని కోరుకోవడం కూడా సరి అయిన సాహితీ ఆపేక్ష అవ్వదు. సూటిగా మాట్లాడ్డం అందుకు తగిన భాషను ఎన్నుకోవడం అది రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండడంలో అసంబద్ధం ఏమీలేదు. ఐలయ్య భాషతో కాని, అతని అభిప్రాయాల తోటి కాని విభేదించే వాళ్ళు ఇంకో పుస్తకం లేదా సభలు, సమావేశం లాంటి పద్దతులు ఎన్నుకోవచ్చు గాని భౌతికంగా ఐలయ్యపై దాడికి దిగడం ఈ ప్రజాస్వామ్యా నికి సిగ్గు చేటుగా మేము భావిస్తున్నాము. ఐలయ్యపై ఈ విధంగా జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిగానే కాక, మొత్తం కులనిర్మూలన వాదంపై జరుగుతున్నది దాడిగా భావిస్తున్నాం. - బహుజన రచయితల వేదిక, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, బహుజన రచయితల సంఘం, శివారెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు, రాణీ శివ శంకర శర్మ, కుఫిర్‌, కవి యాకూబ్‌, లక్ష్మినారాయణ, కే ఎన్‌ మల్లీశ్వరి, పి విక్టర్‌ విజయ్‌ కుమార్‌, జి యస్‌ రామ్మోహన్‌, రాంకి, పసునూరి రవీంద్ర, దుప్పల రవికుమార్‌, నూకతోటి రవి కుమార్‌, అరణ్యక్రిష్ణ, జివి రత్నాకర్‌, భార్గవ గడియారం, డాక్టర్‌ లెనిన్‌ ధనిసెట్టి, విరసం అరుణ్‌, దేశరాజు, సువర్ణ ముఖి, ఆర్కే పర్స్పెక్టివ్స్‌, పద్మాకర్‌ దగ్గుమాటి, సత్యచక్ర, పి.వరలక్ష్మి, బత్తుల రమాసుందరి, అట్టాడ అప్పల నాయుడు, నస్రీన్‌ ఖాన్‌, వాహెద్‌, సన్నశెట్టి రాజశేఖర్‌, ఇంద్రవెల్లి రమేష్‌, దాసరి రామచంద్ర రావు, పొదిలాపు శ్రీనివాస్‌, చింతాడ తిరుమల రావు, వాసిరెడ్డి నవీన్‌, ప్రసాద రాజ వర్మ, కూర్మనాధ్‌, విల్సన్‌ సుధాకర్‌, పుట్ల హేమలత, నారాయణ స్వామి, ఖాజా వినోద్‌, రాంకి, వెంకట కృష్ణ, బల్లెడ నారాయణ మూర్తి, గుర్రం సీతారాములు.
editorial
17,537
23-10-2017 03:21:20
నకళ్లను అసలుతో పోల్చి చూడాలి
ధ్రువపత్రాలపై బ్యాంకులకు నిబంధనన్యూఢిల్లీ, అక్టోబరు 22: అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేంద్రం కొత్త నిబంధన విధించింది. నిర్దేశించిన మొత్తానికి మించిన నగదు లావాదేవీల సమయంలో సంబంధిత వ్యక్తులు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల నకళ్లను అసలు (ఒరిజినల్‌) పత్రాలతో సరి చూడడం ఇక తప్పనిసరి. ఈ మేరకు ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ధ్రువీకరణ పత్రాల కాపీలను ఇలా సరి చూడడంతో పాటు ఆ విషయాన్ని వాటిపై నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి, రూ.50 వేలు అంతకు మించిన ఆర్థిక, రూ.10 లక్షలకు పైబడి నగదు లావాదేవీలకు అనుసరించాల్సి ఉంటుంది. ఈ నిబంధన బ్యాంకులతో పాటు స్టాక్‌ బ్రోకర్లు, సహకార బ్యాంకులు, చిట్‌ ఫండ్‌, గృహ నిర్మాణానికి రుణాలు ఇచ్చే సంస్థలు, నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలకు వర్తిస్తుందని గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
nation
6,341
22-01-2017 11:26:09
పరిచయం లేని వాళ్ల పెళ్లిలో హల్‌చల్ చేసిన తాప్సీ!
గతేడాది ఊహించని విధంగా సక్సెస్‌ను చవిచూసిన ఆ అందాల భామ... ఈ ఏడాది విడుదల కాబోయే సినిమాతోనూ అదే రేంజ్ హిట్ వస్తుందని ధీమా ఉందట. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలోనూ అమ్మడు సరికొత్తగా ముందుకు సాగుతోందట. బాలీవుడ్‌లో సక్సెస్ రావడం ఎంత కష్టమో... ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం కూడా అంతే కష్టం. తన బాలీవుడ్ కెరీర్‌లో 'పింక్' అనే సినిమాతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ... ఆ సినిమా సక్సెస్‌తో రెండు మూడు ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంది. అందులో ఒకటైన 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' అనే సినిమాను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో సినిమాను ప్రమోట్ చేసుకునే బాధ్యతను తాప్సీ భుజానకెత్తుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె సినిమాను ప్రమోట్ చేయడం చాలామందిని ఆకర్షించిందట. పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటలకు హెల్ప్ చేసే కాన్సెప్ట్‌పై రూపొందిన ఈ మూవీ పబ్లిసిటీ కోసం.. నిజంగానే ఓ పెళ్లికి వెళ్లిపోయి హంగామా చేసిందట ఢిల్లీ బ్యూటీ. ముంబైలోని ఓ హోటల్‌లో జరుగుతున్న పెళ్లిలో సడెన్‌గా సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమైన తాప్సీ...అక్కడ తెగ హల్ చల్ చేసిందట. అంతటితో ఆగకుండా ఈ సినిమాలోని 'డింపీ పే నాల్ భాగే బంటీ' అంటూ సాగే పాట‌ను ఈ పెళ్లిలోనే లాంచ్ చేసిందట తాప్సీ. అంతకు కొద్ది గంటల ముందుగానే ఓ పెళ్లి ఫంక్షన్‌కు సడెన్‌గా వెళ్లబోతున్నానని సోషల్ మీడియాలో వెల్లడించిన తాప్సీ... చెప్పినట్టుగానే పిలవని పెళ్లికి వెళ్లి హంగామా చేయడం... ప్రమోషన్‌లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. మరి... సినిమా కోసం సరికొత్త ప్రమోషన్ దారులను వెతుక్కుంటున్న తాప్సీకి... బాలీవుడ్‌లో మరోసారి 'పింక్' రేంజ్ సక్సెస్ వస్తుందేమో చూడాలి.
entertainment
10,732
03-05-2017 15:12:44
వర్మకు ఓ లేడీ రెబల్ ఫోన్ చేస్తే.. ఇలా ఉంటుంది!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పట్టాన ఎవరికీ అర్థం కారు. ఆ మాటకు వస్తే రెండో పట్టాన కూడా అర్థం కారు. ఓసారి అందరూ మంచివాళ్లు.. తానే చెడ్డవాణ్ణి అని అంటారు. ఇంకోసారి అందరూ చెడ్డవాళ్లు...తానే మంచివాడినని అంటారు. ఓసారి తాను తప్పులు చేశానని, ఇంకోసారి తానసలు తప్పే చేయనని అంటారు. నోటికొచ్చిన ట్వీట్లు పెట్టి వివాదాలు కొనితెచ్చుకుంటారు. ఇంతకూ ఓ లేడీ రెబల్‌కి రామ్ గోపాల్ వర్మకు కాల్ చేయాలని అనిపించింది. అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనిపై సరదాగా ఏబీఎన్ రూపొందించిన రన్నింగ్ కామెంటరీలో చూడండి..చూసి ఆనందించండి...
entertainment
1,092
09-02-2017 00:13:38
అమెరికా పొమ్మంటే.. జపాన్‌ రమ్మంటోంది
గ్రీన్‌ కార్డు నిబంధనలకూ సవరణ బెంగళూరు : భారత ఐటి నిపుణులను అమెరికా పొమ్మంటుంటే.. జపాన్‌ మాత్రం రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. తమ దేశంలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్‌ కార్డులూ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అత్యున్నత నైపుణ్యాలున్న విదేశీయుడు జపాన్‌లో వరుసగా ఐదేళ్లు ఉంటే తప్ప ఆ దేశ గ్రీన్‌ కార్డు లభించదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఈ కాలపరిమితిని జపాన్‌ ప్రభుత్వం ఏడాదికి తగ్గించబోతోంది. ‘భారత ఐటి కంపెనీలకు ప్రస్తుతం జపాన్‌ చాలా చిన్న మార్కెట్‌. ఈ ప్రతిపాదనతో ఆ దేశంలోనూ మన కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరుగుతాయి. భాష వంటి కొన్ని సాంస్కృతిక అడ్డంకులు ఉన్నా గ్రీన్‌ కార్డు నిబంధనల సవరణతో ఆ అడ్డంకులనూ అధిగమించవచ్చు’ అని నాస్కామ్‌ జాతీయ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. 2040 నాటికి జపాన్‌ జనాభా 40 శాతం తగ్గుతుందని అంచనా. దీంతో భారత వంటి దేశాల నుంచి వివిధ రంగాల్లో నైపుణ్యాలున్న వృత్తి నిపుణులను ఆకర్షించాలని జపాన్‌ భావిస్తోంది.
business
7,898
26-05-2017 00:29:26
అక్కడ మచ్చ.. ఇక్కడ రేఖ!
‘‘లేడీస్‌ టైలర్‌’ సినిమాలో అందరూ సీనియర్‌ ఆర్టిస్ట్లు నటించారు. నేటి ట్రెండ్‌కి అనుగుణంగా ఓ మంచి ప్రయత్నంగా ‘ఫ్యాషన్ డిజైనర్‌’ సినిమా చేశాం. పరిశ్రమలో కథానాయికగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న నాకు ఈ చిత్రం మంచి అవకాశం, చక్కని అనుభవం. పాత సినిమాతో పోల్చకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అని మనాలి రాథోడ్‌ అన్నారు. ‘గ్రీన్ సిగ్నల్‌’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’ సినిమాలతో ఆకట్టుకున్న ఆమె వంశీ దర్శకత్వం వహించిన ‘ఫ్యాషన్ డిజైనర్‌’లో అమ్ములుగా అలరిస్తానని చెబుతోంది. మధురశ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో మాట్లాడారు మనాలి. ‘‘ఇందులో నా క్యారెక్టర్‌ పేరు అమ్ములు. అమాయకంగా కనిపించే పక్కా పల్లెటూరి అమ్మాయిని. పాత సినిమాలో పుట్టుమచ్చ కాన్సెప్ట్‌ అయితే ఇక్కడ మన్మథరేఖ మీద కథ నడుస్తుంది. వంశీగారి హీరోయిన్ అనగానే చీరకట్టు, పెద్ద బొట్టు తప్పనిసరి. నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. అమ్ములు పాత్రకి నన్ను ఎంపిక చేస్తారని కలలో కూడా ఊహించలేదు. నటిగా ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి అవకాశమిది. నాతోపాటు మానస, అనీషా అంబ్రోస్ కి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. నా పాత్రలో చాలా మలుపులు ఉంటాయి. ఇందులో నాక్కూడా ఓ పాట ఉంది. అందులో గ్లామర్‌గా కనిపిస్తా. వంశీగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మధుర శ్రీధర్‌ ఫ్యాషన్ ఉన్న నిర్మాత’’ అని తెలిపారు.
entertainment
12,193
14-09-2017 03:36:04
వారంలో హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
కొలీజియం సిఫార్సులకు ప్రధాని గ్రీన్‌సిగ్నల్‌న్యూఢిల్లీ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టుకు మరో వారం రోజుల్లో ఆరుగురు కొత్త న్యాయమూర్తులను కేంద్రం నియమించనుంది. మూడు నెలల క్రితం సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల జాబితాకు బుధవారం ప్రధాని మోదీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. న్యాయవాదులు కొంగర విజయలక్ష్మి, సోమయాజులు డీవీఎస్‌, అమర్‌నాథ్‌గౌడ్‌ టి, అభినంద్‌కుమార్‌, పి.కేశవరావు, ఎం.గంగారావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రధాని మోదీ బుధవారం సంతకం చేసిన ఫైలును వెంటనే పీఎంవో న్యాయశాఖకు పంపింది. న్యాయశాఖ నుంచి హోంశాఖకు, అక్కడి నుంచి రాష్ట్రపతి కోవింద్‌కు సిఫార్సులు వెళ్లిన వెంటనే న్యాయమూర్తుల నియామకం ఫైలుపై రాజముద్ర పడుతుందని తెలిసింది. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వారంలో ముగిసే అవకాశాలున్నాయని, దసరా సెలవులకు ముందే న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.
nation
1,759
02-03-2017 00:17:42
1 నెల.. 1 లక్ష టన్నులు
ఫిబ్రవరిలో సెయిల్‌ భారీ స్థాయి ఉక్కు ఎగుమతులు
business
12,500
07-04-2017 01:40:52
ఆప్‌ సర్కారుది బంధుప్రీతి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కారు నియామకాల్లో బంధుప్రీతికి పాల్పడిందని వి.కె.షుంగ్లూ కమిటీ తేల్చింది. ఢిల్లీకి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నజీబ్‌ జంగ్‌ ఉన్న రోజుల్లో కాగ్‌ మాజీ అధిపతి షుంగ్లూ నేతృత్వంలో ఈ కమిటీని వేశారు. కమిటీ ఏర్పాటే చట్ట విరుద్ధమని, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో తమను దెబ్బ తీయడానికే షుంగ్లూ నివేదికను బయటకు తెచ్చారని ఆప్‌ పేర్కొంది. ఢిల్లీ ఆరోగ్య మిషన్లో 2016లో ఆర్కిటెక్ట్‌ అయిన సౌమ్య జైన్‌కు ఉద్యోగమిచ్చారు.  ఆమె ఆరోగ్య మంత్రి కుమార్తె. మీడియాలో రచ్చ కావడంతో రాజీనామా చేశారు. మంత్రికి భవనాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలికి అర్హత లేకున్నా ఇల్లును కేటాయించారు. సీఎం బంధువును ఆరోగ్య మంత్రి దగ్గర ఓఎస్డీగా నియమించారు. కేజ్రీవాల్‌ సన్నిహితులైన పలువురిని మంత్రుల దగ్గర ఓస్డీలుగా పెట్టి జీతం 87 వేలు చేశారు. శుంగ్లూ నివేదికపై సీఎం కేజ్రీవాల్‌ గద్దె దిగాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌, బీజేపీలు డిమాండ్‌ చేశాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఆప్‌ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.
nation
13,646
27-05-2017 17:38:30
యోగీ...! శాంతిభద్రతలేవీ..?
సహరాన్‌పూర్‌: యూపీలోని సహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతి నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారంనాడు తన పర్యటన కొనసాగించారు. రెండు వర్గాల విభేదాలతో అట్టుడికిన సహరాన్‌పూర్‌ చేరుకున్న రాహుల్ అక్కడి స్థానికులను కలుసుకున్నారు. అల్లర్లకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులో ఉంచడంలో యోగి సర్కార్ విఫలమైందని రాహుల్ ఈ సందర్భంగా ఆరోపించారు. 'దేశంలో ఇవాళ పేదలకు చోటు లేకుండా పోయింది. యూపీలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైంది. దేశ పౌరులందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది' అని రాహుల్ మండిపడ్డారు. సహరాన్‌పూర్‌లో పరిస్థితి చక్కబడలేదని, పరిస్థితి చక్కబడగానే తామే గ్రామానికి తీసుకువెళ్తామని, ప్రస్తుతం వెనక్కి వెళ్లిపొమ్మని అధికార యంత్రాంగం తనను కోరినట్టు రాహుల్ చెప్పారు. కాగా, పోలీసులు రాహుల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆయన పట్టుబట్టి మరీ ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో మమేకమయ్యారు. పరిస్థితి విషమించడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, రాజ్‌బబ్బర్ తదితరులు ఉన్నారు.
nation
21,517
26-06-2017 01:10:36
‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ సింధు
బెస్ట్‌ టీమ్‌గా జూనియర్‌ హాకీ జట్టుఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక అవార్డుల ప్రకటనహైదరాబాద్‌: స్పోర్ట్స్‌ జర్నలిస్ట్స్‌ ఫె డరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ జేఎఫ్‌ఐ) ప్రతి ఏడాది ప్రకటించే ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు భారత ఏస్‌ షట్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్‌లో జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్‌ హాకీ జట్టును ‘బెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు వరించింది. గత డిసెంబర్‌లో లక్నో వేదికగా జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్‌లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
sports
5,727
26-06-2017 13:12:06
ఆ లోపు అంటే పవన్‌తో సినిమా కష్టమే: జక్కన్న
బాహుబలి.. రాజమౌళి డైరెక్టింగ్ బ్యాటింగ్‌లో హాలీవుడ్ బౌండరీని తాకిన ఓ ఎపిక్. ఆ చిత్రంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళితో లైఫ్‌లో ఒక్క సినిమా చేస్తే చాలు.. అని అనుకునే హీరోలు చాలా మందే ఉన్నారిప్పుడు. తెలుగులో రాజమౌళి సినిమాలను చూస్తే ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రవితేజ, సునీల్, రామ్‌చరణ్, నితిన్ వంటి వారితో ఓ చిన్న లిస్టు మాత్రమే కనిపిస్తుంది. లిస్ట్ చిన్నదైనా వాటి నుంచి వచ్చిన ఫలితాలే భారీగా కనిపిస్తాయి. మరి, పవన్‌తో సినిమా ఎప్పుడు...? రాజమౌళికి పవన్ అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్న ఇది. తాజాగా ఆ ప్రశ్న మరోసారి ఎదురైంది జక్కన్నకు. రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నెంబర్-1 యారి’ అనే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు జక్కన్న.           ఆ కార్యక్రమంలో రానా.. పవన్‌తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి నుంచి ఊహించని సమాధానమే ఎదురైంది. బహుశా.. పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశాలు లేవేమోనని సమాధానమిచ్చారు రాజమౌళి. ‘‘నాకు తెలిసినంత వరకు పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్లేలోపు పవన్‌తో సినిమా తీసే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు’’ అని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అమితమైన గౌరవమని, ఆయన తన యాదిలోకి వచ్చినప్పుడల్లా కల్మషం లేని ఆయన మనస్తత్వమే గుర్తొస్తుందని అన్నారు.  కళ్లను చూసి హీరో పేరు చెప్పండి.. నగదు బహుమతులు గెలుచుకోండి ఉదయ్‌కిరణ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
entertainment
18,989
12-12-2017 03:12:03
కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్‌, డిసెంబరు 11: భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఉత్తర కశ్మీర్‌లోని హంద్వార ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరితో పాటు ఓ మహిళ కూడా మృతి చెందిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. నిఘా విభాగం హెచ్చరికలతో హంద్వార ప్రాంతంలో సోమవారం వేకువజామున సోదాలు చేస్తుండగా ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో వారిని మట్టుబెట్టాయని స్థానిక డీజీపీ వెల్లడించారు. మృతులను లష్కరే తోయిబకు చెందినవారిగా భావిస్తున్నారు.
nation
15,219
12-02-2017 11:29:04
సత్యార్థి ఇంట్లో చోరీ కేసు...నోబెల్ దొంగలు దొరికారు!
న్యూఢిల్లీ: ఇటీవల నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సునీల్, రాజన్, వినోద్‌ సహా ముగ్గుర్ని అరెస్టు చేసి నోబెల్ బహుమతి నమూనాతో పాటు, ప్రశంసా పత్రం, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సత్యార్థి నివాసంతో పాటు మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చొరబడినట్టు వెల్లడించారు. కాగా ఇంట్లో చోరీ జరిగినప్పుడు కైలాస్ సత్యార్థి పనామా పర్యటనలో ఉన్నారు. సత్యార్థి తన సతీమణితో పాటు పనామాలోని భారత రాయబారి, ఇతర ప్రముఖులతో కలసి పనామా అధ్యక్షుడితో విందులో పాల్గొన్న సందర్భంలోనే ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. బాలల హక్కుల కార్యకర్తగా విశేష కృషి చేసిన ఆయనను 2014లో నోబెల్ బహుమతి వరించింది. తనకు వచ్చిన నోబెల్ పురస్కారాన్ని ఆయన 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించారు. సత్యార్థి నోబెల్ పురస్కారం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. ఇంట్లోని నమూనా పురస్కారాన్నే అసలు నోబెల్ బహుమతి అనుకుని దొంగలు అపహరించుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు.
nation
3,682
30-01-2017 03:52:49
పనిముట్లు
తెగటానికీ కొయ్యటానికీ నడుమ దారం అంచు మీద అంచలంచల కసరత్తు చేసి నునుపు అందాన్ని మెరుపు కొసలకందించే మడక కత్తి. తల చుట్టూ పిచ్చుకలా రెక్కలార్చుతూ తలకొక ప్రపంచాన్ని నిర్మించే కత్తెర. ఒళ్ళు కందకుండా ముల్లును గల్లా పట్టుకుని బయటికీడ్చే గోరుగల్లు కొత్త జంట కాలిగోళ్ళ మీద కురిసే సుతారపు జల్లు. కత్తి చర్మాన్ని కొంచెంకొంచెంగా ఒలిచి కక్కుపెట్టే సానరాయి. మెదడు నాదును మెత్తగా నూరి సాదు చేసే మాలిష్‌ చేతులు. ఒక తాజా కేరింతను లోకానికీ ఒక లోకాన్ని తాజా కేరింతకీ సమర్పించే చేతులు. ఒక తల్లి శరీర మూల రహస్యాల మీద హార్మోనియం వాయించే మంత్రసాని చేతులు. ఆత్మను అత్తరు గీతం చేసి సంగీత పడవల్లో సమయ సముద్రాల్ని దాటించే సన్నాయి. కళఫెళా కదిలి పందిరికి స్పందన తెచ్చే డోలు. వేదాంతి నిలకడలా ఉదరంతో శ్వాసించే సుతిబూర. ఇల్లు ఇల్లుగా పెళ్ళి పెళ్ళిగా పుట్టుక పుట్టుగ్గా బతుకు బతుగ్గా మొగ్గ తొడిగే మేళం. మా పనిముట్లు కనికట్లు కావు మాకే మంత్రాలూ రావు. బతుక్కి కళల రక్తాన్నెక్కించటం కళలకి బతుకు వారసత్వాన్నివ్వటం మా విద్య. నెర్రెలిచ్చిన లోకం గుండెకు మేము కట్టే పసరుకట్లు మా పనిముట్లు. మీ అందరి మీద మా వృత్తి రోజూ ప్రేమగా రాల్చే వెలుగు పొరలు మా పనిముట్లు. ఉపాలి కపాలం నుండి ఊడిపడ్డ ఈ వినయ మాధుర్యాలు సేవను సౌందర్య భాషలోనే పాడే మా పనికి సజీవ సంతకాలు. మంగలత్వమే మధురమని ఎలుగెత్తే నినాదాలు.   జి. లక్ష్మీనరసయ్య
editorial
4,446
28-03-2017 02:01:58
వారసత్వ ఉద్యోగాల భవిష్యత్తేమిటి?
స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేయడానికి సింగరేణి సిద్ధమయ్యింది. యూనియన్ల సూచనలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పరిశీలించాల్సి ఉంది. క్రెడిట్‌ కోసం పాకులాటలు పక్కనబెట్టి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి రావాలి. సింగరేణి యాజమాన్యం అందరిసలహాలు, సూచనలు తీసుకుంటే కచ్చితంగా వారసత్వ ఉద్యోగాలకు ఒక పరిష్కారం లభిస్తుంది. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇరకాటంలో పడ్డాయి. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లోని నిబంధనల ప్రకారం, అల్లుడు అయి ఉంటే కచ్చితంగా కార్మికుని కూతురుని పెండ్లి చేసుకుని ఉండాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలుండాలి. దీంతో దాదాపు సింగరేణిలోని ఆరు జిల్లాలలో హడావుడిగా కట్నం స్థానంలో ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధమైన కార్మికులు తమ పిల్లలకు రిజిష్టర్డ్‌ మ్యారేజ్‌లు కూడా చేసేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో వారి పరిస్థితి తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ కుటుంబాలలో నిద్ర లేదు, తిండి లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16కు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని గోదావరిఖనికి చెందిన సతీష్‌ అనే యువకుడు వారసత్వ ఉద్యోగాలను సవాల్‌ చేస్తూ ఫిబ్రవరి 2న హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) వేశాడు. దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 16న హైకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16ను పూర్తిగా ఉల్లంఘించి వారసత్వ ఉద్యోగాలకు దారితీసేదిగా సింగరేణి సర్క్యులర్‌ ఉందని, అలా ఉద్యోగాలివ్వడానికి వీలు లేదంటూ సంస్థ వాదనలను కోర్టు కొట్టి పడేసింది. హడావుడిగా సీఎం కేసీఆర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు సింగరేణి సీఎండీ శ్రీధర్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు తదితరులతో సమావేశమై సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి నిర్ణయించారు. వాస్తవానికి కోర్టు తీర్పులో ఆర్టికల్‌ 14, 16కు లోబడి మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చని పేర్కొనడం జరిగింది. 1979 ఆగస్టు 11న రెండవ బొగ్గుగని కార్మికుల వేజ్‌బోర్డులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు అన్‌ఫిట్‌ అయితే వారి వారసులకు ఉద్యోగమివ్వవచ్చని ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఒప్పందం అమలులో ఉంది. అయితే 1981 జనవరి 21న ఈ ఒప్పందం కొనసాగింపుగా సింగరేణిలో వీఆర్‌ఎస్‌ ద్వారా అనారోగ్యంతో ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే అన్‌ఫిట్‌ చేసి ఏకకాలంలో వారసుడిని ఫిట్‌ చేయడం, ఉద్యోగమివ్వడం జరుగుతుందని ఐడీ యాక్ట్‌ -12 (3) ప్రకారం ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం 1998లో రద్దయ్యింది. తిరిగి 18 ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమం సందర్భంగా కార్మికుల కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి, తదనంతరం పునరుద్ధరించారు. ఇప్పుడు 6వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ స్కీం ఇరకాటంలో పడింది. బొగ్గుగనుల కార్మికులు ప్రకృతికి విరుద్ధంగా బొగ్గుబావుల్లోకి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి వారికి బీపీ, షుగర్‌ లాంటివి, మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాకుండా గ్యాస్‌ట్రబుల్‌ చివరికి దీర్ఘకాలిక క్యాన్సర్‌, గుండె జబ్బులు, కళ్ళ జబ్బులు, ముక్కు, చెవులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉద్యోగం వదలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే 1979లోనే దీనిపై కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికీ మొన్న పునరుద్ధరణ అనంతరం ఐడీ యాక్ట్‌ 12(3) కింద గెలిచిన కార్మిక సంఘాలతో యాజమాన్యం ఒప్పందం చేసుకుని ఉంటే కోర్టులో కేసు నిలబడేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  సుప్రీంకోర్టుకు వెళ్ళడం కంటే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌ను ఆర్టికల్‌ 14, 16కు లోబడి మోడిఫై చేసి ఉద్యోగాలివ్వడం వల్ల ప్రయోజనం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఒక్కసారి హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే.. అందులో 1981 నుంచి అమలులో ఉన్న డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ సర్క్యులర్‌ను కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. తీర్పు పేజీనెం. 22 పాయింట్‌ నెం. 21లో స్పష్టంగా కనిపిస్తుంది. డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో స్ర్తీ, పురుష వివక్ష తగదు. తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (iii) కార్మికుడు అన్‌ఫిట్‌ కాకముందే అతని డిపెండెంట్‌ను మెడికల్‌కు పంపడం, అతడు ఫిట్‌ అయితేనే కార్మికుడిని అన్‌ఫిట్‌ చేయడం మెడికల్‌ అన్‌ఫిట్‌ కిందకు రాదు. అది స్వచ్ఛంద పదవీ విరమణ కిందకు వస్తుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16కి వ్యతిరేకం. (తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (i,ii) డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో స్ర్తీ పురుష వివక్ష తగదు. (తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (iii) ఆర్గనైజేషన్‌లో ఒకరు పనిచేస్తే ఒక న్యాయం, భర్త, భార్య పనిచేస్తే మరొక న్యాయం తగదు. (తీర్పు పేజీనెం. 22, పాయింట్‌ నెం. 20(iv) అంగవైకల్యం ఉన్న వారి పట్ల వివక్ష తగదు. ఇది 1995 ప్రభుత్వ ఆర్డర్‌కు వ్యతిరేకం. (తీర్పు పాయింట్‌ నెం. 20 (v)) ఇందులోనే దత్తపుత్రున్ని నిరాకరించడం చట్ట వ్యతిరేకం. వాస్తవంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుని డిపెండెంట్‌కు పని కల్పించడం రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్‌ 14, 16కు వ్యతిరేకం కాదు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది (జడ్జిమెంట్‌ ముగింపు పేరా, 22, 23). జడ్జిమెంట్‌ సారాంశాన్ని పరిశీలించినట్లయితే మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుని డిపెండెంట్లకు ఉద్యోగం కల్పించవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పు డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌కు వ్యతిరేకంగా కాబట్టి సుప్రీంకోర్టులో అప్పీల్‌ అడ్మిషన్‌కే ఇబ్బంది అవుతుందని కూడా ఒక వాదన ఉంది. లేదా కేసు అడ్మిట్‌ అయినా తీర్పు వచ్చేవరకు ఎంత సమయం అవుతుందోననే అనుమానాలు కూడా ఉన్నాయి. హడావుడి నిర్ణయాలు, టెక్నికల్‌ పాయింట్ల పరిశీలనపై సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కొంత కసరత్తు చేసి ముందుకు వెళ్ళాలి.  కేవలం డిపెండెంట్‌ ఎంప్లాయిమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో జరిగిన ప్రయోజనం గురించి చెప్పాలి. భవిష్యత్‌లోనూ అలాంటి నోటిఫికేషన్లు రావాలి. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు, రిటైర్డ్‌ కార్మికుల పిల్లలకు కూడా కొంత రిజర్వేషన్‌ ఇవ్వాలి. దీని వల్ల డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ వివాదాస్పదంగా తయారయ్యే పరిస్థితి ఉండదు. అయితే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు సుప్రీంకోర్టుకు వెళ్ళకుండానే ఉన్నాయి. అయితే కోర్టు స్పష్టంగా మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది. తప్పనిసరిగా 1952 మైన్స్‌ యాక్ట్‌ ప్రకారం మైనింగ్‌లో మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు. ఈ విషయంలోనైనా సుప్రీంకోర్టుకు వెళ్ళక తప్పదని అధికారులు చెబుతున్నారు. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేయడానికి సింగరేణి సిద్ధమయ్యింది. అయితే యూనియన్ల సూచనలను కూడా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పరిశీలించాల్సి ఉంది. క్రెడిట్‌ కోసం పాకులాటలు పక్కనబెట్టి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి రావాలి. ఎవరో కుట్రతో కోర్టుకు వెళ్ళారని ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాలు పక్కనపెట్టాలి. సింగరేణి యాజమాన్యం అందరితో ఈ విషయంలో సలహాలు, సూచనలు తీసుకుంటే కచ్చితంగా వారసత్వ ఉద్యోగాలకు ఒక పరిష్కారం లభిస్తుంది.ఎండీ. మునీర్‌  ఇప్పుడు 6వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ స్కీం ఇరకాటంలో పడింది. బొగ్గుగనుల కార్మికులు ప్రకృతికి విరుద్ధంగా బొగ్గుబావుల్లోకి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి వారికి బీపీ, షుగర్‌ లాంటివి, మోకాళ్ళ నొప్పులు మాత్రమే కాకుండా గ్యాస్‌ట్రబుల్‌ చివరికి దీర్ఘకాలిక క్యాన్సర్‌, గుండె జబ్బులు, కళ్ళ జబ్బులు, ముక్కు, చెవులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉద్యోగం వదలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే 1979లోనే దీనిపై కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికీ మొన్న పునరుద్ధరణ అనంతరం ఐడీ యాక్ట్‌ 12(3) కింద గెలిచిన కార్మిక సంఘాలతో యాజమాన్యం ఒప్పందం చేసుకుని ఉంటే కోర్టులో కేసు నిలబడేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  సుప్రీంకోర్టుకు వెళ్ళడం కంటే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌ను ఆర్టికల్‌ 14, 16కు లోబడి మోడిఫై చేసి ఉద్యోగాలివ్వడం వల్ల ప్రయోజనం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఒక్కసారి హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే.. అందులో 1981 నుంచి అమలులో ఉన్న డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ సర్క్యులర్‌ను కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. తీర్పు పేజీనెం. 22 పాయింట్‌ నెం. 21లో స్పష్టంగా కనిపిస్తుంది. డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో స్ర్తీ, పురుష వివక్ష తగదు. తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (iii) కార్మికుడు అన్‌ఫిట్‌ కాకముందే అతని డిపెండెంట్‌ను మెడికల్‌కు పంపడం, అతడు ఫిట్‌ అయితేనే కార్మికుడిని అన్‌ఫిట్‌ చేయడం మెడికల్‌ అన్‌ఫిట్‌ కిందకు రాదు. అది స్వచ్ఛంద పదవీ విరమణ కిందకు వస్తుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16కి వ్యతిరేకం. (తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (i,ii) డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ విషయంలో స్ర్తీ పురుష వివక్ష తగదు. (తీర్పు పేజీనెం. 21, పాయింట్‌ నెం. 20 (iii) ఆర్గనైజేషన్‌లో ఒకరు పనిచేస్తే ఒక న్యాయం, భర్త, భార్య పనిచేస్తే మరొక న్యాయం తగదు. (తీర్పు పేజీనెం. 22, పాయింట్‌ నెం. 20(iv) అంగవైకల్యం ఉన్న వారి పట్ల వివక్ష తగదు. ఇది 1995 ప్రభుత్వ ఆర్డర్‌కు వ్యతిరేకం. (తీర్పు పాయింట్‌ నెం. 20 (v)) ఇందులోనే దత్తపుత్రున్ని నిరాకరించడం చట్ట వ్యతిరేకం. వాస్తవంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుని డిపెండెంట్‌కు పని కల్పించడం రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్‌ 14, 16కు వ్యతిరేకం కాదు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది (జడ్జిమెంట్‌ ముగింపు పేరా, 22, 23). జడ్జిమెంట్‌ సారాంశాన్ని పరిశీలించినట్లయితే మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుని డిపెండెంట్లకు ఉద్యోగం కల్పించవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పు డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌కు వ్యతిరేకంగా కాబట్టి సుప్రీంకోర్టులో అప్పీల్‌ అడ్మిషన్‌కే ఇబ్బంది అవుతుందని కూడా ఒక వాదన ఉంది. లేదా కేసు అడ్మిట్‌ అయినా తీర్పు వచ్చేవరకు ఎంత సమయం అవుతుందోననే అనుమానాలు కూడా ఉన్నాయి. హడావుడి నిర్ణయాలు, టెక్నికల్‌ పాయింట్ల పరిశీలనపై సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కొంత కసరత్తు చేసి ముందుకు వెళ్ళాలి.  కేవలం డిపెండెంట్‌ ఎంప్లాయిమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో జరిగిన ప్రయోజనం గురించి చెప్పాలి. భవిష్యత్‌లోనూ అలాంటి నోటిఫికేషన్లు రావాలి. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు, రిటైర్డ్‌ కార్మికుల పిల్లలకు కూడా కొంత రిజర్వేషన్‌ ఇవ్వాలి. దీని వల్ల డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ వివాదాస్పదంగా తయారయ్యే పరిస్థితి ఉండదు. అయితే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు సుప్రీంకోర్టుకు వెళ్ళకుండానే ఉన్నాయి. అయితే కోర్టు స్పష్టంగా మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది. తప్పనిసరిగా 1952 మైన్స్‌ యాక్ట్‌ ప్రకారం మైనింగ్‌లో మహిళలకు, దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు. ఈ విషయంలోనైనా సుప్రీంకోర్టుకు వెళ్ళక తప్పదని అధికారులు చెబుతున్నారు. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేయడానికి సింగరేణి సిద్ధమయ్యింది. అయితే యూనియన్ల సూచనలను కూడా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పరిశీలించాల్సి ఉంది. క్రెడిట్‌ కోసం పాకులాటలు పక్కనబెట్టి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి రావాలి. ఎవరో కుట్రతో కోర్టుకు వెళ్ళారని ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాలు పక్కనపెట్టాలి. సింగరేణి యాజమాన్యం అందరితో ఈ విషయంలో సలహాలు, సూచనలు తీసుకుంటే కచ్చితంగా వారసత్వ ఉద్యోగాలకు ఒక పరిష్కారం లభిస్తుంది.ఎండీ. మునీర్‌
editorial
16,025
12-10-2017 02:20:05
భారత్‌కు సమీపంలో పాక్‌ అణ్వాయుధాలు!
రహస్య ప్రాంతంలో నిల్వథేమ్‌వాలీలో 3 భారీ సొరంగాలుఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ రిపోర్టున్యూఢిల్లీ, అక్టోబరు 11: భారత్‌కు చేరువలో పాకిస్తాన్‌ అణ్వాయుధాలను మోహరి స్తోందా? పెద్ద మొత్తంలో క్షిపణులను సిద్ధం చేస్తోందా? అంటే పలు అంతర్జాతీయ రిపోర్టులు అవుననే అంటున్నాయి. దాదాపు 140 అణ్వాయుధాలను తయారుచేసిన దాయాది.. వాటిని దాచేందుకు రహస్య ప్రాంతంలో సొరంగాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని థేమ్‌వాలీ ప్రాంతంలో కొండల కింద మూడు భారీ సొరంగాలను తవ్వుతున్నట్లు ఓ అం తర్జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆ కథనం ప్రకారం... పాకిస్థాన్‌ నిర్మాణాల్లో 10 మీటర్ల ఎత్తు, 10 మీటర్ల వెడల్పు ఉండే పొరంగాలు ఉంటాయి. ఒక్కో సొరంగంలో 12 నుంచి 24 అణ్వాయుధాలు, లాంచింగ్‌ వాహనాలను దాచవచ్చు.  ఒక సొరంగానికి, మరో సొరంగానికి మధ్య 450 నుంచి 750 మీటర్ల దూరం ఉంటుంది. వాటిలోకి లాంచర్లను తీసుకెళ్లేలా 20 మీటర్ల వెడల్పు గల భారీ రోడ్లను కూడా నిర్మిస్తోంది. పాకిస్థాన్‌ ఆర్మీ పర్యవేక్షణలో 2009లో ప్రారంభమైన సొరంగాల నిర్మాణ పనులు 2016 డిసెంబరు వరకు జరిగాయని తెలుస్తోంది. కాగా, ఈ ప్రాంతానికి అన్నివైపులా కంచెను ఏర్పాటుచేశారు. లోపలకు వెళ్లేందురు రెండు ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఇక అ డ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో సిబ్బంది వాహనాల పార్కింగ్‌ కోసం భవనాలను కట్టారు. ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యలో మసీదును కూడా నిర్మించారు. అంతేకాదు క్షిపణులను ప్రయోగించే వాహనాలు దిశను మార్చుకునేదుకు వీలుగా 80మీటర్ల వ్యాస మున్న వృత్తాకారంలో టర్నింగ్‌ ఏరియా ఉంది. థేమ్‌వాలీలోనే ఎందుకు?థేమ్‌వాలీ.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు 350 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి భారత్‌పై సులువుగా దాడిచేయ వచ్చనే ఉద్దేశంతోనే, అక్కడ సొరంగాలను నిర్మిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.
nation
7,359
12-11-2017 12:00:19
" ‘పద్మావతి’ మూవీని ఆదిలాబాద్‌లో అడ్డుకుంటాం"
ఆదిలాబాద్‌‌: హిందూ ధర్మాన్ని మంటగలిపేలా రజాకారుల చరిత్రను ముస్లింలకు అను కూలంగా మారుస్తున్న సీఎం కేసీఆర్‌కు రజాకారుల చరిత్ర తెలియదా? అని శివసేన జిల్లా అధ్యక్షు డు యతింధ్రనాథ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. శనివా రం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందు ధర్మాన్ని కించపరిచే విధంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని మండిపడ్డారు. పద్మావతి సినిమాను జిల్లాలో విడుదల కాకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ముస్లింలకు వంద శాతం సబ్సిడీపై రూ.3లక్షల రుణం అందిస్తామనడం సిగ్గు చేటన్నారు. హిందూవులను కించపరిచేలా మాట్లాడితే శివసేన ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. ఇందులో నాయకులు అనికేత్‌పాటిల్‌, కరణ్‌సింగ్‌ ఠాకూర్‌, సాయికోటావార్‌, కృష్ణయాదవ్‌, గౌరవ్‌ఠాకూర్‌, నరేష్‌, అభినయ్‌ గౌడ్‌, సంతోష్‌సింగ్‌ పాల్గొన్నారు.
entertainment
13,987
27-12-2017 03:22:15
టార్చ్‌లైట్‌ వెలుగులో శుక్లాలు తొలగించారు!
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యుల నిర్వాకంఉన్నావ్‌, డిసెంబరు 26: కంట్లో శుక్లాలను తొలగించే శస్త్రచికిత్సను చాలా జాగ్రత్తగా చేయాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా రోగులు చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ 32 మందికి టార్చ్‌లైట్‌ వెలుతురులో ఇలాంటి శస్త్రచికిత్సలను చేశారు యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుప్రతి వైద్యులు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు బాధ్యులను సస్పెండ్‌ చేసింది.
nation
13,122
15-03-2017 14:37:40
జయలలిత బాటలో సిద్ధరామయ్య!
బెంగళూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్దమయ్యారు. 5, 10 రూపాయలకే అల్పాహారం, భోజనాలు వడ్డించేలా ‘నమ్మ’ క్యాంటీన్లు నెలకొల్పందుకు శ్రీకారం చుట్టారు. ఒక్క బెంగళూరులోనే 198 నమ్మ క్యాంటీన్లు ప్రారంభించనున్నారు.  2017-18 కర్నాటక బడ్జెట్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించారు. బెంగళూరు వ్యాప్తంగా 198 నమ్మ క్యాంటీన్లు నెలకొల్పుతామనీ.. బ్రేక్‌ఫాస్ట్ రూ.5, మధ్యాహ్నం భోజనం రూ.10కే అందిస్తామని కర్నాటక సీఎం వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కూడా ‘సవిరుచి సంచారీ’ పేరిట సంచార క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ పథకంలో స్వయం సహాయక సంఘాల ద్వారా సబ్సిడీ కింద ఆహారం అందిస్తామని తెలిపారు. ‘అన్నభాగ్య’ పథకం కింద అందిస్తున్న కోటా బియ్యాన్ని 5 కిలోల నుంచి 7 కిలోలకు పెంచుతున్నామన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2011లో ‘అమ్మ క్యాంటీన్లు’ పేరిట తొలిసారి ఇలాంటి పథకాన్నిప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లలో రూ.1కే ఇడ్లీలు, రూ.5 కేల పొంగళ్లు అందిస్తుండడంతో లక్షలాది మంది పేద ప్రజలకు ఆకలి తీర్చుకునే అవకాశం కలిగింది. అంతేకాదు.. ప్లేటు సాంబారు అన్నం రూ.5, ప్లేటు పెరుగన్నం రూ.3 పథకాలు కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి. సాయంత్రం రెండు చపాతీలు, పప్పు కలిపి రూ.3కే అందిస్తారు. జయలలిత ప్రారంభించిన ఈ పథకాలు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను ఆకర్షించాయి. ఢిల్లీ, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ‘అమ్మ క్యాంటీన్’ మాదిరి ఆహార పథకాలను ప్రవేశపెట్టారు. తాజాగా జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేయడంతో.... కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. ఆకర్షణీయమైన పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే పనిలో పడింది.
nation
19,254
04-02-2017 11:29:23
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం?
చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వీకే శశికళ.. తాజాగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు ముహూర్తం ఖరారైనట్టు చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం స్థానంలో... ఈ నెల 8 లేదా 9న శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఆదివారం జరిగే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రకటించింది. దీంతో అందరి దృష్టి ఆ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. మరోవైపు శశికళకు అత్యంత విధేయురాలైన అధికారి షీలా బాలకృష్ణన్‌తో సహా ముగ్గురు ఉన్నతాధికారులను రాజీనామా చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పడు పాలనా బాధ్యతలన్నీ షీలానే చూసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమెను రాజీనామా చేయాలని పన్నీర్ సెల్వం కార్యాలయం కోరినట్టు చెబుతున్నారు. శుక్రవారం మాజీ మంత్రి కేఏ సెంగోట్టాయన్, మాజీ మేయర్ సైదాయ్ ఎస్ దురైసామిలను పార్టీ కార్యదర్శులుగా శశికళ నియమించారు. పార్టీలోని అసమ్మతి వాదులకు చెక్ పెట్టేందుకే వీరిని తెరపైకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఏఐఏడీఎంకే పార్టీ అనుబంధ సంస్థ ఎంజీఆర్ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న అంబత్తూర్ ఎమ్మెల్యే అలెగ్జాండ‌ర్‌ను కూడా తొలగిస్తున్నట్టు శశికళ ప్రకటించారు.
nation
5,320
09-07-2017 13:12:33
రావణుడి రికార్డుల వేట..!
విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబులో, ఫేస్‌బుక్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు రావణుడు. జూలై 6న సాయంత్రం విడుదలైన జైలవకుశ టీజర్.. ఆ క్షణం నుంచే రికార్డుల వేట మొదలెట్టేసింది. ఒక్క రోజు తిరగకుండానే లక్ష లైకులను సొంతం చేసుకున్న టీజర్.. రెండు రోజుల్లో కోటి వ్యూస్ దాటేసింది. అవును.. విడుదలైన 48 గంటల్లోనే జై టీజర్.. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లు కలిపి కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ వెల్లడించారు. తద్వారా నాన్ బాహుబలి రికార్డులను జైలవకుశ టీజర్ బద్దలు కొట్టినట్టైంది. ఇక, ఈ టీజర్‌కు ఇప్పటిదాకా రెండు లక్షలకు పైగా వ్యూయర్లు లైక్ కొట్టారు. ‘‘48 గంటల్లోపే కోటి డిజిటల్ వ్యూస్. జైటీజర్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. మీ అందరి సంచలన స్పందనకు ధన్యవాదాలు’’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. కాగా, రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటిదాకా జైటీజర్ మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
entertainment
6,243
02-10-2017 14:34:27
ప్రభాస్, రానా, రవీనా టాండన్, అనుష్క సెల్ఫీ వైరల్..
బాలీవుడ్ హీరోయిన్, బాహుబలి స్టార్స్ హైదరాబాద్‌లో ఓ పార్టీలో కలుసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వివరాలైతే తెలియలేదు కానీ కలుసుకుని మాత్రం సందడి చేశారు. బాలీవుడ్‌లో మెరిసి.. టాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నాటి బ్యూటీ రవీనా టాండన్. గతంలో ఆకాశ వీధిలో నాగార్జున సరసన, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో మోహన్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు. సడెన్‌గా ఇప్పుడు ప్రభాస్, రానా, అనుష్కలతో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ పార్టీలో వీరంతా ఇలా కలుసుకున్నారని సమాచారం. ఈ పార్టీలో అనుష్కకు రవీనా ఓ కత్తిని గిఫ్టుగా ఇచ్చారు. రవీనా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
entertainment
3,106
23-07-2017 23:54:07
జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నారా?
నేటికాలంలో బీమా రక్షణ లేనిదే జీవితానికి భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. జీవితానికి ఆర్థిక రక్షణతోపాటు, పిల్లల పెళ్లిళ్లు, చదువులు వంటి అవసరాలకూ ముందుగానే జీవిత బీమా రక్షణతో సిద్ధం కావలసి అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు జీవిత బీమా తప్పనిసరై పోయింది. అయితే పూర్తిగా పరిజ్ఞానం లేని ఏజెంట్ల మాటలు నమ్మి పాలసీలు కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనంకన్నా ఆర్థిక భారం ఎక్కువగా భరించాల్సి వస్తుంది. అందుకే జీవిత బీమా పాలసీలు తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. అవేమిటంటే..అవసరానికి తగిన పాలసీ ఎంపిక పాలసీదారుడికి అనుకోనిదేమైనా జరిగితే అతడు లేదా అతని కుటుంబ సభ్యులకు పాలసీలో హామీ ఇచ్చిన మేరకు ‘ఆర్థిక’ భరోసా కల్పించడమే జీవిత బీమా పాలసీల ప్రధాన లక్ష్యం. అంతే తప్ప పొదుపు కోసం లేదా పన్నుల ఆదా కోసం జీవిత బీమా పాలసీలు తీసుకోకూడదు. అయితే బీమా పాలసీలను తీసుకుంటే ఈ రెండూ అదనపు ప్రయో జనాలుగా వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ తీసు కునేటపుడే తన అవసరాలు ఏమిటి? తాను తీసుకునే పాలసీ ద్వారా నిర్దేశిత అవసరం తీరుతుందా? అని ఒకటికి రెండు మార్లు ఆలోచించాలి. అవసరమనుకుంటే వెంటనే మీ అవసరాలు తీర్చే జీవిత బీమా పాలసీ తీసుకోండి. లేకపోతే మాత్రం వాటి జోలికే పోవద్దు.  బీమా కవరేజ్‌ లెక్కింపుజీవిత బీమా పాలసీ తీసుకునే ముందు మీరు దురదృష్టవశాత్తు లేకపోయినా ఆ పాలసీ మీ కటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలు తీర్చేలా ఉండాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ ఖర్చులకు ఢోకా ఉండకూడదు. ఇందుకు ద్రవ్యోల్బణం ఆధారంగా భవిష్యత్‌లో ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని లెక్కించి అంత మొత్తానికి కవరేజ్‌ ఉండేలా పాలసీ తీసుకోవాలి. అంతే తప్ప ఎక్కువ కవరేజ్‌ కోసం తొందర పడకూడదు. అలా చేస్తే చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం తడిసి మోపెడవుతుంది. పాలసీ గురించి తెలుసుకోవడం..పిల్లల చదువుల ఖర్చులతోపాటు దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కోసం యులిప్‌ పాలసీ సరి పోతుందా? లేక టర్మ్‌ పాలసీ సరిపోతుందా? అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. కేవలం ఆర్థిక రక్షణ మాత్రమే చాలు అనుకుంటే టర్మ్‌ పాలసీ తీసుకోవడం మంచిది. అలాకాకుండా పిల్లల చదువులు, పెళ్లిళ్ల ఖర్చుల కోసం పెట్టుబడుల వృద్ధి కావాలనుకుంటే యులిప్‌ పాలసీను ఆశ్రయించడం మంచిది. యులిప్‌ పాలసీలు పెట్టుబడుల వృద్ధితోపాటు జీవితానికి బీమా రూపంలో ఆర్థిక రక్షణ ఇస్తాయి. ఈ పాలసీల కోసం నెలకోసారి లేదా ఏడాదికి ఒకసారి చొప్పున ప్రీమియం చెల్లించాలి. ఇందులో కొంత భాగం పెట్టుబడులకు, ఇంకొంత భాగం జీవిత బీమాకు పోతుంది. ఇంత రిస్కు మాకొద్దనుకుంటే నిర్ణీత రాబడులకు హామీ ఉండే ఎండోమెంట్‌ పాలసీలు ఎంచుకోవడం మంచిది.ఎండోమెంట్‌ పాలసీల ద్వారా సమకూరే ప్రీమియం నిధులను బీమా కంపెనీలు పెద్దగా రిస్కులేని రుణ పత్రాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటిపై రాబడులు తక్కువగానే ఉంటాయి. రిస్కు ఉన్నా అధిక రాబడులు కావాలనుకుంటే మాత్రం యులిప్స్‌ను ఎంచుకోవడమే మంచిది.  ప్రీమియం చెల్లింపు గడువుప్రతి బీమా పాలసీకి నిర్ణీత కాలం పాటు నిర్ణీత మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. ఎంచుకునే కవరేజ్‌ ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ఆధారపడి ఉంటుంది. టర్మ్‌ పాలసీలు తీసుకుంటే మెచ్యురిటీ తీరాక చెల్లించిన ప్రీమియంలో పైసా కూడా తిరిగి రాదు. అదే నాన్‌ టర్మ్‌ పాలసీలైతే చెల్లించిన ప్రీమియంతోపాటు కొంత అదనపు మొత్తమూ రాబడి రూపంలో చేతికి అందుతుంది. ఈ రాబడి మనం చెల్లించే మొత్తం ప్రీమియంపై ఎంత శాతం అనే విషయాన్ని ముందుగానే లెక్కించి పాలసీ తీసుకోవడం మంచిది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిష్పత్తిపాలసీ తీసుకునే ముందే ఆ కంపెనీ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చరిత్ర తెలుసుకోవాలి. పాలసీదారులు క్లెయిమ్‌ చేసిన వెంటనే చెల్లింపులు చేస్తోందా? లేదా అనే విషయాలు అత్యంత ముఖ్యం. అలాగే వచ్చిన క్లెయుమ్స్‌లో ఎన్ని క్లెయిమ్‌లు సెటిల్‌ చేసింది? ఎన్ని క్లెయిమ్‌లను తిరస్కరించింది? వాటి నిష్పత్తి తెలుసుకోవాలి. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ నిష్పత్తి ఎక్కువగా ఉన్న బీమా కంపెనీల పాలసీలే తీసుకోవాలి. అలాగాకుండా ప్రీమియం తక్కువని పాలసీ తీసుకుంటే అవసరమైనపుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
business
9,475
28-04-2017 11:02:56
అలాంటి మగాడు ఇంకా పుట్టలేదు మామా: హీరో నాని
గట్టిగా చూస్తే 80 కోట్ల మార్కెట్‌ కూడా లేని ఓ ప్రాంతీయ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు 450 కోట్ల రూపాయలతో ఓ భారీ సినిమా తీయడానికి సంకల్పించాడంటే ఎంతటి తెగువ, నమ్మకం ఉండాలి. రాజమౌళి తీసిన ఆ ప్రాంతీయ చిత్రం గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ తెలుగు సినిమా ఘనతను చాటుతోంది.  తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి రుచి చూపించిన రాజమౌళిపై సినీ ప్రముఖులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు. ‘నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా’ అని నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్‌ చేశాడు. హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి కూడా ‘బాహుబలి’ పండుగ చేసుకుంటున్నట్టు ట్వీట్‌ చేసింది.
entertainment
20,310
22-02-2017 01:51:40
ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా దివాకర్‌
న్యూఢిల్లీ: విజేందర్‌ బాటలో మరికొందరు భారత బాక్సర్లు నడుస్తున్నారు. ఒలింపియన్‌ దివాకర్‌ ప్రసాద్‌, మాజీ జాతీయ చాంపియన్‌ మదన్‌ లాల్‌లు కూడా ప్రొఫెషనల్‌ బాక్సర్లుగా మారారు. విజేందర్‌, అఖిల్‌ కుమార్‌ ప్రమోటర్లతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. గాయాల కారణంగా 32 ఏళ్ల దివాకర్‌ కెరీర్‌ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. మంగళవారం మొత్తం 13 మంది ఐవోఎస్‌ బాక్సింగ్‌ ప్రమోషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
sports
6,331
08-08-2017 17:22:47
వేశ్య పాత్రపై ఆశ పెంచుకున్న ఆండ్రియా
ఓ సినిమా నిర్మాణంలో ఆలస్యమైందంటే చాలామంది నటీనటులు ఆ సినిమాపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఓ కోలీవుడ్ హీరోయిన్ మాత్రం బాగా ఆలస్యమైన సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. అందంతో పాటు అభినయం కలగలిసిన కథానాయిక ఆండ్రియా 'తడాఖా' వంటి తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా... గాయనిగానూ మెప్పించింది. అయితే వీటన్నింటి కంటే కూడా లిప్ లాక్ సీన్స్‌లో నటించడం, బోల్డ్ స్టేట్మెంట్స్‌తోనే ఆండ్రియాకు గుర్తింపు ఎక్కువగా లభించింది. ఇదిలా ఉంటే విడుదల కాబోయే ‘తరమణి’ సినిమా తనకు నటిగా మరింత పేరు తెచ్చిపెట్టడం ఖాయమంటోందట ఆండ్రియా. ఆండ్రియా కథానాయికగా నటించిన సినిమా 'తరమణి’. అంజలి అతిథి పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వం వహించాడు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఇప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేస్తోన్న ఆండ్రియా ఈ సినిమా విడుదల వరకూ కొత్త సినిమాలేవి కమిట్ అవకూడడని నిర్ణయించుకుందట. ఇందుకు కారణం ఈ సినిమా రిజల్ట్‌పై ఉన్న నమ్మకమేనట. 'తరమణి' సినిమాపై ఆండ్రియా కాన్ఫిడెంట్‌కు కారణం.. ఈ సినిమాలో తాను పోషించిన పాత్రేనట. అయితే బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. పైగా వీటిలో ఎక్కువభాగం ఆండ్రియాకు సంబంధించిన సన్నివేశాలేనట. ఇందుకు కారణం. ఈ సినిమాలో ఆండ్రియా వేశ్య పాత్రను పోషించడమేనట... చిత్రయూనిట్ మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. గతంలో ఇలా వేశ్యపాత్రతో చాలామంది కథానాయికలు మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆండ్రియా కూడా 'తరమణి' సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తోంది. మరి ఆండ్రియా ఆశలు ఎంత వరకూ నెరవేరతాయో తెలియాలంటే ఆగస్టు-11 వరకూ ఆగాల్సిందే..!
entertainment
11,112
22-06-2017 10:50:56
అలా చేస్తే హానికరం... మోదీ యోగాపై డిగ్గీరాజా హెచ్చరిక
న్యూఢిల్లీ: యోగాసనాలను నిపుణుల సమక్షంలోనే చేయాలని, ప్రధాని మోదీ చేస్తున్న మాదిరిగా సామూహికంగా చేయడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(డిగ్గీరాజా) హెచ్చరించారు. నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా... ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. అందరినీ ఒకచోట కూర్చోపెట్టి సామూహికంగా యోగా చేయడం వలన మంచి కన్నాచెడు ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించారు. నిపుణుల సహాయంతోనే యోగాసనాలు వేయాలని సూచించారు. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని దిగ్విజయ్ విమర్శించారు.
nation
4,599
02-06-2017 11:58:34
రాంగోపాల్ వర్మ మరో సంచలనం
రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ తాజాగా గన్స్ అండ్ తైస్ ట్రైలర్‌తో, ఆ ట్రైలర్‌లోని న్యూడ్ సీన్స్‌తో మరో వివాదానికి తెరలేపాడు. సినిమాల్లో సెన్సార్ నుంచి తప్పించుకోవడానికి వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసుకున్న ఆర్జీవీ ఏ మాత్రం ఆలోచించకుండా ట్రైలర్ రిలీజ్ చేసి న్యూడ్ సీన్స్‌కు ఏ మాత్రం కత్తెరేయకుండా, ఇన్‌స్టాగ్రాంలో న్యూడ్ పిక్స్ పోస్ట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కంటే ముందే ఆర్టీవీ మరో షార్ట్ ఫిల్మ్‌తో రాబోతున్నాడు. ‘‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహతి హై’’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశాడు. ఒక యువతి సన్నీలియోన్‌గా మారాలని భావిస్తే ఎలా ఉంటుంది? పోర్న్ స్టార్‌గా మారాలని ఎందుకు భావిస్తోంది? ఇంట్లో వాళ్లు కూతురి ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారు? వంటి అంశాలతో వర్మ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించాడు.
entertainment
8,382
11-03-2017 12:40:54
ఆ లీక్డ్ వీడియోను నేను చూశా.. అందులో ఉన్నది నేను కాదు: రాఖీసావంత్
బోల్డ్ టాక్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తన మాటలతో కాకుండా ఓ షాకింగ్ వీడియోతో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. రాఖీసావంత్ లీక్డ్ వీడియో అంటూ ఓ ఎంఎంఎస్ వైరల్ అవుతోంది. 38 ఏళ్ల రాఖీసావంత్ దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయంటూ ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో దానిపై రాఖీసావంత్ స్పందించింది. ‘‘ఆ వీడియోను నేను చూశాను. అందులో ఉన్న ఆమె ఎవరో నాకు తెలీదు. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంది. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. ఎవరో ఫేస్ మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది రాఖీ. అప్పట్లో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసును ఆధారంగా చేసుకుని తీసిన ‘ఏక్ కహానీ జూలీ కి’ సినిమాలో ఇంద్రాణీ ముఖర్జీ పాత్రను రాఖీసావంత్ పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బిఫోర్ క్రిస్మస్ ఇన్ కశ్మీర్’ సినిమాలో నటిస్తోంది రాఖీ.
entertainment
11,730
14-08-2017 02:35:19
కళాశాలల విద్య బలోపేతం గవర్నర్‌ చేతిలోనే
 పీఈఎస్‌ వర్సిటీ చాన్సలర్‌ ఎం.ఆర్‌.దొరస్వామిబెంగళూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ ప్రగతికి కర్ణాటక దిక్సూచిగా ఉందని పీఈఎస్‌ లవర్సిటీ చాన్సలర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి చెప్పారు. నిష్ణాతులైన వైస్‌చాన్సలర్‌ను నియమించడం ద్వారా కళాశాలల విద్య బలోపేతం చేసే మహత్తరమైన శక్తి గవర్నర్‌కే ఉందని అభిప్రాయపడ్డారు. పీఈఎస్‌ వర్సిటీ ద్వితీయ స్నాతకోత్సవం బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా దొరస్వామి మాట్లాడారు. కళాశాలల విద్య గుణాత్మకం, క్రమశిక్షణగా సాగాలంటే ఉత్తమ వైస్‌చాన్సలర్లను నియమించాలన్నారు. వారిని బట్టి ఉన్నత విద్య బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. 638 మంది విద్యార్థులకు ఆయన పట్టాలు ప్రదానం చేశారు.
nation
8,800
19-11-2017 00:55:31
‘పద్మావతి’కి సెన్సార్‌ కష్టాలు!
దరఖాస్తు అసంపూర్తిగా ఉందని వెనక్కి.. 1న చిత్రం విడుదల అనుమానమేముంబై, నవంబరు 18: వివాదాల సుడిలో చిక్కుకున్న పద్మావతి చిత్రానికి తాజాగా సెన్సార్‌ కష్టాలు మొదలయ్యాయి. దరఖాస్తు అసంపూర్తిగా ఉందన్న కారణంతో సెన్సార్‌ బోర్డు చిత్రాన్ని వెనక్కి పంపింది. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే స్ర్కీనింగ్‌ కమిటీకి పంపి సర్టిఫికేట్‌ జారీ చేస్తామని తెలిపింది. పద్మావతి చిత్రాన్ని వారం క్రితమే సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం చిత్ర బృందం పంపింది. సర్టిఫికేట్‌ ఇవ్వడంపై బోర్డు 61రోజుల్లోగా నిర్ణయం తీసుకోవచ్చు. దీంతో డిసెంబరు 1న చిత్రం విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాతలు మాత్రం విడుదల వాయిదా పడదంటున్నారు. కాగా సెన్సార్‌ బోర్డు తీరును ప్రముఖ నటి, సామాజికవేత్త షబనాఅజ్మీ విమర్శించారు.  చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీకి, పద్మావతి పాత్రధారి దీపికా పదుకొనేకు బెదిరింపులకు నిరసనగా చిత్రపరిశ్రమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనం సరికాదన్నారు. హాలీవుడ్‌ నటి రూబీ రోజ్‌ కూడా ఈ చిత్ర బృందానికి మద్దతుగా నిలిచారు. ‘నా మిత్రురాలు దీపికాకు బెదిరింపుల వార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. ఇలాంటి చర్యలు సరికాదు’ అని రూబీ పేర్కొన్నారు. కాగా, పద్మావతి చిత్రంపై రాజ్‌పుత్‌ల నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆధ్వర్యంలో కుంభల్‌గడ్‌ కోట ప్రవేశద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. కుంభల్‌గఢ్‌ కోట మహారాణా ప్రతాప్‌ జన్మస్థలం. బెదిరింపులు వస్తున్నా దీపిక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సెన్సార్‌ సర్టిఫికేషన్‌ పూర్తికాకుండానే చిత్రాన్ని టీవీ చానళ్లకు ప్రదర్శించడాన్ని సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి తప్పుబట్టారు.
entertainment
8,443
31-05-2017 11:19:07
అబుదాబిలో మహాభారతం... ఏర్పాట్ల మొదలు?
ఇదేదో సినిమా టైటిల్‌ కాదు. ‘మహాభారతం’ సినిమా షూటింగ్‌ను అబుదాబిలో చేయబోతున్నారట‍! అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మహాభారతాన్ని’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే‌! మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర చేయబోతున్న ఈ సినిమా సన్నాహాలను నిర్మాతలు మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో కొంత భాగాన్ని అబుదాబిలో చిత్రీకరించాలని నిర్మాతలు భావిస్తున్నారట! ఈ మేరకు అబుదాబిలో కావలసిన ఏర్పాట్లను మొదలు పెట్టారట కూడా! మొదట వెయ్యి కోట్లతో మహాభారతాన్ని తీస్తామని నిర్మాతలు ప్రకటించగానే కొందరు జోక్‌ చేస్తున్నారని లైట్‌గా తీసుకున్నారు. కానీ తమవి మాటలు కాదని చేతలు అని నిరూపించబోతున్నారు ఆ సినిమా నిర్మాతలు.
entertainment
11,755
21-07-2017 16:04:55
కిరణ్ బేడీపై వివాదాస్పద పోస్టర్లు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పుదుచ్చేరి శాఖ వివాదంలో ఇరుక్కుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కించపరుస్తూ మూడు పోస్టర్లతో ప్రచారం చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఫొటోను హిట్లర్ రూపంలోకి మార్చి ఒక పోస్టర్‌ను వేసింది. మరో పోస్టర్‌లో ఆమెను కాళికాదేవిగా, ఇంకొక పోస్టర్‌లో ఆమెను కొందరు తరిమికొడుతున్నట్లుగా చూపించింది. హిట్లర్‌గా ఆమెను చూపించిన పోస్టర్‌లో ఆమె ఫొటోకు మీసాలు కూడా పెట్టారు. కాళికాదేవిగా చూపించిన పోస్టర్‌లో, ఆమె చేతుల్లో కొందరు నేతల తలలను ఉంచారు. ఈ మూడు పోస్టర్లను నగరమంతటా అతికించారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేశారు. టెరిటోరియల్ గవర్నమెంట్‌ను సంప్రదించకుండా కిరణ్ బేడీ ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించారని, అందుకు నిరసనగా కాంగ్రెస్ వర్గాలే ఈ పోస్టర్లను అతికించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టర్లను కిరణ్ బేడీ కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పుదుచ్చేరికి ముగ్గురు శాసనసభ్యులను నియమించింది. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వి. స్వామినాథన్, ఆ పార్టీ కోశాధికారి కే జీ శంకర్, ఆ పార్టీకే చెందిన మరో నేత ఎస్ సెల్వగణపతిలను ఎమ్మెల్యేలుగా నియమించింది. ఈ నెల 4న వీరిని కిరణ్ బేడీ నియామక ప్రక్రియ జరిపారు. దీంతో కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, వీసీకే నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పార్టీలు కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బంద్, నిరాహార దీక్షలను నిర్వహించాయి.
nation
14,801
13-10-2017 14:02:15
తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు... అర్ధరాత్రి నుంచి అమల్లోకి : ముఖ్యమంత్రి
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పారు. పెట్రోలుపై 5 శాతం, డీజిల్‌పై 3 శాతం వ్యాట్ తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కొత్త ధరలు అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని 2 శాతం తగ్గించింది. ఆ తర్వాత వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ వీటిపై విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా ఆ జాబితాలో మధ్యప్రదేశ్ చేరింది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పెట్రోలు, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించాలని కోరిన సంగతి తెలిసిందే.
nation